మాయ అంటే ?

మాయ అంటే ?

రామక్రిష్ణ పరమహంస ఒకసారి "మాయ ను దర్శించాలనుకున్నారు . కాళి మాతను ప్రార్దించారు . గంగానది వైపు చూస్తుండగానే ఆ జలాల్లోంచి ఒక చిన్న బుడగ బయటికి 

వచ్చింది . అది అలా లేచి క్రమేపి పెద్దదవుతూ గట్టు మీదకి వచ్చి, చూస్తూ ఉండగానే ఒక స్త్రీ గా మారింది . ఆ స్త్రీ ప్రౌడఐ ఒక బిడ్డను ప్రసవించింది . కాసేపు ఆ బిడ్డను పోషించి, పెంచి ,

ప్రేమతో లాలించి పెద్దచేసింది . కొద్ది సేపటికి ఎక్కడి నుండో కత్తిపీట తెచ్చింది . అంత సేపు ఆలనా,

పాలనా చూస్తూ కానీ పెంచిన బిడ్డను చిన్న చిన్న ముక్కలుగా తరిగి,కరకరా నమిలి మింగేసింది . తానూ ఆ జలాల్లో కలిసిపోయింది .అయితే ఆ స్త్రీ ముఖములో నీటి బుడగనుంచి ఉత్పన్నమైన క్షణము నుంచి ,తిరిగి నీటిలో కలిసి పోయేవరకు ఒకే రకమైన ప్రసన్నత వుంది రామకృష్ణులు వంక పలకరింపుగా నవ్వి, అంతర్దానమైంది . వారికీ దృశ్యము అనుభూతమైనంత సేపు , చుట్టు పక్కల జనం సంచరిస్తున్నారు . వారెవరికీ దృశ్యం కనిపించినట్లు లెదు. అప్పుడు కాళికా దేవి ఇలా వివరించింది . "నీవు చుసిన దృశ్యం మాయ . అయితే మాయను చూచు టకు ఒకడున్డాలి . చుచువానిని విడిచి మాయ లెదు. చూచువాడు కూడా ఆ మయాసమ్భవములొ ఒక పాత్రను పోషిస్తాడు" .రామక్రిష్ణులు అప్పటికే జ్ఞాన సిద్ధులు కాబట్టి స్వయముగా ప్రభావితులు కాకుండానే అ దృశ్యాన్ని దర్శించ గలిగారు . అలా కాని వారికి అది సాధ్యము కాదు. మాయానుభుతికి ఏంటో కొంత సుంకం చెల్లించాలి .అంటే అందులో పాత్రను పోషించి ,దాని కాస్త నష్టాలను, పంచుకొవాలి. ఈ అనుభూతి ద్వారా మాయను గురించి గ్రహించ వలసిన అంశాలు వున్నయి. 

1. మాయ తాత్కాలికమ్. దానికి మొదలు ,మధ్య,తుది ,వున్నాయి . 

2. దానిలో సంఘటనలు ముందు ఆకర్షణీయముగా ఉన్నప్పటికీ, చివరికి దుఃఖము గానే మారుతున్నయి. 

3. రామక్రిష్ణుల దర్శనములో మాయారూపిణి అయిన స్త్రీ గంగా జలము నుండి పుట్టి తిరిగి గంగ లోనే కలిసి పొయింది . అంటే కాదు తాను సృటిన్చిన బిడ్డని , తెగ నరికి తిరిగి తనలోకే అంతర్హితం చేసుకుని మరీ గంగలో కలసిపోయింది . గంగ అంటే పరబ్రహ్మము. కాబట్టి మాయ బ్రహ్మము నుండి పుట్టి, దాని నుండి పడినట్టుగా కనిపించి తిరిగి బ్రహ్మము లో నే కలిసి పోతుంది . పై దృశ్యము లోని స్తేరీ మాయకు సంకెతము. ఆమె కని , ప్రేమతో పెంచిన బిడ్డ ఆమె , దేహముతో కలుపుకుని ఈ ప్రపంచానికి సంకెతము.అనగా మాయ తాను కన్న ప్రపంచములో అంతర్భగమె. ముందు ఆకర్షణీయముగా తోచిన ప్రపంచమే చివరకు విషం, విషమం అవుతుంది . దానిని వదిలిన్చుకోవటమే అభ్యాసము. దానిక్ సాధనం విచారమనే కత్తిపీట . తన సృష్టి అనే శిశువును ఖండించి అంతర్హితం చెయ్యాలి . అనగా దేహ భావన , ప్రపంచ భావన అంతరించాలని అన్తరార్ధము. అప్పుడే జీవునికి మరలా గంగా ప్రవేశము - అనగా బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మము లో కలియుట .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!