Posts

Showing posts from April, 2016

ఏ.యం.రాజా!

Image
ఏ.యం.రాజా! విప్రనారయణ సినిమాలో ఈపాట విన్నప్పుడు రాజా  గుర్తుకు వచ్చేడు. . .మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా భాసిల్లెనుదయాద్రి  బాల భాస్కరుడు వెదజల్లె నెత్తావి విరబూచి విరులు విరితేనెలాని మైమరచు తుమ్మెదలు లేచెను విహగాళి లేచెను నిదుర చల్లచల్లగ వీచె పిల్ల తెమ్మెరలు రేయి వేగినది వేళాయె పూజలకు ॥ చరణం : పరిమళద్రవ్యాలు బహువిధములౌ  నిధులు గైకొని దివ్యులు కపిలధేనువును అద్దమ్ముపూని  మహర్షి పుంగవులు మురువుగా పాడ  తుంబురు నారదులును నీ సేవకై వచ్చి నిలచియున్నారు సకుటుంబముగ సురేశ్వరులు కానుకలు గైకొని మొగసాల  కాచియున్నారు ॥ దేవరవారికై పూవుల సరులు  తెచ్చిన తొండరడిప్పొడి మురియ స్నేహదయాదృష్టి చిల్కగా జేసి  సెజ్జను విడి కటాక్షింప రావయ్యా ॥ ఏ.యం.రాజా (అయిమల మన్మథరాజు రాజా) (జూలై 1, 1929 - 1989) 1950వ దశకములో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. విప్రనారాయణ, చక్రపాణి, ప్రేమలేఖలు, మిస్సమ్మ పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు. ఈయన వివిధ భాషలలో 10,000 పాటలు పాడి, వందకు పై

మధ్యాహ్న పురాణం. 1 (304/16.) తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – రెండవ భాగం

Image
మధ్యాహ్న పురాణం. 1 (304/16.)  తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – రెండవ భాగం రచన: కె. వి. ఎస్. రామారావు ఏడవరోజు ఏడవరోజు యుద్ధానికి కౌరవసేనని మండలవ్యూహంగా దిద్దాడు భీష్ముడు. అదిచూసి వజ్రవ్యూహం కల్పించమని ధర్మజుడు తన సేనాపతికి చెప్పాడు. రెండు సైన్యాలు ఆవేశంగా రెండోవైపుకు దూసుకుపోయినయ్. ద్రోణుడు విరాటునితో, అశ్వత్థామ శిఖండితో, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడితో, శల్యుడు కవలల్తో, విందానువిందులు యుధామన్యునితో, అనేకమంది రాజులు అర్జునుడితో తలపడ్డారు. అలాగే భీముడూ కృతవర్మ, అభిమన్యుడూ చిత్రసేన దుశ్శాస వికర్ణులు, ఘటోత్కచుడూ భగదత్తుడు, సాత్యకీ అలంబుసుడు, ధృష్టకేతుడూ భూరిశ్రవుడు, చేకితానుడూ కృపాచార్యుడు, ధర్మజుడూ శ్రుతాయువు, ఎంతోమంది రాజులూ భీష్ముడు జతలుగా పోరసాగారు. “భీష్ముడి వ్యూహాన్ని చూసుకుని మురిసిపోతూ భయంలేకుండా వీళ్లు మనమీదికి ఎలా వచ్చారో చూశావా, వీళ్ల సంగతి చూస్తా చూడు” అంటూ అర్జునుడు తననెదిరించిన వారి మీద అమ్ములు కురిశాడు. వాళ్ళూ ఒక్కుమ్మడిగా అతని మీద దూకితే కోపంతో అర్జునుడు ఇంద్రాస్త్రం ప్రయోగించాడు. అది వాళ్లు వేసిన బాణాల్ని నాశనం చేసి, వాళ్లకి గాయాలు చేసి, గజహయాల్ని కూల్చి భీభత్స

ఇండియాలో మొదటి బస్సులు నడిపింది... బెజవాడ నుండి మాచలిపట్నంమధ్య..

Image
ఇండియాలో మొదటి బస్సులు నడిపింది... బెజవాడ నుండి మాచలిపట్నంమధ్య.. ఇది 1910 లోజజరిగింది...లండన్ మూజియం లో ఇప్పటికిదినిమోడల్ ఉంది

1864 నాటి బందరు ఉప్పెన కధ!

Image
1864 నాటి బందరు ఉప్పెన కధ! . అక్టోబరు 13 న వచ్చిన పెను తుపానులో కృష్ణా జిల్లా, మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు ట! రక్తాక్షి నామ సంవత్సరంలో, 1 నవంబర్ 1864 న, బందరులో సముద్రం పొంగి, ఊరు ములిగిపోయిందని చెప్పుకుంటారు.  “స్థలపూరాణం” ప్రకారం “ఉమ గోల్డ్ కవరింగ్” వారి భవనం మొదటి అంతస్తు అంతా ములిగిపోయి, నీరు రెండవ అంతస్తు వరకు వచ్చేసిందిట.  వివరాలకి ఇప్పుడు సాక్షులు దొరకరు కాని వినికిడి కబుర్లే నిజం అయితే 30,000 మంది చచ్చిపోయారుట. సముద్రం చెలియలికట్టని దాటి, నాలుగైదు కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొచ్చి, జనావాసాలని ముంచేసిందన్న మాట! దీనిని "బందరు ఉప్పెన" అని ప్రజలు అభివర్ణిస్తారు. బందరుకి మచిలీపట్నం అన్న పేరు రావటానికి వెనుక కథ ఒకటి ఉంది. సముద్రపుటొడ్డున ఉన్న కోట ద్వారం దగ్గర ఒక చేప విగ్రహం ఉండేది. అందుకని ఈ ఊరికి మచిలీపట్నం అన్న పేరొచ్చిందంటారు. 'మచిలీ' అంటే హిందీ భాషలో చేప, పట్నం అంటే పెద్ద ఊరు. తెలుగు దేశంలో పట్టణం అనేది సర్వసాధారణంగా సముద్రపు ఒడ్డున ఉన్న రేవులకే వాడతారు. ఉదాహరణకు చెన్నపట్నం, విశాఖపట్టణం, భీమునిపట్నం, కళింగపట్నం, నిజాంపట్నం మొద

మధ్యాహ్న పురాణం. 1 (29/4/16.) తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – మొదటి భాగం.

Image
మధ్యాహ్న పురాణం. 1 (29/4/16.) తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – మొదటి భాగం. రచన: కె. వి. ఎస్. రామారావు . వింటే భారతం వినాలి. ఈ మాట భారత ‘యుద్ధకథ’ గురించి అన్నారో లేదో గాని నేను చూసినంతలో ఇంత విపులంగా ఉత్కంఠభరితంగా కళ్లకి కట్టినట్టుగా యుద్ధక్రమాన్ని వర్ణించిన ఇతిహాసం మరొకటి, మరెక్కడా లేదు. నిజానికి భారత కథలోని ముఖ్య పాత్రల నిజమైన రూపాలు, స్వభావాలు మనకి యుద్ధభాగం లోనే కనిపిస్తాయని నా అభిప్రాయం. సామాన్యంగా భారతం చదివేవాళ్లు దాన్ని మొదట్నుంచి చివరిదాకా చదవరు. ఏ విరాట పర్వంతోనో మొదలెట్టి వాళ్లకి ఇష్టమైన రెండు మూడు ఇతర పర్వాలు చదివి ఊరుకుంటారు. అందునా యుద్ధపర్వాలు చదవటం చాలా అరుదు. దీనికి కారణాలు అనేకం. చాలా మందికి భారతయుద్ధం అంటే మహాభారత్ టీవీ సీరియల్లోనో లేక అనేక సినిమాల్లోనో చూసిందే. కాకుంటే ‘కాళిదాసు కవిత్వం కొంతైతే నా పైత్యం కొంత’ అన్నట్టుంటాయవి. ఇది తిక్కన తెలుగు భారతం లోని యుద్ధభాగాలకి తేలిక వచనంలో అనువాదం. వీలైనంత దగ్గరగా మూలాన్ని అనుసరిస్తూ, కథాగమనానికి అడ్డొచ్చే పునరుక్తుల్ని, యుద్ధకథకి నేరుగా సంబంధం లేని పిట్టకథల్ని మాత్రం వదిలేస్తూ సాగుతుంది. ఎన్నో ఆసక్తికరాలు, ఆ