వారణాసీ పురవాసం !.

వారణాసీ పురవాసం !.

.

నగరవాసం మీద తనకేమాత్రం మోజులేనప్పటికీ, సుకుమారంగా పెరిగిన సతీదేవి తనతోపాటు కొండల్లో - కోనల్లోను, మేఘాల మీదను విహరింపవలసి రావడం పరమశివునికీ బాధ కలిగించేదిగానే వుంది.

.

నివాసానికి అనుకూలమైన ప్రదేశం కోసం లోకాలన్నీ పరికించి చూశాడు. భూలోకంలో గంగానది ఒడ్డున ఉన్న వారణాసీ పురాన్ని, తాను ఇంతకుముందే చూసివున్నాడు. బాగా యోచించి అదే తన నివాస స్థానంగా చేసుకోవాలని భావించాడు.

.

వెంటనే, అక్కడున్న నికుంభుడనే గణనాయకుని పిలిచి, వారణాసీ వాటికలో ఎలాంటి అకృత్యాలూ చేయకుండా, ఆ పురాన్ని ప్రజలచేత ఖాళీ చేయించమన్నాడు. అప్పుడక్కడ దివోదాసుడనే ధర్మప్రభువు రాజ్యం చేస్తున్నందున శివుడలా ఆనతిచ్చి ఉన్నాడు. శివదీక్షాపరుడైన మంకణుని సాయం తీసుకుని నికుంభుడు నేర్పుగా ఖాళీ చేయించాడు ఆ పట్టణాన్ని.

.

అలా ఖాళీ అయిన ఆ నగరాన్ని స్వర్గంతో తులతూగేలా - వాసయోగ్యంగా నిర్మించి ఇవ్వమని శంకరుడు పరమాత్ముని ధ్యానించాడు. సంకల్పమాత్రాన అది అపురూప నగరిగా రూపాంతరం చెందింది. సతీ సమేతుడై శంకరుడానగరిలో చిరకాలం సుఖించాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!