Posts

Showing posts from January, 2017

మరొక ఆదిశంకరులవారు అవతారమెత్తాలి !

Image
మరొక ఆదిశంకరులవారు అవతారమెత్తాలి ! .  శ్రీ ఆదిశంకరాచార్యులవారు సాక్షాత్తూ పరమశివుని అవతారమని భావిస్తాము. భారతావనిలో బౌద్ధం ప్రబలంగా వ్యాపిస్తున్న కాలం లో,  ఆది శంకరులవారు తమ జన్మస్థానమైన కలాడి లో కూర్చోని తమ అద్వైత సిద్ధాంత ప్రవచనాలు చేయలేదు.  పాదచారియై బౌద్ధాన్ని "ప్రచ్చన్న పాషండం" గా ఖండిస్తూ, దేశం నలుమూలలా శంకర మఠాలు స్థాపించి ధర్మ ప్రచారం చేశారు. హిందూమత పరిరక్షణ చేశారు. ఎక్కడి కేరళలో కలైడి, ఎక్కడి హిమాలయాలు!!! అదీ 1200 యేండ్ల క్రిందట!! .  హిందూమత పునరుద్ధరణకు బద్ధకంకణులై శ్రమించగల పరివ్రాజక స్వాములు--మరొక ఆదిశంకరులు---అవతరించాల్సిన సమయం వచ్చింది. హైందవం జనసామాన్యానికి దూరమై ఎవరో కొంతమంది  ఛాందస ఆచారవ్యవహారాలకు బందీయై, పరిమితమై అంతరించిపోయే ప్రమాదం ప్రస్ఫుటంగా కనపడుతున్నది. పవిత్రహైందవ శంఖనినాదం వూరువూరులా, వాడవాడలా  ప్రతి ప్రాంగణంలోనూ మారుమ్రోగింపవలసిన తరుణం వచ్చింది. రాజకీయ దుర్గంధానికీ, ఛాందసానికీ దూరంగా హైందవుడైన ప్రతి పురుషుడూ,  ప్రతి స్త్రీ కులాలకు అతీతంగా హైందవం నాది, మనది అని గర్వించగల తరుణం సాకారం చేయగల ధర్మప్రచారకులు మరొక ఆది శం

కలువ కన్నుల కన్నయ్య!

Image
కలువ కన్నుల కన్నయ్య! . "లలనా! యేటికి తెల్లవాఱె? రవి యేలాదోఁచెఁ బూర్వాద్రిపైఁ? గలకాలంబు నహంబుగాక నిశిగాఁ గల్పింపఁ డా బ్రహ్మ దా వలఱేఁడుం గృపలేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లోకదే; కలదే మాపటికాల మందు మనకుం గంజాక్షు సంభోగముల్." . ఏమే చెలీ! అప్పుడే ఎందుకు తెల్లవారిపోయిందే!  తూర్పుకొండమీద ఆ సూర్యుడు ఎందుకు పొద్దుపొడిచేసేడే బాబు! అవును పగళ్ళన్నవి లేకుండా ఎప్పటికి తెల్లవారని రాత్రిళ్ళుగా ఎందుకు చెయ్యడే  ఈ బ్రహ్మదేవుడు! . ఈ మన్మథుడేమో మరీ కరుణమాలిన వాడైపోయాడు; చిలకలను చూస్తే వారించేవాళ్ళే లేరు; ఇంకా ఎలాగమ్మా బతకటం!  అసలు రాత్రి ఎప్పటికేనా అవుతుందా!  ఆ కలువ కన్నుల కన్నయ్యతో కలిసే అదృష్టం లభిస్తుందంటావా! . (పోతనామాత్యుడు.)... తెల్లవారటం అంటే బ్రహ్మానందం పొందే సమాధి స్థితికి విఘ్నం కలిగి మెళకువ వచ్చేయటం అనుకుంటే,  ‘ఇంద్రియాణాం మనశ్చాస్మి’ అని గీత కనుక రవి అంటే మనస్సు అనుకుంటే,  పూర్వాద్రిలో పూర్వ అంటే సమాధి నిండుగా పూర్తికాక ముందే అని,  అద్రి అంటే ఈ దేహం అనుకుంటే,  మనస్సు తోచటం అంటే తెల్లవారటం అనుకోవచ్చు. అహము అంటే సంసార సంపాదనకై సంచారం

భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును"

Image
నిజమే కదా.! . "కవితా కన్య రసజ్ఞత కవి కన్నా రసజ్ఞుడెరుంగు గాని కవి కేమి ఎరుగు; నవ కోమలాంగి సురతము భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును" , భావము:  కవిత యొక్క భావంలోని అందం అది వ్రాసిన కవికంటే దాన్ని ఆస్వాదించే రసజ్ఞులకే బాగా తెలుస్తుంది. అలాగే యవ్వన స్త్రీ యొక్క సొగసులు తండ్రి కంటే కూడా భర్తకే బాగా తెలుస్తుంది

శ్రీ మహావిష్ణువు తత్వం!

Image
శ్రీ మహావిష్ణువు తత్వం! . విష్ణుమూర్తి ఎప్పుడూ దేవతలకే సహాయం చేస్తాడు . రాక్షసులకు చేయడు . ఎందుకు ?  సమాధానం పోతన పలికించిన పద్యమిది .  . "త్రంబులు త్రైలోక్య ప విత్రంబులు భవలతాలవిత్రంబులు స న్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్! భావం: శ్రీమహావిష్ణువు చరిత్రలు కేవలం విచిత్రాలు మాత్రమే కావు. ముల్లోకాలను పవిత్రం చేసేటువంటివి.  జీవరాసులకు మంచిమిత్రుల వంటివి. అడవులకు వసంత ఋతువు  ఆనందం కలిగిస్తుంది. అదేవిధంగా ఈ చరిత్రలు మునులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇవి సంసార బంధం అనే లతలను అవలీలగా ఛేదించే  లవిత్రాలు (కొడవలి వంటివి)...  . శ్రీ మహావిష్ణువు తత్వం ఎవరికీ అంతు పట్టదు .  పృకృతికి చెందకుండా ( సంసార బంధాలకు అతీతంగా ) ,  తన మాయతో గుణాలు సృష్టించాడు . సత్వగుణ ప్రధానంగా దేవతలను , మహర్షులను , తమోగుణ ప్రధానంగా రాక్షసులను సృజించాడు . సత్వగుణం స్వామికి ఇష్టం కనుక సత్వ గుణ ప్రధానులైన  దేవతలకు సంతోషం కలిగిస్తూ , తమో గుణ ప్రధానులైన రాక్షసులకు  ఖేదం కలిగిస్తూ ఉంటాడు .  ఇంకా అర్థం చేసుకోవాలంటే తమోగుణం మనుష్యులను నిద్రాపరవశులను చేస్తుంది .

భగవంతుడు ! .

Image
భగవంతుడు ! . భారతీయ తత్వ దర్శనం ప్రకారం భగవంతుడు ఎక్కడో వేరే లోకంలో ఒక రూపంతో ప్రత్యేకంగా ఉండడు.  భారతీయ దైవానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా లేదు.  అటువంటి దైవం గురించి ఎవరో ఒక మనిషి లేదా ప్రవక్త చెప్పలేదు. నేను చెప్పిందే నిజమని ఎవరూ చెప్పలేదు. దైవాన్ని ఎవరికి వారే తెలుసుకోమన్నారు.  ఒక భారతీయుడు అఖండ ప్రకృతిలో ఉన్న అనంతమైన శక్తిలో దైవాన్ని దర్శిస్తాడు.  అందుకే వేదాల్లో మొదటిదైన ఋగ్వేదంలో మొదటి సూక్తం 'అగ్నిమీళే పురోహితమ్‌' అంటూ అగ్నిని స్తుతించడంతో ప్రారంభమవుతుంది. భారతీయ దైవాలు మిగిలిన మతాల్లోలాగా కేవలం ఊహాత్మకం (Abstract) కాదు. అంటే ఎవరో చెప్పారు కాబట్టి నమ్మడం కాదు.  ఎక్కడో ఒక గ్రంధంలో రాసారు కాబట్టి మనం కూడా ఉన్నారనే భావన చేయడం కాదు. కళ్ళెదురుగా ఉండే వాస్తవం. అదే ప్రకృతి దర్శనం. భారతీయ సంస్కృతిలో ప్రధానంగా పూజలందుకొనే  శివుడు, విష్ణువు, దుర్గ వంటి వారందరూ కూడా ప్రకృతి శక్తులే.

పెద్దనామాత్యుని నాయిక వరూధిని.! .

Image
పెద్దనామాత్యుని నాయిక వరూధిని.! . "మృగమదసౌరభవిభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ స్థగితేతర పరిమళమై మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుతమొలసెన్".! . “కస్తూరి, పచ్చ కర్పూరపు పరిమళాల తాలూకు చిక్కటి సౌరభము  ఇతర సువాసనలను కప్పివేస్తూ, ఒకానొక అమ్మాయి జాడను తెలిపే  గాలితెమ్మెర … అలా …వీచిందిట!” . పెద్దనామాత్యుని స్వారోచిషమనుసంభవం కావ్యంలో నాయిక వరూధిని అనే అప్సరసను పరిచయం చేసే సందర్భంలో ఆమె గురించిన మొట్టమొదటి పద్యం అది. . (వడ్డాది పాపయ్య గారి వరూధిని.)

సీమంతం.! (Babay Shower .)

Image
సీమంతం.! (Babay Shower .) తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది.సీమంతం .  కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం  (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం).  సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం. . ఇది గర్భాకాలమున ఆరవనెలన గాని, ఎనిమిదవ నెలనగాని జరుపవలెను (దేశకాలమానములు బట్టి ఇవి వేర్వేరుగా ఉండవచ్చును). ఇందులో మేడిపండ్లు, వనస్పతి మొదలగు శుభకరమైన పదార్థములను ఉపయోగించి భర్త భార్యను మేడిచెట్టువలె బలముగా నుండుమని, వనస్పతివలె సంతాన సంపదను పొందుమని అర్థం వచ్చే మంత్రములను వినిపించును.  అలాగే, ప్రజాపతి అదితికి సీమంతోన్నయనము చేసినట్లు నీకు కూడా సీమంతోన్నయనము చేసి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, వృద్ధాప్యము వరకు దీర్ఘజీవిని చేసెదను అని ఇంకొక మంత్రము పలుకును.  అటు తర్వాత భర్త దేవతలను ప్రార్థించి గర్భదోషములు తొలగింజేయు, భవిష్యత్త్ సంతాన కళ్యాణమునకై గర్భప

ధేనుకాసుర వధ! (పోతనామాత్యుడి...తెలుగు భాగవతం నుండి)

Image
ధేనుకాసుర వధ! (పోతనామాత్యుడి...తెలుగు భాగవతం నుండి) . శ్రీరాముడు అనే పేరు గల గోపబాలుడు బలరామ కృష్ణులను చూసి ఇలా అన్నాడు . -క. దూరంబునఁ దాలతరు స్ఫారం బగు వనము గలదు; పతితానుపత ద్భూరిఫలసహిత మది యే ధీరులుఁ జొర వెఱతు రందు ధేనుకుఁ డుంటన్. - భావము: ఆ ధేనుకుడు మహాబలవంతుడు వాడు భయంకరమైన గాడిద రూపంలో ఉంటాడు. తనతో సమానమైన బలం కలిగిన తన బంధువుల తోపాటు తాను మనుష్యులను పట్టుకుని తింటూ ఉంటాడు. అక్కడ చక్కని సువాసనలు వెదజల్లుతూ ఎన్నో కొత్త కొత్త పండ్లు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. వింటున్నారా. -క. ఫలగంధము నాసాపుట ముల జొచ్చి కలంచి చిత్తములఁ గొనిపోయెన్ ఫలముల నమలింపుఁడు మము;  బలియురకును మీకు దైత్యభటు లడ్డంబే? . భావము: ఆ పండ్ల సువాసనలు మా ముక్కులలో చొరబడి మమ్మల్ని వ్యాకుల పెడుతూ మనస్సులను అటు లాగివేస్తున్నాయి. ఎలాగైనా ఆ పండ్లను మాకు తినిపించండయ్యా. మీరు మహాబలవంతులు మీకు ఆ సామాన్య రాక్షసులు అడ్డమా ఏమిటి.” అని పలికిన చెలికాని పలుకు లాదరించి విని నగి వారునుం దారును నుత్తాలంబగు తాలవనంబునకుం జని; యందు. -క. తత్తఱమున బలభద్రుఁడు తత్తాలానోకహములఁ దనభుజబలసం పత్తిఁ గ

సుందరకాండ విశిష్టత:! .

Image
సుందరకాండ విశిష్టత:! . ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ. తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు.  శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ.  . . భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు.  అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. .  సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము. హనుమ సీతారాములిరువురికి ఆనందం కల్గించి సుందరుడైనాడు. . ఈ విధముగా పాత్రోచితరీతిలో సుందరకాడ శ్రీరాముని, సీత మరియు హనుమల సౌందర్యాలను దర్శంపచేస్తుంది. ఆధ్యాత్మక చింతనతో చూస్తే భగవత్సౌందర్యమును, జీవ సౌందర్యమును, ఆచార్య సౌందర్యమును సుందరకాండ వర్ణిస్తుంది. . సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథః  సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం  సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?  . .అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ.  సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్త

అహోబిలసార్వభౌమ ||

Image
అహోబిలసార్వభౌమ || . సగము నరునిగ సగము కేసరిగ నుండి రాజ ఠీవి సటము నలరగ నృసింహ | పదును కోరల పాపాల పరిహరించు సర్వసుఖదా యహోబిల సార్వభౌమ || . భావము : మీ దేహము మనిషిగా, తల సింహముగా ఉంటుంది.  రాజ ఠీవితో మీ జూలు అద్భుతంగా కదులుతూ ఉంటుంది. పదునైన మీ కోరలతో మా పాపాలు అన్నింటినీ నాశనం చెయ్యండి. అందరికీ అన్ని సుఖములను ప్రసాదించేది మీరే కదా!  అహోబిల క్షేత్రానికి సార్వభౌములు మీరే కదా !  ఈ పద్యంలో 'నృసింహం' అన్న నామాన్ని స్వామి దయతో వాడడం జరిగింది. (Padmini Priyadarsini కి కృతజ్ఞలతో)

రామాయణము, సుందరకాండము - మొల్ల ( విశ్లేషణ శ్రీ Satyanarayana Piska గారి విశ్లేషణ.)

Image
రామాయణము, సుందరకాండము - మొల్ల ( విశ్లేషణ శ్రీ Satyanarayana Piska గారి విశ్లేషణ.) . దానవు లెప్పుడు చూచిన మానవులను గెలువగలరు, మది నూహింపన్ మానవభక్షకులై మను దానవులను గెలువ నరుల తరమే జగతిన్?! . చిన్నచిన్న తేలికమాటలతో కవయిత్రి మొల్ల ఎంత అందంగా పద్యమును అల్లినదో చూడండి! మొదటి, చివరి పాదములలో దానవులను, మధ్యన గల రెండు పాదములలో మానవులను తొలిపదముగా వాడి, ఒక వింత సొబగును సమకూర్చినది ఈ పద్యానికి! . జగతీశుడు మానవుడట! నగరే భుజశక్తిచేత నా కెదు రన్నన్? నగధరుడో, నగధన్వుడొ, నగభేదియొ, కొంతకొంత నాతోఁ బోరన్? . ఇది మరింత అందమైన పద్యము.  చివరి 2 పాదములు చాలా చక్కగా కూర్చినది మొల్ల!  నగధరుడు అనగా విష్ణువు (క్షీరసాగరమధన సమయములో కూర్మరూపం ధరించి, మంధరగిరిని తన వీపుపై మోశాడు కదా!).  నగధన్వుడు అంటే శివుడు. (త్రిపురాసుర సంహార సమయములో మేరుపర్వతమును తన ధనుస్సుగా మార్చుకున్నాడు).  ఇక, నగభేది అంటే ఇంద్రుడు. (ప్రాచీనకాలములో పర్వతములకు ఱెక్కలు ఉండేవి. వాటిని తన వజ్రాయుధముతో భేదించాడు ఇంద్రుడు).... " ఈ మువ్వురూ నన్ను కొంతవరకు ఎదిరించగలరేమోకాని,  మానవుడైన రాముడు నాముందు

తెలుగు సాహిత్యంలో హాస్యం-2.

Image
తెలుగు సాహిత్యంలో హాస్యం-2. . శ్రీనాధుని హరవిలాసంలో మాయా బ్రహ్మచారి పార్వతిని పరీక్షించాలని వచ్చి ఆమె ఎదుట శివుని నిందిస్తూ, వారి కళ్యాణాన్ని నిరసిస్తూ చేసిన ప్రసంగం,, “రాయంచ యంచు చీరెక్కు జోకయగుగాక పచ్చి మెనిక తోలు పచ్చ్చడంబు,”.. వంటి వ్యంగ్యాలు హాస్య రసాన్ని అందిస్తాయి. శ్రీనాధునివిగా ప్రసిద్ధి చెందిన చాటు పద్యాలలో కావలసినంత హాస్యం మనకు కనిపిస్తుంది. ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట. . సిరిగలవానికి చెల్లును తరుణులు పదియారువేలు తన పెండ్లాడన్.. తిరిపెమున కిద్దరాండ్రా పరమేశా గంగను విడుము పార్వతి చాలున్.. . నీళ్లకోసం ఇలా గడుసుగా విసిరిన చమత్కారానికి ఎంత మాడుపు మొహమైనా వికసించక తప్పదు. . ఆయనదే మరో పద్యం.. పూజారి వారి కోడలు తాజారగబిందె జారి దబ్బున పడియెన్ మైజారు కొంగు తడిసిన బాజారే తొంగి చూసి ఫక్కుంజ నగియెన్… . ఎంత దగ్గరివారైనా ఇలాంటి సన్నివేశాల్లో దబ్బున జారిపడితే చూసినవాళ్లెవరికైనా ముందు వచ్చేది నవ్వే.. ఇలాంటి చాటువులు కోకొల్లలు,.

సంగీత సామ్రాట్టు స్వాతి తిరునాళ్.! . - రచన : తనికెళ్ళ భరణి.

Image
సంగీత సామ్రాట్టు స్వాతి తిరునాళ్.! . - రచన : తనికెళ్ళ భరణి. ఆధ్యాత్మిక రంగంలో ఆదిశంకరాచార్యులు... హైందవ జాతి పునరుద్ధరణంలో వివేకానందుడు... ఎలాగ కృషి చేసి ప్రాత:స్మరణీయులై అతి చిన్నవయస్సులోనే పరమేశ్వరుడిలో లీనమైపోయారో!... .  అలాగే కేరళ రాష్ట్రానికి చెందిన ట్రావన్కూర్ మహారాజు "స్వాతి తిరుణాళ్" కూడా సంగీతంలో విశేషమైన కృషి చేసి ముప్పై మూడవ ఏటనే పరమపదం చేరాడు. .  అల్లకల్లోకంగా ఉన్న రాజకీయ, సాంఘిక పరిస్థితులు... వారసులెవరూ లేకపోతే రాజ్యాన్ని కాజేద్దామని కోట బురుజుల మీద గిరికీలు కొడ్తున్న "తెల్లదొరతనపు గద్దలు"... ఐకమత్యం లేక పరస్పరం కలహించుకుని ముక్కలు చెక్కలైపోతున్న సిగ్గులేని భరతజాతీ!... ఇలాంటి పరిస్థితుల్లో 1813 వ సంవత్సరంలో లక్ష్మీబాయి, రాజరాజ వర్మలకు ’స్వాతి’ నక్షత్రంలో పుట్టాడు..."స్వాతి తిరుణాళ్"!! పదహారో ఏటనే రాజ్యానికి వచ్చాడు గానీ.... కుట్రలూ కుతంత్రాల రాజకీయ చదరంగం ఏమీ నచ్చలేదు. ఎందుకో అతని మనసు సంగీతం వైపు మొగ్గింది. అలాంటి రాజకీయ కల్మషంలో గూడ... స్వచ్చమైన పద్మంలాగ సంగీత పరిమాళాలు గుబాళించాడు!! ఆయనో బాలమేధావి....అక్షరాల

హాస్యానికి ఆలంబనాలు చాటువులు.!

Image
హాస్యానికి ఆలంబనాలు చాటువులు.! . “ శృంగారాది నవరసాలలో హాస్యానిది రెండవ స్థానం.  సంభాషణా చాతుర్యం ద్వారా,హావభావ విన్యాసం ద్వారా  మనసుకు హాయిని కలిగించేది హాస్యం” . హాస్యానికి ఆలంబనాలు చాటువులు.  చమత్కార జనితమైన ఈ చాటువులు కొన్ని శృంగార భరితంగా కూడ ఉంటాయి.  కాళిదాసు పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ చాటువుని చదివి ఆనందించండి. . “ఆణోరణీయాన్ మహతో మహీయాన్ మధ్యో నితంబశ్చ మదంగనాయాః తదంగ హారిద్ర నిమజ్జనేన  యజ్ఞోపవీతం పరమం పవిత్రం” . దానిభావం పరిశీలిద్దాం -  మొదటి పాదం “ఆణువుకన్నా చిన్నదైన పరమాణువు  అనగా కనీకనిపించనిది అనికదా భావం. అట్లే మహత్తు కన్నా మహత్తు పెద్దవాటిలో పెద్దది అనికదాభావం.  అవి అందమైన, యవ్వనంలో ఉన్న స్త్రీయొక్క మధ్యమము  అనగా (సన్నని) నడుము,  మరియు నితంబము పెద్దది గాను ఉన్నదనియు, అట్టి స్త్రీని ఆలింగనం చేసికొన్నపుడు, ఆమె ఒంటికి రాసుకొన్న పసుపుతో కలసిన యజ్ఞోపవీతము,  పరమ పవిత్రమైనది కదా!” (వడ్డాది పాపయ్యగారి చిత్రం.)

" అమవస నిశి " !

Image
" అమవస నిశి " ! . ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలవారు నిండు కొలువు తీరి ఉండగా ,  అల్లసాని పెద్దన్న గారు కవిత్వం చెబుతూ , ఒక పద్యం లో " అమవస నిశి "  అన్న పదాన్ని వాడారు . ఆ పద్యం ఇదుగో ....... కలనాటి ధనము లక్కర గలనాటికి దాచ కమల గర్భుని వశమా నెల నడిమి నాటి వెన్నెల యలవడునే గాదె బోయె నమవస నిశికిన్. . అమవస అనేదే ఒక వికృతి ( అమావాస్య ) , దానిని నిశి తో కలిపి ప్రయోగించడం  నింద్యము , ఆక్షేపణీయం , నిషిద్ధం . అది అల్లసానివారు ఎరుగరా ? అయినా  గమన సౌలభ్యం కోసం , ఛందస్సు కుదరడం కోసం , వేరే పదాన్ని వెతకలేక  అలాగే వాడేశారు . సభికులెవ్వరూ కిమ్మనలేదు . నిశ్శబ్దం గా ఉన్నారు .  ఇంతలో తెనాలి రామలింగ కవి లేచి , అల్లసానివారిని ఆక్షేపణ చేస్తూ ఈ విధంగా  పద్యం చెప్పాడు . . ఎమి తిని సెపితివి కపితము? బమ పడి వెరి పుచ్చ కాయ వడి తిని సెపితో ఉమెతకయను తిని సెపితో అమవస నిసి యనుచు నీవు అలసని పెదనా! భావము:- ఓ అల్లసాని పెద్దనా! అమావాశ్య నిశి అనుదానిని  అమవస నిసి అని చెప్పితివి కదా? ఏమి తిని చెప్పితివి?  భ్రమపడి వెఱ్ఱి పుచ్చకాయ తిని చెప్పితివా? ఉమ్మెత్తకా

జగమంతా ఒక నాటకరంగం జనమంతా యిక పాత్రధారులే!

Image
శుభరాత్రి ! ఈ జగమంతా నిత్యనూతన నాటకరంగం ఈ జనమంతా అందలి చిత్రచిత్ర పాత్రధారులు ఈ జగన్నాటక సూత్రధారి ఆ సర్వసాక్షి ఈశ్వరుడే! జగమంతా ఒక నాటకరంగం జనమంతా యిక పాత్రధారులే!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2401) (శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2401) (శ్రీ శేషప్ప కవి) -సీ|| గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల మలయజంబు? శార్దూలమున కేల శర్కరాపూపంబు? సూకరంబులకేల చూతఫలము? మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల కుండలములు? మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల పంజరంబు? తే||  ద్రోహచింతనఁ జేసెడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేల?  భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే... ,

Image
తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే... , దానికంట ఒక్క రోజు ముందే నేను చచ్చిపోతాను.... ప్రక్క రాష్టాల వాళ్ళు భాష భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చి పోవాలని అనుకుంటున్నారు . . తెలుగంటే 35 మార్కులు ముక్కి ములుగి తెచ్చికోవటం కాదురా అది మనం మన అమ్మతో మన భాధలను ఆనందాన్ని పంచుకొనే వారధి .. ఐన దెబ్బ తగిలితే sit అని అసుధాన్ని నోటిలో వేసుకొనే మీకు తెలుగు గొప్పతనం ఏం అర్ధం అవుతుంది. / నేను మీకు ఉపన్యాసం చెప్పటానికి రాలేదు తెలుగు తల్లి కోసం పాఠం చెప్పటానికి వచ్చాను సర్ తెలుగు భాష చనిపోదు మీకు కూడా ఏమి కాదు మీరు అతి త్వరలో మల్లి మా ముందుకు వచ్చి మల్లి మంచి మంచి ఉపదేశాలు చెప్తారు అని ఆశిస్తూ... మీ కోసం దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను .. మీకు ఏమి కాదు మీలాంటి మహనీయుల వాళ్ళ ప్రతిరోజు ఎందరో పడుతున్న భాదల్ల్ని మరచి మొఖం మిధ మల్లి చిరునవ్వు చిగురిస్తుంది మీకు దేవుడు నిన్ను నూరేళ్ళు దేవుడు మా మధ్య ఉంచుతారు అని ప్రార్ధిస్తున్నాము .!

క్షణంలో సగం--శ్రీరంగం శ్రీనివాసరావు...(శ్రీ శ్రీ)

Image
ఒక మంచి కధ... క్షణంలో సగం--శ్రీరంగం శ్రీనివాసరావు...(శ్రీ శ్రీ) (ఇది--ఆంధ్ర జ్యోతి మాసపత్రిక, 1949 ఏప్రియల్--ఉగాది సంచికలో ప్రచురించబడింది. తరువాత ఇంకెక్కడైనా ప్రచురించారో లేదో నేను చూడలేదు.) . ఒక సాయంత్రం (వాడి పేరు చెప్పను) కనబడ్డాడు. "బయల్దేరు" అన్నాడు. ఎక్కడకని అడిగి లాభంలేదు వాడితో. హఠాత్తుగా అలాగే ఎన్నోసార్లు కనబడి ఏవో ప్రతిపాదనలు చేస్తూ వుంటాడు. నేను మారుమాట లేకుండా వాటిని శిరసావహిస్తూ ఉంటాను. "అనుభవం జ్ఞానానికి జనకుడు" అంటే నేను నమ్మను. అలాగే "అవసరం సృష్టికి జనని" అనే సుభాషితంలోకూడా నాకు నమ్మకంలేదు. అంటే పూర్తిగా నమ్మకం లేదనాలి. అవన్నీ సగం సత్యాలు కాబట్టి సగం సగం మాత్రమే నమ్ముతాను. ఇద్దరం బయలుదేరిన తర్వాత వీడు (ఎవరి పేరైతే చెప్పదలచుకోలేదో వాడు) "ఇప్పుడు మనం లక్షాధికారులం కావడం ప్రారంభిస్తున్నాం. తక్షణమే! జోరుగా నడు" అన్నాడు. ఇద్దరం తక్షణం ప్రారంభించాం. కాని ఆ ప్రారంభం ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉండి పోయింది. అప్పుడు బయల్దేరిన మేము ఇంకా బయల్దేరుతూనే ఉన్నాం. * * * ఈ సాయంత్రం ఇక్కడ ఈ నగరంలో.....సముద్రంలాంటి ఆకాశంలాంటి ఎడారిలా

ఎవరిని అడగాలి ..

Image
ఎవరిని అడగాలి ... బాపూ ఏమని అడగాలి ? . (రచయిత : సినారె) . సిరిమల్లెల విరియించే వసంతం చిగురాకులనే రాల్చేస్తే . నావను నడిపే చుక్కాని .. ఆ నావను తానే ముంచేస్తే  .  .వలపులు పోసి పెంచిన తీవే కాలసర్పమై కాటేస్తే . మమతలు పంచిన పాల మనసే మనసును కాస్తా విరిచేస్తే  . ఎవరిని అడగాలి ... బాపూ ఏమని అడగాలి ? . (ఆర్తి అగర్వాల్ సినిమా అందాల రాముడు చూస్తున్నా.)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2201) (శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2201) (శ్రీ శేషప్ప కవి) -సీ|| కర్ణయుగ్మమున నీ కథలు సోఁకినఁ జాలు పెద్ద పోగుల జోళ్లు పెట్టినట్లు చేతు లెత్తుచుఁ ౠజ సేయఁగల్గినఁ జాలు తోరంపుఁ గడియాలు తొడిగినట్లు, మొనసి మస్తకముతో మ్రొక్కఁగల్గినఁ జాలు చెలువమైన తురాయి చెక్కినట్లు, గళము నొవ్వఁగఁ నామస్మరణ గల్గినఁ జాలు, వింతగాఁ గంఠీలు వేసినట్లు, తే|| పూని నినుఁ గొల్చుటే సర్వ భూషణంబు, లితర భూషణముల నిచ్చగింపనేల? భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

శ్రీకృష్ణుడు "దైవం మానుష రూపేణా"

Image
శ్రీకృష్ణుడు "దైవం మానుష రూపేణా"   శ్రీకృష్ణుడు  అవతార పురుషుడు.  నరనారాయణులలో నారాయణుడు.  లీలామానుష విగ్రహ స్వరూపుడు. కారణజన్ముడు.  రాజసూయ యాగ సమయంలో రాజులంతా చూస్తుండగా సుదర్శనచక్రం శిశుపాలుడి తలను ఖండించింది. ఒక కొండలా అతడి తల క్రిందబడింది. వెంటనే ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ  బయటకు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది. ఆ కాంతిపుంజమే జీవాత్మ. అలా పరమాత్మలో జీవాత్మ ఐక్యం కావడాన్ని అక్కడి రాజులందరూ  ప్రత్యక్షంగా వీక్షించారు. శ్రీకృష్ణుడిని మానవమాత్రుడైన దైవంగా కీర్తించారు. ఈయన అవతార పురుషుడు. "దైవం మానుష రూపేణా" అన్నట్లు దేవుడే మనుష్యరూపం ధరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణల కొరకు భూమిపై అవతరించినట్లుగా మహాభారతంలో ఎల్ల చోట్లా కనబడుతున్నది.  ద్వాపరయుగమున మద్యపాన, స్త్రీలౌల్య, ద్యూతక్రీడాది వ్యసనములు సమాజమున స్వైరవిహారము చేసినవి. మద్రదేశ దురాచారముల గురించి కర్ణుడు శల్యునితో అన్నమాటలు: మద్రదేశంవారు చాలా దుష్టాత్ములు, దుర్మార్గవర్తనులు. మిత్రులకు కూడా కీడు తలపెట్టేవారు. మీ జాతిలో ఆడ, మగ, వావివరుసలు లేక సంచరిస్తారు. మీకది తప్పు కాదు. చనుబాలకు

త్రివర్గ విజ్ఞానం!

Image
                                          త్రివర్గ విజ్ఞానం! త్రివర్గ విజ్ఞానం! "ధర్మే చ, అర్థే చ, కామే చ, మోక్షే చ భరతవర్షభ                       యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్" భరత కుల శ్రేషా్ఠ! ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థ విషయమున ఇందేమి గలదో అదియే ఇతరత్ర గలదు. ఇందు లేనిది మరి యెచ్చోటను లేదు. భారతజాతీయ ప్రజాజీవిత సర్వస్వమే మహాభారతమునందలి ఇతివృత్తము. ఇందలి ప్రతి పాత్రయు సజీవమై జీవన మార్గ రహస్యములను దెల్పి మానవుల నడవడిని తీర్చిదిద్దుటలో ప్రముఖపాత్ర వహించును. దాని పరిణామమును, తుదకు ధర్మమే జయించుటను కండ్లకు కట్టినట్లుగా చూపును. ఆంధ్రమహాభారతం త్రివర్గ (ధర్మం, అర్థం, కామం) సాధనలోని అంతర్యాన్ని ఈవిధంగా ప్రపంచ మానవాళికి వివరిస్తున్నది. ధర్మం, కామం తగ్గిపోయేటట్లు అర్థపురుషార్థాన్ని (ధనార్జనయే) ధ్యేయంగా సేవించేవాడు కుత్సితుడు. అతడు తప్పక పతనం చెందుతాడు.  కేవలం ధనం కోసమే అర్థసేవ చేసేవాడు భయంకరమైన అడవిలో గోవులను రక్షించబూనే మందబుద్ధిని పోలుతాడు. ఇక అర్థధర్మాలు రెండింటిని విడిచి కేవలం, కామపురుషార్థపరాయణుడైనవాడు నీరు తక్కువ అయిన చెరువులో ఉండే చేప వంటివ

నా హృదయమందు! (దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఊర్వశి” నుంచి.)

Image
నా హృదయమందు! (దేవులపల్లి  కృష్ణ శాస్త్రి  గారి ఊర్వశి” నుంచి.) నా హృదయమందు … నా హృదయమందు విశ్వవీణాగళమ్ము భోరుభోరున నీనాడు మ్రోతవెట్టు; దశదిశాతంత్రులొక్క సుధాశ్రుతిని బె నంగి చుక్కలమెట్లపై వంగి వంగి నిలిచి నిలిచి నృత్యోత్సవమ్ముల చలించు. వెలుగులో యమృతాలొ తావులొ మరేవొ కురియు జడులు జడులు గాగ, పొరలి పారు కాలువలుగాగ, పూర్ణకల్లోలములుగ; కలదు నాలోన క్షీరసాగరము నేడు! దారిదొరకని నా గళద్వారసీమ తరగహస్తాల పిలుపుతొందర విదల్చు! మోయలేనింక లోకాలతీయదనము! ఆలపింతు నానందతేజోంబునిధుల! ప్రేయసి! చలియింపని నీ చేయి చేయి కీలింపుము చలియించెడు నా కంఠము నిలిచి నిలిచి పాడగా! ఊర్వశి! ఊర్వశి! నాతో ఊహాపర్ణాంచలముల

కృష్ణకుమారి !

Image
                                               కృష్ణకుమారి ! కృష్ణకుమారి !   కృష్ణకుమారి పాత తరం తెలుగు సినిమా కథానాయిక. ఈమె పశ్చిమ బెంగాల్ లో 1936, మార్చి 6న జన్మించారు. షావుకారు జానకి ఈమెకు పెద్దక్క. ఈమె సుమారు 110 పైగా తెలుగు సినిమాలలో నటించింది. కృష్ణకుమారి బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌ను పెండ్లాడింది. ఈమె పశ్చిమ బెంగాల్ లోని నౌహతిలో జన్మించింది. నాన్నగారి ఉద్యోగరీత్యా తరచుగా బదిలీల మూలంగా ఈమె విద్యాభ్యాసం రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా మొదలైన ప్రదేశాలలో జరిగింది. మెట్రిక్ అస్సాంలో పూర్తయిన తర్వాత మద్రాసు చేరిన వీరి కుటుంబం అక్కడే సినీ అవకాశాలు రావడం జరిగింది. సినీ జీవితం.... ఒకసారి ఆమె తల్లితో సహా స్వప్నసుందరి సినిమా చూడడానికి వెళితే అక్కడకి సౌందరరాజన్ గారి అమ్మాయి భూమాదేవి కూడా వచ్చింది. సినిమా హాల్లో కృష్ణకుమారిని చూసిన ఆమె నవ్వితే నవరత్నాలు సినిమా కొసం అమాయకంగా కనిపించే కథానాయిక కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. తర్వాత రోజే వారు కృష్ణకుమారి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆమెకు ఆ పాత్రనిచ్చారు. అలా తెలుగు సినిమా తెరకు 1951లో నిర్మించిన నవ్

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2001) (శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2001) (శ్రీ శేషప్ప కవి) -సీ|| అవనిలోఁగల యాత్రలన్ని చేయఁగవచ్చు, ముఖ్యుడై నదులందు మునుఁగవచ్చు, ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వఁగవచ్చుఁ, దిన్నగాఁ జపమాల ద్రిప్పవచ్చు, వేదాల కర్ధంబు విఱిచి చెప్పఁగవచ్చు, శ్రేష్ఠయాగములెల్లఁ జేయవచ్చు, ధనము లక్షలు కోట్లు దానమీయఁ నైష్ఠికాచారముల్ నడుపవచ్చు, తే||  జిత్త మన్యస్ధలంబునఁ జేరకుండ నీ పదాంభోజములయందు నిలుపరాదు; భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1901) (శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!( శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1901) (శ్రీ శేషప్ప కవి) . సీ|| భుజబలంబునఁ బెద్దపులులఁ జంపగవచ్చు, పాముకంఠముఁ జేతఁ బట్టవచ్చు, బ్రహ్మరాక్షస కోట్ల బాఱఁద్రోలఁగ వచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు, జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగఁగ వచ్చు, బదను ఖడ్గము చేత నదుమవచ్చుఁ, గష్టమొందుచు ముండ్ల కంపలోఁ జొరవచ్చుఁ, దిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చుఁ, తే||  బుడమిలో దుష్టులకు జ్ఞానబోధఁ దెలిపి సజ్జనుల జేయలేఁడెంత చతురుఁడైన, భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1801) (శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1801) (శ్రీ శేషప్ప కవి) సీ||  అధిక విద్యావంతుల ప్రయోజకులైరి, పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి, సత్యవంతులమాట జనవిరోధంబాయె, వదరుపోతులమాట వాసికెక్కె, ధర్మవాసనపరుల్ దారిద్ర్య మొందిరి, పరమలోభులు ధన ప్రాప్తులైరి, పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి, దుష్ట మానవులు వర్ధిష్టులైరి, తే|| పక్షివాహన! మావంటి భిక్షుకులకు శక్తిలేదాయె, నిఁక నీవె చాటు మాకు, భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1701) (శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1701) (శ్రీ శేషప్ప కవి) . సీ|| ఉర్విలో నాయుష్యమున్న పర్యంత్మంబు మాయ సంసారంబు మరగి, నరుఁడు సకల పాపములైన సంగ్రహించునుగాని నిన్ను జేరెడి యుక్తి నేర్వలేఁడు, తుదకుఁ గాలునియొద్ద దూత లిద్దఱువచ్చి గుంజుక చనివారు గ్రుద్దుచుండ, హింస కోర్వఁగలేక యేడ్చి గంతులు వేసి దిక్కులేదని నాల్గు దిశలు చూడఁ, తే|| దన్ను విడిపింప వచ్చెడి ధన్యుఁడెవడు? ముందె నీ దాసుఁడైయున్న ముక్తిగలుగు;  భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

నీలాసుందరీ పరిణయము - కూచిమంచి తిమ్మకవి

Image
నీలాసుందరీ పరిణయము - కూచిమంచి తిమ్మకవి (Satyanarayana Piska గారి కృతజ్ఞలతో...) . "బలు తెలి పుల్గు వారువము, బంగరువీణియ, మిన్కుటందెలున్, చిలుక తుటారిబోటియును, జిందపువన్నియ మేనుఁ, బొత్తమున్, చెలువపు తెల్లతమ్మివిరి సింగపుగద్దెయుఁ గల్గి యొప్పు న ప్పలుకులచాన, జానలరు పల్కులొసంగెడుఁ గాత నిచ్చలున్." . (నీలాసుందరీ పరిణయము - కూచిమంచి తిమ్మకవి) . భావము:  మిక్కిలి తెల్లనైన హంసవాహనముతో, పాదములకు ప్రకాశించు అందెలతో, శంఖమువంటి శ్వేతవర్ణశోభిత దేహకాంతితో,  తెల్లని తామరపూవు సింహాసనముపై అధివసించియున్నది వాణీమాత! ఆమె తన హస్తములలో స్వర్ణవీణ, చిలుక, పుస్తకములను ధరించియున్నది. "అటువంటి వాగ్దేవి తనకు సరళసుందరములైన అచ్చతెలుగు పలుకులను ప్రసాదించి, ఆశీస్సులను అందించుగాక"  . అని కవి ఆకాంక్షిస్తున్నాడు. . "నీలాసుందరీ పరిణయము" అచ్చతెలుగు కావ్యము. అందుకు అనుగుణంగా ఈ భారతీదేవి ప్రార్థనాపద్యం  కూడా అచ్చమైన తెలుగు పదాలతోనే సాగినది.

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1601) (శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1601) (శ్రీ శేషప్ప కవి) . సీ|| అతిశయంబుగఁ గల్లలాడ నేర్చితిఁ గాని పాటిగా సత్యముల్ బలుకనేర; సత్కార్య విఘ్నముల్ సలుపనేర్చితిఁగాని యిష్ట మొందఁగ నిర్వహింపనేర; నొకరిసొమ్ముకు దోసిలొగ్గనేర్చితిఁగాని చెలువుగా ధర్మంబు సేయనేర; ధనము లియ్యంగ వద్దనఁగ నేర్చితిఁగాని శీఘ్రమిచ్చెడునట్లు చెప్పనేర; తే|| పంకజాతాక్ష ! నే నతి పాతకుఁడను దప్పులన్నియు క్షమియింపఁ దండ్రివీవె; భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1501) (శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1501) (శ్రీ శేషప్ప కవి) . సీ||  నీమీఁద కీర్తనల్ నిత్యగానముఁజేసి రమ్యమొందింప నారదుఁడ గాను; సావధానముగ నీ చరణపంకజసేవ సలిపి మెప్పింపంగ శబరిఁగాను; బాల్యమప్పటినుండి భక్తి నీయందునఁ గలుగను బ్రహ్లాద ఘనుఁడఁగాను; ఘనముగా నీమీఁద గ్రంధముల్ కల్పించి వినుతిసేయను వ్యాస మునిని గాను; తే|| సాధువును, మూర్ఖమతి, మనుష్యాధముఁడను; హీనుఁడను, జుమ్మి; నీవు నన్నేలు కొనుము భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

మా వూరు విశాఖపట్నం జిల్లా చోడవరం. !

Image
చోడవరం. ! . మా వూరు విశాఖపట్నం జిల్లా చోడవరం.  (నా భార్య చెబితే నేను రాసేను ) అక్కడ మట్టిలోనే ఎదో శక్తి ఉంది. మా ఊళ్ళో ఎవర్ని కదిలించినా కవిత్వం చెప్పగలరు. మాట్లాడితే కావ్యం, పాట పాడితే గేయం, వెటకారానికి, వ్యంగ్యానికీ, మానవతకీ  మా ఊరు పుట్టింది పేరు. టైం ఎంతయిందిరా... అని ఎవరన్నా అడిగితే, .  “ఇందాకటి కంటే ఎక్కువే “ అని చెప్పే తిమ్మారింపు మా వాళ్ళకే చెల్లుతుంది. .  ఒంట్లో బాగులేని మనిషిని పరామర్శించి “ చచ్చీ దాకా బతుకుతావులేహే ” అంటూ గడుసుగా ధైర్యం చెప్పి, వాడికేదో సాయం చేసే మానవత మా ప్రజానీకం సొంతం. అలాంటి వాతావరణం లో నా బాల్యం గడిచింది.  నా నడత లో అదంతా రంగరించుకు పోయింది.  .  ఈవారపు “ నవ్య “ లో ప్రత్యేకం  డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు : భలే నచ్చేసింది  ఆయన సొంత ఊరు చోడవరం పరిచయం. అసలు మా వూరు( విజయవాడ ) నుంచీ బయలుదేరి ఏలూరు దాటుతున్నప్పుడే మొదలవుతుంది  ఈ వెటకారపలంకారం. అలా తెలుగు రాష్ట్ర అంచు దాకా వెళ్ళే సరికి ఇంకెంతవుతుందో ఆ చమత్కారం. ఉత్తరాంధ్ర తెలుగు సౌరభాన్ని తన వంతుగా కలం చేసి అందించిన ఆయన గురించిన పరిచయం లో సామాన్యుడే నాకు మాన్యు

సంక్రాంతి పండుగ..!

Image
సంక్రాంతి పండుగ..! సంక్రాంతి పండుగ..! సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతి పండుగ పుష్య మాసంలో వస్తుంది.ఇది మూడు రోజుల పండుగ. మార్గశిర మాసం, పుష్య మాసాలు హేమంత ఋతువులో వస్తాయి. ఇది చలి కాలం. చలి గజ గజా వణికిస్తూ వుంటుంది. మొదటి రోజు "భోగి" ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. "స్వర్గ వాకిళ్లు" అనే ముగ్గును వేస్తారు. ముగ్గుమధ్యలో "గొబ్బెమ్మలు" పెడతారు. వీధులలో "భోగి మంటలు" వేస్తారు. కుటుంబంలోని వారందరూ తలస్నానాలు చేసి "సంక్రాంతి లక్ష్మి" ని పూజిస్తారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. భోగి రోజు మూడు లేక ఐదు కూరగాయలను కలిపి కూరగా వండుతారు. దీన్ని "కలగూర" అంటారు. "నువ్వు పులగం, పొంగలి", ప్రధాన వంటకాలు. సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటము జరుపుతారు. బొమ్మల కొలువును ఏర్పరచడం కూడ వుంటుంది. బొమ్మలకు హారతి యిచ్చి, పేరంటం చేస్తారు. రెండవ రోజు "సంక్

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1401) (శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1401) (శ్రీ శేషప్ప కవి) సీ||  ఇభరాజవరద ! నిన్నెంత పిల్చిన గాని మాఱు పల్కవదేమి మౌనితనమొ, మునిజనార్చిత ! నిన్ను మ్రొక్కి వేడినఁగాని కనుల!జూచి వదేమి గడుసుదనమొ? చాల దైన్యమునొంది చాటు జొచ్చినఁగాని భాగ్యమీయ వదేమి ప్రౌఢతనమొ? స్ధిరముగా నీపాద సేవఁ జేసెదనన్న దొరకఁజాల వదేమి ధూర్తతనమొ? తే|| మోక్షదాయక! యిటువంటి మూర్ఖజనునిఁ గష్టపెట్టిన నీకేమి కడుపునిండు ? భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

Image
            శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1301) (శ్రీ శేషప్ప కవి) .సీ|| తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ మఱఁదు లన్నలు మేన మామగారు, ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనఁ దాను దర్లగ వెంటఁ దగిలి రారు, యమునిదూతలు ప్రాణ మపహరించుక పోఁగ మమతతోఁ బోరాడి మాన్పలేరు, బలగమందఱు దుఃఖపడుట మాత్రమె కాని, యించుక యాయుష్య మీయలేరు, తే||  చుట్టములమీఁది భ్రమఁదీసి చూరఁ జెక్కి, సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

రామ చిలుక!

Image
రామ చిలుక! (దేశి సాహిత్యము.... జానపద గేయములు.. ఎల్లోరా) . చిలుక చిలుక రామ చిలుక పలక నంటుందీ అత్త తెచ్చిన కొత్తకోక కట్టనంటుంది మామ తెచ్చిన సన్న బియ్యం దంచ నంటుంది అవ్వ తెచ్చిన ఆది రసం తినా నంటుంది మొగుడు తెచ్చిన మల్లెపూలు ముడవ నంటుంది కటారి కోకమీద కన్ను వేసిందీ. మామ కొడుకుమీద మనసు ఉంచిందీ.

కలలోనే చూడాలేమో! .

Image
కలలోనే చూడాలేమో! . హరిదాసు పాటతో పోటి పడుతోన్న కోకిల కిలకిలలు... గువ్వల గుసగుసలు . ఇంటి ముందు కొలువయిన గొబ్బెమ్మల ముచ్చట్లు ... . నింగిపైని ఇంద్రధనుసును కిందకు దించిన ఇంటి ముందున రంగవల్లులు... . రేగి పండ్లతో అమ్మలు చేసే చంటి పిల్లల అభిషేకాలు.. .. కంటికెదురుకానీ! నేటి ఈ స్వప్నం... తిరిగి రానీ! మళ్లీ నాటి మన పల్లె సౌందర్యం,!.

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1201) (శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ . శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1201) (శ్రీ శేషప్ప కవి) . సీ|| పాంచభౌతికము దుర్భరమైన కాయం బి దెప్పడో విడుచుట యెఱుకలేదు, శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని, నమ్మరాదామాట నెమ్మనమున బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక ముదిమియందో, లేక ముసలియందొ, యూరనో, యడవినో, యుదకమధ్యముననో, యెప్పుడో యేవేళ నే క్షణంబొ? తే|| మరణమే, నిశ్చయము, బుద్ధిమంతుఁడైన దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు,  భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

గురు శిష్య బంధం! (శ్రీ చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి, ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం)

Image
గురు శిష్య బంధం! (శ్రీ చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి, ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం) . చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారి ప్రధాన శిష్యుడు పింగాలి తన వెంటే ఎప్పుడూ తీసుకొని వెళ్ళే వాత్సల్యం వారిది  .శాస్త్రి గారిఉ మరణిస్తే అప్పటి దాకా ఆయన నిర్వహించిన ఆస్థాన కవి పదవి ఖాళీ అయితే ఎవరిని నియమించాలన్న విషయం లో మంత్రి గోపాల రెడ్డి వీరి దగ్గరకు వచ్చి సలహా అడిగారు . అప్పుడు పింగళి ‘’మీ ఆస్థాన కవి పదవి మా గురువు గారికి ఒక ‘’ఫుట్ స్టూల్ ‘’లాంటిది .నేనుద్దేశించిన వాజ్మయపు గద్దె అది కాదు ‘’అని చెప్పి వేరేవారి పేరో సూచించారట  .ఇంగ్లీష్ -తెలుగు నిఘంటువు ను నిర్మించిన ఘనత పింగళి వారిది .అందులో ప్రయోగం అనువదించే పధ్ధతి చూపి కొత్త మార్గం పట్టించారు .ఆంధ్రా యూని వర్సిటి లో ఉద్యోగ విరమణ త్తర్వాత ఇరవై ఏళ్ళు కవిత్వం జోలికే పోలేదు 1948 లో వెంకట శాస్త్రి గారిని ఆస్థాన కవిగా మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే విజయ వాడ లో గొప్ప సన్మాన సభ జరిపారు శిష్యులు .అప్పుడు కట్టమంచి రామ లింగా రెడ్డి మాట్లాడుతూ ‘’వెంకట శాస్త్రి గారు చేసిన సాహిత్య వ్యాసంగం అవధానాలు ఒక ఎత్తు అయితే పింగళి లక్ష్మీ కాంతం అనే శిష్యు

నీ పైట నా పడవ తెరసాప కావాల!

Image
                  నీ పైట నా పడవ తెరసాప కావాల ! - నీ పైట నా పడవ తెరసాప కావాల నీ సూపే సుక్కానిగ దారి సూపాల నా పాట నీ నోట పలకాల సిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక

సంక్రాంతి జోకులు....!

Image
సంక్రాంతి జోకులు....! . * ఒబేసిటీ పేషెంట్ షాకయ్యేదెప్పుడు? పూటకి ఒక్క ముగ్గు చొప్పున ఉదయం-1, మద్యహ్నం-2, రాత్రి-3. ఇలా నెల రోజులపాటు రెగ్యులర్ గా ముగ్గులు పెట్టావంటే తీగలా సన్నబడతావు అని డాక్టర్ చెప్పినప్పుడు. ......... * సిసలైన చాదస్తపు డాక్టరు? సంతానం కోసం సలహా అడిగిన పేషెంట తో పుత్ర కామేష్ఠి యాగం చేయమనేవాడు. ...... * నేటి పేషంట్? ఇంటి దగ్గర వుంటే రోగం గురించి, హాస్పిటల్ కొచ్చాక బిల్లు గురించి బాధ పడేవాడు. ..... * నిజాయితీ గల క్రొత్త డాక్టరు? నూతనంగా అద్దె ఇంట్లో ప్రాక్టీస్ ప్రారంభించిన హాస్పిటల్ గోడపై నేటి మీ ఫీజులే రేపటి నా శాశ్వత నర్సింగ్ హోమ్ కి పునాదులు అని క్యాప్షన్ వ్రాయించేవాడు. ... * పేషంట్ విస్తుపోయేదెప్పుడు? నర్స్ పేషెంట్ వివరాలు రాసుకుంటూ ‘జన్మ నక్షత్రం చెబితే గుళ్ళో అతడిపేరు మీద అర్చన చేయిస్తా’మని చెప్పినపుడు.

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1101) (శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1101) (శ్రీ శేషప్ప కవి) . సీ|| బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని, మరణకాలమునందు మఱతునేమో? యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు కఫ వాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ గంప ముద్భవమంది, కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచుఁ బిలుతునో! శ్రమచేతఁ బిలువలేనొ? . తే|| నాటికిప్పుడె చేసెద నామభజనఁ దలఁచెదను జేరి వినవయ్య ! దైర్యముగను, భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1001) (శ్రీ శేషప్ప కవి)

Image
                       ధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! ధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1001) (శ్రీ శేషప్ప కవి) . సీ|| బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని, మరణకాలమునందు మఱతునేమో? యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు కఫ వాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ గంప ముద్భవమంది, కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచుఁ బిలుతునో! శ్రమచేతఁ బిలువలేనొ? . తే|| నాటికిప్పుడె చేసెద నామభజనఁ దలఁచెదను జేరి వినవయ్య ! దైర్యముగను భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారిసాహిత్యవిశేషాలు!

Image
ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారిసాహిత్యవిశేషాలు! 1960లో ఆగ్రా లో అఖిల భారత బెంగాలీ సభలు జరిగితే ప్రత్యెక అతిధిగా వెళ్లి మహా భారతం విశిష్టత మీద గంట సేపు అనర్గళం గా ఆంగ్లం లో ప్రసంగించి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేశారు .అక్కడి వాళ్ళు ‘’మీ ఆంద్ర దేశం లో చైతన్య ప్రభువు ప్రభావం లేదటగా కృష్ణ భక్తీ మీకు తెలియదట గా ?’’అని అడిగితే లక్ష్మీ కాంతం గారు ‘’మీ చైతన్యుడి కంటే ముందే మా మధుర కవి పోతన్న భాగ వతాన్ని రాశాడు. కృష్ణ భక్తిని ఇంటింటా పాదుకోల్పాడు ఆయన పద్యాలు రాని తెలుగు లోగిలి లేదు ‘’అని చక్కని సమాధానం చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపించారు . ఆంద్ర ప్రభ వార పత్రికలో శ్రీ తిరుమల రామ చంద్ర ‘’మరపు రాని మనీషులు ‘’శీర్షిక తో తెలుగు ప్రముఖులను గురించి రాస్తున్నారు .ఆయన ఈయన ఇంటర్వ్యు కోసం వస్తే ‘’నాకు మీ ప్రచారం అక్కర్లేదు నా పనేదో నేను చేసుకు పోతున్నా ‘’అని నిష్కర్షగా చెప్పారు .ఆయన వీరిపై వ్యాసం రాసి అందులో ‘’పింగళి వారికి ప్రచార సాధనం వారి శిష్యులే .నూటికి నూరు పైసలా ఆయన ఆచార్యులు .నిజమైన ఉపాధ్యాయులు ‘’అని ముక్తాయింపు ఇచ్చాడు . కేంద్ర సాహిత్య ఎకాడమి కి ఎక్సి క్యూటివ్ కౌన్సిల్ సభ్యులైనారు దాని అధ్