tag:blogger.com,1999:blog-58368021228679122002024-02-29T20:24:51.090-08:00పలుకు తేనియలు Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.comBlogger5439125tag:blogger.com,1999:blog-5836802122867912200.post-73327890575333576072022-06-09T22:01:00.000-07:002022-06-09T22:01:03.292-07:00🌹🌹🌹🌹దొందూదొందే - సామెతకథ 🌹🌹🌹🌹<h3><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhpIw_qsazPmWZ90hVkc4rVjUpnuh9hSXBxCoMNdKkIUWRCMHS1zkBQOjD8KdMx5FaDdqg-ZLDWKM6cDhlPXHPznQUFDeI5DlAkGyvyRFqxcJu-ikP8fNUWaEWzJU2FRl5GjAkXzS7wzxmBFpLcxjIZv0-FWw3bZZfdz0jrrwkDvVLE3l9skdYhNwInPA/s960/285850574_8306249212733738_4752636949936476289_n.jpeg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="693" data-original-width="960" height="462" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhpIw_qsazPmWZ90hVkc4rVjUpnuh9hSXBxCoMNdKkIUWRCMHS1zkBQOjD8KdMx5FaDdqg-ZLDWKM6cDhlPXHPznQUFDeI5DlAkGyvyRFqxcJu-ikP8fNUWaEWzJU2FRl5GjAkXzS7wzxmBFpLcxjIZv0-FWw3bZZfdz0jrrwkDvVLE3l9skdYhNwInPA/w640-h462/285850574_8306249212733738_4752636949936476289_n.jpeg" width="640" /></a></div><br />🌹🌹🌹🌹దొందూదొందే - సామెతకథ 🌹🌹🌹🌹</h3><h3>——————————//———————————</h3><h3>అనగనగా ఒక ఊరు.</h3><h3>ఆ ఊళ్ళో ఒక నత్తి వాడుండేవాడు.</h3><h3>అతన్ని అందరూ ఎగతాళి చేసేవారు.</h3><h3>నత్తి కారణంగా అతనికి పెళ్ళి కాకుండా వుంది.</h3><h3>చివరికి అతని తల్లితండ్రులు చాలా దూరంలో వున్న</h3><h3>ఒక ఊరిలో అమ్మాయిని చూసి ఆ అమ్మాయితో తమ అబ్బాయికి పెళ్ళి చేశారు. పెళ్ళి జరుగుతున్నంతసేపూ ఇద్దరూ మాట్లాడకుండా కూచున్నారు. సిగ్గుపడుతున్నారని అందరూ అనుకున్నారు.</h3><h3>🌈</h3><h3>పెళ్ళి తంతు అంతా పూర్తి అయిన తర్వాత అబ్బాయినీ,</h3><h3>అమ్మాయినీ పల్లకీలో ఎక్కించి అబ్బాయి ఊరికి పంపించారు.</h3><h3>దారిలో వారికి పూచిన చింతచెట్ల వరస కనిపించింది.</h3><h3>👉నత్తివాడు సంతోషం పట్టలేక “ తింతలు తూతాయి”</h3><h3>(చింతలు పూశాయి )అన్నాడట.</h3><h3>👉అది విని అమ్మాయి “ తూతే తెట్టు తుయ్యదా తాతే తెట్టు తాయదా “</h3><h3>(పూసే చెట్టు పుయ్యదా , కాసే చెట్టు కాయదా ) అన్నదట.</h3><h3>👉వారి వెనక వస్తున్నపురోహితుడు “ దొందూ దొందే “</h3><h3>(రెండూ రెండే) అని అన్నాడట.</h3><h3>ఆ ముగ్గురు నత్తివాళ్ళను చూసి పల్లకీ బోయీలు నవ్వుకున్నారట.....</h3><h3>అలాఅలా దొందూ దొందే అనే సామెత వాడుక లోనికి వచ్చింది........</h3><h3>🌹🌹🌹🌹🌹————🌹🌹🌹——-🌹🌹🌹🌹</h3><div><br /></div>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-76054137874748894382022-06-09T20:52:00.002-07:002022-06-09T20:52:27.844-07:00🔻మధ్య తరగతి మనో "గతం" <h3 style="text-align: left;"> </h3><h3>(<div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjwLFg6v4z1NTMn_AZTotnh5o-c0mCp_N1VzWP7WggoUq7WW9gY5-4ImabdM76L_OOZwkYtf6B38FGRLP-BK-VtHoNyyytA-sKji7yxlRulhJVsps71pX7wdMOuj_V5PKOTWVzO0rJyRCOJUg2T-DBTuRRpoiEMwjexVC60EKlwnh7VrXrdWmGR-sfpWg/s1010/279047354_8072529606105701_8549110788487621519_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="768" data-original-width="1010" height="486" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjwLFg6v4z1NTMn_AZTotnh5o-c0mCp_N1VzWP7WggoUq7WW9gY5-4ImabdM76L_OOZwkYtf6B38FGRLP-BK-VtHoNyyytA-sKji7yxlRulhJVsps71pX7wdMOuj_V5PKOTWVzO0rJyRCOJUg2T-DBTuRRpoiEMwjexVC60EKlwnh7VrXrdWmGR-sfpWg/w640-h486/279047354_8072529606105701_8549110788487621519_n.jpg" width="640" /></a></div><br /></h3><h3>ఎవరో ఈల వేసి పిలిచినట్టు సెల్ ఫోను </h3><h3>మోగగానేఆయనకేసి చూశాను</h3><h3>జాపుకున్న కాళ్ళకి పతంజలి నూని రాసుకుంటూ... </h3><h3>"పార్వతీ ! నీ కొడుకు నీ అకౌంటకి 2000 డాలర్లు పంపాడట ,</h3><h3> వ్వాట్సాప్ లో చెబుతున్నాడు" అన్నారు </h3><h3>మావారు శంకర ప్రసాదు గారు. </h3><h3>"డాలర్లలో చెప్పకండి, నాకర్ధమయ్యేట్టు రూపాయల్లో చెప్పండి" అన్నాను విసుగ్గా. </h3><h3>"2000 ని 74 తో గుణించు... రూపాయల్లో వస్తుంది " అన్నారు విద్యార్థికి లెక్క ఇస్తున్నట్టుగా </h3><h3>"ఆ గుణకారాలేవో మీరే చెయ్యండి,</h3><h3>లెక్కల మాష్టారు కదా ?" అన్నాను తెలివిగా .</h3><h3>"లక్షా నలభై ఎనిమిది వేలవుతుంది" అని చెప్పేసి వ్వాట్సాప్ లోకి దూరిపోయారు యధాలాపంగా. </h3><h3>🚩</h3><h3>చెప్పొద్దూ... అమెరికా వెళ్ళినప్పుడల్లా ఏ మాల్ కి వెళ్లినా ధరలు చూసి వెంటనే 70 తో గుడించేదాన్ని, </h3><h3>నాకు ఏడో ఏకం బాగానే వచ్చు .</h3><h3>రూపాయిల్లోకి మార్చాక గుండె గుభేల్మనేది .</h3><h3>"ఇక్కడ రూపాయల్లో ఆలోచించ కూడదమ్మా"</h3><h3>అనేవారు పిల్లలు.</h3><h3>పుట్టుకతో వచ్చింది ఊరికినే పోతుందా ?</h3><h3>🚩</h3><h3>కరివేపాకు కట్ట 70 రూపాయలట !</h3><h3>అందుకే.. కూరల్లో,చారులో కొంచం తగ్గించే వేసేదాన్ని.</h3><h3>ఎప్పుడు ఏ సంఘటన జరిగినా ...</h3><h3>ఎందుకో పాత జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి. </h3><h3>ఈయన మూడేళ్ళ కిందట రిటైర్ అయ్యాక మరీను !</h3><h3>🚩</h3><h3>ఇప్పుడు నా రెండో కొడుకు ప్రత్యేకం జ్ఞాపకంపెట్టుకుని, </h3><h3>నాపుట్టిన రోజుకి ఏదైనా కొనుక్కోమని లక్ష చిల్లర డబ్బులు పంపిస్తే ఆనందమే ....కానీ....</h3><h3>అప్పట్లో మా మావయ్య నాపుట్టిన రోజుకని ఇచ్చిన యాభై రూపాయలకి ఎంత సంబర పడిపోయానో....</h3><h3>ఎంత మందితో చెప్పుకున్నానో !</h3><h3>అంత సంతోషించడానికి కారణం ఆ వయసా ?</h3><h3>అప్పటి పరిస్థితులా ? లేక అవసరాలా? ఏమో!</h3><h3>🚩</h3><h3>ఇప్పుడు ఖరీదైన 4 బెడ్ రూముల అపార్టుమెంటు,</h3><h3>ఏసీలు,సోఫా సెట్లు,కింగ్ సైజు మంచాలు, అమెరికా పరుపులు, పేద్ధ టీవీ, ఖరీదైన కారు ...అన్నీ ఉన్నా.... </h3><h3>ఎందుకో.. ఆ మూడు వరస గదుల అద్దె ఇంట్లో </h3><h3>మా అత్త గారు,మేవిద్దరం,ముగ్గురు పిల్లల్తో ఉన్నా </h3><h3>ఎంతో ఆనందంగా, కళ కళ్ళాడుతూ ఉండేది !</h3><h3>ఇరుకు అనిపించేదే కాదు. </h3><h3>🚩</h3><h3>సెకండు హ్యాండు స్కూటర్ మీద ఆయన అలా ...</h3><h3>గోదారి గట్టు మీదకి తీసుకెడితే ...</h3><h3>ఆ ‘ఇదే’ వేరు ! </h3><h3>ఫ్రిజ్ కూడా లేదు, నలుపు, తెలుపు టీవీ లో చిత్ర లహరి చూస్తుంటే ఏమి ఆనందించాం !</h3><h3>🚩</h3><h3>మా ఆడపడుచులు వస్తే అందరం బరకం పరుచుకుని, పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే.. నిద్రే వచ్చేదికాదు !</h3><h3>మా అత్త గారు కూడా మధ్యలో కబుర్లు కలుపుతూ, కునికి పాట్లుపడుతూ,</h3><h3>"ఇంక చాలు, పడుక్కోండి, తెల్లారి పోతోంది, </h3><h3>మళ్ళీ పెందలాడే లేవాలి" అనేవారు. </h3><h3>🚩</h3><h3>మా కబుర్ల కంటే నవ్వులే ఎక్కువగా ఉండేవి,…</h3><h3>ఎవర్నీ నిద్దరోనీకుండా. </h3><h3>మా ఆడపడుచులు ఎంతో మంచివాళ్ళు,</h3><h3>ఇప్పటి టీవీ, సినిమా ఆడపడుచుల్లా కాదు.</h3><h3>అప్పట్లో ఈయన పినతల్లి కొడుకు పెళ్లికి వెళ్ళాలంటే మంచి పట్టు చీరలే ఉండేవి కావు.</h3><h3>🚩</h3><h3>ఇప్పుడు మూడు బీరువాల నిండా ఎవరెవరో పెట్టినవి, పెట్టించుకున్నవి,కొనుక్కున్నవి చాలా ఉన్నాయి.</h3><h3>పట్టు చీరలైతే లెక్కే లేదు…. ఫాన్సీ చీరలు ఉన్నా ...</h3><h3>ఏం కట్టుకుంటాం ?</h3><h3>అటూ, ఇటూ అందరి పెళ్ళిళ్ళూ అయిపోయాయి. </h3><h3>అందరి కుటుంబాల నించీ ఒక్కళ్ళైనా అమెరికాయో,</h3><h3>లండనో చెక్కేశారు. </h3><h3>మా రోజుల్లో కొంపకి ఒక్కళ్లు హైదరాబాద్ వెడితే ...</h3><h3>‘అబ్బో’ అనుకునే వాళ్ళం. </h3><h3>శ్రావణ మాసం పేరంటంలో ఎవరైనా</h3><h3>"మావాడు హైడ్రాబాడ్ లో చార్మినారు,ట్యాంకు బండూ చూపించాడు" అంటే,</h3><h3>మనం ఎప్పుడు చూస్తామో అనుకునే వాళ్ళం. </h3><h3>🚩</h3><h3>ప్రస్తుతం మా పిల్లలు, ఇద్దరబ్బాయిలూ, </h3><h3>ఒకమ్మాయి అమెరికా లో స్థిరపడ్డారు...</h3><h3>"శతమానం భవతి" సినిమాలో లాగ.</h3><h3>నేనూ,ఈయనా ఇక్కడే భాగ్య నగరంలోనే ఉండిపోయాం...</h3><h3>జయ సుధా, ప్రకాష్ రాజుల్లాగా.</h3><h3>🚩</h3><h3>కొడుకులు ఫోను చేసినప్పుడల్లా "గ్రీన్ కార్డు" అంటూవుంటారు.... </h3><h3>స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ మాటిమాటికి </h3><h3>"నా ఉజ్జోగం?" అన్నట్టు!</h3><h3>ఎందుకో అమెరికా వెళ్లాలంటే ఇంకా మనసు </h3><h3>రావడం లేదు, </h3><h3>🚩</h3><h3>ఇక్కడే పాత స్నేహితులు,చుట్టాలతో వాట్సాప్, ఫోనులతో కాలక్షేపం చేయడమే ఇష్టం. </h3><h3>తరవాత్తరవాత భగవంతుడెలా నిర్ణయిస్తాడో మరి!</h3><h3>నాకు మాత్రం, ఆ టీవీ సీరియళ్లు, చాగంటి వారి ప్రవచనాలు చూసుకుంటూ వేళకి ఇంత ఉడకేసిపడేస్తే </h3><h3>హాయిగా గడిచిపోతుంది. </h3><h3>🚩</h3><h3>అన్నట్టు మొన్న వేసంకాలం మా అమ్మాయి, పెద్ద మనవరాలు, మనవడు వచ్చినపుడు వేలకి వేలు తగలేసి నాకోసం ట </h3><h3>స్మార్టు ఫోను,టాబ్ కొన్నారు.-....చెప్పాచెయ్యకుండా .</h3><h3>వాటిల్లో వాట్సాప్, యూట్యూబు పెట్టి నన్ను చూసుకోమన్నారు.</h3><h3>మా పెద్ద మనవరాలు మా హై స్కూల్ సైన్సు మాష్టారి లాగ అన్నీ నేర్పించి వెళ్ళింది. </h3><h3>ఈయన నేర్పితే రాదుకానీ...</h3><h3>అది నేర్పితే బాగానే అలవడ్డాయి నాకు.</h3><h3>నిజంచెప్పొద్దూ... అవన్నీ నేర్చుకున్నాక, </h3><h3>రోజూ పిల్లలందరి మెసేజీలు, ఫోటోలు, వీడియోలు,</h3><h3>రక రకాల విశేషాలు చూస్తుంటే ...మాటాడుతుంటే… </h3><h3>టైమే తెలియడంలేదు. </h3><h3>ఈమధ్య ‘భావుక’ మిత్ర బృందం తో చేరాక చిన్నప్పటి</h3><h3>నా క్లాసు మేట్లు అందరూ కట్టగట్టుకుని వచ్చినట్టుంది.</h3><h3>పిల్లలు ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్నారనే భావమే రావడంలేదు. </h3><h3>🚩</h3><h3>అదే నా పెళ్ళైన కొత్తలో నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న</h3><h3>మా అమ్మ కోసం ఎంత బెంగెట్టుకునేదాన్నో!</h3><h3>ఏమాటకామాటే చెప్పుకోవాలి, పాపం ఈయన వారానికి రెండుసార్లు పుట్టింటికి పంపించేవారు</h3><h3>బడ్జెట్ ఇబ్బందులున్నా !</h3><h3>తనికెళ్ళ భరణి తీసిన "మిధునం" చూస్తుంటే మా కధే తీసినట్టు అనిపిస్తుంది. </h3><h3>కాకపోతే లక్ష్మి, బాలు గార్లు పల్లెటూళ్ళో ఉంటారంతే. </h3><h3>మా పిల్లలు వారానికి రెండు మూడు సార్లు వీడియో కాల్సు చేస్తే </h3><h3>వంట డ్యూటీ తనదేనని పాపం శంకర ప్రసాద్ గారికి తెలుసు. </h3><h3>🚩</h3><h3>ఆయనక్కూడా వాట్సాప్, యూట్యూబు,ఫేసు బుక్కు ఉన్నా,ఆయన రూటే ...సెపరేటు. </h3><h3>ఎప్పుడూ రాజకీయాల గొడవే !</h3><h3>"వాడలా అన్నాడు, వీడిలా అన్నాడు "</h3><h3>అని ఆవేశపడిపోతూ ఉంటారు. </h3><h3>ఆ ఫేసు బుక్కులో వ్యాసాలకి వ్యాసాలు రాసేస్తుంటారు, </h3><h3>తానే సమాజాన్ని మార్చెయ్యాలన్నట్టు !</h3><h3>ఇంక టీవీ చూడ్డం మొదలెడితే స్నానమవదు, </h3><h3>అన్నానికి లేవరు. </h3><h3>పొద్దుకుంగే దాకా ఆ దిక్కుమాలిన ఛానళ్ళ లో వాదనలే వింటుంటారు. </h3><h3>పది మందీ కలిసి ఒక్క సారే అరిచేస్తుంటారు,</h3><h3>ఒకడు చెప్పీది ఇంకోడు వినిపించుకోడు.</h3><h3>ఈయన,"నువ్వునోరుముయ్యరా" అని అరిచేస్తుంటారు !</h3><h3>రోజూ ఇదో ప్రహసనం !</h3><h3>🚩</h3><h3>నేను మాత్రం, నా గది లోకి వెళ్లి, ఏసీ వేసుకుని,</h3><h3>సుమ ఆడవాళ్ళ చేత ఆడించే ఆటలు చూస్తూ,</h3><h3> వాళ్ళు కట్టుకున్న పట్టుచీరలు, నగలు చూస్తూ, </h3><h3>ఈటీవీ లో 'అభిరుచి' లోని రక రకాల వంటల కార్యక్రమాలని ఎంజాయ్ చేస్తుంటాను. </h3><h3>ఆయనకి ఇవేమీ నచ్చవు. </h3><h3>ఎప్పుడూ రాజకీయాలు, వార్తలు, ట్రంపు, మోడీ, </h3><h3>చంద్రబాబు,కేసీయారు, జగన్ను,పవన్ను......</h3><h3>లేక పోతే </h3><h3>ఆ జంతువులు ఒకదాన్నొకటి పీక్కుతినే 'విజ్ఞాన' </h3><h3>చానళ్ళు ట.... అవే చూస్తుంటారు.</h3><h3>మా దాంపత్య జీవితం లో నగలు, చీరల కోసం ఎన్నడూ ఆయన్ని వేధించలేదు కానీ..</h3><h3>చిన్న టీవీ ఉన్నప్పుడు మాత్రం, సీరియళ్ల టైముకి ఛానల్ మారిస్తే మాత్రం గొడవలే. </h3><h3>అందుకే మొన్నామధ్య మా చిన్నబ్బాయి వచ్చినపుడు, రాజీమార్గం గా</h3><h3>నా కోసం ఒకటి, వాళ్ళ నాన్నకి ఒక పేద్ధ టీవీ కొని పారేశాక, కొంపలో శాంతి నెలకొంది... శ్రీలంక లో లాగ.. </h3><h3>అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది,</h3><h3>ముగ్గురు పిల్లలు, నేను, మా ఆయన, మా అత్త గారు</h3><h3>ఉన్నపుడు ఇల్లు ఇరుకనిపించ లేదు, డబ్బు లేదనిపించలేదు. </h3><h3>(ఈయన జీతం ఏ నెల్లో ఎంత వచ్చేదో నేను ఎప్పుడైనా పట్టించుకుంటేగా!)</h3><h3>🚩</h3><h3>చుట్టాలు, పక్కాలు వచ్చి మూడు,నాలుగు రోజులుండి పోయినా ఇబ్బందనిపించేది కాదు.</h3><h3>ఎన్నిసార్లు డికాషన్ తీసేదాన్నో..</h3><h3>ఎన్నిసార్లు కుక్కర్ పెట్టేదాన్నో !</h3><h3>సమయానికి గ్యాస్ అయిపోతే, పక్క వాటా వాళ్ళ </h3><h3>సిలిండెర్ ఉమ్మడి ఆస్తి అయిపోయేది.</h3><h3>ఫ్రిజ్ లేని రోజుల్లో అధాట్టుగా ఎవరైనా వస్తే,</h3><h3>పాలు, పంచదార,కాఫీ పొడికి పక్కింటి</h3><h3>రాధమ్మ గారే మాకు క్రెడిట్ కార్డు. </h3><h3>🚩</h3><h3>ఇప్పుడేమో లంకంత కొంపలో బిక్కు బిక్కుమంటూ మేమిద్దరమే….</h3><h3>అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయిలాగ. </h3><h3>ఎవరి ఫోన్లు, డెబిట్ కార్డులు, బాంక్ అకౌంట్లు, </h3><h3>ఫేసుబుక్ అకౌంట్ లు వాళ్లవే.</h3><h3>పిల్లలు వారంలో ఐదారు సార్లు ఫోను చేసినా ఆయనతో మాట్లాడేది తక్కువే .</h3><h3>ఎప్పుడైనా ఆయన ఫోను తీస్తే, "ఎలా ఉన్నార్రా ?" </h3><h3>అంతే. మాటలే ఉండవు.</h3><h3>అదే మాకయితే డైలీ సీరియళ్ళే !</h3><h3>మా చిన్న కోడలు ఫోను చేసిందంటే బీబీసీ దగ్గరినించీ అన్ని చానళ్ల న్యూస్ చెప్పాక,</h3><h3>మా బుల్లి మనవడి బొమ్మల టెంటు లోకి తీసుకెళ్లి వాడితో మాట్లాడించే లోపు </h3><h3>వాడు "నానమ్మ, బాయ్" అంటాడు. </h3><h3>వాడు బాయ్ ఎంత బాగా చెప్తాడో !</h3><h3>🚩</h3><h3>మాపెద్ద కోడలైతే వీకెండ్ లోనే మాట్లాడుతుంది, </h3><h3>ఉద్యోగ భారం కారణంగా .</h3><h3>ఈ లోగా మా పెద్దాడు వచ్చి,</h3><h3>"అమ్మా,గ్రీన్ కార్డు విషయం ఏంచేశారు?"అంటాడు </h3><h3>సినిమా మధ్యలో వాణిజ్య ప్రకటన లాగ. </h3><h3>"మీ నాన్ననడుగు" అని ఆయన మీదకి తోసేస్తాను. </h3><h3>ఆయనతో ఈ విషయం మాట్లాడ్డానికి వాడికెందుకో</h3><h3> చాలా 'ఇది'. </h3><h3>🚩మా అమ్మాయి అయితే ఈటీవీ జబర్దస్తు లెవెల్లో</h3><h3>జోకులు వేస్తూనే ఉంటుంది. </h3><h3>ఈ లోగా మా పెద్ద మనవడు, మనవరాలు వచ్చి,</h3><h3>వాళ్ళకొచ్చిన గిఫ్టులు,సర్టిఫికెట్లు చూపించేస్తారు. </h3><h3>“అంతసేపు మాట్లాడ్డానికి ఏముంటాయి?"</h3><h3>అంటారీయన.!</h3><h3>ఈయనకేంతెలుసు, పిల్లల్తో మాట్లాడాక నాకు టానిక్ తాగినట్టుంటుందని ?</h3><h3>మా అబ్బాయిలు "అమ్మా, వచ్చే సమ్మర్ కి మీరు</h3><h3>ఇక్కడికి రావడానికి టికెట్లు బుక్ చేస్తున్నాం " అంటే </h3><h3>"మీ నాన్న తో చెప్పండి" అని ముక్తాయిస్తా .</h3><h3>వాళ్ళ నాన్నని అడిగితే "మొన్ననే కదరా వచ్చాం" </h3><h3>అంటారని వాళ్లకి తెలుసు. </h3><h3>ఎందుకో రాను రాను అమెరికా ప్రయాణాలు బోరు కొడుతున్నాయి .</h3><h3>అదే చిన్నప్పుడు విమానం శబ్దం వినిపిస్తే చాలు,</h3><h3>బయటికి పరుగెత్తి, </h3><h3>విమానం కనుమరుగయ్యేదాకా చూస్తే ఎంత బాగుండేదో !</h3><h3>అదే ఇప్పుడు ..ఎయిరిండియాలూ, లుఫ్తాన్సాలు, </h3><h3>ఎతిహాద్ లు ఆనట్లేదు. </h3><h3>చిన్నప్పుడు పిల్లల్తో ఎర్ర బస్సెక్కి పుట్టింటికి వెడుతుంటే ...</h3><h3>కిటికీ లోంచి ఆ పచ్చటి పొలాలు,కాలువలు,చెట్లు ఎంత అందంగా ఉండేవని !</h3><h3>(అప్పట్లో ఈయన జోకు...</h3><h3>నేను పుట్టింటికెళ్లేటప్పుడు</h3><h3>ఎర్ర బస్సు వికార పెట్టదుట</h3><h3>అదే బస్సు తిరుగు ప్రయాణంలో </h3><h3>ఎంత వికార పెడుతుందోట!)</h3><h3>ఇప్పుడేంటి ?</h3><h3>హాంగ్ కాంగు, దుబాయి, ఫ్రాంక్ ఫర్టు,అబుదాబీ లు మామూలుగానే కనిపిస్తున్నాయి?</h3><h3>పుట్టింటినుంచి వచ్చేస్తుంటే అమ్మ కొన్న చుక్కల</h3><h3>కాటన్ చీర ఎంత బాగుండేది !</h3><h3>(ఇప్పటికీ దాచుకున్నా)</h3><h3>🚩</h3><h3>ఇప్పుడు ఈయన, పిల్లలు ఎన్ని వేలో పోసి కొన్న పట్టు చీరలు ఎందుకు అంత గ్లామరస్ గా అనిపించట్లేదు?</h3><h3>ఇలా చెప్పుకుంటూ పోతే.... ఎన్నో,ఎన్నెన్నో!</h3><h3>మా చిన్నాడి పెళ్లికి మొదలయిన టీవీ సీరియల్,</h3><h3>"జిగట కాంభోజి రాగాలు" ఇప్పటికీ మలుపుల మీద మలుపులు తిరుగుతూ పోతున్నట్టు, ఎప్పటికీ పూర్తి కాదు. </h3><h3>నా ఈ మధ్య తరగతి మనోగతం లోని కొన్నిఅనుభవాలు </h3><h3>మీవే అనిపిస్తే మాత్రం,</h3><h3>ఒక లైక్ వేసుకోండి.</h3><h3>🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩</h3>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-15749125191165832021-08-25T22:03:00.004-07:002021-08-25T22:03:41.882-07:00కన్యాశుల్కం<p>-</p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjXPMteG0UCmPDPD4Czg0wu95CXjWUvQOMjKBknlJBSRgYCNbQ6oFp5ZYXpIivIsui_0uAxD335pnGnqIW6JXb_9oE06t4FzHePNaoyRWyltRohTgQDdmAeonTlEuoOxQBDSPBUJAWldYe4/s608/%25E0%25B0%25A8%25E0%25B0%25BE_%25E0%25B0%25B5%25E0%25B1%2586%25E0%25B0%25B3%25E0%25B1%258D%25E0%25B0%25B3%25E0%25B0%25BF%25E0%25B0%25AA%25E0%25B1%258B%25E0%25B0%25AF%25E0%25B0%25BF%25E0%25B0%2582%25E0%25B0%25A6%25E0%25B0%25BF-removebg-preview.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="410" data-original-width="608" height="432" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjXPMteG0UCmPDPD4Czg0wu95CXjWUvQOMjKBknlJBSRgYCNbQ6oFp5ZYXpIivIsui_0uAxD335pnGnqIW6JXb_9oE06t4FzHePNaoyRWyltRohTgQDdmAeonTlEuoOxQBDSPBUJAWldYe4/w640-h432/%25E0%25B0%25A8%25E0%25B0%25BE_%25E0%25B0%25B5%25E0%25B1%2586%25E0%25B0%25B3%25E0%25B1%258D%25E0%25B0%25B3%25E0%25B0%25BF%25E0%25B0%25AA%25E0%25B1%258B%25E0%25B0%25AF%25E0%25B0%25BF%25E0%25B0%2582%25E0%25B0%25A6%25E0%25B0%25BF-removebg-preview.png" width="640" /></a></div><br /><p></p><p><br /></p><p><br /></p><p>🌹🔻</p><p><br /></p><p>1955 లో 22 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి.</p><p>అవి మిస్సమ్మ, రేచుక్క, చెరపకురా చెడేవు, కన్యాశుల్కం, జయసింహ, సంతోషం , అర్ధాంగి, రోజులు మారాయి, అనార్కలి, సంతానం, వదిన, దొంగ రాముడు, శ్రీ జగన్నాధ మహాత్మ్యం, బంగారు పాప, బీదల ఆస్థి, ఆడ బిడ్డ, వదినగారి గాజులు, అంతే కావాలి, విజయ గౌరి, కన్యాదానం, శ్రీ కృష్ణ తులాభారం, పసుపు కుంకుమ.</p><p><br /></p><p>అభినవ ఆంధ్ర సాహితీ వైతాళికుడు, తెలుగు కథకు ఆద్యుడు గురజాడ అప్పారావు గారు (21-09-1862 & 30-11-1915)పూర్తిస్థాయి వాడుక భాషలో రాసిన తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’. ప్రపంచ నాటకాల్లో కన్యాశుల్కానికి ఒక ప్రముఖ స్థానం ఉంది.</p><p>ఒక సమకాలీన సాంఘిక సమస్యను తీసుకొని, సభ్యసమాజంలో ఎదురయ్యే సామాన్య జనం నుండి పాత్రలను తీసుకొని రాసిన నాటకమిది. ఇందులో ప్రతి పాత్ర తనదంటూ ఒక మరుపురాని హాస్యభరిత కావ్యాన్ని ఆవిష్కరించింది. బాల్యవివాహాలు, కన్యాశుల్కము వంటి సాంఘిక దురాచారాలు, హేయమైన మానవ నైజాల వంటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన నాటకం ‘కన్యాశుల్కము’.</p><p>ఇంగ్లిషు, ఫ్రెంచి, రష్యన్, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో అనువాదానికి నోచుకున్న కన్యాశుల్కము, వివిధ నాటక సమాజాల ద్వారా కొన్ని వేల సార్లు ప్రదర్శితమైంది. వినోదా సంస్థ అధినేత డి.యల్ నారాయణ ‘కన్యాశుల్కం’ సినిమాను పి.పుల్లయ్య నిర్దేశికత్వంలో సినిమాగా నిర్మించారు.</p><p>ఈ సినిమా 64 సంవత్సరాల క్రితం... అంటే 1955, ఆగస్టు 26న విడుదలైంది. తొలివిడత ‘రష్’లో ప్రేక్షకాదరణ లభించకపోకపోయినా తరువాతి కాలంలో విడుదలైన ప్రతిసారీ కాసులు రాల్చిన ఈ విలక్షణ చిత్ర విశేషాలు ...</p><p><br /></p><p>డీ ఎల్ అనే ద్రోణావఝుల లక్ష్మీనారాయణ భరణి, రేణుక, తమిళనాడు టాకీస్ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్గా పని చేస్తుండేవారు. 1951లో డీఎల్తో బాటు దర్శకుడు వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకుడు సుబ్బురామన్, రచయిత సముద్రాల భాగస్వాములుగా ‘వినోదా’ బ్యానర్ స్థాపించి ‘స్త్రీ సాహనం’, ‘శాంతి’ వంటి సినిమాలు తీశారు. ‘శాంతి’ సినిమా అపజయంపాలైంది. దాంతో భాగస్వాములు ముగ్గురూ తప్పుకున్నారు. 1953లో డీఎల్ ఒక్కడే నిర్మాతగా ‘దేవదాసు’ సినిమా తీసి విజయం సాదించారు. విజయానంతరం గురజాడ వారి ‘కన్యాశుల్కము’ నాటకాన్ని సినిమాగా నిర్మించాలనుకొన్నారు. చిన్న చిన్న భేదాబిప్రాయాలు కారణంగా వేదాంతం రాఘవయ్య స్థానంలో పి.పుల్లయ్యను దర్శకునిగా నియమించి, సదాశివ బ్రహ్మం చేత ఆ ఎనిమిది గంటల నాటకానికి సినీ సమీకరణ చేయించారు. అక్కినేని నాగేశ్వరరావును గిరీశం పాత్ర ధరించమని కోరితే, నెగటివ్ రోల్ అని వేయనని, డి ఎల్ ను కూడా సినిమా తీయవద్దని సలహా ఇచ్చారు. డీఎల్ది అనుకున్నది సాధించాలనే మనస్తత్వం. అందుకే సినిమా తీసేందుకే మొగ్గుచూపి ఎన్టీఆర్ను గిరీశం ప్రాతకు ఒప్పించారు.</p><p><br /></p><p>ఎన్టీఆర్ అప్పటికే సూపర్స్టార్ స్థాయి చేరుకోవడంతో గిరీశం పాత్రను హీరో పాత్రగా మలిచారు. మధురవాణి లేని కన్యాశుల్కము నాటకాన్ని మనం ఊహించలేం. ఆమెది అందరికాన్నా మహోన్నతమైన పాత్ర. ‘‘మధుర వాణి అనే ఒక వేశ్యశిఖామణి కళింగరాజ్యంలో ఉండకపోతే భగవంతుడి సృష్టికి లోపం వచ్చివుండేది’’ అని గురజాడవారే ఒకానొకచోట కరకట శాస్త్రి చేత చెప్పిస్తారు. అందుకే ఆ పాత్ర కోసం సావిత్రిని తీసుకున్నారు. లుబ్ధావధానులను పెళ్లి సమయంలో ఏడిపించడం, రామప్పంతుల్ని ఆట పట్టించడంలో సావిత్రి అభినయం అద్భుతం. ఆమె చేత మేజువాణి పెట్టించడం పుల్లయ్య సృష్టి. బుచ్చమ్మ పాత్రకు షావుకారు జానకిని తీసుకోవడానికి ఒక నేపధ్యం వుంది. నిజానికి దేవదాసు సినిమాలో పార్వతి పాత్ర కోసం తొలుత జానకినే అనుకున్నా కారణాంతరం వలన అది సావిత్రికి దక్కింది. అందుచేత ఈ సినిమాలో ఆమెకు బుచ్చమ్మ పాత్రను ఇచ్చారు.</p><p><br /></p><p>విజయనగరంలో మధురవాణి (సావిత్రి) అనే వేశ్య బహుజాణ. ఆమెకన్నా జాణతనం కలిగిన గిరీశం (ఎన్టీఆర్) అనే ఇంగ్లీషు చదువుకున్న జిత్తులమారి యువకుడు ఒక పూటకూళ్లమ్మ (ఛాయాదేవి) ఇంట్లో వుంటూ మధురవాణితో స్నేహం కలుపుతాడు. రామచంద్రాపురం అగ్రహారంలో పెద్దమనిషిగా చలామణి అయ్యే రామప్పంతులు (సియ్యస్సార్ ఆంజనేయులు) బ్రహ్మచారి, వేశ్యాలోలుడు. మధురవాణి దగ్గరకి వస్తుంటాడు. అదే ఊళ్లో లుబ్ధావధానులు (గోవిందరాజులు సుబ్బారావు) అనే అరవయ్యేళ్ల లక్షాధికారి ఉన్నాడు. అతని డబ్బు గుంజే ప్రయత్నంలో రామప్పంతులు అతనిని పునర్వివాహం చేసుకోమని వుసిగొల్పుతాడు. వార్ధక్యంలో పెళ్లెందుకని కూతురు మీనాక్షి (సూర్యాకాంతం) వారించినా లుబ్దావధానులు వినడు. ఆ రోజుల్లో డబ్బులకు ఆశపడి, కన్యాశుల్కము పుచ్చుకొని నోరెరుగని బాలికలను భార్యలేని ముసలివాళ్లకు కట్టబెట్టడం పరపాటి. కృష్ణరాయపుర అగ్రహారంలో వుండే అగ్ని హోత్రావధానులు (విన్నకోట రామన్నపంతులు) అలా పిల్లల్ని అమ్ముకోవడంలో ఘనాపాఠి. అతని పెద్దకూతురు బుచ్చమ్మ (జానకి) చిన్నప్పుడే భర్తను కోల్పోయింది. చిన్నకూతురు సుబ్బమ్మ (బేబీ సుభద్ర)కు తొమ్మిదేళ్లు. ఆ పిల్లను పద్దెనిమిది వందల కన్యాశుల్కానికి రామప్పంతులు ద్వారా లబ్ధావదానుకు అమ్మడానికి అగ్నిహోత్రావధానులు నిశ్చయిస్తాడు. అమాయకురాలైన అతని భార్య వెంకమ్మ (హేమలత) అడ్డుపడి పోట్లాడుతుంది. అయినా ఖాతరు చెయ్యడు.</p><p><br /></p><p>విజయనగరంలో అప్పులబారి నుండి విముక్తి కాలేక, జిత్తులమారి గిరీశం తన వద్ద ఇంగ్లిష్ పాఠాలు నేర్చుకునే అగ్నిహహోత్రవధానులు కొడుకు వెంకటేశం (మాస్టర్ కుందు)ను తీసుకొని కృష్ణరాయపుర అగ్రహారం చేరుకుంటాడు. వాళ్ల ఇంట్లో వున్న విధవరాలైన బుచ్చమ్మను చూసి మోహించి ఆమెను లేవదీసుకెళ్లి వివాహం చేసుకోవాలని పన్నాగం పన్నుతాడు. ఇంతలో అగ్ని హోత్రావధానులు భార్య ‘‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ అనే వీధి గాయకుల పాటవిని, తన చిన్న కూతురు బ్రతుకు కూడా విధవరికానికే దారితీస్తుందని దుఃఖించి నూతిలో పడుతుంది. అక్కడే వున్న గిరీశం ఆమెను రక్షిస్తాడు. ఈ విషయం అగ్నిహోత్రావధానులు బావమరిది కరటకశాస్త్రి (వంగర వెంకటసుబ్బయ్య)కి తెలిసి ఎలాగైనా బాల్యవివాహాన్ని ఆపి, కన్యాశుల్కము రాబట్టాలనే బావగారి ఆశలకు చరమగీతం పాడాల్సిందేనని నిశ్చయిస్తాడు. స్వయంగా రంగస్థల నటుడు కావడంతో మధురవాణి సహకారంతో తన శిష్యుడు మహేశం (మాస్టర్ సుధాకర్)కు ఆడపిల్ల వేషం వేసి రామప్పంతులు వద్దకు తీసుకెళ్లి అతనికి లంచమిస్తానని ఆశపెట్టి, అగ్నిహోత్రావధానుల అమ్మాయితో నిశ్చయించిన పెళ్లిని ఆపించమని అందుకు ప్రతిగా ఆడవేషంలో ఉన్న మహేశంతో వివాహం జరిపించమని నాటకమాడుతాడు.</p><p><br /></p><p>మధురవాణి రంగంలోకి దూకి మహేశంతో పెళ్లి తంతు జరిపిస్తుంది. లుబ్ధావధానులకు అసలు విషయం తెలిసి పశ్చాత్తాపం చెందుతాడు. ఇదే అదునుగా గిరీశం బుచ్చమ్మను లేవదీసుకొని విశాఖపట్నం చేరుకొని సౌజన్యరావు (గుమ్మడి) అనే సంస్కారవంతుడైన వకీలును కలిసి సాయం కోరతాడు. ఈలోగా వీరిని వెదుక్కుంటూ అందరూ విశాఖపట్నం చేరుకుంటారు. మధురవాణి జరిగిన విషయాన్ని సౌజన్యరావుకు విశదీకరిస్తుంది. సౌజన్యరావు గిరీశాన్ని మందలించి బుచ్చమ్మతో అతనికి వితంతు వివాహం జరిపిస్తాడు. సదాశివబ్రహ్మం, పుల్లయ్యలు ఒరిజినల్ ‘కన్యాశుల్కము’ నాటకాన్ని సినిమాకు అనుగుణంగా మార్చిన కథ ఇదే! ఇందులో హెడ్ కానిస్టెబుల్ పేకేటి శివరావు, పోలిశెట్టిగా చదలవాడ కుటుంబరావు, సిద్ధాంతిగా గౌరీపతిశాస్త్రి, కానిస్టేబుల్గా రామకోటి నటించారు.</p><p><br /></p><p>ఈ సినిమా చిత్రనిర్మాణం మొత్తం రేవతి, నరసూ, వీనస్ స్టూడియోల్లో నిర్మించిన సెట్టింగులలోనే జరిగింది. ఎక్కడా అవుట్ డోర్ సదుపాయాలు వినియోగించలేదు. ఈ సినిమాలో లుబ్ధావధానులుది ప్రధాన పాత్ర. అతడు లేకపోతే సినిమానే లేదు. అందుకే ఆ పాత్రకు గోవిందరాజులు సుబ్బారావు అయితేనే న్యాయం జరుగుతుందని దర్శకుడు పి.పుల్లయ్య భావించారు. నిజానికి ఆ రోజుల్లో వేసే నాటకాల్లో గిరీశం పాత్రను గోవిందరాజులు సుబ్బారావే పోషించేవారు. ఇందులో సౌజన్యరావు పాత్ర సంక్ష్లిష్టమైనది. నాటకంలో సౌజన్యరావు మధురవాణి అందానికి ముగ్ధుడై ఆమెను ముద్దుపెట్టుకోబోతాడు. అపుడు ‘చెడని వారిని చెడగొట్టవద్దని మా తల్లి చెప్పింది. అంచేత ముద్దు పెట్టుకోనివ్వను’’ అని మధురవాణి అతన్ని వారిస్తుంది. అప్పుడు సౌజన్యరావు ఆమెతో ‘కృతజ్ఞుణ్ణి’ అంటాడు. ఇటువంటి పాత్ర కోసం పి.పుల్లయ్య గుమ్మడిని తీసుకురమ్మన్నారు. రామప్పంతులు అల్లరి ఆరంభం చెయ్యగలడుగానీ దాన్ని తప్పుకునే చాకచాక్యంలేదు. అందుకే ఆ పాత్ర సియ్యస్సార్ను వరించింది.</p><p><br /></p><p>విశ్వశాంతి అధిపతి యు.విశ్వేశ్వరరావు ఈ సినిమాకు దయాసాగర్తో కలిసి సహాయ దర్శకునిగా పనిచేశారు. అతడు విద్యాధికుడు, మంచి చిత్రకారుడు కూడా. బాపు పద్ధతిలోనే అతడు సన్నివేశాలకు అనుగుణంగా బొమ్మలు గీసుకుని, వాటిని విభజించి చిత్రీకరణ సమయంలో దర్శకునికి గుర్తు చేసేవాడు. ఒకానొక సన్నివేశ చిత్రీకరణలో సావిత్రి మూడు రంగుల గాజులు ధరించింది. ఆ గాజులు రంగులు ఏ వరుసలో ఉండేవో విశ్వేశ్వరరావు నోట్ చేసుకున్నాడు. తరవాతి షెడ్యూలులో సావిత్రి ధరించిన గాజుల క్రమం మారిందని గమనించి వెంటనే ఆమె దృష్టికి తీసుకెళ్లి సవరించుకోమన్నారు. సావిత్రికి ఆ సూచన చికాకు తెప్పించింది. ‘‘ఇదేమీ కలర్ సినిమా కాదుగదా’’ అంటూ వాదించింది. కంటిన్యూటీ దెబ్బతింటుందని విశ్వేశ్వరరావు చెబితే ‘షాట్ తీసే సమయానికి మార్చుకుంటానులే’ అంటూ సావిత్రి దాటవేసింది. రిహార్సల్స్ తరవాత షాట్ రెడీ అయ్యాక కూడా ఆమె గాజుల క్రమాన్ని మార్చుకోలేదు. విశ్వేశ్వరరావు వెంటనే కట్ చెప్పారు. పుల్లయ్యకు అర్ధంకాలేదు. విశ్వేశ్వరరావు పుల్లయ్యకు జరిగిన విషయాన్ని వివరించాడు. సావిత్రి గాజులు మార్చుకోక తప్పలేదు. పి.పుల్లయ్య, విశ్వేశ్వరరావు సూక్ష్మదృష్టిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.</p><p><br /></p><p>ఇందులో బుచ్చమ్మగా నటించిన షావుకారు జానకి మంచిపేరు తెచ్చుకుంది. ఇందులో వెంకటేశం పాత్రలో నటించిన మాస్టర్ కుందు అసలు పేరు గాదె బాలకృష్ణారావు. రేడియో అన్నయ్యగా పిలుచుకొనే న్యాపతి కామేశ్వరరావుకు మేనల్లుడు. ఈ సినిమా తర్వాత కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించి సినీ నటనకు స్వస్తిచెప్పి హైదరాబాద్లో స్థిరపడ్డారు. సినిమా చివర్లో గిరీశం బుచ్చమ్మను పెళ్లాడినట్లు చూపడం మాత్రం విమర్శకు దారి తీసింది. ఈ సినిమా టైటిల్ కార్డుల్లో విజయనగర రాజప్రసాదం, పురవీధుల ఫోటోలను బ్యాక్డ్రాప్గా వాడుకుంటూ టైటిల్స్ వేయించారు పి.పుల్లయ్య. అంతేకాకుండా సినిమాను గురజాడ వారికి అంకితం చేసి పుల్లయ్య తన సహృదయతను చాటుకున్నారు. సినిమా టైటిల్స్కు ముందే ‘‘నాటకమును యధాతథంగా చిత్రించుటకు వీలు పడనందున, కొన్ని సన్నివేశములలోను, సంభాషణలలోనూ యథోచితంగా మార్పులు చేయవలసి వచ్చినది. రసజ్ఞులు సహృదయంతో సహకరించవలెనని ప్రార్ధన’’ అని ప్రేక్షకులకు డి.ఎల్. ముందే విన్నపం చేశారు. కానీ సినిమా విడుదలయ్యాక అనేక విమర్శలు వచ్చాయి. నాటకానికి చేసిన మార్పులను ప్రేక్షకజనం మన్నించలేదు. అందుకు కారణం కన్యాశుల్కము నాటకం అందరికీ కరతలామలకం కావడమే. ముఖ్యంగా దర్శకుని మీద ఎక్కువగా విమర్శలు వచ్చాయి. వేదాంతం రాఘవయ్య దర్శకుడైతే సినిమా మరోవిధంగా వుండేదనేది కొందరి అభిప్రాయం. అందువలన తొలిసారి విడుదలైనప్పుడు సినిమా అంతగా విజయవంతం కాలేదు. డీఎల్ నారాయణ మాత్రం నిరాశ పడలేదు. పాతకేళ్ల తర్వాత రిపీట్ రన్లో కన్యాశుల్కము సినిమా బాగా ఆడి సిల్వర్ జూబ్లీ చేసుకుంది. (హైదరాబాద్ దీపక్లో) గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో శతదినోత్సవం కూడా చేసుకుంది.</p><p><br /></p><p>మొదటి రిలీజ్లో జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయిన సినిమా.. తర్వాత పలుమార్లు విడుదలై, మూడుసార్లు వందరోజులు ప్రదర్శితమైతే అది చరిత్ర కాక ఏమవుతుంది? అలాంటి చరిత్ర గల ఏకైక తెలుగు చిత్రం ‘కన్యాశుల్కం’. ఈ సినిమా విడుదలై 63 ఏళ్లు. ఆ సినిమా విశేషాలు:</p><p><br /></p><p>మొదటి సారి కన్నా తర్వాతి పర్యాయాలు విడుదలైనప్పుడు ఎక్కువ విజయం సాధించిన కొద్ది చిత్రాల్లో 'కన్యాశుల్కం' ఒకటి. ఇప్పటిలా టీవీలు విడియోలు లేని రోజుల్లో చిత్రాలు మళ్లీ మళ్లీ విడుదల కావడం సర్వసాధారణం. ఆ విధంగా థియేటర్లకు కొన్ని పాత విజయవంతమైన చిత్రాలు ఫలానా థియేటర్లో ఏడాదికో రెండేళ్లకో మళ్లీ వస్తాయని(రిపీట్ రన్) అందరికి తెలిసిపోయేది. అందులోనూ అగ్రహీరోల సంస్థల చిత్రాలకు ఆ విధమైన ఏర్పాటు కూడా వుండేది. పాతాళ భైరవి ఏదో ఒక థియేటర్లో ఎక్కడో ఒక చోట ఆడుతుంటుది గనక ఇప్పటికి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నట్టు లెక్క అని ఒకసారి చక్రపాణి చమత్కరించారందుకే. అయితే 'కన్యాశుల్కం' సంగతి వేరు. 1955లో మొదటి సారి విడుదలైనప్పుడు అంతగా ఆదరణ పొందని ఆ సినిమా దశాబ్దాల తర్వాత శతదినోత్సవాలు చేసుకోవడం చాలా అరుదైన ఉదాహరణే. ప్రేక్షకులు ఆచిత్రం స్వారస్యాన్ని, గురజాడ నాటకంగా దాని విశిష్టతను ఆలస్యంగా అర్థం చేసుకోవడం ఇందుకు కారణమై వుండొచ్చు. కన్యాశుల్కం చదవడానికే తప్ప ప్రదర్శనకు అంతగా అనుగుణం కాదనే అపప్రథ చలన చిత్రానికి లేకుండా పోయింది. మూడు గంటల నిడివి కోసం నాటకాన్ని సంక్షిప్తపర్చి కొన్ని మార్పులు చేశారు.</p><p><br /></p><p>ఈ రోజున వరకట్న దురాచారంలాగే ఆ రోజుల్లో ‘కన్యాశుల్కం’ సమాజంలో తాండవించేది. డబ్బుకోసం కన్నవారే ముక్కు పచ్చలారని చిన్నారులను ముసలివాళ్లకిచ్చి కట్టబెట్టేవారు. ఇంట్లో అమ్మాయి ఉందంటే ఎంతకు అమ్మవచ్చునని లెక్కలు వేసుకునే దుష్టసంప్రదాయాన్ని కళ్లార చూసిన గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకంలో ఆ దురాచారంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాడుక భాషను సాహిత్యంలో ప్రవేశపెట్టి, తెలుగు భాషను జనానికి మరింత దగ్గర చేసిన ఘనత కూడా ఈ నాటకానికే దక్కుతుంది. ఆ నాటకం తెలుగునేల అంతటా జేజేలు అందుకుంది.</p><p><br /></p><p>తెలుగునాట సాంఘిక నాటకం అంటే మొదట గుర్తొచ్చేది గురజాడ వారి కన్యాశుల్కం నాటకమే. కన్యాశుల్కం పేరు చెప్పగానే గుర్తొచ్చేది గిరీశం. డామిట్ కధ అడ్డం తిరిగింది (గిరీశం), తాంబూళాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి (అగ్నిహోత్రావధాన్లు), విద్యవంటి వస్తువు లేదు (రామప్పంతులు), బుద్ధికి అసాధ్యం ఉందేమో కాని డబ్బుకు లేదు (మధురవాణి), ఇలా ఎన్నో సంభాషణలు ఇప్పటికీ జనం నాలుకమీద ఆడుతూ ఉంటాయి.</p><p><br /></p><p>ఆ నాటకానికే సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ‘కన్యాశుల్కం’ చిత్రాన్ని నిర్మించారు వినోదా సంస్థ అధినేత డి.ఎల్. ఈ చిత్రానికి పి.పులయ్య దర్శకత్వం వహించారు. 1955 ఆగస్ట్ 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.</p><p><br /></p><p>‘కన్యాశుల్కం’ నాటకం తెలుగువారు ఉన్న చోటల్లా పేరు సంపాదించుకుంది. ఈ నాటకంలో తొలి డైలాగ్ ‘సాయంత్రమయింది..’ అన్నది, చివరి డైలాగ్ ‘డామిట్ కథ అడ్డంగా తిరిగింది’ అనేది. ఈ రెండూ గిరీశం నోట వెలవడతాయి. ఆ డైలాగులు తెలుగువారికి కంఠోపాఠంగా ఉండేవి. నాటకంలో ఒక్కో పాత్ర ప్రవేశిస్తుంటే ఆ పాత్ర డైలాగులు జనాలే వల్లించేవారు. అంతలా పేరొందిన ఆ నాటకాన్ని సినిమా కోసం కొన్ని మార్పులు చేయవలసి వచ్చింది. ఆ విషయాన్ని టైటిల్స్కు ముందే నిర్మాత విన్నవించుకున్నారు. అయినప్పటికీ ‘కన్యాశుల్కాన్ని చెడగొట్టారని, బాల్యవివాహం వల్ల వితంతువులైన వారిని మోసం చేసే గిరీశం పాత్రను ఎన్టీఆర్ కోసం మార్పు చేసి చివర్లో మంచివాడిగా చూపించారని నాటకాభిమానులు కినుక వహించారు. మొదట్లో ఆ సినిమా విడుదలయినప్పుడు ఆ అభిమానులు పెదవి విరిచారు. నాటకమే బాగుందన్నారు. దాంతో డి.ఎల్ ఆశించిన స్థాయిలో ‘కన్యాశుల్కం’ ఆకట్టుకోలేకపోయింది.</p><p><br /></p><p>అప్పటికే సాంఘిక పౌరాణిక జానపద చారిత్రిక పాత్రలతో అలరించిన ఎన్టీఆర్ ప్రతినాయక ఛాయలున్న గిరీశం పాత్రను ఒప్పుకోవడమే ఒక సాహసం.ఆ పాత్రతో సహా ఏది ఎలా వుండాలో కళా దర్శకుడు వాలి స్కెచ్లుతయారు చేశారు. ఎన్టీఆర్కు గిరీశం పాత్ర బాగా నప్పింది. వంకర చూపుతో వంచనాత్మక మాటలతో అవతలి వారిని బురిడీ కొట్టించే తీరు ఆయన బాగా పండించారు. మధురవాణి దగ్గర తన ఆటలు సాగనప్పుడు, ఆమె దగ్గర వుండగానే పూటకూళ్లమ్మ చీపురు కట్టతో తరుముకొచ్చినప్పుడు అన్నిటినీ మించి బుచ్చమ్మను వలలో వేసుకోవడానికి గాను వదిన గారూ ఎంత మాటన్నారు అంటూ వెంటపడినప్పుడు ఎన్టీఆర్ ఒక పెద్ద హీరోగా గాక టక్కరిగానే కనిపించారు. 'చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా' అన్న పాట, దానికి అభినయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వన్స్ దేర్ లివ్డ్ ఎ కింగ్ అంటూ శిష్యుడు వెంకటేశంతో ఉత్తుత్తి ఇంగ్లీషు మాట్లాడ్డం, లేనిపోని కోతలు కోయడం, తెలియని శాస్త్రాలు ఉటంకించడం , 'ఏంటోయ్ షేక్స్పియర్ మొహం పెట్టావ్ అంటూ పలకరించడం, 'మై హార్ల్ మెల్ట్స్' అంటూ బుచ్చమ్మ దగ్గర అభినయం అన్నీ నచ్చుతాయి.</p><p><br /></p><p>సావిత్రి మధురవాణిపాత్రకోసమే పుట్టినంత సహజంగా చేసింది. కుటుంబ కథల గృహిణి పాత్రలు ప్రధానంగా చేసిన సావిత్రి మధురవాణి పాత్రను ఒప్పుకోవడంలో ఆమె అభిరుచి వెల్లడవుతుంది. తర్వాత ఆమె పాత్రను చాలా అధ్యయనం చేసింది. చాలామందితో చర్చించింది. రామప్పంతులు 'లొట్టిపిట్టలు తెప్పిస్తా'నంటే పడీ పడీ నవ్విన సన్నివేశం గాని, లుబ్దావధాన్ల పిలకను తీసి ఆడదిక్కులేక బావగారు ఇలా అయిపోయారని ఏడిపించడం గాని ఎక్కడైనా సరే నటనలో సంభాషణల్లో ఆమెకు ఆమే సాటి అనిపిస్తుంది. అందరినీ తిప్పలు పెట్టే గిరీశం, రామప్పంతులు వంటివారినే మధురవాణి ఒక ఆట ఆడిస్తుంటే ప్రేక్షకులు కేరింతలు కొట్టేవాళ్లు.</p><p><br /></p><p>ఇక శకుని వంటి పాత్రలకే ప్రాణం పోసిన సిఎస్ఆర్కు రామప్పంతులు పెద్ద లెక్కలోది కాదు. డాంబికం, దబాయింపు, నక్కజిత్తులు మేళవించి అమోఘంగా పండించారు.</p><p><br /></p><p>విజయవాడలో న్యాయవాదిగా వున్న విన్నకోట రామన్నపంతులు అగ్నిహౌత్రావధాన్ల పాత్రకు ప్రాణ ప్రతిష్టచేశారు. 'తాంబూలిచ్చాను తన్నుకు చావండి' వంటి ప్రసిద్ధ సంభాషణలు కూడా గొప్పగాపలికించారు.</p><p><br /></p><p>మహానటుడు గోవిందరాజుల సుబ్బారావుకు అందరికన్నా అధికంగా మార్కులు పడతాయి. కాటికి కాళ్లు చాచుకుని కూడా చిన్నపిల్లను అదికూడా తక్కువ కన్యాశుల్కంతో పెళ్లి చేసుకోవాలనుకున్న ఆయన దురాశ దాన్ని ఉపయోగించుకుని ముప్పుతిప్పలు పెట్టే రామప్పంతులు, మధురవాణి సహాయంతో శిష్యుడికి అమ్మాయి వేషం వేసి మోసం చేసే కరకటశాస్త్రి(వంగర) చెప్పాలంటే ప్రతి ఘట్టం వినోదాన్ని సందేశాన్ని ఏకకాలంలో పండిస్తాయి.</p><p><br /></p><p>బుచ్చమ్మగా జానకి, ఆమె తల్లి వెంకమ్మగా హేమలత, పూటకూళ్లమ్మగా చాయాదేవి, లుబ్దావధాన్లు కూతురు మీనాక్షిగా సూర్యకాంతం, తదితరులు నటించారు. నటీనటులుందరూ హేమాహేమీలైనా పాత్రలే కనిపిస్తాయి. చాందస బ్రాహ్మణ పాత్రలను చూసిన అప్పటి పిల్లలు తమ వీధుల్లో కనిపించే అయ్యవార్లే నటించారనుకున్నారట!</p><p><br /></p><p>ఈ సినిమాకు సదాశివబ్రహ్మం సంభాషణలు రాశారు.</p><p><br /></p><p>ఈ సినిమాకు ఘంటసాల సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఇందులో గురజాడవారి ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’, బసవరాజు అప్పారావు, ‘నాగులచవితి’ గీతం, శ్రీశ్రీ రాసిన ‘ఆనందం అర్ణవమైతే’ గీతాలను సందర్భానికి అనుకూలంగా పొందుపరచి గురజాడ నాటకీయతకు న్యాయం చేకూర్చారు.</p><p><br /></p><p>1) ముందుగా మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన మూడు చరణాల గీతం ‘చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా’ గురించి చెప్పుకోవాలి. ఇందులో ‘పండంటి పిల్లకు పసుపూ కుంకం నిండుకున్నదేం గురుడా’’ అనే ప్రశ్నకు ‘దేవుడు చేసిన లోపాన్ని నీవు దిద్దుకురారా నరుడా’’ అంటూ... ‘కొద్దిగ హద్దు మీరరా నరుడా’’ అని గిరీశం ఇచ్చే సలహా సందర్భోచితంగా ఉంటుంది. మరో చరణంలో ‘విధవలందరికి శుభకార్యాలూ విధిగా చెయమంటావా గురుడా’ అనే ప్రశ్నకు ‘అవతారం నీదందుకోసమే ఆరంభించరా నరుడా’ అని ఇచ్చే సమాధానంలో గిరీశం బలహీనతలను వ్యంగ్యం ధోరణిలో, అహంభావంతో వ్యక్తపరిచేలాగా ఘంటసాల దాన్ని తత్వ గీతంలా కాంభోచ్కీజీజి రాగంలో స్వరపరచి ఆలపించారు.</p><p><br /></p><p>మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన 'చిటారు కొమ్మన' పాట మొత్తం గిరీశం స్వభావానికి తగినట్టు సాగుతుంది.</p><p>https://www.youtube.com/watch?v=jOhb-CjF8W8</p><p><br /></p><p>2) ‘ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే’ అనే శ్రీశ్రీ గీతాన్ని సినిమాలో సావిత్రి కోసం పాడించారు. ఘంటసాల శంకరాభరణ రాగంలో స్వరపరచి ఆ పాటకు వన్నె తెచ్చారు.</p><p>శ్రీశ్రీ రాసిన 'ఆనందం ఆర్నవమైతే</p><p>https://www.youtube.com/watch?v=YQgCq_SvmOk</p><p><br /></p><p>3) దేవులపల్లి రాయగా పద్మప్రియ ఆలపించిన బొమ్మలపెళ్లి పాట ‘చేదాము రారే కళ్యాణము... చిలకా గోరింక పెళ్లి సింగారము’ను కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. బాలానందం సభ్యులచేత నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి చక్కగా డ్యాన్సు చేయించారు. ఈ పాటలో ఊర్వశి శారద బాలనటిగా కనిపిస్తుంది.</p><p>https://www.youtube.com/watch?v=mrG7O2ddfNI</p><p><br /></p><p>4) గతంలో బసవరాజు అప్పారావు రాసిన ‘నాగుల చవితికి నాగేంద్రా... నీ పొట్టనిండా పాలు పోసేము తండ్రీ’ అనే నాగులచవితి పాటను సందర్భోచితంగా వాడుకున్నారు. సంగీతం ఘంటసాల, తెరపై షావుకారు జానకి , గాన సరస్వతి గానం,</p><p>నాగుల చవితికి నాగేంద్ర ! నీకు</p><p>పొట్టనిండా పాలు పోసేము తండ్రి !</p><p>నీ పుట్ట దరికి నా పాప లొచ్చేరు</p><p>పాప పుణ్యమ్ముల వాసనే లేని</p><p>బ్రహ్మ స్వరూపులౌ పసికూనలోయి !</p><p>కోపించి బుస్సలు కొట్ట బోకోయి - నాగుల..</p><p>చీకటిలోన నీశిరసు తొక్కేము</p><p>కసిదీర మమ్మల్ని కాటేయ బోకు</p><p>కోవ పుట్టలోని కోడె నాగన్న</p><p>పగలు సాధించి మా ప్రాణాలు దీకు - నాగుల చవితికి</p><p>అర్ధ రాత్రీ వేళ అపరాత్రి వేళ</p><p>పాపమే యెఱుగని పసులు తిరిగేని</p><p>ధరణికి జీవనాధార మైనట్టి</p><p>వాటిని రోషాన కాటేయ బోకు - నాగుల చవితికి నాగేంద్ర</p><p>అటు కొండ యిటు కొండ ఆరెంటి నడుమ</p><p>నాగుల కొండలో నాట్యమాడేటి</p><p>దివ్య సుందర నాగ ! దేహి యన్నాము</p><p>కనిపెట్టి మమ్మెపుడు కాపాడ వోయి - నాగుల చవితికి నాగేంద్ర</p><p>పగలనక రేయనక పని పాటలందు</p><p>మునిగి తేలేటి నా మోహాల బరిణె</p><p>కంచెలూ కంపలూ గడచేటి వేళ</p><p>కంప చాటున వుండి కొంప దీకోయి - నాగుల చవితికి</p><p><br /></p><p>ఆఖరి చరణం లో మొగుడిని "మోహాల బరిణె" గా వర్ణిచడం బసవరాజు గారి చమత్కారం.</p><p><br /></p><p>https://www.youtube.com/watch?v=ACVx0HfKv2o</p><p><br /></p><p>5) గురజాడ రాసిన గేయనాటకం ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ను కూడా సన్నివేశంలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మగా కుమారి ప్రమీల రాణి, ముసలి భర్తగా కంచి నరసింహరావు నటించారు. గురజాడ రచన , పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, ఘంటసాల(సంగీతమూ ఆయనదే) అద్బుతంగా గానం చేశారు.</p><p><br /></p><p>https://www.youtube.com/watch?v=BYAixZI0ykg</p><p><br /></p><p>6) గురజాడ రాసిన తత్వగీతం ‘ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు.. నీ ఇల్లు ఎక్కడే చిలుకా’ను పద్మప్రియ పాడగా మాస్టర్ సుధాకర్ మీద చిత్రీకరించారు.</p><p>https://www.youtube.com/watch?v=zoNDg8CtyG8</p><p><br /></p><p>7) గిరీశానికి చుట్ట ముట్టించి సావిత్రి నాట్యం చేసే ‘సరసుడ దరిజేరరా ఔరా సరసుడా’ అనే జావళిని తొలి సన్నివేశంగా చిత్రీకరించారు. ఈ జావళిని సదాశివబ్రహ్మ రాయగా ప్రముఖ కర్నాటక విద్వన్మణి గానసరస్వతి ఆలపించింది. పసుమర్తి నృత్యరచన కూడా ఆ జావళికి అమోఘంగా అమరింది. ‘సరసుడ దరి చేరరా...’ సదాశివబ్రహ్మం</p><p>https://www.youtube.com/watch?v=bEQPI9tXLUY</p><p><br /></p><p>😎 పసుమర్తి కృష్ణమూర్తి గొంతు కలిపి పద్మప్రియ, మాధవపెద్దిలతో కలిసి ఆలపించిన సముద్రాల ‘కీచకవధ’ వీధినాటకం - ‘వెడలె సైరంధ్రి సభకూ మదమరాణిగమన వెడలె’ను అత్యద్భుతంగా చిత్రీకరించారు.</p><p>https://www.youtube.com/watch?v=xEmsw5ndeDA</p><p><br /></p><p>నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తికి ఈ సినిమాలో వంద మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ‘కన్యాశుల్కము సినిమా నిరాశ పరచినా డీఎల్ నారాయణ వెంటనే ‘చిరంజీవులు’ చిత్ర నిర్మాణానికి పూనుకోవడం నిజమైన విశేషం!</p><p><br /></p><p>ఇలా అందరూ లబ్ధప్రతిష్ఠులైన కవులు కలాల నుంచి జాలువారిన గీతాలు ‘కన్యాశుల్కం’ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. ‘</p><p><br /></p><p>సంస్కర్త సౌజన్యారావు (గుమ్మడి) చివరలో బుచ్చమ్మకూ గిరీశానికి పెళ్లి చేసినట్టు చూపించడం కూడా శ్రీశ్రీ కొడవటిగంటి తదితరుల విమర్శకు గురైంది. గిరీశం 'డామిట్ కథ అడ్డం తిరిగింది' అంటూ నిష్క్రమించడం గాక బుచ్చమ్మను పెళ్లి చేసుకున్నట్టు చూపించడంవల్ల గురజాడ ఉద్దేశమే తలకిందులైందని భావించారు. చిత్ర కథ సుఖాంతం చేసినప్పటికీ దానికి ఒక కారణం పెట్టారు. గిరీశం వంటి టక్కరిని దేశం మీద వదలిపెట్టే బదులు బుచ్చమ్మతో పెళ్లిచేస్తే కొంతైనా బాగుపడతాడేమోనని మధురవాణి చెప్పిన సలహా సౌజన్యారావు పాటించినట్టు చూపించారు. వెనక్కు తిరిగి చూసుకుంటే 64 ఏళ్లకిందట తీసి వుండకపోతే తర్వాత మరెవరూ తీసి వుండేవారు కాదేమో. ఎందుకంటే ప్రసిద్ధ తెలుగు సాంఘిక నాటకాలు చిత్రాలుగా వచ్చింది చాలా తక్కువ. ఆ ఘనత కూడా 'కన్యాశుల్కం'కే దక్కింది.</p><p><br /></p><p>ఈ చిత్రం ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు పుల్లయ్య . నలభైలలోనే మంచి పేరు తెచ్చుకున్న పుల్లయ్య ఎన్నో కళాఖండాలను పండించిన వ్యక్తి. తర్వాత తనూ నిర్మాతగా అనేక మంచి చిత్రాలందించారు.</p><p><br /></p><p>‘కన్యాశుల్కం’ చిత్రంపై ఎన్ని విమర్శలున్నా ఒక్కసారైనా ఈ సినిమాను చూడాలని భావించిన వారు ఈ సినిమా చూశారు. అలా అర్ధశతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం పర్లేదు బాగానే ఉందని అందరూ అనుకుంటున్న సమయంలో సరిగ్గా ‘కన్యాశుల్కం’ విడుదలైన 56 రోజులకు ఎన్టీఆర్ నటించిన జానసద చిత్రం ‘జయసింహ’ (21-10-1955) విడుదలై అఖండ విజయం సాధించింది. ఆ చిత్రం ఘనవిజయం మాటున ‘కన్యాశుల్కం’ మరుగున పడిపోయింది. అలా మొదటి రిలీజ్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.</p><p><br /></p><p>తర్వాత 28 ఏళ్లకు 1983లో ఈ చిత్రం హైదరాబాద్లో విడుదలైంది. సంధ్య 70 ఎమ్ఎమ్ ఉదయం ఆటలతోనూ, వేరే థియేటర్లలో మూడు ఆటలతోనూ ప్రదర్శితమైంది. సంధ్యలో ఏకధాటిగా 130 రోజులకు పైగా ఆడింది. అన్ని రోజులు ఇతర థియేటర్లలో షిప్టుల మీద మూడు ఆటలతో ఆడుతూనే ఉంది. షిప్టుతోనే 175 రోజులు ప్రదర్శితమైంది. అలా 50 సంయుక్తవారాలు జరుపుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ‘కన్యాశుల్కం’.</p><p><br /></p><p>ఈ చిత్రం 1986లో విడుదలైనప్పుడు విజయవాడ విజయా టాకీస్లోనూ, గుంటూరు రాధాకృష్ణలోనూ నూన్ షో డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శితమయింది.</p><p><br /></p><p>ఆ తర్వాత గురజాడ ‘కన్యాశుల్కం’ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలోనూ ఈ చిత్రం 1993లో మరోమారు విడుదలైంది. అప్పుడు హైదరాబాద్లో ఇంకోసారి ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకోవడం విశేషం.</p><p><br /></p><p>ఇలా రిపీట్ రన్స్లోనూ మూడుసార్లు శతదినోత్సవం జరుపుకున్న చిత్రం భారతదేశం చలనచిత్ర చరిత్రలోనే మరొకటి కానరాదు.</p><p><br /></p><p>మొదటి రిలీజ్లో అంతటి ఆదరణ పొందని ఈ సినిమా రిపీట్ రన్స్తో విశేషాదరణ పొందడానికి ఇందులో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించడమే కారణమని వేరే చెప్పాలా? స్టార్ హీరోగా ఎంతో ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ గిరీశం వంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను అంగీకరించడం ఎంతో సాహసం. ఆషాడభూతి వంటి ఆ పాత్రను అనితరసాధ్యంగా పోషించి ఆకట్టుకోవడం విశేషమే.</p><p><br /></p><p>అలా ‘కన్యాశుల్కం’ జనాన్ని రంజింపచేసింది. 64 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇందులోని కథాంశం ఈ నాటికీ ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం.</p><p><br /></p><p>జయాపజయాలు విమర్శలు ఎలా వున్నా ఆ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో గురజాడ అడుగుజాడగా మిగిలిపోయింది</p>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5836802122867912200.post-50248958035001584642021-08-20T05:33:00.001-07:002021-08-20T05:33:11.124-07:00 🚩🚩 మా సినిమాలు.........బాపు గారి మాటలలో ...<div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEggMoUbZhXYgqVyssB-Pe4lgEJSyLZZGRJnJZmRVAbvG3WnZhdkvlOvG56y1gsIvm5pmaEyik1ovPHknMNumQWO4hvDtH7mWFp2wTQIO0Z3z9QfslK6pL4PnowCzISDhksTdqwDZLOpCkPq/s697/Bapu+paintings.+%252818%2529.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="483" data-original-width="697" height="444" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEggMoUbZhXYgqVyssB-Pe4lgEJSyLZZGRJnJZmRVAbvG3WnZhdkvlOvG56y1gsIvm5pmaEyik1ovPHknMNumQWO4hvDtH7mWFp2wTQIO0Z3z9QfslK6pL4PnowCzISDhksTdqwDZLOpCkPq/w640-h444/Bapu+paintings.+%252818%2529.jpg" width="640" /></a></div><br /><p><br /></p><p>♦’సీతమ్మ పెళ్ళి’ తర్వాత తీసిన ’బుల్లెట్’ తుస్సుమంది.</p><p>♦“కళ్యాణ తాంబూలం” పండలేదు. కానీ ఊటీలో తీసిన కొన్ని దృశ్యాలు చూసి ఒక ఎన్నారై ఇవి ఏ దేశంలో తీశారు అని అడిగారు. బయట మేం చేసిన సినిమాల్లో హరికృష్ణ గారు అన్ని విధాలా గొప్ప నిర్మాత.</p><p>♦ ’పెళ్ళిపుస్తకం’. రావి కొండలరావు గారు మిస్సమ్మ కథ తిరగేసి ఇచ్చారు. నంది అవార్డే కాక జనం కూడా రివార్డిచ్చారు. చాలా గొప్ప నటుడు రాజేంద్రప్రసాద్ – కొత్తనటి దివ్యవాణి.</p><p>♦కొంతభాగం మా మిత్రులు NCL రాజుగారి తోటలో తీశాం. రమణగారు అక్కడ చక్రాలు లేని రైలుపెట్టి ఉండడం చూసి గుమ్మడిగారి పాత్రకి చక్కని సీను రాశారు. సినిమాలో “అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటరు” అన్న డైలాగు చాలా ఇష్టం.</p><p>♦ఆరుద్రగారి “శ్రీరస్తు శుభమస్తు” పాట షూటింగుకి మా ఆర్టువారు కళ్యాణమండపం అద్దె, డెకొరేషన్సు, జూనియర్సు, వార కాస్ట్యూమ్సు లెక్కేసి పొడుగాటి జాబితా తెచ్చారు. వద్దనుకుని ఓ తమాషా చేశాం. ఓ గదిలో నాలుగిటుకలూ పుల్లలూ, కాస్తమంట, ముగ్గులు, నాలుగు అరటి పిలకలు, నాలుగు మామిడి రెమ్మలు, ఓ కొబ్బరి బొండాం, మంగళ సూత్రం, పుపు కలిపిన బియ్యం ఓ పళ్ళెం, రెండు కర్రలకి పూలదండలు అమర్చుకుని Tight Close shots తో ఓ పూటలో పాట ముగించేశాం. హీరో హీరోయిన్లు తప్ప జూనియర్సు లేరు. అక్షింతల వేసన చేతులు కూడా మా యూనిట్ వాళ్లవే!</p><p>♦క్లైమాక్సు రాసుకుని రమణగారు పద్మాలయ స్టూడియోస్ లో పెద్ద ఫ్లోరు బుక్ చేశారు. వేరే షూటింగులో ఉన్న సమయంలో క్రాంతి కుమార్ గారు ‘’సీతారామయ్య గారి మనుమరాలు’ (What a picture!) కి రెండు నెలలు అదే ఫ్లోర్ అడిగారని తెలిసింది. పద్మాలయ హనుమంతరావుగారు “చూస్తే ఇది పెద్ద గిరాకీ – కానీ రమణ గారికి మాటిచ్చాశానే” అని ఇరకాటంలో పడ్డారని తెలిసింది. రమణగారు వెంటనే తనంతటతనే ఆ ఫ్లోరు అక్కరలేదని కబురు చేసి NCL రాజు గారి తోటలో చక్రాలు లేని రైలు పెట్టి కీ పాయింటుగా పెట్టుకుని ….అంతా తిరగరాసి షూటింగు పూర్తి చేశారు.</p><p>❤1992 లో యన్.టి.రామారావు గారు పిలిచి ‘లవకుశ ‘ తీద్దామన్నారు. ‘మీకు మీరే పోటీ అవుతారు. పైగా పుల్లయ్యగారి లవకుశని మించి తీయడం అసాధ్యం’ అన్నాము.</p><p>❤ శ్రీనాధకవి జీవితం తీయమన్నారు. “శ్రీనాధుడు దివ్యంగా భోగాలనుభవించి చివరి రోజుల్లో చితికిపోయాడు.</p><p> తోటరాముడు రాజైతే జనం చూస్తారు గానీ వుల్టా అయితే రిస్కు కదా” అని రమణగారన్నా కూడా – యన్.టి.ఆర్. లాభనష్టాలు నాకక్కరలేదు. ఆ పాత్ర నటించాలనుంది అంతే అన్నారు. కొంచెం వయసు కనిపించినా అనితరసాధ్యంగా పోషించారు.</p><p>❤ ప్రీవ్యూ వేసినప్పుడు కవిత వాసన ఎరగని ఒక ఇల్లాలు </p><p>“ఆ రోజులు అంత వైభవంగా వుండేవన్న మాట” అన్నారు</p><p>. కానీ సినిమా రిలీజయితే బాగుందా లేదా అని చూడ్డానికి కూడా జనం రాలేదు. యన్.టి.ఆర్ గారికి మాత్రం నచ్చింది. కౌగిలించుకుని భిజం తట్టారు. “కమర్షియల్ గా …అంత బా…” అని నసిగితే “అది మనకనవసరం బ్రదర్” అన్నారు.</p><p>❤రాముణ్ణి నమ్ముకుంటే అందరికీ మంచే జరుగుతుంది. </p><p>ఇరవై ఏళ్ళ క్రితం తీసిన ఆయన కథ “సంపూర్ణ రామాయణం” వట్టిపోని పాడి ఆవు. అయిదేళ్ళకోసారి అమ్మి లాభం పొందేవాళ్ళం. </p><p>❤ఆ మధ్య మా పార్ట్నర్స్ లో ఒకరు మాకు చెప్పకుండా రామాయణం సినిమాని మరో అయిదేళ్ళకి అమ్మేసి జేబులో వేసుకున్నాడు. రమణగారు ఆయన్ని నిలేస్తే – “అవును. తిన్నాను. ఏం జేస్తావ్? కోర్టుకెడితే వెళ్ళు. సివిలు కేసు హియరింగు కొచ్చేసరికి నువ్వైనా వుండవు. నేనైనా వుండను. ఈ లోగా మరిన్ని మాట్లు అమ్ముకుంటాను” అని హామీ ఇచ్చారు. అంటే – రాముడు పాపం ఆయనకు అవసరమైన సొమ్ము జతపరిచాడు. మాకు కోర్టు వ్యవహారాల గురించి జ్ఞానమూ ప్రసాదించాడు.</p><p>❤1993లో నాకిష్టమయిన ‘మిస్టర్ పెళ్ళాం’ తీశాం</p><p>. నా అభిమాన దర్శకుడు విశ్వనాథ గారు ” ఆ రాజేంద్రప్రసాద్ </p><p>బాగా చేస్తాడండీ” అని మెచ్చుకున్న సినిమా. </p><p>బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డు, నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. </p><p>❤ఆమనికి ఉత్తమ నటి అవార్డు వచ్చింది. నంది అవార్డుల ఫంక్షన్ కి వచ్చినపుడు గౌని మోద్రన్ హైర్ స్టైల్ లిప్ స్టిక్లతో వచ్చిన ఆమెని చూసి జ్యూరీలో ఒకరైన వాణిశ్రీ గారు – నువ్వు తెలుగు ఇల్లాలిగా వేషం పండించావని అవార్డి ఇస్తే ఇదేం వేషం తల్లీ” అని మందలించింది.</p><p>దీంట్లో ముఖ్యాంశం స్త్రీని కూడా పురుషులు తమతో సమానంగా చూడాలి అని. చివర బుద్ధి తెచ్చుకుని మొగాళ్ళందరూ వంగి పెళ్లాల కాళ్ళు పట్టుకుని కళ్ళకద్దుకుని – లాగేస్తారు. శిష్యా – ఇది అనంతం అంటూ.</p><p>❤ఆ తరవాత ‘రాంబంటు’. జీతం కూడా దక్కలేదు.</p><p>❤దేవుడు మేలు చేసి ఇప్పటి దాకా లాస్టుది ‘రాధా గోపాళం’ . మొగుడూ పెళ్ళాం సమానం కానీ మొగుడు కాస్త ఎక్కువ సమానం అన్నది ఇతివృత్తం – చాలా సరదా అయిన సినిమా. సరదాగా ఉండే శృంగారం ముగుడూ పెళ్ళాల మధ్యే అయినా పిల్లలున్న బ్రహ్మచారులు కొందరు కోప్పడ్డారు.</p><p>❤అవండీ 75 సంవత్సరాల తెలుగు చిత్ర యజ్ఞంలో మేము వ్రేల్చిన సమిధలు.</p><p>‘మేము ‘ అంటే …..</p><p>ఓ జమీందారీ గ్రామంలో ఓ రైతుకి ఒకే ఆవుండేదిట. నీదగ్గర పాడి ఎంత అని అడిగితే దొరగారివీ నావీ కలిపి వందా అనేవాట్ట. ‘మేమూ అంటే 99 ఆవులూ రమణ గారివి.</p><p>❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤</p>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5836802122867912200.post-31210008354967721252021-07-03T01:42:00.003-07:002021-07-03T01:42:22.911-07:00🔴 -గరుత్మంతుడు -🔴<h4>♦<div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh541KxHBZuxjBXWuO4vYTc8c27AAjMSMDzNQTZ_0H5y8A7HvcnOiQQK0F5khAGTbCq2dnGSBcV7tJefhyphenhyphenoHKrBdv9l6fR84eCEvlKUnzdKLSp2P3URfxDDp1h2wiYc-2TNG8wbQIX28Tu3/s286/106506257_4669264263098936_6350346587616853793_n.jpeg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="286" data-original-width="176" height="640" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh541KxHBZuxjBXWuO4vYTc8c27AAjMSMDzNQTZ_0H5y8A7HvcnOiQQK0F5khAGTbCq2dnGSBcV7tJefhyphenhyphenoHKrBdv9l6fR84eCEvlKUnzdKLSp2P3URfxDDp1h2wiYc-2TNG8wbQIX28Tu3/w394-h640/106506257_4669264263098936_6350346587616853793_n.jpeg" width="394" /></a></div></h4><p style="text-align: left;"><span style="font-size: large;">🔴 -గరుత్మంతుడు -🔴<br /><br />♦కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకొంటాడు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువకు అండాలనుండి వాసుకి, ఆదిశేషుడు ఆదిగా గల వెయ్యి పాములు జన్మిస్తాయి. <br />♦వినత అది చూసి తొందరపడి తన ఆండాన్ని చిదుపుతుంది. అందునుండి కాళ్లు లేకుండా, మొండెము మాత్రమే దేహముగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో నువ్వు సవతి మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసీగా ఉండు. రెండవ అండాన్ని భద్రంగా ఉంచు. అందునుండి జన్మించినవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు. సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్లిపోతాడు.<br />♦వినత తన రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటోంది. మరో 500 సంవత్సరాలు గడిచిన తర్వాత ... ఆ అండం నుంచి<br /> గరుత్మంతుడు ఉద్భవించి ఆకాశానికి ఎగిరి, భక్తిగా తల్లికి నమస్కరించాడు. వినత సంతోషంగా కుమారుని దీవించింది. అయితే మహాశక్తిమంతుడైన గరుత్మంతుని చూసి కద్రువ హృదయం అసూయతో దహించుకుపోయింది. తగిన సమయంకోసం ఎదురుచూస్తోంది.<br />♦ - వినత, కద్రువలు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీర సాగరమథనములో వచ్చిన ఉచ్చైశ్రవము అనే ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది. అప్పుడు దూరముగా కనిపిస్తున్న గుర్రమును చూసి, కద్రువ తన సవతితో "చూడు ఆ ఉచ్చైశ్రవము శరీరం అంత తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉన్నది" అని అంటుంది. ఉచ్చైశ్రవము తోక తెల్లగా ఉండడం చూసిన వినత, లేదు దాని తోక తెల్లగ ఉన్నదని అంటుంది. దీనితో కద్రువకు మనస్సులో పట్టుదల పెరిగి పందెం వేద్దాము, తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అంటుంది. వినత పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దు పోయిందని తరువాతి రోజు వచ్చి ఆ గుఱ్ఱాన్ని చూడవచ్చని ఇద్దరు అంగీకరించుకొని వారి ఇండ్లకి వెళ్ళిపోతారు.<br />♦సంతానానికి కద్రువ శాపం<br />కద్రువ ఇంటికి వెళ్ళి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను అడుగుతుంది. కొడుకులు దానికి అంగీకరించక పోయేసరికి కోపముతో మాతృ వాక్యపరిపాలన చెయ్యని మీరందరు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో మరణిస్తారు అని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు అమ్మా నేను వెళ్లి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు.<br />♦తరువాతి రోజు వినత, కద్రువలు వెళ్ళి చూడగానే గుఱ్ఱం తోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత బాధ పడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది.<br />♦గరుడుడిని చూసి కద్రువ, "వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడిని కూడా దాసీవాడు గా చేసుకొంటుంది. గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లి పోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడి పోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. సర్పాలు స్పృహలోకి వచ్చాయి. కద్రువ సంతోషించింది. ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది.<br />♦దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తనది, తన తల్లిది దాసీత్వం పోవాలి అంటే చేయవలసిన కార్యాన్ని అడుగుతాడు. అప్పుడు కద్రువ కుమారులు, ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడి మరియు వినత ల దాసీత్వం పోతుందని చెబుతారు.<br />♦గరుత్మంతుని దాస్యవిముక్తి<br />♦గరుత్మంతుడు అమృతం తీసుకొని వెళ్ళుతుంటే మార్గమధ్యములో ఇంద్రుడు కనిపించి "నాయనా గరుత్మంతా! అమృతం నువ్వు తీసుకొని వెళ్ళడం తగదు. అందరికి అమరత్వం సిద్దించరాదు" అని అంటాడు. అప్పుడు గరుత్మంతుడు - ఇంద్రుడు ఒడంబడిక చేసుకొంటారు. గరుత్మంతుడు అమృతకలశం తీసుకొని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు, అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని పారిపోయేటట్లు. గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భ ల పై ఉంచుతాడు. అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసీత్వము, అతడి తల్లి దాసీత్వము పోతుంది.<br />♦సర్పాలకు ద్విజిహ్వత్వం<br />♦అమృతం సేవించడానికి ముందుగా పవిత్రులవ్వాలనే ఉద్దేశంతో ఆ పాములు స్నానం చెయ్యడానికి వెళ్తాయి. అవి అలా స్నానానికి వెళ్లిన తడవుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృతకలశాన్ని ఎత్తుకొని పోతాడు. స్నానం చేసి వచ్చి జరిగింది గ్రహించి సర్పాలు బాధ పడతాయి. అయినా ఆశ చావక, ఆ పాములు దర్భలపై ఉంచి నప్పుడు అమృతం ఏమైనా ఒలికిందేమోనని తమ నాలుకతో నాకుతాయి. ఆ విధంగా నాకడం వల్ల వాటి నాలుకలు చీలి పోతాయి. ఆవిధంగా సర్పాలకు ద్విజిహ్వత్వం (రెండు నాలుకలు) సిద్ధించింది.<br />♦ఆ విధంగా తల్లికి దాస్యవిముక్తి కలిగించి, తాను శ్రీమహావిష్ణువుకు వాహనంగా వెళ్లిపోతాడు. సర్వ శక్తిమంతుడు అయి ఉండిన్నీ, తల్లి మాటకోసం సవతి సోదరులను వీపున మోస్తూ, అవమానాలను భరించి, తల్లికీ, తనకూ కూడా ఉన్న దాస్యబంధనాలను ఛేదించుకొని ఉన్నత స్థానానికి వెళ్లిన గరుత్మంతుడు ప్రాతస్స్మరణీయుడు.<br />♦సాధారణంగా విష్ణువు ఆలయాలలో మూలవిరాట్టు విగ్రహానికి అభిముఖంగా గరుత్మంతుని విగ్రహం ఉంటుంది. శ్రీవైష్ణవ చిహ్నాలలో ఊర్ధ్వపుండ్రాలకు ఇరుప్రక్కలా శంఖ చక్రాలు, వానికి ఇరుప్రక్కలా హనుమంతుడు, గరుత్మంతుడు ల బొమ్మలు చూపుతారు.<br />♦ ఈ శ్లోకం పఠించే సంప్రదాయం ఉంది. ఇందులో గరుత్మంతుని స్మరణ కూడా ఉంది.<br />రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం<br />శయనే యః పఠేన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి.<br />❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤</span></p>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-62231665206111794152021-07-01T23:22:00.000-07:002021-07-01T23:22:01.806-07:00 🚩డాక్టర్ -దేవుడు!<p style="text-align: left;"></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgG0D14oPgHctY_i5MgXXeF-6QdP9ER7pejAXERxSc1v2eerrtbYGMxwObnGQmWRAwTRY3V9-2bTRwVFa0oez0DCYzcGeNE8jFJMih_wp1wRqeDRAK_1mbcXOjStqexf5uTutUX6BgNQKc1/s640/RK+Lakshman+Dies+%25281%2529.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="418" data-original-width="640" height="418" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgG0D14oPgHctY_i5MgXXeF-6QdP9ER7pejAXERxSc1v2eerrtbYGMxwObnGQmWRAwTRY3V9-2bTRwVFa0oez0DCYzcGeNE8jFJMih_wp1wRqeDRAK_1mbcXOjStqexf5uTutUX6BgNQKc1/w640-h418/RK+Lakshman+Dies+%25281%2529.jpg" width="640" /></a></div><br /> 🚩డాక్టర్ -దేవుడు!<p></p><p>♦అసలే ఖాళీ రోడ్డు, పెద్ద ఎండ కూడా లేదు, పైగా చల్లని గాలి, వెనక్కాల గట్టిగా పట్టుక్కూచున్న భార్య, దాంతో తెగ స్పీడుగా డ్రైవ్ చేసుకుంటా వెళ్తున్నాడు హరికృష్ణ. ఆళ్ళ మావగారు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన లేటెస్టు మోడలు కవాసాకీ నింజా బైకు కొత్తల్లుడికి ఉగాది కానుకగా ఇచ్చేరు.</p><p>♦కాకినాడలోని మావగారింట్లో ఉదయాన్నే బండికి పూజ చేయించి, పచ్చడి తిని తల్లిదండ్రులు ఉండే పిఠాపురానికి బయల్దేరాడు. దేవరపల్లి వీధి దాటి కుంతీమాధవస్వామి గుడి దగ్గరకొచ్చేసరికి ఎక్కణ్ణుంచొచ్చిందో ఓ సూడిగేదె అడ్డొచ్చేసరికి సడన్ బ్రేకు వేసాడు హరికృష్ణ. దాంతో నూటిరవై కిలోమీటర్ల స్పీడులో వస్తున్న బండికాస్తా స్కిడ్డైపోయి భార్యాభర్తలిద్దరూ కిందడిపోయేరు. ఒళ్ళంతా గీరుకుపోయి ఒకటే రక్తం, చెయ్యిరిగిపోయిందంటూ ఆ హరికృష్ణ భార్య హరిత ఒకటే ఏడుపు.</p><p>♦రోడ్డు పక్కనే ఉన్న పాకల్లోంచొచ్చిన జనం వీళ్ళిద్దరినీ లేవదీసి బండిని పక్కన నిలబెట్టి, బొట్టు బీదరాజు గాడి ఆటోలో పక్కీధిలోనున్న వెంకట్రాజుగారాసుపత్రికి తీసుకెళ్లిపోయేరు.</p><p>♦బంగళా పెంకేసున్న ఆ చిన్న ఇంటి ముందు డాక్టర్ వెంకట్రాజు, ఆరెంపీ అని రాసుంది. అంత ఏడుపులోనూ ఆ బోర్డు చూసిన హరిత 'షిట్.. ఇన్ని ఇంజ్యూరీస్ తో సఫర్ అవుతూంటే ఆరెంపీ డాక్టర్ దగ్గిరకా? ఈ ఊళ్ళో అపోలో గానీ కేర్ గానీ లేవా' అంటూ అరిచినా వీళ్ళని తీసుకొచ్చిన జనం పట్టించుకోకుండా ఇద్దరినీ వెంకట్రాజు గారిదగ్గిరకట్టుకెళ్ళిపోయి ' డాట్రారండీ.. మరేమోనండీ.. ఈళ్ళిద్దరికీ యాక్సిడెంటైపోనాదండి' అంటూంటే ఆ వెంకట్రాజు గారు మీరందరూ బయటుండండి అని అందరినీ బయటకంపేసి, ఇద్దరి దెబ్బల్నీ శుభ్రం చేసేసి పైన టింక్చర్ అయోడిన్ పూస్తూ చెప్పేడు ' కొద్దిగా మంటగానుంటుంది.. కానీ ఓర్చుకోండి.. గాలికి ఒదిలేసి కొద్దిగా పచ్చిదనం పోయిన తర్వాత ఈ దెబ్బల మీద కొబ్బరి నూనె రాయండి చాలు.. త్వరగా ఎండిపోతాయి.. ఇప్పుడు మీ ఇద్దరికీ టెటనస్ ఇంజక్షన్ ఇస్తాను'..</p><p>♦హరిత ఏడుస్తా అరిచింది' ఐ డోంట్ నో హౌ క్వాలిఫైడ్ హీ ఈజ్.. ఎట్లీస్ట్ ఆస్క్ హిమ్ టు యూజ్ ఎ స్టెరిలైజ్డ్ సిరంజ్'</p><p>♦వెంకట్రాజు నవ్వుతూ బదులిచ్చాడు 'మేడమ్.. ఐ మైట్ లుక్ చీప్.. బట్ మై ట్రీట్మెంట్ ఈజ్ నాట్ చీప్.. నేను స్టెరిలైజ్డ్ మాత్రమే కాదు.. ప్రతీ పేషంటుకీ కొత్త సిరంజీ వాడతాను' అని కొత్త సిరంజీలతో ఇద్దరికీ ఇంజక్షన్లు చేసేడు.</p><p>♦లేవడానికి ఇబ్బంది పడుతున్న హరిత పాదం పట్టుకుని పెయిన్ ఎక్కడుందీ అని అడుగుతూంటే 'మోకాలు దగ్గర చెప్పలేనంత నొప్పి, అయినా నేను కాకినాడెళ్ళి అపోలో లో స్కాన్ చేయించుకుంటాను' అంది</p><p>♦ఆ అమ్మాయి మాటల్ని పట్టించుకోకుండా మోకాలి దగ్గర పరీక్ష చేసిన వెంకట్రాజు గారు చెప్పేరు 'మీ మోకాలి దగ్గర చిన్న డిస్ లొకేషన్.. పాటెల్లా డిస్ లొకేషన్ అంటారు.. ఇప్పుడే ఫిక్స్ చేస్తాన' ని ఆ పిల్ల అరుపులు పట్టించుకోకుండా మోకాలి దగ్గర చిన్నగా తిప్పేడు. ఆ హరిత ఒక్కసారే అరుపులూ, ఏడుపూ ఆపేసి 'ఇదేంటీ.. నెప్పి అలా ఎలా పోయిందీ' అని ఆశ్చర్యపోయింది.</p><p>'♦ఏమీలేదమ్మా.. చిన్న డిస్ లొకేషన్..పాటెల్లా డిస్ లొకేషన్ అంటారు.. ఫిక్స్ చేసేసేను.. మీ వారికి కాళ్లూ చేతులూ కొట్టుకుపోవడం తప్ప పెద్ద ఇన్జ్యూరీస్ ఏవీ లేవు.. పెయిన్ కిల్లర్ వాడండి.. రాస్తాను ' అని ప్రిస్క్రిప్షన్ రాస్తూంటే ఆ హరిప్రసాదు అడిగేడు' మీ ఫీజెంతండీ? '</p><p>'♦ ఇంజక్షన్లకీ, అయోడిన్ కీ కలిపి డెబ్భై రూపాయలివ్వండి చాలు' అని బదులిచ్చిన వెంకట్రాజు గారి కాళ్ళకి దణ్ణం పెట్టి, ఫీజు చెల్లించుకునెళ్ళిపోయారా దంపతులు</p><p>♦ఏ ఊరినుంచొచ్చాడో ఎవరికీ తెలీదు కానీ దేవరపల్లి వీధి లో ఇల్లద్దెకు తీసుకుని ప్రాక్టీసు మొదలెట్టేడా వెంకట్రాజు. ఈయన ఉత్త ఆరెంపీ అంటెహె అనుకుంటూ మొదటెవరూ ఆయన క్లీనిక్ వేపు కన్నెత్తి చూసేవోరు కాదు. ఈయనే ఓ చిన్న పెట్టట్టుకుని ప్రతీ పాకమ్మటా తిరిగి అందరి ఆరోగ్యం వాకబు చేస్తూండేవోడు.</p><p>♦ఎవరికైనా వైద్యం చేసినప్పుడు డబ్బివ్వబోతే 'డబ్బులక్కరలేదు.. ఇవ్వాళ మీ ఇంట్లో భోజనం పెట్టండనేవోడు.. ఊళ్లో వేరే డాక్టర్లు లా కాకుండా టెస్టులూ అయీ ఎంతో అవసరమైతే తప్ప రాసేవోడు కాదు. ఏ రోగినైనా మనిషిని క్షుణ్ణంగా పరిశీలించి రోగమేంటో తేల్చేసేవోడు.</p><p>♦శివాలయం పూజారి ఏకాంబరశాస్త్రి గారి కోడలు కాన్పయ్యిన తర్వాత కాకినాడ డాక్టర్లు ఏవో బోలెడు మల్టీ విటమిన్ టాబ్లెట్లూ గట్రా రాసేసేరు. అసలే ఇంతింత ఆదాయం తో అంత మందుల ఖర్చు ఎలా భరించాలిరా దేవుడా అని ఆయన బాధ పడుతూంటే 'అయ్యో.. భలే వారండీ.. ఆ టాబ్లెట్లయీ ఏమఖ్ఖర్లేదు.. శుభ్రంగా రోజూ తెలగపిండి కూర మునగాకేసి వండి పెట్టండి.. తల్లికీ బిడ్డకీ మేలని' చెప్పేడు. ఈయన చెప్పింది కరెక్టుగా పనిచెయ్యడంతో ఆ ఏకాంబరశాస్త్రి గారి పరివారం అంతా వెంకట్రాజు మీద నమ్మకం పెంచేసుకున్నారు.</p><p>♦అలాగే చుట్టుపక్కల పాకల్లో ఉండే పాలేళ్ళకీ, రిక్షా వాళ్ళకీ జబ్బులొస్తే.. అందుబాటులో ఉన్న పసుపు, మెంతులు, జీలకర్ర వంటివి ఉపయోగించి చిట్కా వైద్యం నేర్పించేసేడు. దాంతో చుట్టుపక్కల జనం ప్రతీదానికీ ఊళ్లో ఉన్న అల్లోపతీ డాక్టర్ల దగ్గరికి పరిగెత్తేవారు కాదు పైగా వెంకట్రాజంటే ఆళ్ళందరి దృష్టిలో దేవుడితో సమానంగా చూసుకునేవారు</p><p>♦అదేంటండీ డాక్టర్ గారూ ఇంకా పెళ్లి చేసుకోలేదేంటండీ అని ఎవరైనా అడిగితే మనకయన్నీ ఎందుకండీ.. మీరందరూ నా కుటుంబంలాంటోరే కదా.. మళ్ళీ నాకు వేరే కుటుంబం గట్రా ఎందుకండీ అని నవ్వేసేవోడు.</p><p>♦ఓసారి కాకినాడ పచ్చిగోళ్ళ వాసు గారి హోల్సేలు మందుల షాపులో తనక్కావలసిన మందులవీ కొనుక్కుని తిరిగి పిఠాపురం వెళ్ళడానికి సర్పవరం జంక్షన్లో షేర్ ఆటో కోసం చూస్తూండగా 'డాక్టర్ గారూ' అని గట్టిగా ఎవరో పిలిచేసరికి ఎవరా అని చూడగా రోడ్డవతల కారాపినుంచున్న ఆ హరికృష్ణ దంపతులు కనబడ్డారు.</p><p>♦వెళ్లి బాగున్నారా అని పలకరిస్తే 'బావున్నామండీ.. ఆ రోజు మీరు చేసిన సహాయం మర్చిపోలేము.. మళ్ళీ మాకు పిఠాపురం వచ్చే పని పడక అటువేపు రాలేకపోయేము. మీరేమనుకోకుండా మా ఇంటికి భోజనానికి రావాలిప్పుడురావాలిప్పుడు' అంది హరిత.</p><p>♦'నేను చేసిందేముందమ్మా.. ఇంకోసారొస్తాను మీ ఇంటికి ' అంటున్నా పట్టించుకోకుండా ' మీరు రాకపోతే నా మీద ఒట్టేనండి ' అని బలవంతంగా వెంకట్రాజుని వాళ్ళింటికి తీసుకెళ్లిపోయారా దంపతులు. దారిలో చెప్పింది హరిత' మా నాన్నగారు కూడా డాక్టరేనండి మీలాగే.. కాకపోతే ఎండి.. కార్డియాలజీ'</p><p>'అవునా.. మంచిదండి' బదులిచ్చాడు వెంకట్రాజు</p><p>♦'ఇక్కడ అపోలో హాస్పిటల్ లో మా మావగారు కార్డియాలజీ ఛీఫ్ అండి' కారు డ్రైవ్ చేస్తూ చెప్పాడు హరికృష్ణ</p><p>హరిత వాళ్ళింటికెళ్ళేసరికి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి. లోపలికెళ్ళి చూసేసరికి హరిత తండ్రి రాజేశ్వరరావు గారు కుప్పకూలిపోయున్నారు.</p><p>♦ఆయన భార్య శాంత అంబులెన్స్ పిలవమని కేకలు పెడుతూ ఏడుస్తూంది. హరిత ని చూడగానే 'నీకిందాకటి నుంచి ఫోనచేస్తున్నాను.. తియ్యవేం?' అని అరిస్తే 'అయ్యో.. ఫోను మ్యూట్ లో పెట్టి మర్చిపోయేను' బిక్కమొహం వేసుకుని బదులిచ్చింది హరిత</p><p>'మీరు కంగారు పడకండత్తయ్యా.. నేను అంబులెన్స్ కి ఫోన్ చేసాను.. వెంటనే వస్తుంది' అని హరికృష్ణ ఆశ్చర్యంగా చూసేడు.</p><p>♦అప్పటికే రాజేశ్వరరావు గారి ఛాతీ మీద మోదుతూ మధ్య మధ్యలో ఆయన నోట్లో నోరెట్టి ఊదుతూ కనిపించాడు వెంకట్రాజు.</p><p>'ఈయనెవరే? ఏం చేస్తున్నాడు మీ నాన్న గారిని? ' అని అడిగిన శాంత గారిని' ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు.. నువ్వు ఆట్టే టెన్షన్ పడకు మమ్మీ ' అంది హరిత</p><p>♦కాస్సేపటికి ఆయన గుండె కొట్టుకోవడం ప్రారంభించింది.' సిపిఆర్ చేసేను.. డేంజరు తప్పినట్లే.. కాకపోతే ఈయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్దాం' అని ఆ రాజేశ్వరరావు గారిని అపోలో లో చేర్పించి వెళ్లిపోయాడు వెంకట్రాజు.</p><p>♦కొన్నాళ్ళకు వెంకట్రాజు ఇంటి ముందు కారాగింది. హరిత తన తండ్రిని వెంకట్రాజు క్లినిక్ లోకి తీసుకొచ్చి చెప్పింది 'నాన్నగారు కోలుకుంటే అన్నవరం లో వెయ్యిన్నొక్కటి కొబ్బరి కాయలు కొడతానని అమ్మ మొక్కుకుంది.. వెళ్తూ మీకు కనిపించెళ్దామని తీసుకొచ్చేను'</p><p>♦వెంకట్రాజు ' నమస్కారమండీ.. బాగున్నారా?' అని పలకరించేడు. రాజేశ్వరరావు గారు తల పంకించి క్లినిక్ అంతా చూసి మాట్లాడకుండా 'ఇంక మనం వెళ్ళాలి.. లేకపోతే గుడి కట్టేస్తారు' అన్నారు</p><p>వెంకట్రాజు చిరునవ్వుతో చూస్తూండగా వారంతా కారెక్కి వెళ్లిపోయేరు.</p><p>♦అన్నవరం కొండెక్కిన తర్వాత హుండీ లో ఓ కవరు వేసి వెళ్లిపోయారు రాజేశ్వరరావు గారు. ఆ తర్వాత ఎప్పుడూ తను డాక్టర్నని చెప్పుకోలేదు, ప్రాక్టీసూ చెయ్యలేదు.</p><p>♦స్వామి వారి హుండీ లో వేసిన కవర్లో చించేసిన ఆయన ఎండీ సర్టిఫికెట్, కార్డియాలజీ లో ఆయన సాధించిన గోల్డ్ మోడల్స్ తో పాటు వెంకట్రాజు ( బ్రాకెట్లో దేవుడు) ని కులపిచ్చి తో ఏడుసార్లు కార్డియాలజీ సబ్జెక్టు లో ఫెయిల్ చేసి మెడిసిన్ వదిలెళ్ళిపోయేలా చేసి తప్పు చేశానని క్షమాపణ కోరుతూ రాసిన ఉత్తరం కూడా ఉంది.❤️</p><p>🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹</p>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5836802122867912200.post-70761706682565843832021-07-01T21:32:00.002-07:002021-07-01T21:32:17.964-07:00మేఘ సందేశం 🚩 (మహాకవి కాళిదాసు!)<div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjpa3Dk4kZDyWvb7yBhLqPcMUU4LGE6cCw_HS9UcCInZtvI4g0JCwVy2Z3qh9zhtYLBASkorJQXz566I3ixUe5TtZ0b225rP1KhAoSNL2xjSzqLCzdqNR36bSYVAy9fTB4Vrw7na0qGvDKn/s413/27-1464342918-draupadi2.jpeg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="413" data-original-width="356" height="640" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjpa3Dk4kZDyWvb7yBhLqPcMUU4LGE6cCw_HS9UcCInZtvI4g0JCwVy2Z3qh9zhtYLBASkorJQXz566I3ixUe5TtZ0b225rP1KhAoSNL2xjSzqLCzdqNR36bSYVAy9fTB4Vrw7na0qGvDKn/w552-h640/27-1464342918-draupadi2.jpeg" width="552" /></a></div><br /><h4><br /></h4><h4>🚩</h4><h4>👉🏿కాళిదాసు గురించి నేను చిన్నప్పుడు విన్న ఒక విషయం చెప్పాలి. అమ్మవారి కటాక్షం లభించడానికి ముందు కాళిదాసు అమయాకంగా ఉండేవాడట.</h4><h4>అక్కినేని నటించిన కాళిదాసు సినిమాలో కూడా అదే చూపించారు.</h4><h4>👉🏿ఆ రోజుల్లో ఒక ఊరి పడచు అతన్ని చూసి అస్తి కస్చిత్ వాక్ విశేషః? అని అన్నదట.</h4><h4>అంటే "అసలు నీకు కొంచెమైనా మాట్లాడగలిగే విషయం ఉందా" అని.</h4><h4>👉🏿కొన్నాళ్ళకు అమ్మవారి కరుణతో గతం అంతా మర్చిపోయి మహాకవి అయిపోయాడని ఐతిహ్యం. గతం మర్చిపోయినా కాని</h4><h4>👉🏿 'అస్తి, కస్చిత్, వాక్' అనే ఆ పడచు</h4><h4>పలికిన ఆ మూడు పదాలు మస్తిష్కంలో ఉండిపోయాయట.</h4><h4>ఏదైతెనేం..ఆ మూడు పదాలతో మూడు కావ్యాలు</h4><h4>మొదలెట్టేసి రాసేసాడు.</h4><h4>👉🏿అస్తి...తో 'అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మా...'</h4><h4>అంటూ కుమారసంభవం,</h4><h4>👉🏿'కస్చిత్..తో..'కస్చిత్ కాంతా విరహ గురుణా..'</h4><h4>అంటూ మేఘ సందేశం,</h4><h4>👉🏿'వాక్' ..తో..'వాగర్ధావివ సంపృక్తౌ...'</h4><h4>అంటూ రఘు వంశం రాసేసాడు.</h4><h4>👉🏿 నీకు మాటలొచ్చా? అన్న ప్రశ్నకు అమ్మవారు కాళిదాసు</h4><h4>నాల్క పైన ఆ మూడు పదాలతో అజరామరమైన మూడు</h4><h4>కావ్యాలే పలికించిందన్న విషయం చరిత్రకారులు</h4><h4>ఒప్పుకోకపోయినా, భాషాభిమానులు, భక్తి పారాయణులు 'అద్భుతం..' అనకుండా ఉండలేరు.</h4><h4>👉🏿ఆ కావ్యాల్లో చిన్నది, విరహ శృంగార రస ప్రధానమైనది మేఘసందేశం.</h4><h4>👉🏿ఇది మొత్తం రెండు సర్గల కావ్యం.</h4><h4>మొదటి దాంట్లో 67 శ్లోకాలు ఉంటే రెండో దాంట్లో 57 ఉంటాయి.</h4><h4>అంటే మొత్తం 124 శ్లోకాల కావ్యం అన్నమాట.</h4><h4>కావ్యం అంతా ఒకటే వృత్తం- మందాక్రాంత.</h4><h4>👉🏿చాలా మందికి 'శాంతాకారం భుజగ శయనం పద్మ నాభం సురేశం..' అనే ప్రసిధ్ధ శ్లోకం తెలిసే ఉంటుంది..</h4><h4>ఈ కావ్యం మొత్తాన్ని ఆ నడకలో చదువుకోవాలి..</h4><h4>👉🏿భారత దేశంలో పుట్టినందుకు పోయేలోపు ఒక్క కావ్యమన్నా చదివి ఆస్వాదించాలనే తృప్తికోసమైనా ఈ మేఘసందేశం చదివి తీరాలి.</h4><h4>నిజానికి ఇదొక్కటీ ఆస్వాదిస్తూ చదివితే మరికొన్ని కావ్యాలు చదవాలనే కొరిక కలగొచ్చు.</h4><h4>👉🏿కూబేరుని శాపం వల్ల భార్యకు దూరమైన ఒక యక్షుడు</h4><h4>మేఘంతో చేసేతన విరహ సంభాషణే ఈ కావ్య వస్తువు.</h4><h4>మేఘంతో సంభాషనేమిటి అర్థం లేకుండా అని అనుకుంటూ</h4><h4>ఉండే లోపే5 వ శ్లోకంలోనే 'ధూమజ్యోతి సలిల మరుతా...'</h4><h4>అంటూ విరహ బాధలో ఉన్నప్పుడు సాధ్యాసాధ్యాల బేరీజు వెసుకోవడం, ఇంగితం వంటివి ఉండవని చెబుతాడు కాళిదాసు.</h4><h4>ఇక అక్కడి నుంచి నాయకుడైన యక్షుని మనఃస్థితిని</h4><h4>అర్థం చేసుకుని తక్కిన కావ్యం సందేహాలు లేకుండా చదివేయొచ్చన్నమాట.</h4><h4>🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷</h4>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-32523864372777531402021-03-10T04:55:00.000-08:002021-03-10T04:55:06.135-08:00హిందు ధర్మం <p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgHFuMWtx2FmYqEtwWDWN6dEOyIpBwROKhqK3bXVy3N1c816Vg4V76_p_6uUeTTpXFeQwYny9CQ7pS3xc3yzqVPj7XOGyZ4w6wbxx7fhwrhm_CdrjxtvIR7TNe4MAl2rJ-mzZPSUdDMkjX8/s650/46+Bhagavatha+-+Kaliyamardhana.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="350" data-original-width="650" height="344" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgHFuMWtx2FmYqEtwWDWN6dEOyIpBwROKhqK3bXVy3N1c816Vg4V76_p_6uUeTTpXFeQwYny9CQ7pS3xc3yzqVPj7XOGyZ4w6wbxx7fhwrhm_CdrjxtvIR7TNe4MAl2rJ-mzZPSUdDMkjX8/w640-h344/46+Bhagavatha+-+Kaliyamardhana.jpg" width="640" /></a></div><br /><span style="font-size: large;"><br />హిందు ధర్మం </span><p></p><p><span style="font-size: large;">మహా రాణా ప్రతాప్ గురించి మనకేవ్వరికి తెలియదు. కానీ ఒక్క సారి చదవండి.</span></p><p><span style="font-size: large;">ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. విచిత్రంగా ప్రపంచంలోనే అత్యంత బలశాలి అయిన అమెరికా మెడలు వంచింది ఈ చిన్ని దేశం.</span></p><p><span style="font-size: large;">ఈ రెండు దేశాల నడుమ కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆఖరికి అమెరికాని ఓడించింది వియత్నాం. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడిని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.</span></p><p><span style="font-size: large;">విలేకరి: ఇప్పటికీ అర్ధం కాని విషయమేమిటంటే,అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలవగలిగారు.?</span></p><p><span style="font-size: large;">విలేకరి అడిగిన ఆ ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు ఇచ్చిన సమాధానం…</span></p><p><span style="font-size: large;">” అన్ని దేశాలలోకెల్ల అత్యంత శక్తివంతం అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు, శ్రేష్టుడు అయిన గొప్ప దేశభక్తిగల ఒక భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని వీరోచితగాథల నుండి, అతని జీవితం నుండి ప్రేరణ పొంది యుద్దనీతి ,ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్దంలో గెలిచాము.</span></p><p><span style="font-size: large;">విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు?</span></p><p><span style="font-size: large;">విలేఖరి ఇలా అడగగానే వియత్నాం అద్యక్షుడు వెంటనే నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు.</span></p><p><span style="font-size: large;">” అతడే… రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్”</span></p><p><span style="font-size: large;">మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పేటప్పుడు అతని కళ్ళు వీరత్వంతో వెలిగిపోయాయి.</span></p><p><span style="font-size: large;">అంతే కాదు అతను ఇంకా ఇలా అన్నాడు</span></p><p><span style="font-size: large;">“ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.”</span></p><p><span style="font-size: large;">అని.</span></p><p><span style="font-size: large;">కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు. అయితే అతని సమాధి మీద ఇలా వ్రాసారు “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుని సమాధి ” అని .</span></p><p><span style="font-size: large;">కాల క్రమేణా కొద్ది సంవత్సరాల తర్వాత వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహులకు శ్రద్ధాంజలి ఘటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు. ఆ తరువాత ఎర్రకోట,ఇంకా ఇంకా ఇలా చూపిస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు “ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”.</span></p><p><span style="font-size: large;">అప్పుడు ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికెడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు….”ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజు” అని అన్నాడు</span></p><p><span style="font-size: large;">మహారణా ప్రతాప్ సింహ్ గురించి మరి కొన్ని వివరాలు..</span></p><p><span style="font-size: large;">అతని పూర్తి పేరు..-కుంవర్ ప్రతాప్ జి(శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్)</span></p><p><span style="font-size: large;">జన్మదినం-9 మే,1540</span></p><p><span style="font-size: large;">జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్</span></p><p><span style="font-size: large;">పుణ్యతిది-29 జనవరి,1597</span></p><p><span style="font-size: large;">తండ్రి – మహారాణా ఉదయ్ సింహ్ జి</span></p><p><span style="font-size: large;">తల్లి-రాణి జీవత్ కాంవర్ జి</span></p><p><span style="font-size: large;">రాజ్య సీమా-మేవాడ్</span></p><p><span style="font-size: large;">శాశన కాలం -1568-1597(29 సంవత్సరాలు)</span></p><p><span style="font-size: large;">వంశం –సూర్యవంశం</span></p><p><span style="font-size: large;">రాజవంశం-సిసోడియ రాజపుత్రులు</span></p><p><span style="font-size: large;">ధార్మికం-హిందూధర్మం</span></p><p><span style="font-size: large;">ప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్ యుద్దం</span></p><p><span style="font-size: large;">రాజధాని-ఉదయ్ పూర్</span></p><p><span style="font-size: large;">శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అతనికి అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”.</span></p><p><span style="font-size: large;">అబ్రహం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి రావాల్సి ఉంది. అతను భారత్ కి బయలుదేరుతూ తన తల్లిని భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అడిగాడట. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వాస పాత్రుడుగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభ పెట్టినా తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందట.కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” లో చదువ వచ్చు.</span></p><p><span style="font-size: large;">*మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు బరువు ఉంటుంది.చేతి కవచం,శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి.</span></p><p><span style="font-size: large;">*డిల్లీ బాద్షాహ్ అయినటువంటి అక్బర్ మహా రాణా ప్రతాప్ ని ఒకసారి ” తల దించి నా కాళ్ళ మీద పడితే సగం హిందూస్థాన్ కి రాజుని చేస్తా ” అని ప్రలోభపెట్టాడు. కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా భావించి తిరస్కరించాడు..</span></p><p><span style="font-size: large;">*హల్దిఘాట్ యుద్దంలో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో సమీకరించబడాయి</span></p><p><span style="font-size: large;">* మహారాణా ప్రతాప్ ఇష్టమైన గుర్రంకి తన త్యాగానికి గుర్తుగా ఒక గుడిని కూడా కట్టారు ,ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది.</span></p><p><span style="font-size: large;">* మహారాణా యుద్దంలో తన అభేద్యమైన దుర్గం లను వదులుకున్నప్పటినుండి కంసాలి వాళ్ళు వేల సంఖ్యలో వాళ్ల వాళ్ళ ఇళ్లను వదిలి రాణా కోసం ఆయుధాలు తయారు చేసేవారు.వాళ్ల దేశ భక్తికి నా తల వంచి ప్రణమిల్లుతున్నాను.</span></p><p><span style="font-size: large;">* హల్ది ఘాట్ యుద్దం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నేలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుదం దొరికింది.</span></p><p><span style="font-size: large;">* మహారణా ప్రతాప్ సింహ్ దగ్గర యుద్ద శిక్షణ శ్రీ జైమల్ మేడతీయ ఇచ్చేవాడు. 8000 మంది రాజపుత్ర వీరులతో కలిసి 60000 మంది మొఘలులతో యుద్దం చేశారు. ఆ ఆయుద్దంలో 48000 మంది చనిపోయారు.ఇందులో 8000 మంది రాజపుత్రులు 40000 మంది మొఘలులు</span></p><p><span style="font-size: large;">* మహారాణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట.</span></p><p><span style="font-size: large;">* హల్ది ఘాట్ యుద్దంలో మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు .వాళ్ళు మహారాణాను వారి పుత్రుడిగా భావించేవారు.మహారాణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నం లో ఒకపక్క రాజపుత్ మరొక పక్క భీల్ ఉంటారు.</span></p><p><span style="font-size: large;">* రాణా గుర్రం అయిన చేతక్ మహారాణాను 26 అడుగుల కందకం మీద నుంచి దూకి అది దాటిన తరువాత చనిపోయింది. అంతకంటే ముందే దానికి ముందు కాలు విరిగి ఉన్నప్పటికి ఆ కందకాన్ని దుమికింది.అది ఎక్కడైతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది.అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్ మందిరం కట్టారు.</span></p><p><span style="font-size: large;">*చేతక్ ఎంత బలమైనదంటే తన ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి అంత ఎత్తులో గాలిలో ఎగిరేది. అది కూడా మహారాణాతో పాటుగా</span></p><p><span style="font-size: large;">*మహారాణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెల్చుకున్నాడు.</span></p><p><span style="font-size: large;">*శ్రీ మహారాణా ప్రతాప్ యొక్క బరువు 110 కిలోలు మరియు అతని పొడవు 7’5’’. ఇరువైపుల పదును ఉన్నటువంటి కత్తి, 80 కిలోల ఈటె తన వద్ద ఉంచుకునే వాడు.</span></p><p><span style="font-size: large;">*మిత్రులారా మహార ణా ప్రతాప్ ,అతని గుర్రం గురించి విన్నారు ,అంతే కాదు అతనికి ఒక ఏనుగు కూడా ఉండేది.దాని పేరు రాంప్రసాద్.</span></p><p><span style="font-size: large;">*అల్ బదౌని అనే రచయిత రాంప్రసాద్ ఏనుగు గురించి తన గ్రంధంలో రాసుకున్నాడు.</span></p><p><span style="font-size: large;">* అక్బర్ బాద్షాహ్ మేవాడ్ మీద యుద్దం చేసేటప్పుడు తన సైన్యానికి ఏమని ఆదేశించాడంటే.</span></p><p><span style="font-size: large;">మహారాణా ప్రతాప్ తో పాటుగా రాంప్రసాద్ ఏనుగుని కూడా బందీగా పట్టుకుంటే సరిపోద్ది అని చెప్పాడట.</span></p><p><span style="font-size: large;">* రాంప్రసాద్ ఎంత బలం కలిగినదంటే ఒక్కత్తే మొఘలుల 13 ఏనుగులని చంపిందట.అలాగే దాన్ని పట్టుకోవడానికి 7 పెద్ద ఏనుగులమీద 14 మంది నైపుణ్యం కలిగిన మావటిలు కూర్చుని ఒక చక్రవ్యూహం ప్రకారంగా దాన్ని బందీ చేశారట అని అల్ బదౌని తన రచనల్లో పేర్కొన్నాడు.</span></p><p><span style="font-size: large;">*బందీని చేసిన రాంప్రసాద్ ని అక్బర్ ముందు నిలబెట్టగ దానికి పీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడు.ఆ ఏనుగు ఎంత స్వామి భక్తి కలదంటే 18 రోజులవరకు దాణా తినకుండా,నీళ్ళు తాగకుండా తన ప్రాణాలు కోల్పోయింది.తరువాత ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్ ” ఈ ఏనుగుని వంచ లేకపోయాను మహారాణాను ఎలా వంచగలుగుతాను “అని అన్నాడట.</span></p><p><span style="font-size: large;">* మన దేశంలో ఇలాంటి దేశభక్తుల్లో చేతక్,రాంప్రసాద్ లాంటి జంతువులు కూడా ఉన్నాయి.</span></p><p><span style="font-size: large;">Be proud to be INDIAN</span></p>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-38480621565703111572021-03-08T23:51:00.002-08:002021-03-08T23:51:21.824-08:00🌼🌿దక్షిణ కైలాసం... శ్రీ కాళహస్తి!🌼🌿<p><span style="font-size: large;"></span></p><div class="separator" style="clear: both; text-align: center;"><span style="font-size: large;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgi15iMesSlXgdVdhEJdXASo_r9IlYVvXqX9CBQYSx5Cqc5HMT7rPAyJ1FnpbhbIc1gy6AMtl-s8uJwcDQd69w9WtnsMqMw-bOzKtvGXXFviXcZpknXHDSCBaIxlEESp5t0L58e5jkE173z/s320/46+Bhagavatha+-+Kaliyamardhana.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="320" data-original-width="320" height="640" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgi15iMesSlXgdVdhEJdXASo_r9IlYVvXqX9CBQYSx5Cqc5HMT7rPAyJ1FnpbhbIc1gy6AMtl-s8uJwcDQd69w9WtnsMqMw-bOzKtvGXXFviXcZpknXHDSCBaIxlEESp5t0L58e5jkE173z/w640-h640/46+Bhagavatha+-+Kaliyamardhana.jpg" width="640" /></a></span></div><span style="font-size: large;"><br />🌼🌿దక్షిణ కైలాసం... శ్రీ కాళహస్తి!🌼🌿</span><p></p><p><span style="font-size: large;"> ఎన్నో క్షేత్రాలను దక్షిణ కాశీగా పిలుస్తున్నా దక్షిణ కైలాసంగా పేరుగాంచింది మాత్రం ఒక్క శ్రీకాళహస్తీశ్వరాలయమే. పంచభూత లింగాలలో ఒకటైన వాయు లింగం కొలువై ఉన్న ఈ ఆలయంలో అడుగు పెట్టినంతనే భక్తులకు ముక్తి లభిస్తుందంటారు. అంతేకాదు, సర్పదోష, రాహుకేతు గ్రహ దోష నివారణలకు దేశంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రమిది. న మఃశివాయలో... ‘న’ అంటే నభము (ఆకాశం), ‘మ’ మరుత్ (వాయువు), ‘శి’ శిఖి (అగ్ని), ‘వా’ వారి (జలం), ‘య’ అంటే యజ్ఞం (భూమి). ఈ అయిదింటికీ ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వపాపాలూ హరించిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.</span></p><p><span style="font-size: large;">అలాంటి పంచ భూతాత్మకుడైన పరమశివుడు వాయులింగం రూపంలో ఉద్భవించిన క్షేత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని కాళహస్తిలో ఉన్న శ్రీ కాళహస్తీశ్వరాలయం. మిగిలిన నాలుగూ ఫృథ్వీలింగం (కాంచీపురం), జలలింగం (జంబుకేశ్వరం), అగ్నిలింగం (తిరువణ్నామలై), ఆకాశలింగం (చిదంబరం) తమిళనాడులో ఉన్నాయి. కాళహస్తీశ్వరుడు వాయు లింగం రూపంలో ఉన్నాడనడానికి ప్రతీకగా గర్భాలయంలో లింగం పక్కన ఉన్న రెండు దీపాల్లో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుందట.</span></p><p><span style="font-size: large;">బ్రహ్మదేవుడు జ్ఞానం పొందిన క్షేత్రం</span></p><p><span style="font-size: large;">కృతయుగం ప్రారంభంలో బ్రహ్మ దేవుడు మహా శివుడి ఆజ్ఞను ధిక్కరించడం వల్ల అజ్ఞానంతో సృష్టి కార్య నిర్వహణలో విఫలమవుతాడు. పోగొట్టుకున్న జ్ఞానాన్ని తిరిగిపొందేందుకు కైలాసంలో తేజోవిరాజితమైన శివానందైక నిలయమనే శిఖరాన్ని తన భుజస్కంధాలపై తీసుకుని భూలోకంలో ఓ పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజించాలనుకుంటాడు. ఆ ప్రకారంగా శివానందైక శిఖరాన్ని కాశీ క్షేత్రానికి 190 యోజనాల దూరంలో దించుతాడు బ్రహ్మ. అక్కడ పంచముఖాలతో కూడిన మహా శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి, శాపం నుంచి విమోచనం పొందుతాడు. అలా శ్రీకాళహస్తి క్షేత్రం దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి పొందింది. ప్రస్తుతం దాదాపు 5500 ఎకరాల్లో ఈ కైలాసగిం¹ులు విస్తరించి ఉన్నాయి. బ్రహ్మదేవుడి మాదిరిగానే వాయులింగేశ్వరుడి దేవేరి అయిన పార్వతీ దేవి కూడా శివుడి కోసం తపస్సు చేసి జ్ఞానామృతాన్ని పొందడంతో ఈ క్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబికగా కొలువుదీరింది.</span></p><p><span style="font-size: large;">భక్తుల పేరుతోనే...</span></p><p><span style="font-size: large;">శ్రీ (సాలీడు), కాళము (సర్పం), హస్తి (ఏనుగు)... ఈ మూడు మూగ జీవాల భక్తికి మెచ్చి ముక్తిని ప్రసాదించిన శివుడు ఇక్కడ శ్రీ కాళహస్తీశ్వరుడిగా కొలువు దీరాడు. అదెలాగంటే... పూర్వం తామ్రపర్ణీ నదీ తీరంలో నివసించే కరబుడు చీరల అల్లకంలో దిట్ట. పుట్టినప్పట్నుంచీ శివ భక్తుడైన అతడు దుష్ట సావాసంతో శివారాధన విస్మరించి, వైదిక ధర్మాలను విడిచి పెట్టడంతో అనారోగ్యానికి గురై తనువు చాలించాడు. మరుజన్మలో సాలీడుగా దక్షిణ కైలాసంలో జన్మించాడు. ఈ సాలీడు తన దారాలతో వాయులింగేశ్వరుడికి కైలాసంలో ఉన్నట్లు వేదికలూ భవనాలను అల్లుతూ ఉండేదట. దాని భక్తిని పరీక్షించదలచి ఓరోజు శివయ్య ఆ అల్లికలను అగ్నికి ఆహుతి చేశాడట. అది చూసి భరించలేక అగ్నిలో దూకిన సాలీడుకి శివుడు సాయుజ్యాన్ని ప్రసాదించాడు.</span></p><p><span style="font-size: large;">కాళము(సర్పం)... హస్తి(ఏనుగు)ల కథ కూడా ఇలాంటిదే. లోగడ ఇద్దరు శివ భక్తులు పూర్వ జన్మ పాపాలతో అష్టకష్టాలూ పడుతూ వచ్చారు. ఆ ఇద్దరూ మరు జన్మలో దక్షిణ కైలాసంలో సర్పం, ఏనుగు రూపాల్లో జన్మించారు. పాము రోజూ ఓ మణిని తీసుకొచ్చి లింగానికి అర్పించి పూజలు చేస్తూ ఉండేది. కొన్నాళ్లకు అక్కడ లింగాన్ని చూసిన ఏనుగు స్వర్ణముఖీ నదిలో స్నానమాచరించి తొండంతో నీళ్లు తెచ్చి లింగానికి అభిషేకం చేసి, మారేడు బిల్వ పత్రాలతో శివార్చన చెయ్యడం మొదలు పెట్టింది. అయితే ఏనుగు మరుసటి రోజు వచ్చేసరికి మారేడు దళాలన్నీ కిందపడిపోయి ఉండేవి. అది చూసి ఏనుగు అసంతృప్తి చెందేది. సర్పం కూడా తాను దేవుడికి అర్పిస్తున్న మణి కింద పడిపోయి ఉండటం వల్ల ఎందుకిలా జరుగుతోందని ఆలోచించింది. విషయం తెలుసుకుందామని ఓరోజు లింగాన్ని చుట్టుకుని పడుకుంది. ఆ సమయంలో ఏనుగు రావడం, పూజ చేసేందుకు మణిని పక్కకు తొయ్యడం చూసిన పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది. దాంతో బాధను తట్టుకోలేక ఏనుగు తన శిరస్సును కొండకు ఢీ కొట్టడంతో రెండు జీవులూ శివైక్యం పొందాయి. అలా ఈ క్షేత్రం శ్రీ కాళహస్తి అయింది.</span></p><p><span style="font-size: large;">మహా భక్తుడైన కన్నప్ప ఏకంగా తన కళ్లనే తీసిచ్చింది ఇక్కడి శివుడికే. అందుకే, కాళహస్తిలో తొలి పూజను అందుకుంటున్నాడు భక్త కన్నప్ప.</span></p><p><span style="font-size: large;">రాహు కేతు పూజలతో ఖ్యాతి</span></p><p><span style="font-size: large;">పుత్ర శోకానికి గురైన వశిష్ఠ మహర్షికి దక్షిణకైలాసంలోనే పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనిమిచ్చాడట శివయ్య. ఆ నాగరూపం కారణంగానే కాళహస్తి ‘రాహు కేతు క్షేత్రం’గా కూడా వర్ధిల్లుతోంది. సర్ప దోషం, రాహు కేతు గ్రహ దోషాల నుంచి నివారణ కోసం దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. క్రీస్తు శకం మూడో శతాబ్దం నుంచే అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్న ఈ ఆలయానికి వెళ్తే మహాదేవుడి దర్శనంతో పాటు అలనాటి శిల్పకళా వైభవాన్నీ దర్శించుకోవచ్చు. పాతాళ వినాయకుడు, శ్రీకృష్ణ దేవరాయల విజయస్తంభం, జలవినాయకుడి ఆలయం, భరద్వాజ తీర్థం, వేయి లింగాల తీర్థం, ఆలయానికి దక్షిణం వైపున ఉన్న బ్రహ్మ గుడి... ఇలా దర్శించుకోదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కాళహస్తిలో.</span></p><div><br /></div>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-28352291512953452762021-02-09T22:27:00.005-08:002021-02-09T22:27:57.913-08:00🚩🚩-మహానుభావుడు బమ్మెర పోతన!-🚩🚩<p> <span style="font-size: large;"><b><i></i></b></span></p><div class="separator" style="clear: both; text-align: center;"><span style="font-size: large;"><b><i><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjXuTTCZ8nB9sfdKwu5blbeID1PBOD5Exjq1T5n05T31u3vkLrUycUKwezvELGvzTp9DoGbR-ZFe3lFN75ySAaY1i1KNrMgsms5bWeLNtjEYAE2D5nPaOeNVRIK3AjoyifKwUq76L0HN9LM/s405/potana.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="403" data-original-width="405" height="636" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjXuTTCZ8nB9sfdKwu5blbeID1PBOD5Exjq1T5n05T31u3vkLrUycUKwezvELGvzTp9DoGbR-ZFe3lFN75ySAaY1i1KNrMgsms5bWeLNtjEYAE2D5nPaOeNVRIK3AjoyifKwUq76L0HN9LM/w640-h636/potana.jpg" width="640" /></a></i></b></span></div><span style="font-size: large;"><b><i><br />🚩🚩-మహానుభావుడు బమ్మెర పోతన!-🚩🚩</i></b></span><p></p><p><span style="font-size: large;"><b><i>#బమ్మెరపోతన సహజ పాండిత్యుడు, సద్గుణ సంపన్నుడు, వినయ విద్యా వివేక వినిర్మల త్రివేణీ సంగమ స్నాతుడు, శ్రీ రామ పాద సేవార్చనా దురంధరుడు ఐన బమ్మెర పోతన మహానుభావుడు సంస్కృతం లోని భాగవతమును తెలుగులోకి అనువదించినవాడు మాత్రమే కాదు..శ్రీ కృష్ణ లీలామృత భాగవతంను సంస్కృతం తరవాత దేశ భాషలలోనికి అనువదించడం ఈయనతోనే ప్రారంభం ఐంది. సంస్కృత భాగవతం తొలిగా తెలుగులోకి అనువదింప బడిన తర్వాతనే ఇతరదేశ భాషలలోకి అనువదించడం మహానుభావులు ఎందరో మొదలు బెట్టారు.</i></b></span></p><p><span style="font-size: large;"><b><i>భక్తి వేదాంత తత్త్వంలో ప్రసిద్ధుడు అగ్రగణ్యుడు అని భావింప బడేకృష్ణ చైతన్యులు వంగ దేశంలో క్రీ.శ.1485 నుండి 1533 వరకూ జీవించినవాడు.ఆసేతు హిమాచలం పర్యటించిన కృష్ణ చైతన్యుడు పోతన వారి భాగవతంచేత ముగ్దుడైనాడు. చైతన్యుడు తెలుగు దేశానికి వచ్చినట్లుగా గుర్తుగా మంగళగిరి లో ఆయన పాదుకలు చెక్కబడి వున్నాయి. ఆతర్వాతి వాడైన మరొక మహానుభావుడు వల్లభాచార్యుల వారు తెలుగు బ్రాహ్మణుడు, ప్రత్యక్షంగా పోతన భాగవతం చేత ప్రభావితుడుఐన వాడు. చత్ర పతి శివాజీ మహారాజు గురువు, శ్రీ రామ, ఆంజనేయ సాక్షాత్కారం పొందినమహా ఉపాసకుడు, సమర్ధ రామదాసు మహారాష్ట్ర నుండి ప్రత్యేకంగా వచ్చి మరీ పోతనఆంధ్ర మహాభాగవతాన్ని విన్నాడు, పులకించి పోయాడు, ఈ విషయాలను ఆయనతన 'దాస బోధ' అనే గ్రంధం లో పేర్కొన్నాడు.</i></b></span></p><p><span style="font-size: large;"><b><i>కౌండిన్య గోత్రము, అపస్తంభ సూత్రము నకు చెందిన వాడనని, కేసన, లక్కమాంబల పుత్రుడనని, తిప్పన తమ్ముడనని పోతన గారు తన ఆంధ్ర మహా భాగవత అవతారికలో చెప్పుకున్నారు.పురాణం హయగ్రీవ శాస్త్రి గారు, వావిలికొలను సుబ్బా రావు గారు, కందుకూరి వీరేశ లింగం పంతులు గారు ప్రభ్రుతులు పోతన రాయల సీమ లోని వొంటి మిట్ట వాడని భావించినా తర్వాత తమ అభిప్రాయములను మార్చుకున్నారు. ఆ తర్వాత మరికొందరు చారిత్రక పరిశోధకులు, సాహిత్యపరిశోధకులు, ప్రసిద్ధులు ఐన కొమర్రాజు లక్ష్మణ రావు గారు, శేషాద్రి రమణ కవులు, అనుముల సుబ్రమణ్య శాస్త్రి గారు, నిడదవోలు వేంకట రావు ప్రభ్రుతులు సాహిత్య, చారిత్రక, శాసనముల ఆధారములతో గుముదూరు శాసనంలో పేర్కొన బడిన వరంగల్ సమీపంలోని బమ్మెర గ్రామమే పోతన గారి జన్మ స్థలం అని నిర్ధారించి ఈ చర్చకు ఆంధ్ర దేశంలోని పండితులందరూ ముగింపు పలికారు. అంతే కాదు పోతన గారి ఆంధ్ర మహాభాగవతం లోని మిగిలిన భాగాలను పూరించిన వెలిగందల నారయ, ఏర్చూరి సింగన, గంగనలు కూడా వరంగల్ చుట్టు ప్రక్కలి ప్రాంతములకు చెందిన వారే అని నిరూపించారు. పోతనకు ప్రౌఢ సరస్వతి అని బిరుదు పొందిన కుమారుడు, అతని కుమారులైన కేసన, మల్లన సోదరులు (వీరు దాక్షాయణీ పరిణయం అనే గ్రంధ రచన చేశారు). బమ్మెర వారి యింటి ఆడ పడుచును పెండ్లి చేసుకున్న అజ్జరపు పేరయ లింగ కవి(ఇతను ఒడ నంబి విలాసం అనే వైష్ణవ భక్త శిఖామణిగురించిన గొప్ప గ్రంధం వ్రాశాడు)..ఇలా పోతన అనంతరం కూడా ఆ భక్తి, పాండిత్య విశేషాలు ఆయన వంశీకులకు సంప్రాప్తించాయి..వీరందరూ కూడా వరంగల్ ప్రాంతం వారే కావడం గమనార్హం.</i></b></span></p><p><span style="font-size: large;"><b><i>పోతన కాలం గురించి రక రకాల పరిశోధనలు, వ్యాసాలూ వెలువరించిన ఈ వ్యాసంలో పైన పేర్కొనబడిన వారు అందరూ పోతన పదిహేనవ శతాబ్దమునకు చెందిన వాడని అంగీకరించారు. ఈ చిన్ని వ్యాసంలో పోతన ఆంధ్ర మహాభాగవత విమర్శ సాధ్యం కాదు గనుక క్లుప్తంగా చెప్పడం కోసం ఒక ఆధ్యాత్మిక, వేదాంత గ్రంధాన్ని సర్వ జనరంజకంగా, అద్భుతమైన పద గుంభనతో, లలితమైన పద విన్యాసంతో, భక్తి, పాండిత్యం, చమత్కృతి, భావుకత్వం నిండిన సంగీత మాధుర్యం పండిన కవన శైలితో తీర్చి దిద్దిన మహానుభావుడు పోతన.</i></b></span></p><p><span style="font-size: large;"><b><i>తెలుగు పద్యానికి అత్యున్నత ఉదాహరణపోతన కవిత్వం. సంస్కృతంలో ఆది శంకరుడు తెలుగులో బమ్మెర పోతనలకు మాత్రమే సాధ్యమైన శైలి ఇది. మహానుభావులైన నన్నయ, తిక్కన, ఎర్రనలు, శ్రీనాధ మహాకవి, పెద్దన, రాయలు,భట్టు మూర్తి, తెనాలి రామ కృష్ణుడు, పింగళి సూరన, చేమకూర వేంకటకవి.. ఎందరున్నారు..ఎంతని పొగడ గలము..</i></b></span></p><p><span style="font-size: large;"><b><i>ఆంధ్ర సాహిత్య సరస్వతీ పద నూపుర ధ్వనులెంత మధురిమలు? ఐనా..వచన రచనకు పోతనకు మించిన వారు ఎవరూ లేరు..నైమిశారణ్య వర్ణనం, నృసింహ ఆవిర్భావ ఘట్టం, వైకుంఠ వర్ణనం, రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణి వర్ణనం, ద్వారకా పురి వర్ణనం, ఇలా ఆంధ్ర మహా భాగవతం మొత్తం అద్భుతమైన వచన రచనా విలాసంతో నిండి వున్నది.ఇక పద్య రచనా విధానం పొగడడానికి ఉద్గ్రంథా లౌతాయి. పద్యాలతో వర్ణ చిత్రాలు, భావ చిత్రాలు, చలన చిత్రాలు,నిశ్చలన చిత్రాలు, కుడ్య చిత్రాలు, మణిమయ సువర్ణ సౌధాలు..నిర్మించిన వాడు పోతన! భీష్మ ఘట్టం మొత్తం అద్భుతమైన వర్ణ చిత్రం. దశమ స్కంధం సాంతం నిరుపమానమైన భావ చిత్రం. వామన ఘట్టం లో ఎదుగుతున్న వామనుడిని 'ట్రెంచ్' షాట్లో చూపించాడు. గజేంద్ర మోక్షణం లో వైకుంఠ పురిని జూమ్ లెన్స్ లో చూపించాడు !</i></b></span></p><p><span style="font-size: large;"><b><i>అద్భుతమైన కుడ్య చిత్రాలుగా, నిశ్చలన చిత్రాలుగా తమ ప్రణయ, దాస్య భక్తిలో నిశ్చేష్టులైన రుక్మిణి, ప్రహ్లాదుడు, నారదుడు, కుంతీ, కుచేలుడు,ఉద్ధవుడు, అర్జునుడు, గోపికలు..వీరందరి నవరస భావ ప్రకటనలతో కూడిన వర్ణ చిత్రాలుగా ఆయా ఘట్టాలను ఆవిష్కరించాడు! తెలుగు కవులలో భక్తికి గానీ,పాండిత్యానికి గానీ, వేదాంతానికి గానీ, నిజాయితీ తో కూడిన అత్మాభిమానానికి గానీ, వినయంలో గానీ,విచక్షణ లో గానీ, మృదువైన, మెత్తనైన, సంగీతమయమైన. ఆర్ద్రమైన, ఆనందాంబుధిలో ముంచెత్తే అమర భాగీరధీ ప్రవాహ సమాన పవిత్రతలో గానీ.. పోతన ను మించిన వారు లేరు, రారు</i></b></span></p>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com2tag:blogger.com,1999:blog-5836802122867912200.post-56667434119481828032020-10-18T00:31:00.004-07:002020-10-18T00:31:47.085-07:00🚩 కళాపూర్ణోదయం -8: మణిహారం.!🚩<div style="text-align: left;"> <div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjXAfiQQWOp-Y5xx3nW-nGKduBODqTxUlFS3hox4e-vkjx3h_2HfTd9k9F6zhiwlwlX4_wTyqkHq8UJb21Rij_LtTIPYRM8F80ac1HVHPWChSfyIHepWscQdaPZsERO1wYPtAESM-e4fgS8/s919/Picture3.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="690" data-original-width="919" height="490" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjXAfiQQWOp-Y5xx3nW-nGKduBODqTxUlFS3hox4e-vkjx3h_2HfTd9k9F6zhiwlwlX4_wTyqkHq8UJb21Rij_LtTIPYRM8F80ac1HVHPWChSfyIHepWscQdaPZsERO1wYPtAESM-e4fgS8/w653-h490/Picture3.jpg" width="653" /></a></div><br /></div><div><b><i><span style="font-size: large;">🚩( జరిగిన కథ :-రెండు నెలల పాప మధురలాలస ఆశ్చర్యం కొలిపేటట్టు కళాపూర్ణుడి పుట్టుక వెనక వున్న జన్మజన్మల కథల్నీ వినిపిస్తోంది. అప్పుడు అలఘువ్రతుడితో అక్కడ వున్న నలుగురు పురోహితులూ అతని కొడుకులేనని చెప్తుంది. అతను నమ్మలేకపోతాడు. బట్టతలకీ మోకాలికీ ముడిపెట్టగలిగే ఈ కతలతల్లి అదెలా సాధ్యం చేస్తుందోనని ఆశ్చర్యపడతాడు. ఇక చదవండి.)</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">🚩</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అలఘువ్రతుడి మాటలకు నవ్వుతూ, “అలా జరగటం తప్పదు” అన్నాడు కళాపూర్ణుడు. ఆ పాపని చూసి, “ఇతని పుట్టుపూర్వోత్తరాలు, ఇతనికి ప్రథమాగమాదులు ఎలా కొడుకులో మాకందరికీ వివరంగా చెప్పమ”ని అడిగాడు. “అలాగే!” అని ఆ పాప ఇలా చెప్పింది</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">పాండ్యదేశంలో సోమశర్మ అనే అతను వుండేవాడు. అతని కొడుకు యజ్ఞశర్మ. ఎంత కష్టపడ్డా అతనికి వేదవిద్యలు ఒక్కముక్క ఒంటపట్టలేదని అతను బాధపడుతుంటే, అది మరిపించటానికి అతని తండ్రి నలుగురు గుణవతుల్ని తెచ్చి అతనికి పెళ్ళిచేశాడు. కోడళ్ళందరికీ ఎన్నో ఆభరణాలు, చీరలు, కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చాడు. చివరి దశలో అతను కొడుకుని పిలిచి, కోడళ్ళకు వినపడేట్టు చెప్పాడు “మన వంశాచారం అన్నదానం. ఎలాటి పరిస్థితుల్లోనైనా దాన్ని ఆపకుండా నడుపు. దాని వల్ల నీకు నాలుగు వేదాల వంటి కొడుకులు కలుగుతారు. నా మాట తప్పదు” అని. “అలాగే”నని మాట యిచ్చాడు కొడుకు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఆ మాటమీద నిలబడి అతను క్రమం తప్పకుండా తన దగ్గరున్న సొమ్మంతా ఖర్చు పెట్టి అన్నదానాలు చేశాడు. చివరికి తన భార్యల సొమ్ములన్నీ అమ్మాల్సొచ్చింది. ఐతే అందుకు వాళ్ళేమీ బాధపడక పోవటమే కాకుండా “ముందుగా నావి తీసుకోండి, నావి తీసుకోండి” అని అందరూ వాళ్ళ ఆభరణాలన్నీ అతనికిచ్చారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఆ యజ్ఞశర్మే ఈ అలఘువ్రతుడు. ఇతని గొప్ప అన్నదాన వ్రతం మూలాన ఈ పేరు వచ్చింది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">కొంతకాలానికి అతనికి దగ్గర వున్నదంతా ఐపోయింది. ఎలాగైనా తన వ్రతం జరపాలి గనక అందుకు మిగిలిన ఒకటే మార్గం తన భార్యల్ని అమ్మటం అని నిశ్చయించుకున్నాడు. ఐతే ఆ విషయం వాళ్ళకి చెప్పటానికి అతని మనసు రాలేదు. ఒక ఉపాయం ఆలోచించి, “తామ్రపర్ణి రేవులోకి వోడలు వచ్చాయి. నేను ఒకతనితో కలిసి ఓడవ్యాపారం చేసి అన్నదానాలకి డబ్బు సంపాయించుకు వస్తాను” అన్నాడు వాళ్ళతో. వాళ్ళు, “మీరు లేకుండా మేం వుండలేము, మమ్మల్నీ మీతో తీసుకెళ్ళండి” అని ప్రాధేయపడితే కష్టం మీద ఒప్పుకుని (అలా నటించి) వాళ్ళందర్నీ ఒక ఓడ మీద ఎక్కించాడు. తను చివర్లో ఎక్కుతానని చెప్పి కొంచెం దూరంలో దాక్కున్నాడు. ఐతే ఆ ఓడ కదిలి కొంచెం దూరం వెళ్ళేసరికి అతనికి ఎక్కడ లేని దుఃఖం కలిగింది. బోరున ఏడ్చాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అతని భార్యలు చూశారది. ఆ నావికుడెవడో తమ భర్తని మోసం చేశాడనుకుని నలుగురూ ఒక్కసారిగా సముద్రంలోకి దూకేశారు!</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఎంత వెదికినా వాళ్ళు దొరకలేదు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">“నీ ఏడుపు మూలానే ఇంత జరిగింద”ని అతని కిచ్చిన డబ్బు కూడ లాగేసుకున్నారు నావికులు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">కనుక, తనకు నలుగురు కొడుకులున్నారనే విషయం ఇతను నమ్మలేక పోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే ఇతనికి తెలియని కథ చాలా వుంది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఇతని భార్యలు సముద్రంలోకి దూకిన సమయంలో ఓ పెద్ద చేప నీళ్ళను లోనికి పీలుస్తున్నది. ఆ నీటితో పాటు వాళ్ళూ దాని నోట్లోకి వెళ్ళారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఆ తర్వాత అది కొంతదూరం వెళ్ళి ఆ నీటిని పైకి విసిరింది. దాంతో పాటు వాళ్ళూ పైకి ఎగిరారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అలా ఎంతో ఎత్తు ఎగిరి వాళ్ళు అప్పుడు అక్కడ వెళ్తున్న ఓ విమానంలో పడ్డారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">తెలివొచ్చి కళ్ళు తెరిచేసరికి ఒక దేవతా దంపతుల్ని చూశారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">వాళ్ళు ఆ నలుగురినీ ఆదరించారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఐతే వాళ్ళ లావణ్యం చూసిన దేవకాంతకి తన భర్త వాళ్ళ మీద మనసు పడతాడేమో ననే అనుమానం భూతమై పట్టుకుంది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">వాళ్లనెలాగైనా వదిలించుకోవటం మంచిదని ఓ ఉపాయం పన్నింది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">పాచికల ఆటలో తన భర్తని ఓడించి, అందుకు పందెంగా ఇద్దరూ మధురసం తాగి శృంగారక్రీడలు చెయ్యాలని చెప్పి, మధువు తాగేప్పుడు ఆ పాత్రలో తన రూపాన్నే చూసుకుని, “నేను కాక ఇంకెవర్నో తెచ్చిపెట్టుకున్నావా?” అంటూ అతన్తో పోట్లాటకి దిగింది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అప్పుడు వాళ్ళ విమానం గోదావరీ తీరంలో వెళ్తోంది. అక్కడ ధర్మపురి అనే వూళ్ళో ముఖ్యవారకాంత ఇల్లు ఆకాశాన్ని తాకుతోంటే, ఈ నాటకంతో ఆ నలుగుర్నీ ఆ మేడ పైన దింపించింది. ఐతే వెళ్ళేముందు ఆమె భర్త, “పాపం వాళ్ళు తినటం, ఉండటం ఎలాగా?” అని విచారిస్తోంటే, “ఏం పర్లేదు, ఆ ఇంటి నిండా బోలెడు వస్తువు లున్నాయి. ఇకనుంచి ఆ వస్తువుల్ని వీళ్ళు గాక మరెవరు వాడబోయినా వాళ్ళకి మూడిందే!” అన్నది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఆమె తన భర్త మీద అనుమానంతో అన్న ఆ మాట వాళ్ళకి వరంగా పరిణమించింది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">విమానంలో వెళ్ళిపోయారు ఆ దేవతలు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఆ యింటి యజమానురాలు ఇదంతా చూసి “వీరెవరో దేవతల్లా వున్నారు, వీళ్ళు ఇక్కడ వుండటమే నా అదృష్టం” అని వాళ్ళకి కనపడకుండా అన్ని సదుపాయాలూ వాళ్ళకి ఏర్పాటుచేసింది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అప్పుడే వాళ్ళకు గర్భసూచనలు కనిపించాయి. కొన్నాళ్లకి నలుగురికీ నలుగురు కొడుకులు పుట్టారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అనుకోకుండా అటు వచ్చిన ఒక యోగి ఆ బిడ్డల జాతకర్మలు నిర్వర్తించాడు. అతనే తన జ్ఞానదృష్టితో వాళ్ళు వేదరూపాలని గుర్తించి అదే విధంగా వాళ్ళకి నామకరణం కూడ చేశాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">వాళ్ళు స్వయంగా అన్ని విద్యలూ తెలిసిన వాళ్ళైనా శాస్త్రోక్తంగా ఆ యోగి దగ్గర కూడ కొంత విద్యాభ్యాసం చేశారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">కొన్నాళ్ళకి వాళ్ళ తల్లులు ఇలా ఊరుకుంటే తమ భర్త విషయం ఎప్పటికీ తెలియదని, వెళ్ళి అతనికోసం వెదకటం మంచిదని, ఆ విషయం కొడుకుల్తో చెప్పారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">వాళ్ళు “మేము ఓ రాజు దగ్గర ప్రాపకం సంపాయించి వస్తాం. అప్పుడు ఆయన్ను వెదకటం తేలికౌతుంది” అని ఊళ్ళోకి వెళ్ళి విచారిస్తే, అక్కడి రాజు మదాశయుడని, అతను విద్యలు తెలిసినవాడనీ, ఐతే అతని పురోహితుని అనుమతి లేకుండా ఎవరికీ ప్రవేశం దొరకదనీ, ప్రతిభ వున్నవాళ్లు ఎవరికీ పురోహితుడి అనుమతి దొరకదనీ విన్నారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">రాజుకు మామిడిపండ్ల బుట్టలు మోసుకెళ్ళే వాళ్ళతో కలిసి వాళ్ళ లాటి వేషాల్లో మోసుకెళ్ళి రాజు ముందర పెట్టారు. వాళ్ళ అమాయక చేష్టలు చూసి రాజు నవ్వుతూ, “అంతా బాగే కదా, దాపరికం లేకుండా చెప్పండి” అంటే వాళ్ళు తెలుగులో ఐతే ఒక అర్థమూ, సంస్కృతంలో ఐతే మరో అర్థమూ వచ్చే విధంగా మాట్లాడారు. మదాశయుడు వెంటనే వాళ్ళని నివురుగప్పిన నిప్పుల్లాటి వాళ్ళని గ్రహించి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆదరించాడు. వాళ్ళని తనకు పురోహితులుగా వుండమని ప్రార్థించాడు. అలాగే నని ఒప్పుకుని వాళ్ళు ఆ తరవాత తమ తండ్రిని ఎంతగానో వెదికించారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఈలోగా అలఘువ్రతుడు తను చేసిన పనికి విచారిస్తూ దేశాంతరాలు తిరుగుతూ మృగేంద్రవాహన ఆలయం గురించి విని అక్కడికి వెళ్ళి భువనేశ్వరీ మంత్ర జపం రెండేళ్ళ పాటు చేసి ఆ దేవి మహిమ వల్ల ఇక్కడికి వచ్చి పడ్డాడు” అని ముగించిందా పాప.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఆశ్చర్యంతో ఈ కథంతా విన్న ఆ పురోహితులు పొంగిపోతూ తమ తండ్రిని కలుసుకుని నమస్కరించారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">కళాపూర్ణుడు కూడ వాళ్ళని సన్మానించాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అప్పుడు అతని మంత్రుల్లో సత్వదాత్ముడనే వాడు ఆ బాలికతో, “అమ్మా, నేను వెర్రిగా కాసారపురంలో తిరుగుతుంటే జనం నాకు సత్వదాత్ముడని పేరు పెట్టారు. అంతకుముందు నా చరిత్ర ఏమిటో నాకేమీ తెలియదు. ఇన్ని తెలిసిన దానివి నా సంగతి కూడ చెప్పు” అని అడిగాడు. ఐతే ఎందువల్లనో ఆ పాప కేవలం పసిపాప లాగా కళ్ళు నులుముకుని ఏడుపు సాగించిందే తప్ప ఎంత బతిమాలినా ఇంకో ముక్క మాట్లాడలేదు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">కళాపూర్ణుడు మదాశయుణ్ణీ రూపానుభూతినీ చూసి, “విన్నారు కదా, ఇకనుంచి మీరు నాకు అత్తమామలు. మీరు కొలువుకు రానక్కరలేదు. ఇంటికి వెళ్ళి ఈ మధురలాలసని పెంచండి” అని పంపాడు. అలాగే అలఘువ్రతుణ్ణి కూడ అతని భార్యల దగ్గరకు పంపించాడు. అతని అన్నదాన వ్రతం సాగటానికి అనేక గ్రామాలిచ్చాడతనికి.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">కాలం గడుస్తోంది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">మధురలాలస పెద్దదయింది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">చెలుల ద్వారా తన చిన్నప్పటి వృత్తాంతం విని కళాపూర్ణుడి మీద మనసు పెంచుకుంది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఐతే కళాపూర్ణుడు అభినవకౌముదితో ఆనందంగా వుంటూ, రాజ్యవ్యవహారాల్లో మునిగిపోయి మధురలాలస విషయం పూర్తిగా మరిచిపోయాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">వసంతం వచ్చింది. చెలికత్తెల్తో మధురలాలస వనవిహారానికి వెళ్ళింది. డేగవేట మీద కళాపూర్ణుడు కూడ వాళ్ళున్న దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. భారంగా ఒకరికొకరు దూరమయ్యారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">కళాపూర్ణుడు ఒక వృద్ధవిప్రుణ్ణి పిలిచి తను వనంలో చూసిన సుందరి గురించి చెప్పి ఆమె ఎవరో కనుక్కోమన్నాడు. అతను కొంతసేపు ఆ రాజుతో నర్మగర్భంగా మాట్లాడి చివరికి మెల్లగా బయటపెట్టాడు, ఆమె ఎవరో కాదు మధురలాలసే నని. ఆమె చిన్నప్పుడే కళాపూర్ణుడు ఆమె తల్లిదండ్రుల్ని తనకు అత్తమామలుగా చెప్పుకున్న విషయం గుర్తు చేశాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఇంకేముంది, ఏర్పాట్లు చకచక జరిగిపోయాయి వాళ్ళ వివాహానికి!</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అభినవకౌముదినీ, మధురలాలసనీ సమానంగా చూసుకుంటూ ఇద్దరితోనూ ఆనందంగా గడుపుతున్నాడు కళాపూర్ణుడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఒక రోజు</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అభినవకౌముది వీణ వాయిస్తూ హాయిగా గానం చేస్తోంది. కళాపూర్ణుడు తను కూడ వింటుందని మధురలాలసని అక్కడికి రప్పించి ఆమెను కూడ పాడి వినిపించమన్నాడు. ఆమె “ఈ వీణ ముందు నా స్వరం సరిపోదేమో!” అని అనుమానిస్తే, “నువ్వు మామూలుగా పాడు, ఆ వీణని పట్టించుకోకుండా” అన్నాడతను. అప్పుడామె తన గొంతెత్తి పాడేసరికి ఆ స్వరపటిమకి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఆమె గాత్రం ముందు ఆ వీణ చాలదని గ్రహించాడతను. అంతకన్నా మంచి వీణ ఎక్కడన్నా వుందా అని అభినవకౌముదిని అడిగాడు. ఆమె “నేను తనకు ప్రియశిష్యురాలినని తుంబురుడు దీన్ని నాకు ఇచ్చాడు. అప్పుడతను ఇంతకన్నా మంచి వీణ ఇంకెక్కడా లేదని చెప్పాడు” అని కొంచెం ఆలోచించి, “ఐతే, ఈ మధ్య నారదుడు తుంబురుణ్ణి గానంలో ఓడించాడని విన్నాను” అన్నది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఆ మాటతో హఠాత్తుగా అతనికి మధురలాలస చిన్నప్పుడు చెప్పిన తన పూర్వజన్మ కథ గుర్తొచ్చింది. దాంతో పాటే స్వయంగా అతనికి కూడా పూర్వజన్మ విషయాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు మణికంధరుడిగా తన వీణను మృగేంద్రవాహనాలయంలో దాచటం గుర్తొచ్చింది. అదే ఆమె కంఠానికి తగిన వీణ అని గ్రహించి, “నీ కంఠానికి సరిపడే వీణ ఒకచోట వుంది. దాన్ని నీకోసం తెప్పిస్తాను” అన్నాడు మధురలాలసతో.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అభినవకౌముది చెలికత్తెలు ఆమెను పక్కకు తీసుకెళ్ళి తన ఎదుట తన భర్త తన సవతిని అంతగా గౌరవించటం ఆమెకెంత అవమానమో బాగా నూరిపోశారు. దాంతో ఆమె మొహం ముడుచుకుని వుంటే కళాపూర్ణుడు ఆ వీణని తెచ్చి ఆమెకే ఇచ్చి ఆమెని గానంలో అందరి కంటే మిన్నగా చేస్తానని వాగ్దానం చేశాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఐతే ఈ వార్త వెంటనే మధురలాలసకి చేరింది. తన కోసం తెస్తానన్న వీణని ఇప్పుడు అభినవకౌముదికి ఇవ్వబోతున్నాడని ఆమె కోపగించుకుని అలిగింది. ఆమె అలక తీర్చటానికి అన్ని దిక్కుల రాజుల మహారాణుల మౌళిమణుల్తో ఆమెకు కాలి అందెలు చేయిస్తానని శపథం చేశాడు కళాపూర్ణుడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అలా ఆ ఇద్దరికిచ్చిన మాటలు తీర్చుకోవటానికి దిగ్విజయాలు చేసి ఆ వస్తువుల్ని సంపాదించి తెచ్చాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">వీణని అభినవకౌముదికిచ్చాడు. మధురలాలసకి పాదమంజీరాలు చేయించమని తన మంత్రిని నియమించాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అతనలా దిగ్విజయం చేసి వచ్చినందుకు ఆనందంగా రకరకాల భూషణాల్ని అలంకరించుకుని ఆ సందర్భంలో తన చిన్నప్పుడు కళాపూర్ణుడు తనకు కానుకగా ఇచ్చిన హారం విషయం చెలికత్తెలు గుర్తు చేస్తే దాన్ని బయటకు తీసి అది మరీ చిన్నదిగా వున్నందువల్ల పొడవు పెంచి వేసుకుంది మధురలాలస.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అప్పుడు సత్వదాత్ముడనే మంత్రి ఆమెకు కొత్తగా చేయించిన అందెలు తీసుకొచ్చి ఆమెకు సాష్టాంగనమస్కారం చెయ్యబోతే ఆమె అతన్ని వారిస్తూ, “వద్దు వద్దు, నువ్వు నాకు మేనమామవు” అంటూ తనే అతనికి నమస్కరించింది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అందరూ ఆశ్చర్యంగా చూశారామెను.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">కళాపూర్ణుడు నవ్వుతూ, “చూస్తే, నీకు చిన్నప్పుడు కలిగిన జననాంతర జ్ఞానం మళ్ళీ కలిగినట్టుంది. అతను అప్పుడు తనెవరో చెప్పమంటే చెప్పలేదు. ఇప్పుడు అడక్కుండానే చెప్తున్నావు. ఐతే అతను నీకు ఎలా మేనమామో కొంచెం వివరంగా చెప్పు. అలాగే, ఇంత గొప్ప జ్ఞానం ఆ వయసులోనే నీకెలా కలిగిందో అప్పుడే ఎందుకు అడగలేదా అని ఎప్పుడూ బాధపడుతుంటాను. ఆ విషయం కూడ చెబుదువు గాని” అన్నాడామెతో.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఒక విసనకర్రతో అతనికి విసురుతూ ఇలా చెప్పింది మధురలాలస</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">“ఇతను ఇదివరకు మహారాష్ట్ర దేశం ఏలే సుగ్రహుడనే రాజు. మా తల్లి రూపానుభూతి ఇతనికి అక్క. ఇతనికి పిల్ల నివ్వాలని ఎంతోమంది రాజులు పత్రికలు పంపారు. ఐతే వాళ్ళలో ఎవరితో సంబంధం చేసుకోవాలో తేల్చుకోలేక చాలా కాలం గడిపితే వాళ్ళు కోపగించి తలా ఓ నెపం పెట్టుకుని ఇతని మీదకు దండయాత్రలు చేశారు. రాజ్యం విడిచి వెళ్ళి బయటనుంచి వాళ్ళని జయిద్దామని ఇతను అడవిలోకి పారిపోయాడు. ఆ రాజులు మాత్రం “రాజు లేని రాజ్యాన్ని ఆక్రమించటంలో గొప్ప ఏమిటి?” అనుకుని ఆ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అది ఇతనికి తెలీదు గనక అడవిలోనే వుండి “ఉన్నచోటనే వుండి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలిగిన వాడు కదా నిజంగా గొప్పవాడు!” అని ఎలాగైనా ఆ శక్తిని సంపాయించాలని బృందావనానికి వెళ్ళి బాలకృష్ణుడి గురించి తపస్సు చేశాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఇతని తపస్సుకి మెచ్చి విష్ణువు బాలరూపంలో మర్రి ఆకు మీద పడుకుని ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. తనకు సర్వజ్ఞత్వం కలగాలని అడిగాడితను.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అప్పుడు విష్ణువు తన మెడలో వున్న ఒక హారాన్ని తీసి ఇతని కిస్తూ, “ఈ హారంలోని నాయకమణి ఎవరి హృదయస్థానానికైనా ఎంతసేపు తాకివుంటుందో అంతసేపు వాళ్ళకు సర్వజ్ఞత్వం వస్తుంది. ఐతే, బ్రాహ్మణులకి మనస్తాపం కలిగించిన వాళ్ల దగ్గర మాత్రం ఇది వుండదు” అని వివరించి మాయమయ్యాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఇతను ఆ హారాన్ని తీసుకుని వస్తూ దార్లో ఓ దేవాలయం దగ్గరకు వెళ్ళాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అక్కడొక అద్భుత సుందరమైన ప్రతిమ వుంది. దాన్ని చూస్తూ ఇతను కొంచెం దూరంలో కూర్చున్నాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఇంతలో అక్కడికి ఒక యోగి వచ్చాడు. ఆ ప్రతిమని చూసి అతని మనసు చెదిరింది. ఎవరూ దగ్గర్లో లేరులే అనే ధైర్యంతో దాన్ని బలంగా కౌగిలించుకున్నాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అంతలోనే ఆ దగ్గర్లో వున్న సుగ్రహుణ్ణి గమనించి, ఆ చుట్టుపక్కల వున్న ప్రతిమలన్నిట్నీ కౌగిలించుకోవటం మొదలెట్టాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఐతే సుగ్రహుడు అది చూసి నవ్వుతూ, “ఎంత నటించినా నువ్వు నన్ను మోసపుచ్చలేవు. నీ ఆంతర్యం నాకు తెలుసులే!” అని గేలిచేశాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఆ యోగికి కోపం వచ్చింది. “ఇప్పటిదాకా నీకున్న జ్ఞాపకాలన్నీ పోతాయి పో!” అని శపించాడు. ఇతను భయపడి ప్రాధేయపడితే “నా యీ రహస్యచేష్ట గురించి ఎవరైనా మాట్లాడితే అప్పుడుగాని నీకు నీ పాత జ్ఞాపకాలన్నీ తిరిగిరావు!” అని చెప్పాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అలా కలిగిన మతిమరుపు వల్ల ఒక్క క్షణం కిందటనే ఆ పక్కన తను పెట్టుకున్న హారం సంగతి మరిచిపోయాడితను.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">మతిలేని వాడిలా తిరుగుతూ గంగాసరయూ సంగమ స్థలాన్ని చేరాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అప్పుడు కాసారపురానికి రాజు లేకపోతే వాళ్ళు ఒక ఏనుగుకు పూలమాల ఇచ్చి “ఇది ఎవరి మెడలో ఈ మాల వేస్తుందో అతనే ఇకనుంచి రాజు” అని పంపారు. అది ఇతని మెడలో వేసిందా మాలని. అలా కాసారపురానికి రాజై, నీ తల్లిదండ్రుల్తో పరిచయమై ఆ తర్వాత నీకు మంత్రి అయ్యాడు. అది ఇతని కథ!</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఇక నాకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయనే విషయం గురించి సుగ్రహుడు ఆలయం దగ్గర వదిలేసిన హారాన్ని మధురలో వుండే ఒక బ్రాహ్మణుడు తీసుకెళ్ళి ఎంతో కాలం పూజించి ఆ తర్వాత ద్వారకకు వెళ్ళి దాన్ని కృష్ణుడికి కానుగ్గా ఇచ్చాడు. దాన్ని కృష్ణుడు మణికంధరుడి కవిత్వానికి మెచ్చి అతనికిచ్చాడు. అతను దాన్ని ధరించాడు కాని అతని హృదయభాగం దాకా రాలేదది!</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">తను శ్రీశైలంలో భృగుపాతానికి వెళ్తూ మణికంధరుడు దాన్ని అలఘువ్రతుడికి ఇచ్చాడు. అతను నీకిస్తే నువ్వు నాకు ఇచ్చావు. అప్పుడు నేను చిన్నదాన్ని గనక దాని నాయకమణి నా హృదయభాగానికి తాగింది. అలా నాకు సర్వజ్ఞత్వం కలిగింది. ఐతే నేను కొంచెం కదిలినప్పుడు ఆ శక్తి పోయింది.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">అలా ఇన్నాళ్ళూ మనకెవరికీ ఈ హారం ప్రభావం తెలీలేదు. ఈరోజు నేను అనుకోకుండా దాన్ని పొడవు చేసి వేసుకోవటం వల్ల మళ్ళీ అది నా హృదయస్థానాన్ని తాకి నాకీ జ్ఞానం కలిగింది” అంటూ అన్ని విషయాలు వివరించింది మధురలాలస.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">సత్వదాత్ముడికి కూడ తన పూర్వజ్ఞాపకాలన్నీ తిరిగొచ్చాయి. తన మహారాష్ట్ర రాజ్యానికి తిరిగివెళ్ళి దాన్ని మళ్ళీ పాలించాడతను.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">మధురలాలస కౌగిలిలో ఆ నాయకమణి తన హృదయాన్ని కూడ తాకేట్టు చేసి కళాపూర్ణుడు కూడ ఆ విడ్డూరాలన్నీ స్వయంగా గ్రహించాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">ఆ పూర్వజన్మ జ్ఞానంతో తను మాట ఇచ్చిన ప్రకారం అభినవకౌముదిని గానంలో ఎదురులేకుండా తీర్చిదిద్దాడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">రాజ్యవ్యవహారాల్లో తనకు కావలసిన విషయాల్ని ఆ హారం ప్రభావంతో కనుక్కుంటూ సుఖంగా రాజ్యపాలన చేసి పుత్రపౌత్రాభివృద్ధి పొందాడు కళాపూర్ణుడు.</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">..................................సమాప్తం.................................................</span></i></b></div><div><b><i><span style="font-size: large;"><br /></span></i></b></div><div><b><i><span style="font-size: large;">👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿</span>👉🏿..</i></b></div>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-34638672193573823152020-10-16T23:39:00.005-07:002020-10-16T23:39:55.362-07:00🚩 కళాపూర్ణోదయం -7: శల్యాసురుడు!🚩<div style="text-align: left;"> <b><i><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjLoW9bPStcpcv7Vv0cild46WKp9OMvT68qR-nfRLaqLpgQ_j_6K5Md024xKivPFNIzGXR3aQQM0wLhe9Edp7jmBU-Mo6OxIMv3pl7y2OZcnvQL6XVLlTmT-2h7zhXoNxipVI7jLwHfJ_kr/s960/71148959_3646732352018804_2832651899465891840_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="498" data-original-width="960" height="353" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjLoW9bPStcpcv7Vv0cild46WKp9OMvT68qR-nfRLaqLpgQ_j_6K5Md024xKivPFNIzGXR3aQQM0wLhe9Edp7jmBU-Mo6OxIMv3pl7y2OZcnvQL6XVLlTmT-2h7zhXoNxipVI7jLwHfJ_kr/w681-h353/71148959_3646732352018804_2832651899465891840_n.jpg" width="681" /></a></div><br /> 🚩 కళాపూర్ణోదయం -7: శల్యాసురుడు!🚩</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>( జరిగిన కథ – రెండు నెలల పసిపాప మధురలాలస తన పూర్వజన్మల కథల్ని చెపుతూ కళాపూర్ణుడి తల్లి మగవాడు, తండ్రి స్త్రీ అని చెప్తుంది. అందరూ ఆశ్చర్యంతో అదెలా జరిగిందో చెప్పమంటారు. ఆమె సుముఖాసత్తి మణిస్తంభులు అతని కన్నవారని, ఆ వృత్తాంతం వివరిస్తోంది. సుముఖాసత్తిని మణిస్తంభుడు కాళికాలయంలో బలి ఇచ్చి నప్పుడు ఆమె “నా మాట నిజమయ్యేట్టు చూడు” అని చివరి మాటగా అని మరణించినందువల్ల అది నిజమై ఆమె మాట వరసకి అన్న మాట “నువ్వు స్త్రీవి ఐతే నేను పురుషుడి నౌతాను” అనేది అక్షరాల జరుగుతుంది. అలా సుముఖాసత్తి మణిస్తంభుడి గాను, మణిస్తంభుడు సుముఖాసత్తి గాను రూపాంతరాలు చెందుతారు. ఇక చదవండి)</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>🚩</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“అలా మారిన సుముఖాసత్తీ మణిస్తంభులు సింహవాహనం మీద ఆకాశంలో తిరుగుతూ ఒక అద్భుతమైన నగరాన్ని చూశారు. అప్పుడు సుముఖాసత్తి (రూపంలో వున్న మణిస్తంభుడు) “ఇది ఎంతో మనోహరమైన పురం, నేనిదివరకు ఒకసారి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కొన్నాళ్ళు ఉండి వెళ్దామని అనిపిస్తున్నది” అన్నది. అని తన సింహవాహనాన్ని నేలకు దించింది. వాళ్ళిద్దరూ ఊరిబయట నడుస్తున్నారు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>సరిగ్గా అప్పడే ఆ పట్టణానికి రాజైన సత్వదాత్ముడు వాహ్యాళికి వెళ్ళి వస్తూ ఆమెను చూసి మనసు పారేసుకున్నాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>మన్మథుడి ప్రభావంతో రకరకాల వికారచేస్ఠలు చేస్తూ అతను ఆమె వంక చూస్తే,</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>ఆమె కూడ జారుతున్న పైటను సవరించుకుంటూ తలవాల్చింది.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అప్పుడతను తన గుర్రం దిగి ఆ సిద్ధుడి దగ్గరకు వెళ్ళి “మహాత్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి కెళ్తున్నారు? మీ పేరేమిటి? ఈ సుందరి మీకేమౌతుంది?” అనడిగాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>ఆ సిద్ధుడు అవసరం ఐనంతవరకు తన విషయం చెప్పి ఆమె తన భార్య అని వివరించాడతనికి.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“ఎలాగోలా ఈమె నా కళ్ళముందు ఉండేట్టు చూస్తే ఆ తర్వాత విషయం తర్వాత చూసుకోవచ్చు” అని దొంగవినయంతో అతను “మిమ్మల్ని కొన్నాళ్ళు నా ఇంట్లో ఉంచుకుని సేవలు చేసే భాగ్యం నాకు కలిగించండ”ని వేడుకున్నాడు. మణిస్తంభుడు సుముఖాసత్తి వంక చూస్తే, ఆమె “అలాగే, ఎక్కడైతే మనకేం?” అంది.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అప్పుడు వాళ్ళని కొత్తపల్లకి మీద ఎక్కించి తన ఇంటికి తీసుకెళ్ళాడు సత్వదాత్ముడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అన్ని సౌకర్యాలు సమకూర్చాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>స్వయంగా ఎన్నో సార్లు తనే వెళ్ళి వాళ్ళకి పరిచర్యలు చేసాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>తగినవాళ్ళ చేత ఆమె తనదగ్గరకు వస్తుందేమో అడిగించాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అందుకామె “ఇప్పుడు నాకు గర్భచిహ్నాలు కనిపిస్తున్నాయి. సిద్ధుడి సంతానాన్ని అతనికి ఇవ్వకుండా ఇంకొకరితో కలవను నేన”ని బదులుచెప్పి పంపింది.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అప్పుడామెకు ఒక శుభముహూర్తంలో ఈ మహారాజు కళాపూర్ణుడు జన్మించాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అలా బ్రహ్మ అమోఘవాక్కు, సరస్వతి వరమూ నిజమయ్యాయి.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>ఆ తర్వాత వాళ్ళిద్దరు తమతమ తొలిరూపాల్ని ధరించారు సుముఖాసత్తి రూపంలో వున్న మణిస్తంభుడు అలా మారుదామని చెప్తే మణిస్తంభుడి రూపంలో ఉన్న సుముఖాసత్తి అలాగేనని అలా అనడంతోనే.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>ఇప్పుడు యోగాభ్యాసం చేసుకుంటూ వాళ్ళిద్దరూ కాసారపురంలోనే ఉంటున్నారు. వాళ్ళనే అడిగి ఈ విషయం అంతా తెలుకోవచ్చు కావాలంటే!</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>ఇతను ఎప్పుడు జన్మించాడో అప్పుడే విచిత్రంగా ఇతనికి యౌవనం ప్రాప్తించింది.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>యౌవనం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే స్వభావుడనే సిద్ధుడు వచ్చి ఇతనికి ఒక మణిని, అమ్ముల్ని, వింటిని ఇచ్చాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>ఈ రెంటిలో ఏది ముందో ఏది వెనకో ఎవరికీ తెలీదు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>ఆ సిద్ధుడే ఇతనికి కళాపూర్ణుడనే నామకరణం చేశాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>ఇతని సద్యోయవ్వనాన్ని గురించి విన్న సత్వదాత్ముడు “ఇతనెవరో మహాపురుషుడు; ఇతని తల్లిని నేను కామించి పాపం చేశాను; ఏమిచ్చి ఐనా సరే దీన్ని వాళ్ళు మరిచేట్టు చెయ్యాల”నుకుని తన రాజ్యాన్ని ఇతనికి ఇచ్చి తను మంత్రిగా వుండి సేవిస్తున్నాడు.” అని చెప్పిందా బాలిక.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అప్పుడు అలఘువ్రతుడు మళ్ళీ అడిగాడామెని “ఈ స్వభావుడనే సిద్ధుడెవరు? అతను మణిని, శరచాపాల్ని కళాపూర్ణుడికి ఎందుకిచ్చాడు?” అని.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>దానికి ఆ బాలిక ఇలా అంది “ఆ స్వభావుడనే సిద్ధుడు సుముఖాసత్తికి తండ్రి. ఆమె పుట్టిన తర్వాత అతను దేశాంతరాలకు పోయి తిరుగుతూ మాహురీపురం చేరాడు. అక్కడ అన్ని యోగరహస్యాలూ తెలిసిన దత్తాత్రేయుడిని తన తపస్సుతో ప్రసన్నుడిని చేసుకున్నాడు. సకల యోగాలు తెలుసుకున్నాడు” అంటూ యోగవిద్య గురించి విస్తరంగా వివరించింది.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“ఆ తరవాత ఆ స్వభావసిద్ధుడు తన యోగసాధనకి అనుకూలమైన స్థలం కోసం చూస్తూ తిరుగుతూ తన ఊరు చేరుకుని అక్కడి శతతాళదఘ్న సరస్సులో నివాసం ఏర్పరుచుకున్నాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అంతలో తన అల్లుడైన శాలీనుడు ఆ మడుగులో దూకినప్పుడు అతన్ని కాపాడి వయస్స్తంభన మణి మొదలైన వాటిని అతనికిచ్చి పంపాడు. ఐతే పోయిన బంధాల్ని మళ్ళీ తగిలించుకోవడం ఎందుకని తమ బంధుత్వాన్ని గురించి అతనికి చెప్పలేదు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>తర్వాత కొంతకాలం గడిచాక విధివశాత్తు అతను సరస్సులో నుంచి బయటకు వచ్చి శ్రీశైలానికి వెళ్ళాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అక్కడి వింతలకు ఆశ్చర్యపడుతూ, ఆ శ్రీపర్వతాన్నెక్కి, మల్లికార్జుడికి పూజలు చేసి ఆ ప్రాంతాలలో విహరిస్తుంటే</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>భృగుపాతానికి సిద్ధమౌతోన్న మణికంధరుడు కనిపించాడతనికి.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“ఎవర్నువ్వు? ఈ సాహసానికి ఏమిటి కారణం?” అని అడిగాడతన్ని.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అప్పటివరకు జరిగిన తన కథంతా అతనికి వినిపించాడు మణికంధరుడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అందులో వినపడిన తన అల్లుడూ కూతుళ్ళ విషయాలు విని ఆశ్చర్యపడ్డాడు. తనకు వాళ్ళతో ఉన్న సంబంధం గురించి అతనికి చెప్పాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“నారదశిష్యుడివి, కృష్ణుడి మెప్పు పొందావు, గంధర్వజాతి వాడివి. ఇవి చాలు నీకు మరో గొప్ప జన్మ కలగటానికి. ఇంకా ఏంకావాలని ఈ భృగుపాతానికి సిద్ధమయ్యావు?” అని అడిగాడతన్ని.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“ధనవంతులు, శుచివర్తనులూ ఐన తల్లిదండ్రులకు జన్మించాలని నా కోరిక” అన్నాడు మణికంధరుడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“అలా ఐతే, నా కూతురూ అల్లుడు తల్లిదండ్రులు కావాలని కోరుకో. దాని వల్ల నాకు తృప్తిగా వుంటుంది. అప్పుడు నీకు నచ్చే మహోపకారం కూడ చేస్తాను.” అన్నాడా సిద్ధుడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“ఇదివరకు ఒకసారి నేను ఆత్మరక్షణ కోసం మా గురువు గారిని ఒక ఖడ్గం కావాలని అడిగితే ఆయన ఒక దివ్యఖడ్గాన్ని సృష్టించి ఇచ్చాడు. ఇస్తూ, ఇకనుంచి నీ వంశం క్షాత్రవంశం కాబోతోంది అని సెలవిచ్చాడు. దాన్ని బట్టి కూడ నువ్వు నాకు మనవడివై పుట్టటం అనుకూలమౌతుంది. రాజువై ప్రపంచాన్ని పరిపాలిస్తావు. ఇది తథ్యం” అన్నాడు సిద్ధుడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“నిజమే. వచ్చే జన్మలో నేను రాజును కావటానికి ఇంకా కారణాలున్నాయి. అంతకన్నా పవిత్రులైన వాళ్ళ ఇంట పుట్టటం కోసమని ఈ భృగుపాతానికి నిశ్చయించుకున్నాను. అయితే, ఇంకా ఒక బాధ నాకు మిగిలి వుంది. అదేమిటంటే, రాజ్యమనే మహాభూతం పట్టినవాళ్ళకు ఎవరికైనా అప్పటివరకూ లేని గుడ్డితనం, మూగతనం, చెవుడూ వస్తాయి. వేదశాస్త్రవిదుల గోష్టుల్తో వాటిని పోగొట్టుకోవచ్చుననుకుంటే భోగాల మీద ఆశ లేనందువల్ల అలాటివారు రాజుల దగ్గర చేరరు. ఈ నా బాధ నివారించటానికి మీరే ఏదైనా మార్గం ఆలోచించండి” అన్నాడు మణికంధరుడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“అలా ఐతే, నీకెప్పుడూ విజయాన్ని కొనితెచ్చే విల్లంబుల్ని సృష్టించి ఇస్తాను. అలాగే ఓ అద్భుతమైన మణిని కూడ ఇస్తాను. అది వేదశాస్త్రవిదుల్ని ఆకర్షిస్తుంది” అంటూనే తన ప్రభావంతో వాటినన్నిటినీ సృష్టించాడా సిద్ధుడు. “నువ్వు వచ్చే జన్మలో ఎప్పుడైతే జన్మిస్తావో అప్పుడే ఇవి నీకు అందించే బాధ్యత నాది” అని చెప్పాడతను.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>వీళ్ళిలా మాట్లాడుకుంటూండగా శివరాత్రి పూజలకు అక్కడికి వచ్చి వున్న మదాశయుడు, అతని భార్య రూపానుభూతి, అతని పురోహితులు ఆ పక్కనే వెళ్తూ అక్కడికి వచ్చారు. ఆ సిద్ధుని పేరడిగి తెలుసుకుని అతనికి సాష్టాంగ ప్రణామాలు చేశారు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>మదాశయుడు వినమ్రుడై, “నేను దత్తాత్రేయుడిని తలచి ఎన్నో ఆరాధనలు చేశాను. ఒకరోజు ఆయన నాకలలో కనిపించి తన భక్తుడు స్వభావసిద్ధుని వల్ల నా కోరిక తీరుతుందని చెపాడు. అప్పటినుంచి నేను మీ గురించి వెతుకుతూ తిరుగుతున్నాను. ఇప్పటికి నా పుణ్యం ఫలించింది” అన్నాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“ఇదంతా ఆ దత్తాత్రేయుడి మహిమ. నీ కోరిక ఏమిటో చెప్పు” అన్నాడా సిద్ధుడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“అందర్నీ జయించటం, మంచి సంతానాన్ని పొందటం నా కోరికలు” అన్నాడతను.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“ఓహో, అలానా! ఈ మణికంధరుడికి వచ్చే జన్మలో విజయసిద్ధి కోసం ఈ విల్లుబాణాల్ని సృష్టించాను. అందువల్ల ఇతన్ని తప్ప మిగిలిన రాజులందర్నీ నువ్వు జయిస్తావు”</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“అంతే చాలు. అప్పటికి ఈ మణికంధరుడి సంగతి చూడటానికి నేనొక్కణ్ణి చాలులే” అన్నాడతను గర్వంగా.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>దాంతో సిద్ధుడికి కోపం వచ్చింది. “ఈ ధనుర్బాణాలతో అతను నిన్ను జయించటం నిశ్చయం. అంతేకాదు, నువ్వూ నీ భార్యా కూడ ఇతనికి బానిసలై సేవలు చేస్తారు” అని శపించాడతన్ని.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>మదాశయుడి పురోహితులు సిద్ధుణ్ణి బతిమాలారు. ఐనా అతను “నా మాటకు తిరుగులేదు. ఈ మణికంధరుడు మళ్ళీ పుట్టేవరకు మీ రాజు అందర్నీ జయిస్తాడు. ఆ తర్వాత మాత్రం అతనికి సేవ చెయ్యటం తప్పదు. ఐతే ఆ రాజు దగ్గర వుండే ఒక మణిమహిమ వల్ల ఈ మదాశయుడికి సంతానప్రాప్తి కలుగుతుంది. అంతే కాదు, మీకు కూడ ఆ మణి ఆనందాన్నిస్తుంది” అని ఆ స్వభావసిద్ధుడు తన దారిన వెళ్ళాడు. మదాశయుడు కూడ సకల రాజుల్నీ జయించాడు” అని వివరించింది మధురలాలస.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“మరి సిద్ధుడి నుంచి వరాలు పొంది వెళ్ళిన మణికంధరుడు ఏం చేసాడో కూడా చెప్పు తల్లీ!” అని అడిగాడు అలఘువ్రతుడు మధురలాలసని.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“మణికంధరుడు భృగుపాతానికి అవసరమైన విధులన్నీ నిర్వర్తించాడు. కొండ మీద నుంచి కిందికి దూకటానికి సిద్ధమయ్యాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>ఐతే ఇంతలో హఠాత్తుగా అక్కడ ఉత్సవానికి వచ్చిన వాళ్ళంతా ప్రాణాలు అరచేత పట్టుకుని తలో దిక్కు పరిగెత్తసాగారు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అతను ఆశ్చర్యంతో చూస్తుండగా ఒక స్త్రీ అతని దగ్గరికి పరుగెత్తుకు వచ్చి ఓ ఖడ్గం అతని చేతిలో పెట్టింది, “నీ భృగుపాతానికి సమానమైన ఫలితం వస్తుంది, ముందు ఈ జనాన్ని రక్షించు” అని అతన్ని తొందర పెడుతూ.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>ఇంతలో భీకరంగా ఏదుముళ్ళ వాన కురిసింది! వెండిగునపాలో, వెండి కట్లతో వున్న ఇనప గునపాలో అన్నట్లున్నాయా ముళ్ళు!</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>మణికంధరుడికి ఏమీ అర్థం కాలేదు. ఆమెనే అడిగాడు “ఏమిటీ ఏదుముళ్ళ వాన? ఏం చెయ్యమని ఈ కత్తిని నాకిచ్చావు? ఇంతకూ నువ్వెవరివి?” అని.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>దానికామె “అదుగో వస్తున్నాడు రాక్షసుడు ఏదుపంది రూపంలో! వాడు ఇటురాకముందే చంపెయ్యి” అని చెప్పింది హడావుడిగా.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>మణికంధరుడికి మహోత్సాహం కలిగింది. కత్తితో విచిత్రవిన్యాసాలు చేస్తూ ముందుకు కదిలాడు. “ఇదెంత పని? ఇప్పుడే ఆ రాక్షసుణ్ణి సంహరిస్తా. నువ్వు మిగిలిన వాళ్లకి ధైర్యం చెప్పు” అంటూ తన విన్యాసాల్తో ముళ్ళని ఖండిస్తూ ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు. “ఓరి మాయావీ, నిన్నిప్పుడే యముడికి కానుక చేస్తా చూడు” అని అతనంటే, “వీడెవడో వెర్రివాడిలా వున్నాడు, తనెవరో నేనెవరో తెలుసుకోకుండా నా మీదికి వస్తున్నాడు” అని నవ్వుకున్నాడా రాక్షసుడు. ఇద్దరూ భయంకరంగా పోరాడారు. మణికంధరుడు తన కత్తితో అతని తలని ఖండించాడు, అదే సమయంలో ఆ రాక్షసుడి ముళ్ళు రక్షణ లేని అతని శరీరంలోకి దూసుకుపోగా తనూ మరణించాడు”.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అలఘువ్రతుడికి ఇంకా కుతూహలం కలిగింది “ఎవడా రాక్షసుడు? అతన్ని చంపించిన ఆ స్త్రీ ఎవరు?” అని అడిగాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“ఆ రాక్షసుడు మహిషాసురుడి మేనమామ కొడుకు శల్యాసురుడనే వాడు. దుర్గ మహిషాసురుణ్ణి చంపినందువల్ల ఎలాగైనా ఆమెకు కీడు చెయ్యాలని సంకల్పించాడు. ఐతే, అందుకు జాగ్రత్తగా పథకాలు ఆలోచించాడు. సరైన పథకం దొరికేవరకు చాలా సాధువులాగా నటిస్తూ ఒకసారి ఒక వనంలో తిరుగుతుండగా అభినవకౌముది అనే అప్సరస కనిపించిందతనికి. ఆమెను చూసి మోహించాడు. ఆమెకి తన కోరిక తెలిపాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>ఐతే అభినవకౌముది అందుకు అంగీకరించలేదు. వాడికి కోపం వచ్చి “నన్ను కాదన్న నిన్ను ఇంకెవడూ చేరకుండా చూస్తాను నేను, నా ప్రియురాలి దగ్గరకు రావటానికి ఎవడికి గుండెలుంటాయి?” అని బెదిరిస్తే, “అలా ఐతే, నిన్ను చంపిన వాడినే నేను వరిస్తాను, ఇది నా ప్రతిజ్ఞ” అని ఎదురుచెప్పింది అభినవకౌముది.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>ఎంతో కోపం వచ్చినా అణుచుకున్నాడు వాడు, “ఎప్పటికైనా మనసు మారకపోతుందా!” అని.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>ఆమె “వీడిని చంపే వీరుడు ఎవరా?” అని వెదుకుతుంటే, “నన్ను చంపదలుచుకున్న వాడు చచ్చే మార్గం ఏమిటా?” అని వాడు వెదకసాగాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అలా వాడు ఒకసారి మృగేంద్రవాహన ఆలయానికి వెళ్ళి, అక్కడ రాసి ఉన్న వాటిలో, “ఇక్కడ గండకత్తెర వేసుకునే సాహసికుడు మళ్ళీ బతకటమే కాకుండా తనని చంపబోయే వాడిని చంపుతాడు” అని చదివి అలా చేసి ఇక తనకు ఎదురులేదని గర్వంతో ఆ ఆలయాన్నే నాశనం చేశాడు వాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>అభినవకౌముది కూడ ఆ మహాశక్తి మహిమలు విని ఆ గుడి దగ్గరకే వచ్చింది. అప్పుడు అక్కడే వున్నాడు శల్యాసురుడు కూడ.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“ఇంకెక్కడికి వెళ్ళగలవు? ఇక్కడ రాసిన ప్రకారంగా చేసి నన్ను చంపదలుచుకున్న వాడిని చంపే వరం సంపాయించాను. ఇక నీ ప్రతిజ్ఞ నెరవేరటం కల్ల!” అన్నాడు వాడు. ఏం చెయ్యాలో తోచలేదామెకు. ఆ శిధిలాయలంలో వున్న దేవి దగ్గరకు పరుగెత్తింది, తనకో దారి చూపమని ప్రార్థించింది. ఆ దేవి కూడ వాడు తన ఆలయాన్ని పడగొట్టానికి కోపగిస్తూ ఆమెకు వెంటనే ప్రసన్నురాలై, “వీడి వరం జరగక తప్పదు. ఐతే, తనని చంపదలుచుకున్న వాడు చస్తాడని తప్ప తను చావడని కాదు ఆ వరం. మణికంధరుడనే గంధర్వకుమారుడు ఒకడున్నాడు. ఒక కారణం చేత శక్తివంతమైన ఒక కత్తిని ఇక్కడ వదిలి వెళ్ళాడు. దాన్ని నువ్వు తీసుకెళ్ళి అతనికిచ్చి అతని చేత ఈ రాక్షసుణ్ణి చంపించు. అప్పుడు అతను కూడ చావకతప్పదు కాని ఆ తర్వాతి జన్మలో నువ్వు అతన్ని వరించి నీ ప్రతిజ్ఞ చెల్లించుకో. ఇప్పుడతను శ్రీశైలంలో భృగుపాతానికి సిద్ధమౌతున్నాడు. త్వరగా వెళ్ళి ఈ రాక్షసుణ్ణి చంపితే అతనికి భృగుపాతఫలం వస్తుమ్దని చెప్పు” అని ఉపాయం చెప్పింది దేవి.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>పైట బిగించి, జుట్టు ముడివేసి, ఖడ్గాన్ని చేత బట్టి బయటకు వస్తున్న అభినవకౌముదిని చూసి శల్యాసురుడు భయపడ్డాడు ఆమె తనని చంపటానికి వస్తుందేమోనని! అలా ఐతే ఆమె మరణించాలి కదా!</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“వద్దు, వద్దు. నువ్వు నామీదికి యుద్ధానికి వస్తే నీ ఇష్టదేవతల మీద ఒట్టు! అలాటి తెలివి తక్కువ పని చెయ్యకు” అని కంగారుగా చెప్పాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“ఆపాటి తెలీదా నాకు? అలా చెయ్యనులే” అంటూ మంచి మాటల్తో వాడిని తన వెంట తీసుకుని శ్రీశైలానికి బయల్దేరింది అభినవకౌముది. కామాతురుడై వాడు కూడ వేరే ఆలోచన లేకుండా ఆమె వెంట వెళ్ళాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>కొంతదూరం వెళ్ళాక వాడికి అనుమానం వచ్చింది. “ఇలా ఇంక ఎంతదూరం వెళ్ళాలి? నా శక్తి నీకు తెలీదు, చూడు” అంటూ ముళ్ళు కురిపించి ఆ చుట్టుపక్కల వున్న చెట్లనీ, జంతువుల్నీ నాశనం చేశాడు. “నా మాట వినక పోయావంటే ఇలా అందరూ చస్తారు. అప్పుడా పాపం నీదే!” అని బెదిరించాడు. ఇంక ఆలస్యం మంచిది కాదని త్వరత్వరగా శ్రీశైలానికి చేరిందామె. ఆమె వెనకనే తన ముళ్ళని కురిపిస్తూ సాగాడు వాడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>శ్రీశైలానికి చేరి, అక్కడ శివరాత్రి మహోత్సవానికి వచ్చిన భక్తులకు వాడి గురించి చెప్పి, “ఇక్కడి నుంచి పారిపొండ”ని హెచ్చరించి మణికంధరుడి దగ్గరికి వెళ్ళి అతని చేత వాడిని చంపించి, ఆ మణికంధరుడు మళ్ళీ కళాపూర్ణుడిగా జన్మిస్తే అతన్ని వెదుక్కుని వచ్చి అతన్ని వరించి స్వర్గానికి వెళ్ళకుండా అతనితోనే ఉండేట్టు ఒప్పుకుని అతన్ని గాంధర్వవివాహం చేసుకుంది.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>మదాశయుడు కూడ స్వభావసిద్ధుడు చెప్పినట్లుగా రాజులందర్నీ జయించి గర్వంతో కాసారపురం మీదికి దండెత్తి వచ్చి ఈ రాజు చేతిలో ఓడిపోయి అప్పట్నుంచి అతనికి సేవకుడిగా వుంటున్నాడు తన భార్యతో సహా. వాళ్ళకు ఈ మణి దర్శనం వల్ల నేను పుట్టాను. తర్వాత వాళ్ళు సరస్వతీబ్రహ్మల కథలో చెప్పిన విధంగా (ఒక పురోహితుడు మణిని గట్టిగా నొక్కిన కారణాన) ఈ క్రముకకంఠోత్తరపురం నుంచి వెళ్ళి కొంతకాలం అంగదేశంలోనే ఉండి ఆ ప్రయాణం వల్ల నేను చిక్కిపోతే మళ్ళీ తిరిగివచ్చి నన్నిక్కడికి తీసుకువచ్చారు. ఈ మణిదర్శనం వల్ల నేను ఆరోగ్యవంతురాలి నయ్యాను. ఇంతకుముందే నా తల్లిదండ్రులు ఈ విచిత్రం కళాపూర్ణుడికి వివరించారు. పురోహితులు నలుగురూ కూడ ఈ మణి మహిమ వల్ల తిరిగి ఇక్కడికే వచ్చారు, అదిదో వాళ్ళే ఆ నలుగురు!” అని చూపించింది మధురలాలస.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“ఓ వింత బాలికా! మరి ఆ పురోహితులెవరు? వాళ్ళ కథ ఏమిటి?” అని అడిగాడు అలఘువ్రతుడు.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>“వాళ్ళ కథ చెప్పేదేముంది? వాళ్ళు నలుగురూ నీ కొడుకులే!” అంది ఆ బాలిక నవ్వుతూ.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>దానికి మహాశ్చర్యపోయాడతను. “అదెలా సాధ్యం? నా భార్యల్ని యౌవనంలోనే పొగొట్టుకుని అదీ నా కళ్ళ ముందే సముద్రంలో పడి మునిగిపోతుంటే చూసి అప్పట్నుంచి ఇంకెవరితోనూ సంబంధం పెట్టుకోని నాకు కొడుకులేమిటి? ఈ వింతకథల తల్లి ఏ విధంగా బట్టతలలకి మోకాళ్ళు ముడి పెడుతుందో గాని ఈ మాట మాత్రం నేను నమ్మలేను” అన్నాడతను రాజుతో.</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>(ఇంకా ఉంది)</i></b></div><div><b><i><br /></i></b></div><div><b><i>👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿</i></b></div>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-46749789825458283942020-10-16T00:42:00.003-07:002020-10-16T00:42:28.395-07:00 🚩🚩 🚩 కళాపూర్ణోదయం -6: బ్రహ్మలోకం!🚩🚩<p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjV8O4LHV0hejFVHnjwDnqIjAPpAga7M68rEDL-RLQ3o1SlXWueqhE19IIl34mmOdqGwu7tXUvNj1cXB2KewluiDG1E-NTKBI31qa2YcaMB2zP8OHfig5EXS2F80eyYTP8NEWzzLkJmGO5A/s480/dpa-maa-26948.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="332" data-original-width="480" height="492" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjV8O4LHV0hejFVHnjwDnqIjAPpAga7M68rEDL-RLQ3o1SlXWueqhE19IIl34mmOdqGwu7tXUvNj1cXB2KewluiDG1E-NTKBI31qa2YcaMB2zP8OHfig5EXS2F80eyYTP8NEWzzLkJmGO5A/w712-h492/dpa-maa-26948.jpg" width="712" /></a></div><br /> <span style="font-size: large;">🚩🚩 🚩 కళాపూర్ణోదయం -6: బ్రహ్మలోకం!🚩🚩</span><p></p><p><span style="font-size: large;">*</span></p><p><span style="font-size: large;">( జరిగిన కథ – సుముఖాసత్తి సుగాత్రి అనీ మణిస్థంభుడే శాలీనుడనీ తేలిపోతుంది. అలఘువ్రతుడనే వాడు</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">కళాపూర్ణుడి కథ తెలులుకోవాలనే కోరికతో భువనేశ్వరీదేవి</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">జపం చేస్తాడు. మణికంధరుడు కలభాషిణిని దేవికి బలిస్తాడు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఆమె బతికి ద్వారకలో తనవాళ్ళతో కలుస్తుంది. మణికంధరుడు భృగుపాతానికి శ్రీశైలం వెళ్తాడు – తన దగ్గరున్న రత్నమాలికని అలఘువ్రతుడికిచ్చి. రెండేళ్ళ తర్వాత అలఘువ్రతుడు ఎగిరిపోయి</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఓ రాజసభలో పడి తన దగ్గరున్న రత్నమాలికని ఆ రాజుకి కానుకగా ఇస్తాడు. దాన్ని అక్కడే తొట్టిలో ఉన్న రెండు నెలల బాలిక మెళ్ళో వేస్తారు. హఠాత్తుగా ఆ బాలికకు పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. తను క్రితం జన్మలో కలభాషిణి నంటూ అంతకు ఆ జన్మకన్నా ఇంకా ముందటి జన్మలో జరిగిన విశేషాల గురించి చెప్పటం మొదలు పెడుతుంది. ఇక చదవండి.)</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">🚩</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“#సరస్వతీదేవి మందిరంలో నేను ఉండేటప్పుడు ఒక రోజు భవనం బయట ఒక సరస్సు! దాన్లో హంసల బొమ్మలు! మధ్యలో ఒక గొప్ప మాణిక్య స్తంభం! పక్కన బంగారపు సోపానాలు! ఆ సరస్సు పక్కనే లేత కల్ప వృక్షాల నీడలో పూలపానుపు మీద బ్రహ్మ! ఆయన పాదాలు తన తొడల మీద పెట్టుకుని ఒత్తుతూ శారద!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">హఠాత్తుగా ఆమెని ముద్దాడాలన్న కోరిక్కలిగింది బ్రహ్మకి! ఆవేశంగా ఆమె ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు! “బాగుంది మీ వరస. ఇలా నాలుగు ముఖాలతో ముద్దు పెట్టుకోవాలనుకుంటే ఒకే ముఖం ఉన్న నాకెలా కుదుర్తుంది? ఇంక ఆపండి!” అంది మెడ బిగిస్తూ, ముఖం ఎడంగా పెట్టి, పెదాలకి చేతిని అడ్డంగా ఉంచి! ఆ భంగిమలో ఆమెకి ఒక పక్క మొలక నవ్వు, మరో పక్క కోపం! ఒక పక్క తళుకు చూపులు, మరో పక్క ముడిపడ్డ కనుబొమలు!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అలా ఆమెని చూసేసరికి బ్రహ్మకి ఇంకా ఉద్రేకం కలిగి ఆమె ముఖం అందుకుని అడ్డున్న చేతిని తీసేసి చిన్న గాటు పడేట్టు కొరికాడామె పెదవిని! ఆ పని ఆవిడక్కూడా ఆనందం కలిగించటంతో ఒక మధురమైన శబ్దం బయటికొచ్చిందామె గొంతులోంచి! ఐతే తనకీ ఆనందం కలిగిందని బయటపడ్డం ఆమెకి ఇష్టం లేదు! అందుకని అలక నటిస్తూ రెండో వైపుకి తిరిగింది. కాని ఆమె మనసులోని విషయం ఆమెలో కనపడ్డ కళాశాస్త్ర లక్షణాల వల్ల అక్కడే ఉన్న నాకు తెలిసిపోయింది! అప్పుడేం చెయ్యాలో తోచలేదు బ్రహ్మకి! పక్కనే పంజరంలో ఉన్న నన్ను చూసి, “చిలకా! ఉబుసుపోటానికి ఓ కథేదన్నా చెప్పరాదూ?” అనడిగాడు. దానికి నేను, “మీకు కథలు చెప్పే పాటి దాన్నా నేను? మీరే చెప్పండి నేను వింటా” అన్నాను. సరేనని బ్రహ్మ ఇలా కథ మొదలెట్టాడు</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“అనగనగా కాసారపురం అనే పట్టణంలో కళాపూర్ణుడనే రాజు. అతనికి గొప్ప సంపదలున్నాయి. అతను తన కళల్తో లోకంలో ఉన్న రాజులందర్నీ జయించాడు. అతను పుట్టగానే స్వభావుడనే సిద్ధుడొకడు ఒక కొత్త మణిని, గొప్ప విల్లుని, మెరిసే బాణాల్ని అతనికిచ్చాడు. ఆ మణి అద్భుతమైన ఎరుపు రంగుతో ప్రకాశిస్తోంది! ఆ బాణాలు ఎప్పటికీ తరిగిపోయేవి కావు! ఆ విల్లు అతని విజయాలన్నిటికీ కారణం! వాటిని అతను ఎప్పుడూ ధరించే ఉంటాడు! తర్వాత మదాశయుడనే రాజొకడు రూపానుభూతి అనే భార్యతో, ధీరభావుడనే మంత్రితో వచ్చి ఆ చుట్టుపక్కల తారాడుతుంటే కళాపూర్ణుడు తన విల్లెక్కుపెట్టి ధీరభావుణ్ణి దూరంగా తరిమేశాడు! మదాశయుడు శరణు కోరటంతో అతన్నీ అతని భార్యనీ తనకి సేవకుల్ని చేసుకున్నాడు!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అంతవరకూ అలక నటించిన సరస్వతికి అదంతా విని నవ్వొచ్చింది! “కథ బాగానే ఉంది. మరి ఆ కళాపూర్ణుడు ఏమయ్యాడో అతని తల్లిదండ్రులెవరో కూడా కనుక్కోవే!” అంది నాతో. “ఏముందీ! అప్పుడతన్ని అభినవకౌముది అనే సుందరి వచ్చి వరించింది. అతని తండ్రి సుముఖాసత్తి, తల్లి మణిస్తంభుడూ!” అనే సరికి ఫక్కున నవ్వి అతన్ని కౌగిలించి, “ఇంతలోనే ఇన్ని తబ్బిబ్బులా స్వామీ! ఆ రాజు తల్లి మగవాడూ తండ్రి ఆడదీనా! భలే ఉందే! ఆ తర్వాత ఏమైంది?” అంది అతని వీపు చరుస్తూ!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">దాంతో బ్రహ్మ ఇంకా పరవశుడయ్యాడు. ఆమెని కౌగిలించుకుని తన నాలుగు ముఖాల్తో చుంబించాడు. ఐతే వాటిలో ఒకటి ఆమెకి కొంచెం గట్టిగా నాటింది! “ఆపండి చాలు!” అని కోపం చూపిస్తూ అతని నాలుగు ముఖాల్ని తన రెండు చేతుల్తోనూ వెనక్కి నెట్టి పట్టుకుంది సరస్వతి! ఆ భంగిమలో కొంత బయటికి కనిపిస్తున్న ఆమె పాలిండ్లనీ వాటి కిందగా ఉన్న ఆమె సన్నటి నడుమునీ కొంత సేపు అలాగే చూశాడు బ్రహ్మ! మళ్ళీ ఒకసారి ముద్దాడాడు! “ఇవన్నీ బాగానే ఉన్నాయి గాని ఆ రాజేమయ్యాడో చెప్పండి!” అంది శారద.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“అతనికేం! సత్వదాత్ముడనే మంత్రి అతన్ని అంగదేశంలో క్రముకకంఠోత్తర పురం అనే గొప్ప పట్టణానికి రాజుని చేశాడు. దానికి మదాశయుడు బంగారు కోట పెట్టించాడు. అప్పటికీ వెళ్ళిపోకుండా మదాశయుడు, అతని భార్య రూపానుభూతీ అతన్నే కొలుస్తూ అతని దగ్గరున్న మణి ప్రభావం వల్ల మధురలాలస అనే కూతుర్ని కన్నారు. అప్పుడా మణి గొప్పతనానికి ఆశ్చర్యపడుతూ మదాశయుడి పురోహితులు నలుగురు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ ఆగములనే వాళ్ళు వచ్చి ఆ మణిని తాకుతూ ఆనందించారు. వాళ్ళందరూ అలా తనకి లొంగి వున్నందువల్ల కళాప్రపూర్ణుడు కూడా ఆనందించాడు. ఐతే ఇంతలో ఆ నలుగుర్లో ఒక తుంటరి ఆ మణిని గట్టిగా నొక్కి పట్టటంతో కళాపూర్ణుడికి కోపం వచ్చేసింది! వాళ్ళ నలుగుర్నీ వెంటనే అక్కణ్ణుంచి పారదోలాడు! అంతటితో ఆగక మదాశయుడు పెట్టించిన బంగారు కోటని కూడా బద్దలు కొట్టించాడు!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">మదాశయుడు “ఇక్కడిక లాభం లేదు. ఈ దేశంలోనే మరో పట్టణానికి వెళ్దాం” అని భార్యా బిడ్డల్తో ఆ క్రముక కంఠోత్తర పురం విడిచి వెళ్తుండగా ఎదురుగా రెండు అద్భుతమైన పూర్ణ కలశాలు కన్పించాయతనికి! వాటిని చూసి ఆనందిస్తూ ఆ దగ్గర్లోనే మధ్య దేశంలో కొన్నాళ్ళ పాటు ఉన్నారు వాళ్ళు! కాని ఆ ప్రయాణ బడలిక వల్ల మధురలాలస నీరసపడిపోయింది! మరి ఆ పాప పరిస్థితి వల్లనో ఏమో మదాశయుడు సకుటుంబంగా మళ్ళీ క్రముకకంఠోత్తర పురానికి తిరిగొచ్చాడు! అలా తిరిగొచ్చాక కళాపూర్ణుడినీ, అతని దగ్గరి మణినీ చూట్టం తోనే ఆ పాప ఆరోగ్యవంతురాలైంది! ఆ విచిత్రం చూసిన మదాశయుడు కళాపూర్ణుడిని ఎంతగానో పొగుడ్తూ అక్కడే ఉండిపోయాడు. వాళ్ళ నలుగురు పురోహితులు కూడ వినయంగా తిరిగొచ్చి బుద్ధిగా అతన్ని సేవిస్తున్నారు. మధురలాలస క్రమక్రమంగా పెరిగి పెద్దదై ఆ కళాపూర్ణుడితో కనీ వినీ ఎరగని సుఖాలనుభవించింది! ఇదీ కళాపూర్ణుడి కథ!” అని ముగించాడు బ్రహ్మ ఉత్సాహంగా!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అదంతా విని మనసులో ప్రేమ పొంగుతున్నా పైకి మాత్రం కోపం నటిస్తూ “చాల్చాల్లే. మీరు కథలు కట్టటానికి నేనే దొరికానా!” అన్నది సరస్వతి కనుబొమలు ముడుస్తూ. దానికతను నవ్వుతూ, “అదేమిటి? ఈ కథలో నీ విషయం ఏముంది?” అన్నాడు అమాయకంగా. “సరేలెండి, మీ మాటలన్నిటికీ మూలం నేనిచ్చిన విద్యలేనని మరిచిపోకండి! మీరు చెప్పిన కథంతా ఇప్పుడిక్కడ మనిద్దరి మధ్యా జరిగిన సంఘటనలకి కథారూపమే నని నాకు తెలీదనా మీ ఉద్దేశ్యం? కావాలంటే చెప్తా వినండి” అంటూ అతను చెప్పిన కథకు తన వ్యాఖ్యానాన్ని వినిపించింది శారదాదేవి! (కొంచెం జాగ్రత్తగా బ్రహ్మా సరస్వతుల సరసాల్ని చదివిన వాళ్ళకి ఈ పాటికి ఆయన చెప్పిన కథకీ అక్కడ జరిగిన వాటికీ సంబంధం తెలిసిపోయి ఉండాలి. ఇంకా అనుమానంగా ఉంటే మరొక్కసారి చదివి ఆపైన ముందుకు సాగండి!)</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“ఇప్పుడు మన ఎదురుగా ఉన్న కొలనే కాసారపురం. దాన్లో కన్పిస్తున్న నా ముఖం నీడ పూర్ణ చంద్రుడిలా ఉందని అది కళాపూర్ణుడనే రాజన్నారు (రాజంటే చంద్రుడనే అర్థం కూడా ఉంది కదా!). ఆ రాజు మిగిలిన రాజులందర్నీ తన కళల్తో ఓడించాడనటం ఆ నీడ అన్ని లోకాల్లో ఉన్న అందగత్తెల ముఖాల కన్నా కూడా అందంగా ఉందనే మీ అతిశయోక్తి! దీన్లో ఆలోచించాల్సిందేమీ లేదు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అతనికి స్వభావుడనే సిద్ధుడు విల్లు, బాణాలు, ఎర్రటి మణి ఇచ్చాడంటే స్వాభావికంగానే విల్లులాటి కనుబొమలు, బాణాల్లాటి చూపులు, ఎర్రటి పెదాలు ఉన్నాయని చెప్పటం ఈ అర్థం ఎవరికి తెలీదు?</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">చూపుల బాణాలు ఎప్పటికీ తరగనివి. విల్లే అతనికి విజయాన్నిస్తుందనటం నా కనుబొమలు మీ కోరికల్ని అదుపులో పెడతాయనటం. మదాశయుడనే వాడు రూపానుభూతి అనే భార్యతో ధీరభావుడనే మంత్రితో ఆ చుట్టుపక్కలకి వస్తేనే కళాపూర్ణుడు తన వింటిని సారించి ధీరభావుణ్ణి పారదోలి మదాశయుణ్ణీ అతని భార్యనీ సేవకులుగా చేసుకున్నాడంటే ఆ నీడ వంక మీ హృదయం, దృష్టి, ధైర్యం వెళ్ళగానే అది కోపంతో కనుబొమలు ఎత్తి మీ ధైర్యాన్ని పారదోలి హృదయాన్నీ దృష్టినీ స్వాధీనం చేసుకున్నదని!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">మీరంతవరకు చెప్పేసరికి నాకు నవ్వొచ్చింది. ఆ నవ్వు వెన్నెల్లా ఉందని అభినవ కౌముది (కొత్త వెన్నెల) వచ్చి కళాపూర్ణుణ్ణి వరించిందన్నారు. కళాపూర్ణుడి తండ్రి సుముఖాసత్తి తల్లి మణిస్తంభుడు అనటం చక్కటి నాముఖం (సు ముఖం) ఆ కొలనుకి దగ్గరగా ఉండటం (ఆసత్తి) వల్ల దాని నీడ కొలన్లోని మణిస్తంభంలో పుట్టిందని చెప్పటం! అలా మీరు తల్లి మగవాడు తండ్రి ఆడదీ అనటంతో నాకు నవ్వొచ్చి మీ వంక తిరగటం వల్ల కొలనులో నీడ బదులు మీ ఎదురుగా నా కంఠం పై భాగంలో ముఖం కనపడటాన్ని అంగదేశంలో క్రముక కంఠోత్తర పురంలో కళాపూర్ణుడికి పట్టం కట్టటం అన్నారు. అలా తిరగటం అనేది నా ఇష్ట ప్రకారం జరిగిన పని గనక సత్వదాత్ముడనే మంత్రి అలా అతనికి రాజ్యం పట్టం కట్టాడన్నారు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అప్పుడు మీరు నన్ను మీ బంగారు రంగు చేతుల్తో కౌగిలించుకున్నారు. దాన్ని మదాశయుడు క్రముకకంఠోత్తర పురానికి బంగారు కోట పెట్టించటంగా చెప్పారు. మీ హృదయం, దృష్టి నా ముఖాన్నే చూస్తూ పెదాల్ని కావాలనుకోవటాన్ని మదాశయుడికీ రూపానుభూతికీ మణి మహిమ వల్ల మధురలాలస పుట్టటంగా వర్ణించారు. అప్పుడు మదాశయుడి పురోహితులు నలుగురు ఆ మణిని పట్టి చూశారనటం మీరు నాలుగు ముఖాలతో నా పెదాల్ని చుంబించటం! మీ నాలుగు ముఖాల్నుంచీ నాలుగు వేదాలు వల్లిస్తారు గనక ఆ పురోహితులకి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ ఆగములని పేర్లు పెట్టారు (ఆగమాలంటే వేదాలు కదా!). వాటిలో ఒక ముఖం కొంచెం గట్టిగా పీడించటం వల్ల కోపంతో వెనక్కి నెట్టి కౌగిలి విడిపించుకోవటాన్ని ఆ పురోహితు డొకడు మణిని గట్టిగా నొక్కటం గానూ కళాపూర్ణుడు అందుకు కోపగించి వాళ్ళను తరిమి బంగారు కోటను పడగొట్టించటం గానూ చెప్పారు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అప్పుడు మీ హృదయం, దృష్టి నా ముఖాన్ని వదిలి మిగతా అవయవాల మీదికి వెళ్ళటాన్ని మదాశయుడు భార్యతో కలిసి కళాపూర్ణుడిని వదిలి అంగదేశంలోనే మరో చోటికి వెళ్ళటంగా పోల్చారు. అక్కడ రెండు పూర్ణ కలశాల్ని చూసి మధ్య దేశంలో కొంత కాలం ఉండటం అంటే వక్షోజాల్ని చూసి నడుం దగ్గర కొంత సేపు దృష్టి నిలపటం. ముఖం మీది నుంచి దృష్టి పోయాక పెదాల మీది కోరిక తగ్గటాన్ని కళాపూర్ణుడి నించి దూరమయాక మధురలాలస చిక్కిపోవటంగా వర్ణించారు. అప్పుడు మళ్ళీ మీ హృదయం, దృష్టి నా ముఖం మీదికి రావటం, అందువల్ల పెదాల మీద కోరిక పెరగటం, తర్వాత ఆ కోరిక తీరటం మదాశయుడు కళాపూర్ణుడి కొలువుకి తిరిగి రావటం, మణి ప్రభావం వల్ల మళ్ళీ మధరలాలస ఆరోగ్యం పుంజుకోవటం, దానికి యవ్వనం వచ్చాక కళాపూర్ణుడితో సుఖాలు పొందటంగా పోల్చిచెప్పారు. ఇదీ మీరు చెప్పిన కథలోని అసలు కథ. నేనంతా సరిగ్గానే చెప్పానా లేదా!” అని పరిహాసంగా నవ్వింది శారదా దేవి!” (ఈ అద్వితీయమైన ఘట్టాన్ని మూలంలోనే చదవాలి దాని రుచి సరిగ్గా తెలియాలంటే. మూలం కావాలంటే ఇక్కడ నొక్కండి.)</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఇక్కడి వరకూ చెప్పిన ఆ పాప నవ్వుతూ అన్నదీ, “మరి ఇదంతా జరిగేటప్పుడు నేనక్కడున్న విషయం వాళ్ళకి గుర్తు లేదో లేక చిలకే కదా అని పట్టించుకోలేదో గాని, నేను మాత్రం కదిల్తే కోపగిస్తారేమో నని బిక్కచచ్చిపోయి అక్కడే ఉండి అంతా చూసి, విన్నాను.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">తర్వాత కొన్నాళ్ళకి బ్రహ్మ కొలువుకి ఇంద్రుడు వస్తుంటే రంభ కూడ అతన్తో వచ్చి సరస్వతీదేవి దర్శనానికి అంతఃపురంలోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే నేను ఒక చోట పంజరంలో కూర్చుని పనిలేక అదివరకు కొలను దగ్గర ఉన్నప్పుడు సరస్వతీ దేవి గొంతులోంచి వచ్చిన మధురమైన శబ్దాన్ని అనుకరించి ఆనందిస్తున్నా! అది విన్నది రంభ. విన్నది ఊరుకోక “ఇదేదో చాలా బాగుందే, అమ్మ గారి దగ్గర నేర్చుకున్నావా?” అనడిగితే బుద్ధిలేని దాన్ని, నేనూ ఏమీ దాచకుండా కొలను దగ్గర జరిగిన వ్యవహారమంతా పూసగుచ్చినట్టు చెప్పానామెకి! ఎంత నేర్పినా చిలకలు చిలకలే కదా! అంతటితో ఆక్కుండా ఆ రంభ “మళ్ళీ మళ్ళీ” అని అడుగుతుంటే నేను కూడ ఉత్సాహంగా ఆ శబ్దాన్ని పదేపదే వినిపిస్తున్నా.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అంతలో అక్కడికొచ్చింది శారదా దేవి! కోపంతో మండిపడుతూ! “ఎంత తిమ్మిరి కూతల దానివే నువ్వు! నోటికొచ్చిన వన్నీ చెప్తున్నావ్! దీనికి శాస్తిగా నువ్వు భూలోకంలో లంజవై పుట్టు పో!” అని నన్ను శపించింది ఆ ఆవేశంలో! ఈలోగా రంభ భయపడి పరిగెత్తి ఒక రత్నస్తంభం వెనక నక్కి నిల్చుంది. అంతలో బ్రహ్మ కూడా అక్కడికొచ్చాడు. ఆమె చేసిన పని చూసి “ఎప్పుడూ లేనిది ఇంత కోపం ఏమిటివేళ?” అంటూ సున్నితంగా మందలించాడామెని. దానికామె కూడా కోపం తగ్గిపోయి నవ్వుతూ, “చూశారా ఇది మనం ఉద్యానవనంలో చెప్పుకున్న కథంతా రంభకి చెప్పేస్తోంది!” అంది. దానికతను “అది చిలక్కదా, దానికేం తెలుస్తుంది? మరీ ఇంత నిర్దయగా తిట్టొచ్చునా?” అని ఆ శాపానికి బాధ పడుతున్న నన్ను చూసి ఓదారుస్తూ, “మీ అమ్మ గారి శాపాన్ని తిప్పటం ఎవరి వల్లనౌతుంది? అది అనుభవించక తప్పదు. కాకపోతే ఆ తర్వాతి జన్మలో నువ్వు మదాశయుడనే రాజుకి మధురలాలస అనే కూతురిగా పుట్టి కళాపూర్ణుడనే మహారాజుకి భార్యవై ఎక్కడలేని భోగాల్ని అనుభవించి కృతార్థురాలివౌతావు. విచారించకు” అని చెప్పాడు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">దానికామె విసుక్కుంటూ, “మళ్ళీ ఈ మదాశయుడూ కళాపూర్ణుడూ ఏమిటి? ఇంకా మీకు అదే కలవరింతా?” అని అతన్ని ఆక్షేపించింది. “నీ ముఖ వర్ణనకి సంబంధించిన కథలు నాకెప్పుడూ కలవరింతలేననుకో!… ఐతే, నిజంగానే, భూమ్మీద కళాపూర్ణుడనే రాజు పుడతాడు, ఇదతనికి భార్య ఔతుంది” అని అదే మాట మీద నిలబడ్డాడు బ్రహ్మ. “అలానా? మరి ఆ కథ ఎలా ఉంటుందో చెప్పండి” అని ఆమె అడిగితే, “వేరే ఏమీ లేదు. నువ్వు ఇదివరకు విన్నదే ఈ కథానూ! అందులో ఉన్న మనుషుల పేర్లు, మనుషులు, సంఘటనలు, అన్నీ అలాగే జరుగుతాయి. కాకపోతే మనం చెప్పుకున్న కథ అదివరకే జరిగినట్టు చెప్పాను, ఇది ఇక ముందు జరగబోతోంది! నేను కథని కాస్త టూకీగా చెప్పాను, అది జరిగేటప్పుడు అవసరమైన కొన్ని పిట్ట కథల్తో ఇంకొంచెం పెద్దదౌతుంది. అదే తేడా! ముఖ్యమైన కథంతా నేను ఇదివరకు చెప్పిందే!” అని వివరించాడా సృష్టికర్త.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఆ మాటలకి చాలా ఆశ్చర్యపడింది సరస్వతి. కొంచెం ఆలోచించి, “ఐతే ఆ రాజుకి నిజంగానే తల్లి మగవాడూ తండ్రి ఆడదీనా?” అనడిగింది నమ్మలేనట్టుగా! “అనుమానం ఎందుకు? పైగా, నీ మూలానే అలా జరుగుతుంది కూడా!” “సరే లెండి. మీరు సృష్టికర్తలు, ఎట్లాగైనా చెల్లుతుంది. మధ్యలో నన్నెందుకూ ఇరికిస్తారు? … అదీ గాక ఇక్కడ మన మధ్య జరిగిన విషయాలేవీ ఎవరి దగ్గరా ఎత్తకండి. ఏదో ఏకాంతంలో చెప్పుకున్న కథ కదా అని అనుకుంటే ఇప్పుడేమో అది నిజంగానే భూమ్మీద జరగబోతుందంటున్నారు! దానికి తోడు ఇంకా “ఇది ఇలా జరుగుతుందని బ్రహ్మ ముందే చెప్పాడట” అని బయటపడితే, ఇంకేముందీ! వెంటనే, “మరి ఈ కథంతా దేన్ని గురించిట?” అని, “వాగ్దేవి ప్రతిబింబానికి రూపమే కళాపూర్ణుడు” అంటే “ఈ కథ ఏ సందర్భంలో చెప్పాడో కదా?” అనీ, ఇలా తీగ లాగితే డొంకంతా కదిల్నట్టు విషయమంతా బయటికొచ్చి నేను నలుగుర్లో నవ్వుల పాలౌతాను. కాబట్టి మీరెక్కడా బయటపెట్టొద్దు. రహస్యంగా దాచేద్దాం” అన్నది సరస్వతీ దేవి కంగారుగా.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“ఆఁ! అన్నీ పైపై మాటలే! ఎవరి కైనా వాళ్ళ శృంగార కథలు బయటికి రావాలనే ఉంటుంది! నీ మనసూ మాటా ఒకటో కాదో చూద్దాం ఏదీ నీ నాలిక్కొనతో ముక్కందుకో నమ్ముతాను!” అంటూ ఎకసెక్కెం ఆడాడతను. గొప్ప ప్రయత్నం మీద నవ్వాపుకుంటూ “నవ్వులు చాలు, మీరేమన్నా ఇక నాక్కోపం వస్తుంద”ని ఆమె ఓ పూల బంతిని అతని మీదికి విసిరింది. ఐనా అతనాపక పోవటంతో “ఇంక ఆపండి” అంది అతన్ని కౌగిలించుకుని ఒక చేత్తో గడ్డం పట్టుకుని చెక్కిలితో చెక్కిలి రాస్తూ. దానికతను ఆనందిస్తూ, “ఎందుకలా వెనకాడతావ్? నీ మాటలెలా ఉన్నా నీ మనసులో కోరిక మాత్రం ఈ కథ బయటికి రావాలనే! ఇలాటి విచిత్రమైన కథ వల్ల గాక ఇంకే విధంగా నీ మహిమలు ప్రచారమౌతాయి చెప్పు? అసలు ఆలోచించిచూస్తే దేనికైనా ప్రసిద్ధి కలిగేది భాష వల్లనే కదా!…. ఆ భాషేమో నీ రూపం! మరి అలాటప్పుడు నీ అంగీకారం లేకుండా ఏదైనా నిలుస్తుందా? కనక ఈ కళాపూర్ణుడి కథ తప్పకుండా చాలా ప్రసిద్ధి పొందబోతోంది” అని విశ్లేషించాడు ఓపిగ్గా.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“మీరింత పట్టుపట్టి చెప్తుంటే నేను కాదనటం ఎందుగ్గాని, మరి ఆ కళాపూర్ణుడి కథ జరిగినంత మాత్రాన మన కథ కూడా దాన్తో పాటు బయటికి రావల్సిందేనా?” “ఆహా, ఇది ముందుగానూ అది ఆ తర్వాతనూ వస్తాయి” “సరే, అలా ఐతే మన కథ ఎలా బయటికొస్తుందో తెలుసుకోవాలి. మీరు మాత్రం ఎక్కడా చెప్పకండి” “అలాగే!”</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అప్పుడా శారదా దేవి నా వంక చూసి, “ఇప్పుడిది భూలోకంలో పుట్టబోతోంది గనక ఈ విషయాలేవీ గుర్తుండవు, ఈ కథ ఎవరికీ చెప్పలేదు!” అని “ఆ రంభ ఎటుపోయింది? దానికి సరైన బుద్ధి చెప్పాలి!” అనేంతలో గడగడ వణుకుతూ బయటికొచ్చి ఆమె కాళ్ళ మీద పడింది రంభ. “లే, లే! నువ్వీ కథ ఎక్కడన్నా చెప్పావంటే ఏమౌతుందో … నా సంగతి తెలుసుగా!” అంటుంటే బ్రహ్మ నవ్వుతూ, “నీ సంగతి ఇంక ఎవరికేం తెలుస్తుంది? ఇక ముందు ఈ కథ చెప్పే వాళ్ళూ వినేవాళ్ళూ భూమ్మీద తరతరాలకీ తరగని సంపదల్తో శుభాలు సౌఖ్యాలు పొందుతారు. ఇది నా ఆశీర్వచనం” అని సెలవిచ్చాడు. దానికి సరస్వతి కూడా, “అలాగే కానివ్వండి. ఇదీ బాగానే ఉంది. ఇక్కడి వాళ్ళెవరమూ ఇక ఈ విషయం గురించి మాట్టాడం” అని హాయిగా నవ్వేసింది.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఇక నా శాపం వల్ల నేను కలభాషిణి అనే వేశ్యగా ద్వారకా నగరంలో పుట్టాను. బ్రహ్మ చెప్పిన విధంగా ఈ జన్మలో ఇలా ఇక్కడ పుట్టాను. క్రితం జన్మలో కాళికాలయంలో మణికంధరుడి దగ్గర చివర సారిగా చూశా ఈ హారాన్ని. అందువల్లనే ఇప్పుడన్నది రెండేళ్ళ నాడు చూశానని!” అంటూ తన రెండు జన్మల క్రితం కథని వినిపించింది ఉయ్యాల్లో పసిపాప.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఆశ్చర్యంలో మునిగి తేలారందరూ. అలఘువ్రతుడు ఆ పాపకి సాష్టాంగ నమస్కారం చేసి “తల్లీ, నువ్వు చెప్పిన దానికి సాక్ష్యంగా కలభాషిణిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన ఒక పని నాకు కన్పిస్తోంది” అన్నాడు. “అదేమిట”ని ఆ రాజు అడిగితే, “కలభాషిణి వల్లనే నేను కళాపూర్ణుడి గురించి విన్నాను. అది విన్నందు వల్లనే నేను భువనేశ్వరీ జపం చెయ్యటం, ఇలా వచ్చి పడటం జరిగాయి.” అని చెప్పాడతను.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అప్పుడతనికి మరో ముఖ్యమైన విషయం గుర్తొచ్చింది. ఆ పాప వైపుకు తిరిగి, “నువ్వు కారణజన్మురాలివి. నీ మాటలు జరక్కపోవటం లేదు. కనక నువ్వు మధురలాలసగా ఎలా పుట్టావో, నీకు భర్త కాబోతున్న ఆ కళాపూర్ణుణ్ణి నేను ఎప్పుడు ఎక్కడ చూస్తానో కూడా చెప్పు తల్లీ” అని ప్రార్థించాడతను. దానికా బాలిక, “ఆ విషయాలు నేను చెప్పటం బాగుండదు. ఈ సభలో వాళ్ళనడుగు. వాళ్ళు నీకు చెప్తారు” అంది ఆదరంగా. అప్పుడా రాజుని చూసి, “అయ్యా!ఇదే లోకమో! ఏ పట్టణమో! మీరెవరో! నాకేమీ తెలియటం లేదు. దయచేసి చెప్పండి” అని ప్రాధేయ పడ్డాడు అలఘువ్రతుడు. అందుకా రాజు, “ఇప్పటి దాకా అద్భుతమైన కథలు వింటూ నీ విషయం కూడా అడగలేదు. ఐనా కొంత కొంత నీ విషయం బయటికొచ్చింది. ఇక మా విషయం చెప్తా విను! నేనే కళాపూర్ణుడిని! స్వభావ సిద్ధుడిచ్చిన మణీ, విల్లు, బాణాలు ఇవే! మదాశయుడి పురోహితులు నలుగురూ వీళ్ళే! అతను సత్వదాత్ముడు, ఆ పక్కన మదాశయుడు, ఆమే రూపానుభూతి! ఆమె బిడ్డే ఈ శిశువు. ఆమె తండ్రి నన్ను కొన్నాళ్ళు కొలిచి ఆ తర్వాత కొన్నాళ్ళు విడిచి వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చాడు. నన్నూ ఈ మణినీ చూడటంతో ఆ పాపకి సేద తీరిందని ఆనందిస్తూ ఇంతకు ముందే ఆ బంగారు తొట్టిలో ఉంచారామెని. దాని పేరు మధురలాలస. అలాగే ఆమె చెప్పిన కథలోని పేర్ల వాళ్ళందరూ ఇక్కడున్నారు! ఇప్పుడు మనం ఉన్నది అంగ దేశం! నేను పుట్టింది కాసార పురంలోనే! ఇది క్రముకకంఠోత్తర పురం! అన్నీ సరిపోయాయి” అని వివరించాడతనికి.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అప్పుడా అలఘువ్రతుడు కుతూహలం ఆపుకోలేక , “ఐతే మీ తల్లి మగవాడూ తండ్రి స్త్రీనా?” అనడిగాడా రాజుని. “ఆ ఒక్క విషయం మాత్రం నాకూ విచిత్రంగానే ఉంది. ఆ పాపే చెప్పాలి మనకి అదెలాగో!”</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">దానికి మధురలాలస మళ్ళీ ఇలా ప్రారంభించింది “అలఘువ్రతుడా! నువ్వా కాళికాలయానికి వచ్చేటప్పటికి అక్కడ మణిస్తంభుడనే సిద్ధుడూ, సుముఖాసత్తి అనే అతని భార్యా ఉన్నారు కదా! వాళ్ళూ ఈ రాజు తల్లిదండ్రులు! అదెలా జరిగిందంటే కొన్నాళ్ళ తర్వాత దేశ సంచారానికి వెళ్ళారు వాళ్ళు. సముద్రాన్ని చూసిన తర్వాత కలిగిన కోరికల్తో వాళ్ళు మదనక్రీడల్లో తేలటం ప్రారంభించారు. అప్పుడొక తోటలో ఉన్నప్పుడు అతను వింత కోరికతో, “నువ్వు పురుషుడివి కా, నేను స్త్రీనౌతాను” అన్నాడామెతో. ఆమె కూడా, “అలాగే, నువ్వు స్త్రీవి కా, నేను పురుషుణ్ణౌతాను” అంది. అదేం మాయో! వెంటనే వాళ్ళలాగే మారిపోయారు!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">కొంతసేపు ఆలోచించే సరికి అలా ఎందుకు జరిగిందో అర్థమైంది సుముఖాసత్తికి.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“కాళికాలయంలో నువ్వు నన్ను బలి ఇచ్చినప్పుడు నేను చివరగా దేవిని ప్రార్థించింది నా మాట నిజమయ్యేట్టు చూడమని. కనక అక్కడి శాసన స్తంభం మీద రాసున్న విధంగా నేనన్న మాటలు నిజమయ్యే వరం ఆ దేవి నాకిచ్చిందన్నమాట!” అన్నది ఆశ్చర్యపడుతూ!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">మణిస్తంభుడు వెంటనే, “అలా ఐతే ఇంకేం అనొద్దిప్పుడు నువ్వు. మనం ఇలా రూపాలు మార్చుకున్నందు వల్ల ఇదివరకు సరస్వతీ దేవి మనిద్దరికీ ఇచ్చిన విరుద్ధమైన వరాలు కూడా నిజమయ్యేట్టున్నాయి” అన్నాడు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">(ఇంకా వుంది)“</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿...</span></p><div><br /></div>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5836802122867912200.post-29751986029640718072020-10-15T01:10:00.001-07:002020-10-15T01:10:21.756-07:00🚩🚩కళాపూర్ణోదయం -5: అలఘువ్రతుడు!🚩🚩<p><table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto;"><tbody><tr><td style="text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgyo2bwgDsaB9PyOtqYRcre-9TBPf8aFMeKKAl-uIaQviF4aLNw8vT-4GH8vACiY5pnNeA-UvbobLArZ5xX840C_W1sN5pQWIZ3wMFr5DSDipD6GETp1MJtNeUM_J5xLRsMb7jq9l1M69Xf/s640/dpa-maa-26948.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"><img border="0" data-original-height="640" data-original-width="399" height="853" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgyo2bwgDsaB9PyOtqYRcre-9TBPf8aFMeKKAl-uIaQviF4aLNw8vT-4GH8vACiY5pnNeA-UvbobLArZ5xX840C_W1sN5pQWIZ3wMFr5DSDipD6GETp1MJtNeUM_J5xLRsMb7jq9l1M69Xf/w534-h853/dpa-maa-26948.jpg" width="534" /></a></td></tr><tr><td class="tr-caption" style="text-align: center;">Add caption<br /></td></tr></tbody></table> <b><i><span style="color: red;"><br />🚩🚩కళాపూర్ణోదయం -5: అలఘువ్రతుడు!🚩🚩</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">(క్రితం భాగం కథ మణికంధరుడు, కలభాషిణి ఒకరిపై ఒకరికి మొదటి నుంచీ ఉన్న మక్కువ గురించి చెప్పుకున్నారు. ఆ సందర్భంలో మణికంధరుడు అక్కడున్న సుముఖాసత్తి, మణిస్తంభుడు, కలభాషిణిలకు సుగాత్రీ శాలీనుల కథ చెప్పాడు. అంతా విన్నాక “నేనే ఆ సుగాత్రిని” అన్నది సుముఖాసత్తి. శతతాళదఘ్నంలో దూకిన తన భర్త శాలీనుడు ఏమయ్యాడోనని బాధపడింది. ఇక చదవండి.)</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">#మొసలి నోట్లోంచి నిన్ను సురక్షితంగా బయటపడేసిన నీ పాతివ్రత్యం నీ భర్తను కాపాడదా? నేనే ఆ శాలీనుణ్ణి!” అన్నాడు మణిస్తంభుడు!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">అసలే మోసకారి సిద్ధుడు! అతని మాటలు నమ్మొచ్చునా?</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">తన పాత కథ ఇలా చెప్పుకొచ్చాడు మణిస్తంభుడు “అలా ఏదో పూనినట్టు వెళ్ళి నేను మడుగులో దూకేశాను కదా! కొంతసేపటికి చూస్తే నేను జలస్థంభన విద్యలో ఉన్న ఒక సిద్ధుడి ముందున్నాను. అక్కడతనికో చిన్న ఆశ్రమం! అతను కళ్ళు తెరిచి నా విషయం అడిగి తెలుసుకుని, “మరీ అంత కోపమా!” అని నవ్వి ఆ రోజంతా తన్తో ఉంచుకుని ఎందువల్లనో నా మీద దయతో వయసు పెరగనివ్వని ఒక గొప్ప మణిని, తనెక్కే సింహాన్ని, దాన్ని వశీకరణం చేసుకునే మంత్రాన్ని, ఈ కత్తిని నాకిచ్చి, నాకు వాద విద్యని కూడా అప్పటికప్పుడే నేర్పి పంపాడు. అప్పుడే ఆయన నాతో చెప్పింది ఈ కత్తిని ఎవరి మీదికి ఎత్తితే ఇది వాళ్ళని ఎప్పటికైనా తప్పక చంపుతుందని! .. నేనా సింహాన్ని ఎక్కి అదిలించటంతోటే అది ఎగిరి మడుగులోంచి బయటికొచ్చి ఆకాశంలో ప్రయాణించటం మొదలెట్టింది. దాని మీద ప్రపంచంలో వింతలన్నీ చూస్తూ తిరుగుతున్నాను ఇంతకాలమూ! మణి చేత నా వయస్సు స్తంభించి పోయింది గనక నాకు మణిస్తంభుడని పేరొచ్చింది. మా గురువు గారి మీద గౌరవంతో అప్పట్నుంచీ ఇలా సిద్ధుడి వేషంలో తిరుగుతున్నా”.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">అతన్లో శాలీనుడి పోలికలు కొంత కనపడుతున్నాయని సుముఖాసత్తికి అంతకు ముందే అనుమానం ఉంది. కనక ఆమె అతని మాటల్ని పూర్తిగా కొట్టెయ్యలేక పోయింది. ఐతే అతను నిజంగా శాలీనుడౌనో కాదో తెలియాలంటే అది చాలదు కదా!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">“అలా ఐతే ఆ రోజు నేను నీ చెవులో ఏం చెప్తే దానిక్కోపం వచ్చి నువ్వెళ్ళి కొలన్లో దూకావో చెప్పాలి” అన్నదామె.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">దానిగ్గాను ముందు కలభాషిణ్ణి పక్కకి పిలిచి “ముందు నేను నీకా రహస్యం చెప్తా. ఆ తర్వాత అతన్ని చెప్పమందాం” అని ఆమె చెవిలో చెప్పబోతూ, అంతలోనే, “ఇది కాదు పద్ధతి. నేను ముందు నీకు చెప్తే దూరశ్రవణం ద్వారా అతను వింటాడు. పోనీ రాద్దామా అంటే దూరదృష్టితో చూడగలడు గనక అదీ పనిచెయ్యదు” అని ఒక్క క్షణం ఆలోచించింది.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">ముందు తను చెప్పకూడదు, అతని చేతనే చెప్పించాలి!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">మణికంధరుణ్ణి ముందుగా మణిస్తంభుడి దగ్గర ఆ రహస్యం కనుక్కోమంది.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">మణికంధరుడు మణిస్తంభుణ్ణి దూరంగా తీసుకెళ్ళి అతను చెప్పిందంతా విన్నాడు. తర్వాత సుముఖాసత్తి దగ్గరికి వచ్చి ఆమెని చెప్పమన్నాడు.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">ఇలా చెప్పిందామె “శాలీనుడు మడుగున దూకేముందు నా అందం రోజురోజుకీ పెరుగుతుందనీ, దానిక్కారణం ఏమిటంటే తను నాకు గర్భం రాకుండా ఉండాలని శారదాదేవిని వరం అడిగాడనీ దానికి ఆమె సరేనన్నదనీ నా చెవిలో చెప్పాడు. దానికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే, అంతకుముందే ఆ దేవి నా వల్ల అతనికి ఒక కొడుకు పుడతాడని వరం ఇచ్చింది. నేనా విషయం అతన్తో చెప్పి, “దేవి మన ఇద్దరికీ ఇలాటి వరాలిచ్చిందే మరి ఈ రెండూ ఎలా జరుగుతాయి?” అన్నాను. దానికతను, “ఇలా నా ఇష్టానికి వ్యతిరేకంగా వరం కోరుతావా!” అని మహా కోపంతో వెళ్ళి మడుగులో దూకేశాడు”.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">ఇద్దరికీ అలాటి వరాలిచ్చిన ఆ దేవి మాటలు ఎలా నిజం ఔతాయో కదా!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">ఇద్దరి దగ్గరా విన్నాడు గనక ఇప్పుడు మణికంధరుడు తన తీర్పుని ప్రకటించాడు</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">“మీరిద్దరూ ఒకే విధంగా చెప్పారు. మీరు సుగాత్రీ శాలీనులే!”</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">అందరూ ఆనందంలో తేలిపోయారు!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">“ఇన్నాళ్ళకి ఈ అన్న మూలాన నా భర్తను కలవగలిగాను” అని మణికంధరుణ్ణి పొగిడింది సుముఖాసత్తి.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">“జాతికి గంధర్వుడివి; రూపంలో మన్మథుడివి; సంగీత సాహిత్యాల్లో దిట్టవి; గొప్ప తపస్వివి; విష్ణుభక్తుడివి; ఆ ఒక్క శాపం కూడా లేకుంటే ఎంత బాగుండేదో!” అంది విచారంగా.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">కలభాషిణి కూడా అతని శాపానికి బాధ పడుతూ, “ద్వారకలో నారదుడూ, నువ్వూ పూలతోటలో దిగినప్పుడు కళాపూర్ణుడి విషయం వచ్చింది కదా! మరి రంభ అడిగినప్పుడు ఎందుకు చెప్ప లేక పోయావ్?” అనడిగింది.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">“లేదే! నేనా విషయం ఎప్పుడూ వినలేదే!” అన్నాడు మణికంధరుడు ఆశ్చర్యంగా!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">అప్పుడు కలభాషిణికి గుర్తొచ్చింది “ఔనౌను. అప్పుడు నువ్వు నేనేదో రహస్యం మాట్లాడబోతున్నానని పక్కకెళ్ళావ్! ఇప్పుడు గుర్తొచ్చింది” అంటూ అప్పుడు తనకీ నారదుడికీ జరిగిన సంభాషణంతా వినిపించింది వాళ్ళకి.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">ఆ సందర్భంలోనే కళాపూర్ణుడి కథ వినటం వల్ల కలిగే తరతరాల భోగభాగ్యాల గురించి కూడ వాళ్ళకి చెప్పింది.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">సరిగ్గా ఆమె అలా చెప్తున్నప్పుడే అలఘువ్రతుడనే మళయాళపు బ్రాహ్మణుడొకడు తనకి సిరిసంపదలు కావాలని ఆ దేవిని ప్రార్థించటానికి వచ్చి కళాపూర్ణుడి గురించి ఆమె చెప్పిందంతా విన్నాడు!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">“ఇంకేం! నాకు తరతరాలకూ సంపదలు కలిగే మార్గం దొరికింది! అలాగే ఒక అద్భుతమైన కథ కూడ వినొచ్చు. కనక ఆ కళాపూర్ణుడి కథ వినిపించమని కోరుకుని దేవీ జపం చేస్తాను” అని నిశ్చయించుకుని అప్పటికప్పుడే భువనేశ్వరీ మంత్ర జపం ప్రారంభించాడు అక్కడి శిలాక్షరాల్లో రాసిన ప్రకారంగా!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">శాపాల విషయం వచ్చింది గనక కలభాషిణి తన శాపం విషయం కూడ తల్చుకుని సిద్ధుణ్ణి చూసి, “ఇంకా ఆలస్యం ఎందుకు? నీ కత్తి మహిమకీ, ఆ రంభ శాపానికీ సరిపోయేట్టుగా చేసి రాజ్యం సంపాయించి నీ కోరిక తీర్చుకో!” అని ప్రోత్సహించింది. మణిస్తంభుడు మాత్రం ఒప్పుకోలేదందుకు.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">“ఈ సుముఖాసత్తి దేవి మీద ఒట్టేసింది కదా! దాని వల్ల ఇప్పటి దాకా పడ్డ పాట్లు చాలు” అంటూ అంతలోనే ఇంకో ఆలోచన వచ్చి మణికంధరుణ్ణి చూసి, “నా కత్తి నీకిస్తాను. దాంతో ఆమె చెప్పినట్టు చేసి నువ్వు రాజ్యం సంపాదించుకో!” అని సలహా ఇచ్చాడు. సుముఖాసత్తి కూడ “ఈ స్థితిలో అదే మంచి పని” అని సమర్థించింది.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">ఐతే మణికంధరుడు ససేమిరా అందుకు ఒప్పుకోలేదు. అందరూ రకరకాలుగా చెప్పి అతికష్టం మీద ఎలాగైతేనేం చివరికి అతన్ని ఒప్పించ గలిగారు.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">కలభాషిణి అందరికీ నమస్కారాలు చేసి సుముఖాసత్తితో “నాకెందుకూ బాధ లేదు గాని మీలాటి పూజ్యుల్ని పూజించుకుంటూ కాలం గడిపే అవకాశం లేకుండా పోతోందని మాత్రం బాధ పడుతున్నాను” అనటంతో ఆమె “మన బంధం ఇంతటితో పోతుందా? ముందు ముందు నువ్వూ నీ భర్తా మమ్మల్ని గురు భావంతోనే చూస్తారులే! అప్పుడు నువ్వు పరమ పతివ్రతవై రాజ్యభోగాలు అనుభవిద్దువు గాని” అని దీవించింది కలభాషిణ్ణి.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">అప్పుడు కలభాషిణి మణిస్తంభుడి దగ్గర కత్తి తీసుకుని మణికంధరుడి చేతికిచ్చి దేవి కెదురుగా పద్మాసనం వేసుక్కూర్చుని “ఇంకా ఆలోచనెందుకు? నీ చేతుల బలాన్ని చూపించు” అని రకరకాలుగా ఉత్సాహం కలిగిస్తుంటే వెనకాడుతూ వెనకాడుతూ చివరికామెని దేవికి బలిచ్చాడు మణికంధరుడు.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">అప్పుడు కాళికాదేవి మణికంధరుడితో “నువ్వు బలి ఇవ్వటంలో ఇంత ఆలస్యం చేశావ్గనక నీకు ఈ జన్మలో రాజ్యం రాదు. వచ్చే జన్మలో నువ్వు సద్యోయవ్వనంతో పుట్టి మహారాజ్య భోగాలు అనుభవిస్తావు. ఇక ఈ కలభాషిణి ఎంతో ధైర్యంగా బలయ్యింది గనక ఆమెని బతికించి ద్వారకలో ఆమె బంధు మిత్రుల దగ్గరికి చేరుస్తున్నా!” అని ప్రకటించింది.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">అలా ద్వారకలో తన ఇంట్లోనే మళ్ళీ బతికి కళ్ళు తెరిచింది కలభాషిణి!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">తర్వాత రెండేళ్ళ పాటు ఆనందంగా గడిపి తన బంధుమిత్రుల మధ్య సహజమరణం పొందింది!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">ఇంక ఇక్కడ, కాళికాలయం దగ్గర నలకూబరుడి శాపం మణికంధరుణ్ణి ఆత్మ హత్యకి పురిగొల్పుతోంది!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">శ్రీశైల పర్వతం మీంచి దూకిన వారికి ఆత్మ హత్యా పాపం ఉండదనీ, పైగా పుణ్యం కూడ వస్తుందని, అక్కడికి బయల్దేరాడతను. తన దగ్గరున్న వస్తువుల్ని చూసుకున్నాడు వీణని ఆ ఆలయంలోనే ఒక గుహలో జాగ్రత్తగా భద్రపరిచాడు; తన కవిత్వానికి మెచ్చి శ్రీకృష్ణుడిచ్చిన రత్న మాలికని అక్కడే కూర్చుని భువనేశ్వరీ మంత్ర జపం చేస్తున్న అలఘువ్రతుడికిచ్చాడు. శ్రీశైలానికి ప్రయాణం సాగించాడు.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">అతను వెళ్ళిపోయాక కొంత కాలం పాటు ఆ గుడిలోనే పూజలు చేస్తూ గడిపారు సుముఖాసత్తీ మణిస్తంభులు. అంతలో మళ్ళీ దేశాంతరాలు తిరిగి చూడాలనే కోరిక్కలిగింది మణిస్తంభుడికి. తన సింహవాహనాన్ని ఆకర్షించాడు. ఆలుమగలిద్దరూ దాని మీద ప్రపంచ పర్యటనకి బయల్దేరారు.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">ఎదురుగా సముద్రం! తీరాన దిగారు. ఆ దృశ్యం చూసి మణిస్తంభుడికి కవిత్వం తన్నుకొచ్చింది!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">దాంతో పాటే మదనవాంఛ కూడ!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">రతిక్రీడల్లో తేల్తూ కొంత కాలం గడిపారు వాళ్ళు.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">ఇంతలో ఇక్కడ కాళికాలయంలో అలఘువ్రతుడి రెండేళ్ళ దీక్ష పూర్తయింది!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">దేవి “నీ కోరిక ఇంకోచోట నెరవేరబోతోంది” అనటం, ఆ మాటలు చెవిని పడేలోగానే అతను గాల్లో ఎగిరి ఒక గొప్ప పట్టణం మధ్య ఒక రాజు గారి కొలువులో వెళ్ళి పడటం జరిగిపోయాయి!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">అలఘువ్రతుడు తేరుకుని చూసేసరికి ఎదురుగా రెండో దేవేంద్రుడిలా వెలుగు తున్న రాజు!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">అతని పక్కన బంగారు తొట్టెలో పొత్తుల్లో ఉన్న ఒక చక్కటి పాపాయి!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">అలఘువ్రతుడు లేచి వెళ్ళి ఆ రాజుని ఆశీర్వదించి తన దగ్గరున్న రత్న మాలికని అతనికి కానుగ్గా ఇచ్చాడు. ఆ రాజు కూడా అతన్ని కూర్చోబెట్టి కులనామాలు కనుక్కుని “నువ్విలా రావటం అద్భుతంగా ఉంది. నీ కథంతా మాకు చెబుదువు గాని” అంటూ “ఇవేళ నాకు వచ్చిన కానుకలన్నీ ఈ పాపవే!” అని ఆ రత్నమాలికని ఆ పాప మెళ్ళో వేయించేసరికి</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">ఆశ్చర్యంతో అందరూ దిగ్భ్రమ చెంది బొమ్మల్లా నిలబడిపోయేట్టుగా</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">ఆనందంగా నవ్వి ఆ పాప అన్నది “ఆహా! రెండేళ్ళక్కదా ఈ హారాన్ని మళ్ళీ చూశాను!” అని!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">ఆ రాజు కూడా “ఈ పాప ఏ దేవతాకాంతో, కారణజన్మురాలో! ఇంకా మాట్లాడించి చూద్దాం!” అనుకుని “పాపా! నీకు సరిగ్గా రెండు నెలలైనా నిండాయో లేదో, ఈ హారాన్ని రెండేళ్ళ కిందట చూశానని ఎలా అంటున్నావ్?” అనడిగాడు.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">“నా క్రితం జన్మలో నాకు దీన్తో చాలా పరిచయం ఉంది. అందువల్ల”</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">“నువ్వేదో కారణజన్మురాలివి గాని మామూలు బిడ్డవి కావు. నీ పూర్వ జన్మ కథ, ఇక్కడ పుట్టటానికి కారణం వివరంగా వినాలనుంది నాకు” అని ఆ పాపని అడిగాడా రాజు కుతూహలంగా.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">సభలో అందరూ మంత్రం వేసినట్టు నిశ్శబ్దంగా వింటున్నారు!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">కనీ వినీ ఎరగని కథ చెప్పటం మొదలెట్టిందా పసిపాప!</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">“ఇంతకు ముందుది కాక ఆ ముందు జన్మలో నేను సాక్షాత్తూ సరస్వతీదేవికి పెంపుడు చిలకని. అప్పుడు నాకో శాపం తగిలినందు వల్ల ఇంకో రూపం ఎత్తాల్సొచ్చింది. ఆ శాపం ఎందుకొచ్చిందో ఇప్పుడు చెప్తా. ఈ కథ చాలా రసవంతమైంది, సంపదల్నీ ఆయుష్షునీ పెంచేది, పవిత్రమైందీను. ఇది చెప్పగలగటం నిజంగా నా అదృష్టం!”</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">అంటూ అద్భుతమైన కళాపూర్ణోదయ కథకి అసలు కీలకం ఏమిటో చెప్పటం మొదలుపెట్టిందా చిన్నారి పాప.</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">(ఇంకా వుంది)</span></i></b></p><p><b><i><span style="color: red;"><br /></span></i></b></p><p><b><i><span style="color: red;">👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿</span></i></b>👉🏿👉🏿👉🏿👉🏿...</p>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-43979421278167264582020-10-13T23:21:00.003-07:002020-10-13T23:21:28.204-07:00🚩🚩 కళాపూర్ణోదయం -4: సుగాత్రీశాలీనులు.!🚩🚩<p><span style="font-size: large;"><br /><br /></span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;"><br />🚩🚩 కళాపూర్ణోదయం -4: సుగాత్రీశాలీనులు.!🚩🚩</span></p><p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgBNS5JgIKKGe0AzI35mFDwLpP3uTk_IDcGtAxabx30RAqWMsZIV31GM0evDbPW3fNkBDaDCRIJxlHap58IkNMe-lfCTyYc6yuEn5BLINFl1NBLeWIvzea_9gXLe2_HVpAsnjoBsOsLlYsr/s960/73241318_3693483790676993_5622965755084537856_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="960" data-original-width="739" height="754" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgBNS5JgIKKGe0AzI35mFDwLpP3uTk_IDcGtAxabx30RAqWMsZIV31GM0evDbPW3fNkBDaDCRIJxlHap58IkNMe-lfCTyYc6yuEn5BLINFl1NBLeWIvzea_9gXLe2_HVpAsnjoBsOsLlYsr/w580-h754/73241318_3693483790676993_5622965755084537856_n.jpg" width="580" /></a></div><span style="font-size: large;">(జరిగిన కథ నారద శిష్యుడు మణికంథరుడు తీవ్రమైన తపస్సు చేస్తుంటే అతని తపస్సు చెడగొట్టటానికి రంభని పంపాడు ఇంద్రుడు. ఈలోగా రంభ ప్రియుడు నలకూబరుడి మీద మనసు పడ్డ కలభాషిణి మణిస్తంభుడనే సిద్ధుడిని ప్రాధేయపడి అతని సింహవాహనం మీద బయల్దేరింది. ఐతే దార్లో అతనామెను దేవికి బలివ్వటానికి ప్రయత్నిస్తే ఆ దేవి వాళ్ళిద్దర్నీ మణికంథరుడి తపోవనం దగ్గర్లో పడేట్టు విసిరేసింది. అక్కడ తను చూసిన చిత్రవిచిత్రాల్ని మళ్ళీ దేవీ ఆలయానికి తిరిగి వచ్చిన మణిస్తంభుడు మిగిలిన వాళ్ళకి వివరిస్తుంటే మాయారంభగా కలభాషిణి, మాయానలకూబరుడిగా మణికంథరుడు ఒకరికొకరు తెలియకుండా కలిసినట్టు అర్థమైంది వాళ్ళకి. ఇక చదవండి.)</span><p></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">🚩</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">లభాషిణి ఆశ్చర్యానికి అంతులేకుండా పోతోంది!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“అదెలా జరిగింది? నేనీ మణిస్తంభుడితో సింహాన్నెక్కి వస్తున్నప్పుడు దార్లోనే ఎదురై రంభ చెలికత్తెలు ఆమె నలకూబరుడితో ఉందని చెప్పారే!”</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“నిజమే! ఐతే, అప్పుడు రంభతో ఉన్న ఆ నలకూబరుణ్ణి నేనే!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అది నా తపస్సు చెడగొట్టి నాతో ఉన్నప్పుడు నలకూబరుణ్ణి తలుచు కోవటంతో నాకు తిక్కరేగి అక్కడినుంచి వెళ్తూ మళ్ళీ దార్లో మనసు మార్చుకున్నా. దాంతో అనుభవించిన సుఖాల్తో తృప్తి కలలేదప్పటికీ!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అందుకని నా తపశ్శక్తితో నలకూబరుడి రూపం పొందాను.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అలా తనతో ఉండగా మధ్యలో నువ్వు రంభగా రావటంతో నీతో కలిసి, చివరికి శాపం తెచ్చుకుని అప్పటికి బుద్ధి తెచ్చుకుని నా వీణనీ, రత్నమాలికనీ తీసుకుని ఇలా వచ్చేశా. ఇదివరకే ఇక్కడి దేవి మహిమల గురించి నాకు తెలుసు!” అని అదంతా చెప్పి, చిలిపిగా చూస్తూ</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“నేను రంభ కోసం అన్ని పాట్లు పడితే చివరికి నువ్వు దక్కటం, నువ్వు నలకూబరుడి కోసం ఎంతో కష్టపడితే నీకు నేను దక్కటం వింతగా లేవూ!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఐతే ఒక్కటి చెప్పాలి. నారదుడు శాపం ఇస్తాడేమో అని భయంతో బయటపెట్టలేదు గాని నాకు ఎప్పట్నుంచో నీమీద కోరికుంది! ఈ విధంగా అది తీరటం నిజంగా నా అదృష్టం!” అన్నాడతను.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">కలభాషిణి కూడ, “ఇంకెవడో దుర్మార్గుడు నన్ను మోసం చేశాడనుకున్నా. నాకూ ఎప్పట్నుంచో నీమీద కోరికే! ఐతే నీ అందం, సంగీతం, గుణగణాల ముందు నేను తగననుకుని ఊరుకున్నా.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అదీగాక ఒకసారి నీ పేరు తలుచుకుంటే అలాటిదే మణిగ్రీవుడి పేరు గుర్తొచ్చింది. దాన్తో పాటు అతన్నీ అతని అన్ననీ నారదుడు మద్ది చెట్లుగా కమ్మని శపించటం కూడ గుర్తొచ్చింది! దాంతో భయం వేసి మనసుని నలకూబరుడి మీదికి తిప్పుకున్నాను తప్ప నీమీద మనసు లేక కాదు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఏమైనా అతననుకుని నీతో కలవటం కాలుజారి పూలపానుపు మీద పడటం లాగా ఐంది.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఒక గొప్ప మణిని కోరుకుని, నానా పాట్లు పడి దాని పోలికలున్న గాజుపూసని సంపాయించి, చివరికి అది గాజుపూస కాదు ఎప్పట్నుంచో కోరుకున్న మణేనని తెలుసుకున్నట్టుంది నా పరిస్థితి” అని నిట్టూర్పు విడుస్తూ, “ఐనా ఎవరు నమ్ముతార్లే ఇప్పుడు నా మాటలు?” అని లజ్జతో తల వంచుకుంది కలభాషిణి.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“అలా అనకు కలభాషిణీ! నిజానికి నువ్వు మొదట్నుంచీ నన్నే కోరుకున్నావనటానికి ఒక నిదర్శనం ఉంది. గుర్తుందా ద్వారకలో మనం విడిపోయేటప్పుడు నారదుడు నిన్ను, “అమ్మాయీ! నువ్విదివరకు కోరుకున్నవాణ్ణి, నలకూబరుడి రూపంలో ఉన్నవాణ్ణి కలుస్తావు పో!” అని దీవించాడు కదా! ఆయన కావాలనే అలా అన్నాడని నా ఉద్దేశ్యం! లేకుంటే, “నలకూబరుణ్ణి కలుస్తావు” అని నేరుగానే అనొచ్చుగా! నలకూబరుడి రూపంలో ఉన్న నన్ను నువ్వు కలిశావు గనక ఆయన మాట ప్రకారం అంతకుముందు నువ్వు కోరుకున్నది నన్నేనని తేలిపోతోంది కదా!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">శాపభయం వల్ల మనిద్దరం మన మనసులు చెప్పుకోకపోవటం వింత కాదు. లోకంలో ఇలాటివి జరుగుతూ ఉంటాయి.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">రంభ పక్కన నిగనిగ లాడుతున్న నలకూబరుణ్ణి చూడటంతో నీ మనసు అతని మీద నిలబడిపోయి మిగిలిన రూపాలేవీ నచ్చక పోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మగవాళ్ళకి ఇలాటి స్వభావం ఉంటుందనటానికి నీకో పుణ్యకథ చెప్తా” అంటూ సుగాత్రీ శాలీనుల కథ మొదలెట్టాడు మణికంధరుడు!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“ఇదివరకు ఒకసారి నేను అనంతదేవవ్రతం ఉద్యాపన కోసం అనంతపద్మనాభ స్వామి దర్శనానికి వచ్చాను. అక్కడ అద్భుతమైన కవిత్వం చెప్తున్న కవీంద్రుల్ని చూసి నాక్కూడా అలాటి కవిత్వం ఎలా వస్తుందా అని తిరుగుతూ ఈ దేవి గురించిన కథలు విని పెద్ద దూరం కాకపోవటంతో ఇక్కడికి వచ్చి ఆ శిలాక్షరాల్లో రాసినట్టుగా చేసి సాహిత్య విద్య సంపాయించాను. తిరిగి వెళ్ళి అక్కడి వైష్ణవ స్వాముల సముఖంలో నా కవిత్వం వినిపించి వాళ్ళ ఆశీస్సులు పొందాను.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">కానీ కాశ్మీరంలోని శారదాపీఠం వాళ్ళు మెచ్చుకుంటేనే కదా ఏ కవిత్వానికైనా అసలైన గుర్తింపు?</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అందుకని అక్కడికి వెళ్ళాను.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఇక ఇప్పుడు మొదలౌతుంది అసలు కథ</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అక్కడ వేదఘోషలు మిన్ను ముడుతున్నాయి. గృహ్యసూత్రాలు, శబ్దతంత్రాలు, జ్యోతిష చర్చలు, ధర్మోపన్యాసాలు, ఉభయ మీమాంసల ప్రసంగాలు, యుక్తి కథలు, యోగగోష్టులు, కావ్య గానాలు హోరుమని సాగుతున్నాయి.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఒకచోట బ్రహ్మచారులకి విద్య నేర్పుతున్న ఒక గురువుని బ్రహ్మ తేజస్సుతో ఉన్నతన్ని చూసి దగ్గరికి వెళ్ళా. ఆయన నన్ను పిలిచి కులగోత్రాలు విని “పూజ్యులు వచ్చారు గనక ఈ రోజు మీకు సెలవు” అని విద్యార్థుల్ని పంపేసి నాతో అదీ ఇదీ మాట్లాడుతూ ఉండగా ఒక బ్రహ్మచారి ఓ పుస్తకం పట్టుకుని హడావుడిగా వచ్చాడక్కడికి. “ఏమిరా ఇంత ఆలస్యం ఐంది?” అని గురువు అతన్ని అడిగితే,</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“చాలా పెద్ద కారణమే ఉంది. మీరు ఇంకా విన్నట్టు లేదు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">మీరు పంపితే నేను వెళ్ళేసరికి శాలీనుడు వాళ్ళ పూలతోటలో ఒక లతాగృహంలో ఉన్నాడు. సుగాత్రి అతని పాదాలు ఒత్తుతోంది. అతను నన్ను చూసి “మీ గురువు గారు పుస్తకం కోసం పంపారా? అదుగో ఆ కొమ్మ మీద పెట్టాను. తీసుకెళ్దువులే కొంచెం సేపు కూర్చో” అని ఒక మావిడి చెట్టు నీడన కూర్చోబెట్టాడు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అప్పుడతను ఆ సుగాత్రి వీపున చెయ్యేసి, “అమృతం తాగావో లేక ఏదైనా సిద్ధరసం దొరికిందో గాని రోజురోజుకీ నీ వయసు తగ్గుతున్నట్టుందే! ఏమిటి విశేషం?” అనడిగాడు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఆమె దానికి చిరునవ్వు నవ్వుతూ, “అలాటిదేమో నాకు తెలీదు. మీ తరగని ప్రేమ వల్లనేమో!” అన్నది.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">దానికతను కూడా నవ్వుతూ, “అసలు విషయం నే చెప్తా, విను” అంటూ ఆమె చెవులో ఏదో చెప్తే, దానికామె విచిత్రంగా అతని వైపు చూసి “మరి నేను ఇంకొకటి కోరితే తీరుస్తానన్నదే ఆ దేవి! ఆ విషయం ఏం చేస్తుందో!” అని అతని చెవులో తనూ ఏదో చెప్పింది.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అదెలాటి విషయమో గాని, అతను హఠాత్తుగా ఎక్కడ లేని కోపంతో పరిగెత్తుకెళ్ళి దగ్గర్లో ఉన్న శతతాళదఘ్నం అనే కొలన్లోకి దూకేశాడు!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఆమె కూడ, “అతను నన్ను వదిల్తే నేనతన్ని వదుల్తానా!” అని అతని వెనకే పరిగెత్తి అక్కడే తనూ దూకేసింది!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">దూరం గనక మీకు వినపడ లేదేమో గాని ఊళ్ళో వాళ్ళంతా వెళ్ళి కొలనంతా వలల్తో గాలించి ఉపయోగం కనపడక బాధతో తిరిగొచ్చారు. నేను కూడ తిరిగి వెళ్ళి శాలీనుడు చూపించిన చోటు నుంచి ఈ పుస్తకాన్ని తీసుకుని వస్తున్నా!” అని తను చూసింది వివరించాడా విద్యార్థి.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">దానికా గురువు “అయ్యయ్యో ఎంత పని జరిగింది! శతతాళదఘ్నం అంటే మాటలా ! నూరు తాటి చెట్ల లోతైంది! దాన్లో పడ్డ వాళ్ళు ఇంక తిరిగిరావటం కూడానా? ఎవరికైనా పురాకృతం తప్పదు” అని బాధ పడ్డాడు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అప్పుడు నేను, “అయ్యా! ఈ సుగాత్రీ శాలీనులు చాలా మంచివాళ్ళని పొగుడుతున్నారు కదా! దయచేసి వాళ్ళ గురించి చెప్తారా?” అనడిగాను ఆయన్ని.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“ఈ పుస్తకంలో ఉన్నది వాళ్ళ కథే! ఇంక ఎలాగూ వాళ్ళని ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు గనక ఒకసారి ఈ కథైనా విందాం” అని గురువా పుస్తకాన్ని కళ్ళకద్దుకుని శిష్యుడికిచ్చి చదవమన్నాడు. అతనిలా చదివాడు</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">కాశ్మీర భూమికి ప్రథానమైన శారదాపీఠాన సరస్వతీ దేవిని పూజించే పూజారికి సుగాత్రి అనే కూతురు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఆమె భర్త శాలీనుడు అత్తగారింట్లోనే ఉంటాడు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">వాళ్ళ తొలిరాత్రికి ఆమెని అందంగా అలంకరించి మరీ పంపితే అతనామెని పట్టించుకోనే లేదు. ఆమె కూడ చూసి చూసి తిరిగివెళ్ళిపోయింది. ఇది చూసిన ఆమె చెలులు ఆమె తల్లితో ఈ విషయం చెప్పి రేపు చూద్దాంలే అని అనుకున్నారు. ఐతే ఆ తర్వాత రెండు, మూడు రాత్రులు కూడా అలాగే గడిచాయి.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అప్పుడామె తల్లి అనుమతితో చెలికత్తెలు ఆమెతో అన్నారు కదా “మీ వాలకం చూస్తుంటే ఆలుమగల విషయాలేం జరిగినట్టు కనపట్టం లేదు! భర్త సరిగా ప్రవర్తిస్తే భార్య సిగ్గుపడొచ్చు గాని యిలా యిద్దరూ సిగ్గు పడితే ఇక కాపురం ఎలాగ? కర్పూర తాంబూలమో తమలపాకులో ఇవ్వొచ్చుకదా నువ్వైనా? బంగారం వంటి వయసుని ఒట్టి మంచానికి అప్పగిస్తారా ఎవరైనా?” అని.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">దానికామె సిగ్గుతో “ఇట్లాటి మాటలు నా చెవుల పడకూడదు పొండిక్కడ్నుంచ”ని వాళ్ళని తరిమేసి ఆ రాత్రికి మాత్రం వాళ్ళు చెప్పినట్టే చేసి చూసింది!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఐనా ఏమీ ఉపయోగం కన్పించలేదు!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">సుగాత్రి, “పోనీలే, ఆయన ఇష్టం ఎలాగో అలాగే జరగనీ!” అని అతనికి పూర్ణాయుష్షు కలగాలని ఎప్పుడూ రకరకాల అలంకారాలు వేసుకుంటూ గడుపుతోంది. అతన్నేమీ అనవద్దని తల్లిని కోరుకుంది.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఆమె తల్లి కూడ కొంతకాలం చూసి “ఇది వట్టిగొడ్డు తాకట్టే!” అని నిర్ణయించుకుని కనీసం పూలతోటనైనా పెంచమని అతనికి పురమాయించింది.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అతను కూడా, “శారదా దేవి పూజకి పనికొచ్చే పని గనక ఇంతకన్నా కావాల్సిందేమిట”ని ఒళ్ళు వంచి పనిచేసి కంటికి రెప్పలా ఆ తోటని పెంచి కాపాడాడు. అతని పనితనం వల్ల ఎండ జొరబడకుండా పెరిగిందా తోట! అతను రోజూ పొద్దున్నే లేచి వింత వింత రకాలుగా పూల మాలలు తయారుచేసి సరస్వతీ దేవికి సమర్పిస్తున్నాడు. సుగాత్రి ఇదంతా చూస్తూ ఎలాగైనా అతనికి పన్లో సహాయ పడుదామనుకుంటుంది గాని సిగ్గు వల్ల సాహసించలేకపోతోంది!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఇలా ఉండగా ఒక నాడు</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">విపరీతమైన వర్షం పట్టుకుంది!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఏనుగు తొండాల్లాంటి ధారల్తో ఆకాశానికి చిల్లుపడ్డట్టు వాన!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">గుండెలవిసిపోయే ఉరుములు!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">గుడ్డితనం తెచ్చే మెరుపులు!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">శాలీనుడు మాత్రం తోటలోనే ఉండిపోయాడు!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">సుగాత్రి మనసు అల్లకల్లోలమైంది. ఎలాగైనా తన భర్తకి కీడు కలక్కుండా చూడమని సరస్వతీ దేవిని ప్రార్థించింది. అంతటితో ఆక్కుండా ఎవరికీ చెప్పకుండా ఒక్కతే తోటకి బయల్దేరింది, ఆ కుంభ వృష్టిలో! ఆమె పాతివ్రత్య మహిమ వల్ల ఆమె మీద చినుకు పడలేదు! దార్లో వాగులు కూడా తప్పుకుని దారిచ్చాయి!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">తోటకి వెళ్ళి అతనికి కనపడకుండా దాక్కుని చూస్తే అతను గాని, ఆ తోట గాని ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్నారు! ఆనందంగా ఆ శారదా దేవి మహిమ వల్లే ఇలా జరిగిందని ఆమెని కీర్తిస్తూ మళ్ళీ ఎవరికీ తెలీకుండా ఇంటికి తిరిగొచ్చి ఎప్పట్లానే ఉన్నది సుగాత్రి. ఊళ్ళో వాళ్ళు మాత్రం అంత పెద్ద గాలివానా ఆ తోటలోని చిన్న మొక్కని కూడ కదల్చలేదని వింతగా చెప్పుకున్నారు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఇంకొన్నాళ్ళు గడిచింది. సుగాత్రి ఇంక సిగ్గుని పక్కకి పెట్టి భర్తకి సహాయం చేద్దామని ఎప్పట్లాగే అలంకరించుకుని తోటకెళ్ళింది. వెళ్ళి, నగలన్నీ మూటకట్టి పక్కన పెట్టి అతనికి ఇష్టం లేకపోయినా పన్లు చెయ్యటం సాగించింది. పాదులు తవ్వింది, మళ్ళకి మడవలు మార్చింది, మోపులు మోసింది, అటూ ఇటూ చకచక నడిచింది, అన్ని రకాల తోటపన్లూ చేసింది!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అలా ఆమె పన్లు చేస్తుంటే అతని మీద పూలబాణాలు గుప్పించాడు మన్మథుడు!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“ఎంత చెప్పినా వినవు కదా! నువ్వెక్కడ, ఈ తోటపన్లెక్కడ?” అంటూ ఆమె చెంపల మీది చెమటని తన ఉత్తరీయంతో తుడుస్తుంటే</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఎంత తుడిచినా అలా వస్తూనే ఉంటుందే! అది మన్మథుడి మహిమ మరి!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఇంక ఆగలేక ఆమెని కౌగిలించుకున్నాడతను.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">దట్టమైన చిగుళ్ళ పొదరింట్లో ఇద్దరూ ఒకటయ్యారు!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">తర్వాత మళ్ళీ అలంకారాలన్నీ పెట్టుకుని ఇంటికి వెళ్ళింది సుగాత్రి.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఆమె ముఖం వంక చూసిన చెలికత్తెలకి విషయం అర్థమైంది. ఆ రాత్రి ఆమెని మళ్ళీ బాగా అలంకరించి భర్త దగ్గరికి పంపారు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఐతే అతని కళ్ళలో మెదుల్తున్నది పూలతోటలో పన్లు చేస్తూ కనిపించిన ఆమె రూపం!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఇలా అలంకరించుకున్న సుగాత్రి ఏం మాట్లాడుతున్నా అతని చెవులకే ఎక్కలేదు ఒక్క ముక్కైనా!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఆమె ఆ రాత్రంతా అక్కడే అతని పాదాలు పడుతూ గడిపింది.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">మర్నాడు మళ్ళీ తోటకి వెళ్ళి పన్లు చేస్తుంటే ఆమెని చూసిన అతని ప్రవర్తన మారిపోయింది!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అప్పుడర్థమైందామెకి అతని మనసుకి నచ్చేది సొంపులే గాని సొమ్ములు కావని!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అలా రోజూ తోట పన్లు చేస్తూ భర్తతో హాయిగా కాలం గడుపుతోంది. మెల్లగా ఆమె తల్లిక్కూడా ఈ విషయం తెలిసింది.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఆమె కూతురితో, “అమ్మా! నువ్వు సరస్వతీ దేవి వరాన పుట్టిన దానివి. నీ మూలాన మన వంశం పవిత్రమౌతుందని ఆ దేవి స్వయంగా చెప్పింది. అందువల్లనే నీ తండ్రి దేశాంతరాలు పట్టిపోయినా నీకు పుట్టే బిడ్డల కోసం ఎదురుచూస్తూ ఇంకా బతికున్నాను. అందుకే నీ భర్తని ఇంతవరకు కొంత చిన్న చూపు చూశాను కూడ. ఇక అతను తోటలో పనిచెయ్యటం ఎందుకు దానికి జీతగాళ్ళున్నారు. అదీగాక అకాలసురతం వల్ల గుణవంతులైన పిల్లలు పుట్టరంటారు. నువ్వే ఆలోచించుకో” అని సున్నితంగా మందలించింది.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">దానికి సుగాత్రి, “అమ్మా, నా భర్తకి ఏది ఇష్టమో అది నేను చేస్తాను. మరెవరి మాటా వినను నేను” అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అప్పుడు శారదా దేవి ప్రత్యక్షమై సుగాత్రి తల్లితో, “ఆమె ఇష్టమైన విధంగా నడుచుకోనీ! ఆమె మీ రెండువంశాల పాపాల్నీ పోగొడుతుంది. ఆమె కథ నాకు ఇష్టమైందిగా పవిత్రమైందిగా నిలుస్తుంది. అలా అయ్యేట్లు నేను చేస్తాను” అని వివరించింది.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అని ఆ విధంగా సుగాత్రీ శాలీనుల కథ చదివి వినిపించాడా విద్యార్థి. అప్పుడతని గురువు, “ఇదయ్యా వాళ్ళ పుణ్య కథ. వాళ్ళంటే ఆ శారదాదేవికి ఎంత ఇష్టమో! నాకూ, ఈ ఊళ్ళో చదవనూ రాయనూ వచ్చిన వాళ్ళందరికీ ఆ దేవి కల్లో కనపడి ఈ పుస్తకం రోజూ ఉదయాన్నే చదువుకోమని ఇచ్చింది. ఒకళ్ళకొకళ్ళం చెప్పుకుని ఆశ్చర్యపోయాం. నిన్న నేను ఆ దంపతుల్ని చూడబోయి అక్కడే ఈ పుస్తకం మర్చిపోయివచ్చాను. అది తెప్పించటానికి పంపితే ఇలాటి ఘోరమైన వార్త వినాల్సొచ్చింది” అంటూ చాలా బాధ పడ్డాడతను!”</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అలా ఆ కథంతా కలభాషిణికి చెప్పాడు మణికంధరుడు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">చెప్పి అన్నాడూ “అలాటి పరిస్థితుల్లో అక్కడ నా విద్య చూపించ బోవటం బాగుండదని ఇక అక్కడ్నించి నాగలోకం వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు సంగీతం మీద కోరిక కలిగి నారదముని దగ్గర శిష్యుడిగా చేరాను. … సరే, మొత్తం మీద ఇదంతా ఎందుకు చెప్పానంటే నా విషయంలో నీ ప్రవర్తన కూడా ఒక విధంగా సుగాత్రి విషయంలో శాలీనుడి ప్రవర్తన లాటిదే నని చెప్పటానికి!”.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అంతలో అతనికి మరో విషయం గుర్తొచ్చింది. సుముఖాసత్తి వంక చూసి, “అమ్మా, మీది కూడ శారదా పీఠమేనని చెప్పినట్టు గుర్తు. ఈ సుగాత్రీ శాలీనుల కథ నీకు తెలిసే ఉండాలి” అన్నాడతను.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">దానికామె అన్నది “తెలియక పోవటమేం? నేనే ఆ సుగాత్రిని!” అని!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అందరూ విభ్రాంతులై నిలబడిపోయారు!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఈ వింతలకి అంతు లేదా ఏమిటి?</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“అదెలా సాధ్యం? అంత పెద్ద మడుగులోంచి ఎలా బయటికొచ్చావు? నీకీ కొత్త పేరెందుకొచ్చింది?” అంటూ ప్రశ్నలు గుప్పించారు వాళ్ళు.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">“అలా నేను శతతాళదఘ్నంలో పడగానే నన్నో పెద్ద మొసలి మింగి అరిగించుకోలేక మర్నాడు కొలని ఒడ్డున పడి పొర్లుతూ నన్ను వెళ్ళగక్కిందట అక్కడ చూసిన వాళ్ళు తర్వాత చెప్పారు నాకు! అందరూ ఆశ్చర్యపడి చూస్తూండగా అలా బతికి బయటపడి నేను ఇంటికెళ్ళా. శారదా దేవిని పూజిస్తూ, వేదాంత, యోగ సాధనల్లో పొద్దుపుచ్చుతూ గడపటం సాగించాను. శాస్త్ర పండితుల్ని సుముఖులు అంటారు కదా! నేను ఎప్పుడూ అలాటి వాళ్ళ సాన్నిహిత్యంలో ఉన్నందు వల్ల నాకు సుముఖాసత్తి అనే పేరొచ్చింది.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">తర్వాత కొన్నాళ్ళకి మా అమ్మ చనిపోగా తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చాను.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">అక్కడి నుంచి కథ మీకు తెలిసిందే!</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఐతే ఆ కొలన్లో పడ్డ నా భర్త ఏమయ్యాడో మాత్రం నాకు ఇంతవరకు తెలీనేలేదు” అని వివరించింది సుముఖాసత్తి.</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">ఇప్పుడేం జరగబోతోందో మీరూహించలేరు! (ఇంకా వుంది)</span></p><p><span style="font-size: large;"><br /></span></p><p><span style="font-size: large;">👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿</span></p>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-193018468169937952020-10-12T23:06:00.001-07:002020-10-12T23:06:11.892-07:00🚩 కళాపూర్ణోదయం -3: రంభా గర్వభంగం.! 👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿...<p> </p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjha4K7NLXPsxhPDe0v-84alQvfRhwtrPWPtn1vz1uVXl41WZIMPUNcH8e_S0DW_LnhMTp99z2U-ihMMC9cIC4opbmJxIzFGU1QtPBjy0Px4CDkIZkgzEk9Gac3BkArBvSaORAwcutRclcA/s960/main-qimg-7761e165bbcbf2da02ef7935b5f8d7e2.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="545" data-original-width="960" height="408" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjha4K7NLXPsxhPDe0v-84alQvfRhwtrPWPtn1vz1uVXl41WZIMPUNcH8e_S0DW_LnhMTp99z2U-ihMMC9cIC4opbmJxIzFGU1QtPBjy0Px4CDkIZkgzEk9Gac3BkArBvSaORAwcutRclcA/w717-h408/main-qimg-7761e165bbcbf2da02ef7935b5f8d7e2.jpg" width="717" /></a></div><br />🚩 కళాపూర్ణోదయం -3: రంభా గర్వభంగం.!<p></p><p>👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿...</p><p><br /></p><p>(జరిగిన కథ ద్వారకలో కృష్ణుడి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు నారదుడు. అతని శిష్యుడు మణికంధరుడు, వాళ్ళకి ద్వారకలో పరిచయమైన కలభాషిణి కూడ సంగీతవిద్యలో ప్రవీణులయ్యారు.</p><p><br /></p><p>నారదుడు రంభకి గర్వభంగం చెయ్యాలనుకున్నాడు.</p><p><br /></p><p>నారదుడి ఉపదేశంతో మణికంధరుడు తీర్థయాత్రలకు బయల్దేరాడు.</p><p><br /></p><p>కలభాషిణి మేడ తోటలో ఆకాశం నుంచి దిగాడో సిద్ధుడు. అతని ద్వారా తన ప్రియుడు నలకూబరుణ్ణి కలుసుకోవాలని అతన్తో బయల్దేరింది కలభాషిణి. వాళ్ళిద్దరూ ఓ దేవి ఆలయం దగ్గర ఆగారు. పూలు తేవటానికి సిద్ధుడు వెళ్తే ఓ ముసలమ్మ వచ్చి కలభాషిణిని అక్కణ్ణించి పారిపొమ్మని హడావుడి చేస్తుంది. ఇక చదవండి.)</p><p><br /></p><p>🚩</p><p><br /></p><p>కలభాషిణికి ఒక్క క్షణం ఆమె ఏమంటున్నదీ అర్థం కాలేదు. కానీ వెంటనే తనున్న పరిసరాలు, ఆ సిద్ధుడు వచ్చిన దగ్గర్నుంచి జరిగిన విషయాలు గుర్తొచ్చేసరికి మెల్లగా అర్థం కావటం మొదలుపెట్టింది తన పరిస్థితి. “ఇప్పుడే నీ బాధంతా పోగొడతాను” అన్న మాటకి అర్థం ఏమిటో తెలుస్తోంది!</p><p><br /></p><p>ఆమెకి తన గత జీవితం అంతా ఒక్కసారిగా కళ్ళముందు మెదిలింది. అలాటి బతుక్కి ఇలాటి చావా?</p><p><br /></p><p>“అమ్మా, నువ్వన్నది నిజం. వీడు మాయావే, అనుమానం లేదు. అమాయకంగా వీడి ద్వారా నా కోరికొకటి సాధించుకుందామని వీడి చేతికి నేను చిక్కాను. కాని ఇప్పుడు పారిపొమ్మంటే ఎక్కడికి పోగల్ను? దూరదృష్టితో చూసి ఎక్కడున్నా పట్టుకోగలడు కదా!”</p><p><br /></p><p>“వాడి దూరదృష్టీ దూరశ్రవణాల విషయం నీకూ తెలుసన్నమాట!”</p><p><br /></p><p>“అదేగా ఇన్ని తిప్పలు తెచ్చిపెట్టింది?” అంటూ తన కథంతా ఆమెతో చెప్పుకుంది కలభాషిణి, ఇలాగైనా తనకి వస్తున్న ఆపద గురించి మరిచిపోవచ్చని.</p><p><br /></p><p>“నాకూ ఇప్పుడర్థమౌతోంది. కష్టపడి దూరదృష్టి సాధించిన దగ్గర్నుంచి “దీనికి తోడు రాజ్య సంపదలు కూడా ఉంటే ఎంత బావుండునో!” అనుకుంటూ, “అద్భుతమైన గానం, మిరుమిట్లు గొలిపే సౌందర్యం కలిసున్న వేశ్య ఎక్కడన్నా ఉంటుందా?” అని దూరదృష్టితో వెదకటం గమనించాను నేను. ఒక చిన్న కిన్నర పట్టుకుని ఎప్పుడూ వాయించుకుంటాడు కూడ అలాగ అద్భుతమైన గానాన్ని పోల్చుకోవచ్చునని.”</p><p><br /></p><p>“ఐతే ఇక్కడనే సంపాయించాడా దూరదృష్టి కూడ? దానికి ఎంతమందిని బలిచ్చాడో కదా ఈ దుష్టుడు! వాడొచ్చే లోగా కనీసం ఆ కథైనా చెప్పు వింటా. ఇంక చేసేదేముంది గనక?”</p><p><br /></p><p>“ఎంత ధైర్యవంతురాలివి! అదే నీకు మేలు చేస్తుంది. ఇక వాడి విషయం చెప్తా విను. అదృష్టవశాత్తూ దూరదృష్టి దూరశ్రవణాల కోసం వేరే ఎవర్నీ బాధించక్కర్లేదు. తన్ని తనే బాధించుకోవాలి. తన కళ్ళు తనే పీక్కుని, చెవుల్లో పదునైన నారసాలు పొడుచుకుని సాధించాడు వాటిని. ఇదుగో, ఆ వ్యవహారమంతా చూద్దువు రా!” అంటూ మంటపం చివర, సింహవాహనం దగ్గర శిలాస్తంభానికి వేలాడగట్టిన శస్త్రాల్ని, చురకత్తిని, గండకత్తెరనీ చూపించింది.</p><p><br /></p><p>“అదుగో, ఆ రాతిస్తంభం మీద ఫలానా కోరిక తీరాలంటే ఫలానా మార్గం అని రాసుంది. ఆ లిపి నీకర్థమౌతుందేమో చూడు” అని అటు తీసుకెళ్ళిందా వృద్ధురాలు.</p><p><br /></p><p>అక్కడ ఇలా రాసుంది</p><p><br /></p><p>“ఇక్కడ రెండేళ్ళ పాటు జితేంద్రియులై భువనేశ్వరీ మంత్రం జపిస్తే దేవి అన్ని కోరికలూ ఇస్తుంది!</p><p><br /></p><p>అలా కాదంటే దూరదృష్టి కావలసిన వాళ్ళు ఈ గోరుగంటితో కళ్ళు పొడుచుకోవాలి!</p><p><br /></p><p>దూరశ్రవణం కావలసిన వాళ్ళు ఈ ఘోరమైన నారసాన్ని చెవిలో పొడుచుకోవాలి!</p><p><br /></p><p>సాహిత్యంలో గొప్పవాళ్ళు కావాలంటే ఈ చురకత్తితో నాలిక కోసేసుకోవాలి!</p><p><br /></p><p>ఈ తళతళలాడే గండకత్తెరతో నడుం నరుక్కునే సాహసుడు ఒళ్ళు మళ్ళీ అతుక్కుని బతకటమే కాకుండా తనని చంపబోయేవాళ్ళని తనే చంపుతాడు!</p><p><br /></p><p>గొప్ప అందం, సంగీతం ఉన్న వేశ్యను బలి ఇచ్చిన వాడు మహారాజౌతాడు!”</p><p><br /></p><p>ఆ వాక్యంతో కలభాషిణి సందేహాలు పూర్తిగా తీరిపోయాయి.</p><p><br /></p><p>“పైనున్న వాటిలో ఏదీ చెయ్యలేని వృద్ధులు ఈ దేవి ముందు నిర్భయంగా మరణిస్తే వాళ్ళకి మళ్ళీ యవ్వనం వస్తుంది. వాళ్ళు మరణవేళ కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది!” అని అదంతా చదవటం పూర్తి చేసింది కలభాషిణి.</p><p><br /></p><p>చివరిభాగం విని నవ్వుతూ అన్నదా ముసలమ్మ “ఆ చివరి ముక్క వినే నేను ఇక్కడ ఉంటున్నది. అసలు నా పేరు సుముఖాసత్తి. కాశ్మీరంలో ప్రఖ్యాతమైన శారదా పీఠాన సరస్వతిని పూజించే పూజారి కూతుర్ని”.</p><p><br /></p><p>ఇంతలో సిద్ధుడక్కడికి వచ్చాడు పూజాసామాగ్రితో! “అమ్మాయ్! మనం త్వరగా పూజ ముగించుకుని వెళ్దాం. పద పద”.</p><p><br /></p><p>కలభాషిణిని ఒక్కసారిగా చావుభయం పట్టుకుంది. “ఒంటిగా పోలేను. నువ్వు కూడా నాతో రా” అన్నదా ముసలమ్మతో, వణుకుతూ!</p><p><br /></p><p>సిద్ధుడికి విషయం అంతా అర్థమైంది.</p><p><br /></p><p>“ఈ ముసిలివగ్గు నీకు తోడేమిటి? నేనున్నాగా!” అంటూ వాడు ఆమె కొప్పు పట్టుకు లాగబోతుంటే</p><p><br /></p><p>కలభాషిణి ప్రాణ భయంతో “ఓ అవ్వా, నీ బిడ్డ లాటి దాన్ని, కాపాడు” అని ఆమె వెనక నక్కుతుంటే</p><p><br /></p><p>ఆ ముసలమ్మ కూడా మనసు కరగ్గా “చంపొద్దు చంపొద్దు” అని వాడి చేతులు పట్టుకుంటే</p><p><br /></p><p>“లోపలికి రాకుండా అడ్డం పడితే ఆగుతానా? ఇది మాత్రం దేవి ఎదటేగా!” అంటూ ఆమె చేతులు పక్కకి నెట్టేసి ఒక చేత్తో కలభాషిణి జుట్టు పట్టుకుని రెండో చేత్తో ఒరలోంచి కత్తి దూసి</p><p><br /></p><p>“దేవీ! నీకిది అర్పణం” అని వాడు దేవతకి కత్తి చెయ్యెత్తి మొక్కి నరకబోయేంతలో</p><p><br /></p><p>“దీన్ని చంపితే ఆ దేవి మీదొట్టు” అంటూ కలభాషిణి మెడకి తన మెడని అడ్డం పెడుతూ ఆ ముసలమ్మ “ఓయ్ సిద్ధుడా! నా ఒట్టు దాటితే నీ కోరిక తీరదు గుర్తుంచుకో! ఓ మహాశక్తీ! నా మాట నిజమయ్యేట్టు చెయ్యి” అంటూండగా</p><p><br /></p><p>వాడు మహారోషంతో ముందు ఆ ముసలమ్మ మెడ నరికి</p><p><br /></p><p>విచిత్ర వేగంతో కలభాషిణి కొప్పు పట్టుకుని కత్తినెత్తే సరికి</p><p><br /></p><p>ఆ దేవి తన మీది ఒట్టుని దాటబోతున్న వాడెత్తిన చేతిని ఎత్తినట్టే పట్టుకుని వాణ్ణి దూరంగా విసిరెయ్యటంతో</p><p><br /></p><p>ఇంతలో కత్తి దెబ్బకి తన ముసలి శరీరం పోగా సుముఖాసత్తి విచిత్రంగా సరికొత్తగా యవ్వనంతో ప్రాణం పోసుకుని</p><p><br /></p><p>ఒక చేత్తో కత్తినీ ఇంకో చేత్తో కలభాషిణి జుత్తునీ పట్టుకుని దూరంగా ఎగిరిపోతున్న సిద్ధుణ్ణి, వాడితో కలభాషిణినీ చూసి, ఆ అమ్మాయి అవస్థ ఇంకా తీరలేదని బాధ పడుతూ క్రమంగా “సృష్టి క్రమం ఇంతే” అని గ్రహించి ఆ దుఃఖం తగ్గించుకుని దేవి వరంతో కలిగిన యవ్వనాన్ని వృథా చెయ్యకుండా ఆ దేవినే గురువుగా భావించి అక్కడే యోగవిద్యాభ్యాసం చేస్తుండగా</p><p><br /></p><p>కొన్నాళ్ళకి</p><p><br /></p><p>మళ్ళీ అక్కడికి వచ్చింది కలభాషిణి!</p><p><br /></p><p>అక్కడున్న అందమైన యువతిని చూసి ఆశ్చర్యంగా, “ఎవర్నువ్వు? ఎక్కడ్నించొచ్చావ్?” అనడిగింది కలభాషిణి. ఆమె నవ్వుతూ, “నేను ఇదివరకు నిన్ను రక్షించబోయి ఆ సిద్ధుడి కత్తికి బలై పోయిన సుముఖాసత్తినే! ఈ దేవి కరుణ వల్ల ఇలా మారా. నువ్వు ఎంతో దూరాన వెళ్ళి పడి కూడా ఏమీ హాని జరక్కుండా రావటమే ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది” అంది కలభాషిణితో.</p><p><br /></p><p>“నిజంగా ఆశ్చర్యం అంటే దేవిని మెప్పించి నువ్వు ఇలా యవ్వనాన్ని పొందటం! అలాటి నీ కరుణ ఉండగా నేను హాయిగా తిరిగిరావటంలో ఆశ్చర్యం ఏముంది? ఐనా జరిగినదంతా చెప్తాను విను” అని కలభాషిణి తన అనుభవాలు చెప్పబోతూ ఉండగా బుజాన వీణతో, రత్నమాలికతో కట్టిన పొడవాటి జుట్టుతో, గంభీరంగా వచ్చాడక్కడికి మణికంధరుడు!</p><p><br /></p><p>సంతోషం, విస్మయంతో తడబడుతూ అతనికి నమస్కరించింది కలభాషిణి. మణికంధరుడు కూడా ఆనందంలో తలమునకలయ్యాడు. “ఓహోహో! నిన్ను చూస్తే నా చుట్టాలందర్నీ చూసినట్లుంది! ఎప్పుడైనా నేను గుర్తొస్తానా? ద్వారకెక్కడ, ఈ ఆలయం ఎక్కడ? అంతా క్షేమమే కదా! ద్వారకలో విశేషాలేమిటి?” అంటూ పాతజ్ నాపకాలన్నీ కలబోసుకున్నా రిద్దరూ.</p><p><br /></p><p>“అన్నట్టు, అప్పుడు నీ మనసులో ఒక కోరిక ఉన్నట్టు గుర్తు. దాన్ని పెంచుకుంటూ వీణని వదిలేశావా ఏమిటి?” అని గుర్తు చేశాడు మణికంధరుడు.</p><p><br /></p><p>ఒక్క క్షణం పాటు సిగ్గుతో మొగ్గయ్యింది కలభాషిణి.</p><p><br /></p><p>కాని అంతలోనే తన పరిస్థితి తల్చుకుని, “ఏం చెప్పేది? దాని వల్లనే కదా నా వాళ్ళందర్నీ ద్వారకలో వదిలి నేనీ దిక్కు మాలిన చోట పడరాని పాట్లు పడింది?” అన్నది బాధగా. వాళ్ళు ద్వారక బయట విడిపోయిన దగ్గర్నించి సుముఖాసత్తి తనని దేవికి బలి కాకుండా కాపాడటం వరకు తన కథ చెప్పి, “ఈమే ఆ పుణ్యాత్మురాలు” అని ఆమెని చూపించింది. తర్వాత, “మరి నీ విషయం ఏమిటి? రంభ నీ తపస్సు చెడగొట్టటం గురించి మణిస్తంభుడు చెప్పాడు. అప్పట్నుంచి ఏమైందో వినాలని కుతూహలంగా ఉంది” అనడిగిందతన్ని.</p><p><br /></p><p>అంతలోనే అక్కడికి వచ్చాడు మణిస్తంభుడు!</p><p><br /></p><p>“ఇతనే నేను చెప్పిన సిద్ధుడు!” అన్నది కలభాషిణి మణికంధరుడితో.</p><p><br /></p><p>“ఇతనా?” ఎగతాళిగానూ, ఆశ్చర్యంగానూ అన్నాడు మణికంధరుడు అతనెవరో అదివరకే తెలిసినట్లు!</p><p><br /></p><p>అదెలా సాధ్యం?</p><p><br /></p><p>కలభాషిణి, మణికంధరుడు అక్కడే ఉండటం, సుముఖాసత్తికి యవ్వనం రావటం మణిస్తంభుడికి ఇదంతా మాయగా ఉంది, ఇంద్రజాలంలా ఉంది! (కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది అతనికి అంత ఆశ్చర్యం ఎందుకో!)</p><p><br /></p><p>“సిద్ధుడా! నువ్వూ కలభాషిణీ ఎగిరి వెళ్ళి ఎక్కడ పడ్డారు? అక్కడేం జరిగింది? చూస్తే మీ అందరి దగ్గరా తలో కథ వున్నట్టుంది” అంది సుముఖాసత్తి కుతూహలంగా.</p><p><br /></p><p>“తప్పకుండా చెప్తాను. అబ్బో, ఎన్నెన్ని విచిత్రాలు చూశాననుకున్నావ్! ఇప్పుడు వెంటనే అదంతా ఎవరికన్నా చెప్పకపోతే నా పొట్ట ఉబ్బిపోయేట్టుంది తెలుసా?” అంటూ తను చూసిన వింతలు విడ్డూరాల కథని వినిపించటం మొదలెట్టాడు మణిస్తంభుడు.</p><p><br /></p><p>“నేను కన్నూ మిన్నూ కానకుండా నువ్వు దేవి మీద వేసిన ఒట్టుని కూడ లెక్కచెయ్యకుండా ఈ కలభాషిణిని చంపబొయ్యాను కదా! దేవి ఆ చేతినలా పట్టుకుని విసిరేసింది నన్ను. ఐతే నేనొక చేత్తో జుట్టు పట్టుకుని ఉన్నందువల్లనేమో, ఈమె కూడ నాతో పాటు ఎగిరొచ్చింది. అలా వెళ్ళి ఈమే, నేనూ ఇంకెక్కడా చోటు లేనట్టు వెళ్ళి వెళ్ళి ఈ మణికంధరుడి తపోవనంలో ఒక మెత్తటి పూలపాన్పు మీద పడ్డాం, అదేం చిత్రమో గాని! నిజంగా దేవి దయచూపించి అలా పడేసింది గాని లేకపోతే ఏమయ్యేవాళ్ళమో మేము! అలా ఒక చేత్తో కత్తి పట్టుకుని నేనింకా రెండో చేత్తో ఆమె జుత్తు పట్టుకుని ఉండటంతో ఈ కలభాషిణి గడగడ వణకటం మొదలెట్టింది.</p><p><br /></p><p>అంత దగ్గరగా ఆమెని అలా చూసేసరికి చెప్పొద్దూ నాలో మదన వికారం కలిగి వెంటనే ఆమెని కౌగిలించు కున్నాను చేసిన పాపం చెప్తే పోతుందంటారు.</p><p><br /></p><p>దాంతో కలభాషిణి రక్షించండని కేకలు పెట్టింది.</p><p><br /></p><p>అప్పుడేమయిందీ “భయం వద్దు, నేనొస్తున్నా. ఎవడ్రా అక్కడ అసహాయురాలైన స్త్రీని బలాత్కరిస్తున్న వాడు! వాడెక్కడున్నా పట్టుకుని వాడి మెడ విరిచేస్తా” అనే మాటల్తోటే పరిగెత్తుకొచ్చాడక్కడికి నలకూబరుడు!</p><p><br /></p><p>అతన్ని చూడ్డంతోటే ఈమెని వదిలేసి నేను పారిపోయా. ఐనా ఊరుకోక నన్ను తరిమి పట్టుకుని, “ఎవడ్రా నువ్వు? పద, నువ్వు బలాత్కరిస్తున్న స్త్రీ ఎక్కడుందో చూపించు. అప్పుడు నిన్ను ఏం చెయ్యాలో అది చేస్తా” అని నన్ను ఈడ్చుకొస్తూంటే ఎదురుగా వచ్చింది</p><p><br /></p><p>రంభ!</p><p><br /></p><p>చెదిరిన బట్టలు సర్దుకుంటూ, జారిన జుట్టు ముడేసుకుంటూ, ముఖం మీద పడ్డ వెంట్రుకులు సరిజేసుకుంటూ!</p><p><br /></p><p>రావటమే “నీకెన్ని సార్లు చెప్పినా వినవు కదా! చేతులో క్తౖతెనా లేకుండా ఇలా పరిగెత్తటమేనా? బాగానే ఉంది సంబడం” అంటూ నన్ను చూసి, “వీడేనా ఆ అన్యాయం చెయ్యబోయింది? ఐనా మన్మథుడి దెబ్బకి ఎవరికైనా మతిపోతుందిలే! ఇంతకీ అదెక్కడ?” అంది రంభ.</p><p><br /></p><p>“అందుకేగా వీణ్ణి లాక్కొస్తున్నది!” అని నలకూబరుడంటే,</p><p><br /></p><p>“సరే, ఎక్కడికీ పోడు గాని అతని చెయ్యి వదిలెయ్యి” అని నన్ను విడిపించింది.</p><p><br /></p><p>అందరం కలభాషిణిని వెదుక్కుంటూ తిరిగాం గాని ఎక్కడా ఆమె కనిపించనే లేదు!</p><p><br /></p><p>నలకూబరుడు నా కత్తి తీసుకుని “ఆవిడని ఏం చేశావ్ చెప్పు” అని నన్ను గద్దించాడు.</p><p><br /></p><p>రంభ కల్పించుకుని, “పోన్లే. తనే ఎక్కడికో వెళ్ళుంటుంది. మనం వెదుకుదాం పద” అంటూ అతన్ని దగ్గరగా లాక్కుని తీసుకెళ్ళింది. అతను నా కత్తిని ఎక్కడన్నా వదుల్తాడేమో తీసుకోవచ్చునని నేను కూడా జాగ్రత్తగా వాళ్ళ వెనకనే వెళ్ళా.</p><p><br /></p><p>అలా వెళ్తూనే నా దూరదృష్టితో ప్రపంచం అంతా వెదికినా ఎక్కడా కూడ కనపడ లేదనుకో ఈ కలభాషిణి, ఎలా మాయమయ్యిందో గాని!</p><p><br /></p><p>తర్వాత వాళ్ళిద్దరూ రతిక్రీడల్లోకి దిగారు. నేను దూరంగా ఉండి గమనిస్తున్నా.</p><p><br /></p><p>ఇంతలో జరిగింది నా మతిపోయే సంఘటన!</p><p><br /></p><p>అలా నే చూస్తుండగానే అక్కడికి వచ్చింది ఇంకొక రంభ!</p><p><br /></p><p>బిత్తరపోయింది అక్కడి పరిస్థితి చూసి!</p><p><br /></p><p>నలకూబరుడూ ఆశ్చర్యపోయాడు ఆమెని చూసి!</p><p><br /></p><p>వాళ్ళందర్నీ చూసి నాకు కళ్ళు తిరిగాయి!</p><p><br /></p><p>నలకూబరుడు వాళ్ళిద్దర్నీ ఎగాదిగా చూశాడు చాలా సేపు. కానీ, వాళ్ళలో ఏమాత్రం తేడా కనిపించలేదతనికి!</p><p><br /></p><p>“ఏమిటీ ఇటూ అటూ చూస్తున్నావ్! ఏమిటి నీ ఉద్దేశ్యం?” అని గద్దించిందతని పక్కనున్న రంభ.</p><p><br /></p><p>“ఒకరికొకరు ప్రతిబింబాల్లా ఉన్నారు మీరు! నువ్వు నా పక్కనే లేకపోతే మీలో ఎవరు ఎవరో చెప్పటం కూడా అసాధ్యంలా ఉంది” అన్నాడతను తన్లో తను మాట్టాడుకుంటున్నట్టు.</p><p><br /></p><p>“అట్లైతే నిన్ను వదలకుండా అంటి పెట్టుకునే ఉంటాను. అదివరకో రాక్షసి సీతనీ రాముడినీ విడగొట్టటానికి వచ్చిన కథ వింటాం కదా! అలాటిదే ఇదీ! ఈ చుట్టుపక్కల లేకుండా వెళ్ళగొడదాం పట్టు. కాని నువ్వు మాత్రం కదలొద్దు” అంటూ అతన్ని కౌగిలించుకుంది.</p><p><br /></p><p>ముక్కున వేలేసుకుని తల విదిలించి ఉసూరు మన్నది కొత్తగా వచ్చిన రంభ.</p><p><br /></p><p>ఆమెని చూసి నలకూబరుడు “ఎవర్నువ్వు? నా ప్రేయసి రూపంలో ఎందుకున్నావ్ ? ఎందుకీ నిట్టూర్పులు? నువ్వు రాక్షసివా పిశాచివా చప్పున చెప్పు నీ విషయమేమిటో!” అన్నాడు.</p><p><br /></p><p>“ఏమంటానికీ ఏముంది? దానికీ నాకూ తేడా చూపించే ఉపాయం ఆలోచిస్తున్నా. ఇదెవరో సరిగ్గా నాలానే ఉంది! చల్లటి సురపొన్న చెట్టుకింద పూల పానుపు మీద మనం ఉంటే పడమట నుంచి ఒక స్త్రీ ఆర్తనాదం వినపడి నువ్వు పరిగెత్తావు. నేనూ నీతో వద్దామని బయల్దేరి అంతలో ఎదురుగా ఒక జింక వస్తే అపశకునం అని కాసేపు దాన్ని చూస్తూ అలాగే నిలబడ్డా. ఇంతలో ఇది నా వేషం ఎలా వేసిందో నాకర్థం కావటం లేదు” అందా రెండో రంభ ఆలోచిస్తూ.</p><p><br /></p><p>“చూశావా, మన విషయం అంతా చూసినట్లే చెప్పేస్తోంది! కన్ను తెరిచుండగానే కనుపాపని దొంగతనం చేసేంత మునిముచ్చు లాగా ఉంది. దీని దగ్గర ఉండటమే మనకి మంచిది కాదు. ఇక్కడి నుంచి ఎటన్నా వెళ్దాం పద” అంటూ తొందర చేసింది తొలి రంభ.</p><p><br /></p><p>“ఆహా! ఇల్లలగ్గానే పండగయిందా? అతన్ని అంత తేలిగ్గా వదిలేసుకుంటాననుకున్నావా! అతన్ని వదిలి పక్కకి రా ముందు, నీ అంతు చూస్తాను” అంటూ యుద్ధానికి దిగింది రెండో రంభ.</p><p><br /></p><p>మొదటి రంభ కూడ ఇంక ఊరుకోలేకపోయింది!</p><p><br /></p><p>ఇద్దరూ మూతులూ తిప్పుకుంటూ మెటికలు విరుచుకుంటూ నువ్వెంతంటే నువ్వెంతని తిట్టుకున్నారు నలకూబరుడు ఎంత ప్రయత్నించినా ఆగకుండా.</p><p><br /></p><p>ఈ పోట్లాటతో తన ఆకలి తీరుతోందని ఆనందిస్తూ అక్కడికి వచ్చాడు</p><p><br /></p><p>నారదుడు హాయిగా వీణ మీటుకుంటూ!</p><p><br /></p><p>ముగ్గురూ వెళ్ళి అతనికి నమస్కరింఛారు.</p><p><br /></p><p>నారదుడికి మహా ఉల్లాసంగా ఉంది!</p><p><br /></p><p>ఔను మరి తన ముందు మిడిసిపడ్డ రంభకి పొగరు అణుగుతోంది!</p><p><br /></p><p>“నలకూబరా! వదలని ప్రేమతో వర్ధిల్లండని మిమ్మల్ని దీవించాలని ఉందయ్యా! మరి వీళ్ళలో నీ ప్రేయసి ఎవరో చెప్తే ఆపని చేసేసి నా దారిన నేను పోతా. కానీ, ఇదేదో చాలా గమ్మత్తుగా ఉందే! తనకంటే నీకింకో ప్రేయసి లేదని రంభకి గర్వంగా ఉందని నువ్వే రెండో రంభని సృష్టించావో లేకపోతే నీతో ఆనందాలు అనుభవించటానికి ఒక్క శరీరం చాలటం లేదని రంభే సృష్టించిందో గాని మొత్తానికి ఇద్దరికీ భలే పోట్లాటపెట్టావయ్యా! చాలా సేపట్నుంచి ఆకాశంలో నిలబడి చూస్తున్నాను మీ వ్యవహారం అంతా!” అన్నాడు నారదుడు చిలిపిగా.</p><p><br /></p><p>“అయ్యో స్వామీ!నేనేం పోట్లాడించాను? ఎవరెవరో తెలీక సతమతమౌతూ వుంటే!” అని వాపోయాడు నలకూబరుడు.</p><p><br /></p><p>తన పక్కనే ఉన్న రంభను చూపించి, “ఈమే ఇంతకు ముందు వరకు నాతో ఉన్నది; ఆ రెండో ఆమె తర్వాత వచ్చింది. వీళ్ళలో ఎవరు ఎవరో నాకేమీ అర్థం కావటం లేదు” అన్నాడు.</p><p><br /></p><p>అప్పుడు రెండో రంభ, “మహానుభావా! మీరప్పుడు ద్వారకలో అన్న మాటల వల్లనే ఇంతా జరిగింది!” అంది నిష్టూరంగా. మొదటి రంభ కూడ, “ఔను స్వామీ! మీరప్పుడు ద్వారకలో అన్న మాటల వల్లనే ఇంతా జరిగింది!” అన్నది.</p><p><br /></p><p>హాయిగా నవ్వుతూ అన్నాడు నారదుడు, “ఔను. మీరిద్దరన్నదీ నిజమే!” అని.</p><p><br /></p><p>నలకూబరుడి ఓపిక నశిస్తోంది.</p><p><br /></p><p>“ఇద్దరిదీ నిజమెలా ఐందో కాస్త చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది!” అనడిగాడతన్ని.</p><p><br /></p><p>“ఏముందీ, వీళ్ళలో ఒకతె గర్వంగా మాట్లాడితే చూడలేక నీకు ముందు ముందు సవతి రావొచ్చులే అన్నాను. ఈవిధంగా అది నిజమైంది. ఇక రెండవది రంభ రూపంలో తన ప్రియుణ్ణి కలవాలనుకుని ఒక సందర్భంలో నా దగ్గర వరం తీసుకుంది. ఆమె విషయంలో ఇప్పుడా వరం నిజమైంది” అన్నాడు నారదుడు యుక్తిగా! (ఒక్క క్షణం ఆగుదాం ఇక్కడ! ఇప్పటికి ఆ ఇద్దర్లో ఒకరు రంభ, మరొకరు ???? అని తెలిసిపోయింది కదా! అనుమానం ఉంటే కథ మొదటికి వెళ్ళి చూడండి!)</p><p><br /></p><p>“సరే స్వామీ! బాగానే ఉంది. ఐతే వీళ్ళలో ఎవరి విషయంలో ఏది నిజమైందో చెప్తే అప్పుడు ఎవరో నిజమో ఎవరో కాదో తెలిసి పోతుంది” అన్నాడు నలకూబరుడు ఆశగా.</p><p><br /></p><p>అంత తేలిగ్గా దొరుకుతాడా నారదుడు!</p><p><br /></p><p>“ఈ ప్రపంచంలో నిజమేమిటీ అబద్ధమేమిటి? ఆ మాటకొస్తే నీ రూపం నిజమైందా? అంతా మాయ. ఏమైనా అదృష్టం అంటే నీది. ఈ ఇద్దర్లో ఒకరికొకర్ని పోటీగా ఉంచి ఇద్దర్నీ నీ అదుపులో ఉంచుకోవచ్చు, ఇద్దరితోటీ హాయిగా ఉండొచ్చు!”.</p><p><br /></p><p>వ్యవహారం దూరం వెళ్తున్నదని వెంటనే నారదుణ్ణి అక్కడ్నించి పంపదల్చుకున్నాడు నలకూబరుడు.</p><p><br /></p><p>“స్వామీ! మీలాటి పెద్దల్ని ఎక్కువ సేపుంచి ఏంమాట్లాడితే ఏమొస్తుందో! ఇప్పటికే చాలా సేపు ఉంచాం మిమ్మల్ని” అనటంతో నారదుడు విలాసంగా నవ్వుకుంటూ “అలాగే, నీ జాగ్రత్తలో నువ్వుండు మరి!” అని అక్కడ్నించి నిష్క్రమించాడు.</p><p><br /></p><p>అప్పుడిక నలకూబరుడు మొదటి రంభని తీసుకుని, “ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం పద” అంటూ రెండో రంభతో, “నీవన్నీ మాయలుగా కన్పిస్తున్నాయి.నిజం తేల్చగలిగే సాక్షి ఎవరన్నా ఉంటే తెచ్చుకో పో” అని తిరస్కారంగా అంటే</p><p><br /></p><p>మొదటి రంభ కూడ “ఒక జంట ఏకాంతంగా ఉన్నప్పుడు యిట్లా వచ్చి అల్లరి చెయ్యటానికి సిగ్గు లేదూ? ఆశకైనా అంతుండాలి” అని యీసడిస్తే</p><p><br /></p><p>కోపం వచ్చిన రెండో రంభ, “నాకేం, కుబేరుడు లేడా, ఇంద్రుడు లేడా, బ్రహ్మ లేడా, ధర్మం నిలబెట్టటానికి ఒక్కరైనా ముందుకు రారా?” అంటే</p><p><br /></p><p>మొదటి రంభ గర్వంగా “నీ దిక్కున్న చోట చెప్పుకో పో! నీ అరిచేతికి పళ్ళొచ్చినప్పుడు కరుద్దువ్ లే నన్ను” అనటంతో</p><p><br /></p><p>రోషంతో రెండో రంభ “తొందర పడకు, నీ నెత్తినే పొద్దు పొడిచిందా! చూస్తా!” అని కొద్ది అడుగులు వేసి అతని వియోగం భరించలేక ఆగి, ఆలోచించి, “నువ్విక్కడ అతన్తో కులుకుతుంటే నే వెళ్ళి వాళ్ళకీ వీళ్ళకీ ఎందుకు మొర పెట్టుకోవాలి? నువ్వూ రా దేవసభకి! వెళ్ళి అక్కడే తేల్చుకుందాం” అని మొదటి రంభ కొంగు పట్టుకుని తీవ్రంగా లాగుతుంటే,</p><p><br /></p><p>“చూశావా దీని ఆగడం, యిది రాక్షసి కాక స్త్రీనా? అసలు దీంతో ఇంతసేపు మాట్టాడ్డం మనదే తప్పు” అని మొదటి రంభ అంటే,</p><p><br /></p><p>“మనకేం! పెద్దల సభలోనే దాని అంతు తేలుద్దాం పద” అని నలకూబరుడు కూడా అనటంతో కొంత ఉత్సాహం పుంజుకున్న రెండో రంభ “నిన్ను వదుల్తాననుకున్నావా? కదులు, దేవసభకి రావాల్సిందే!” అని గద్దించటంతో</p><p><br /></p><p>కొంచెం ఆలోచించి మొదటి రంభ “ఇంత బతుకూ బతికి ఇంటి వెనక చచ్చినట్టు అప్సరసల్లో అందరికన్నా గొప్పదాన్నై ఉండి, ఊర్వశీ మేనకల్లాంటి వాళ్ళ చేత మర్యాదలు చేయించుకుంటూ ఎప్పుడూ ఎవరి చేతా వేలెత్తి చూపించుకోకుండా బతికిన నేను యిప్పుడీ సవతి పోరు తీర్చమని ఇంద్రసభకి వెళ్ళాలా? నా బతుకింత నవ్వుల పాలు కావాల్సిందేనా? ఇప్పుడే కాదు ఇంకెప్పుడూ నేను భూమిని విడిచిపెట్టి రాను” అని ఖరాఖండిగా తీర్మానించటంతో</p><p><br /></p><p>రెండో రంభ ఇంకా విజృంభించి, “చూశావా దీని టక్కులు? వస్తే తన మోసం బయటపడుతుందని దేవసభకి రానంటున్నది; అసలు దీనికి ఆకాశగమనం ఉన్నదో లేదో కూడా అనుమానమే! ఇంతసేపూ దీన్ని నమ్మినందుకు నిన్ననాలి” అని ఊదరగొట్టెయ్యటంతో</p><p><br /></p><p>నలకూబరుడిక్కూడా పరిస్థితి అర్థమై మొదటి రంభని “ఓసి మాయలాడీ!” అని మెడబట్టి నెట్టటం,</p><p><br /></p><p>రెండో రంభ “ఇంత సేపూ నన్ను మన్మథుడి కత్తికి బలిచేశావు గనక నువ్వు కత్తివేటుకే చస్తావ్!” అని శపించటంతో</p><p><br /></p><p>ఆ వ్యవహారం ఓ కొలిక్కి చేరింది.</p><p><br /></p><p>నలకూబరుడింకా ఆ మాయ రంభని “ఎవర్నువ్వు? నీ పేరేమిటి?” అని గద్దిస్తుంటే అసలు రంభ “దాన్నిక పోనీయ్! నా కోరిక సంగతి చూడు ముందు” అంటూ అతన్ని లాక్కుపోయింది”</p><p><br /></p><p>అంటూ వాళ్ళకి మణికంధరుడి తపోవనంలో తను చూసిన వింతలూ విడ్డూరాలు చెప్తున్న మణిస్తంభుణ్ణి “ఇది వరకెప్పుడూ కనీ వినీ ఎరగని కథ చెప్తున్నావ్! మరి ఆ తర్వాత ఏంజరిగింది?” అనడిగింది సుముఖాసత్తి.</p><p><br /></p><p>“అప్పుడే ఏమైంది? అసలు కథ ఇంకా ముందుంది!” అంటూ మళ్ళీ ప్రారంభించాడు మణిస్తంభుడు ఉత్సాహంగా!</p><p><br /></p><p>“అలా రంభానలకూబరులు వెళ్ళి ఒక పూలపానుపు మీద మదనక్రీడల్లో ఆనందిస్తూ ఉండగా</p><p><br /></p><p>ఇంకో నలకూబరుడు వచ్చాడక్కడికి, “నా రూపంలో ఎవడ్రా రంభతో ఉన్నాట్ట!” అని కేకలేస్తూ.</p><p><br /></p><p>చెప్పొద్దూ, ఇదంతా చూస్తున్న నాకు ఒళ్ళు జలదరించింది.</p><p><br /></p><p>ఒకదాని వెంట ఒకటిగా ఇలా మాయలు జరిగిపోతుంటే ఈ ప్రపంచం ఏమౌతుందో అని భయమేసింది!</p><p><br /></p><p>అతనలా వచ్చేసరికి రంభ నలకూబరుడితో, “చూశావా, నీలాటి వాడొకడొస్తున్నాడు! ఇప్పటి దాకా నారూపంలో వచ్చి మనల్ని తిప్పలు పెట్టింది చాలక ఎవడో రాక్షసుడు రకరకాల మాయలు పన్నుతున్నట్టున్నాడు” అంటూండగా,</p><p><br /></p><p>“అదేమిటి రంభా ఆ మాటలు? అసలు నలకూబరుణ్ణి నేను! వాడెవడో మాయావి. నామాట నమ్మనంటావా, చూస్తుండు ఇప్పుడే నా కత్తితో వీణ్ణి తెగనరుకుతా. ఆ తర్వాత తేల్చుకుందూ గాని నేనో వాడో” అని రెండో నలకూబరుడు గర్జించేసరికి</p><p><br /></p><p>రంభ భయంతో తన ప్రియుడి కంఠం కౌగిలించుకుని “దేవతలారా, రక్షించండి! ఎవడో రాక్షసుడు నిరాయుధుడిగా ఉన్న నా ప్రియుణ్ణి చంపబోతున్నాడు” అని ఏడ్చి గగ్గోలు పెడుతుండగా</p><p><br /></p><p>రెండో నలకూబరుడు నవ్వి “అరరే, నన్నే రాక్షసుణ్ణి చేశావా! భయ పడకు, నిరాయుధుణ్ణి చంపను. కావాలంటే తన కత్తి తెచ్చుకోమను. యుద్ధం అంటే ఎవరు గెలుస్తారో ఎవరు చస్తారో నిజం నలకూబరుడు చస్తే ఎలాగ అని నీకు భయమైతే మాలో ఎవరు నిజమో తెలిసే దాకా ఆగి అప్పుడే యుద్ధం చేస్తాలే. ఈ లోగా నువ్వు రహస్యాలడిగో, మాలో తేడాలు పరికించి చూసో తేల్చు… ఐతే ఒక మాట. నా ఎదురుగా నువ్వు వాణ్ణి కౌగిలించటం నేను భరించలేక పోతున్నా! కనక నాకు ఆవేశం వచ్చి వాణ్ణి చంపకుండా ఉండాలంటే నువ్వు వాడికి దూరంగా ఉండు” అంటే ఎందుకైనా మంచిదని రంభ ఇద్దరికీ మధ్య దూరంలో నిలబడి ఎంత చూసినా ఏమీ తేడా కనపడక బిత్తరపోయి చూస్తుంటే</p><p><br /></p><p>రెండో నలకూబరుడన్నాడు, “ఇంద్రుడు పంపితే నువ్వు మణికంధరుడి తపస్సు చెడగొట్టటానికి వచ్చావు కదా! వాణ్ణి ఏ అడివికి తోలేశావు? మధ్యలో వీడెక్కడ తగులుకున్నాడు? దేవకార్యం చెడుతుందని నేను నీ విరహంతో చస్తూ చివరికి ఏమన్నా కానీ అని వచ్చి ఇక్కడికి దగ్గర్లోనే ఒక తోటలో నీ కోసం ఎదురుచూస్తూ ఉంటే నువ్విక్కడ వీడితో గడుపుతున్నావ్! ఇంతకు ముందే నారదుడు వచ్చి “నువ్విక్కడ విరహంలో మునుగుతూ కూర్చుంటే అక్కడెవడో నీలాటి వాడే రంభతో సుఖాలు అనుభవిస్తున్నాడ”ని చెప్పేదాకా తెలీలేదు. ఇప్పుడు చెప్పు వీడు ఎప్పుడు ఎక్కడ దాపరించాడు నీకు?”</p><p><br /></p><p>అని తన సొద చెప్పుకుంటే ఏమీ తోచని రంభ</p><p><br /></p><p>“ఏం చెప్పమంటావ్?” అని మొదటి నలకూబరుడి వంక చూస్తే అతను,</p><p><br /></p><p>“ఏమిటలా చూస్తున్నావ్? గుర్తులేదా నీకు అదివరకు నారదుడన్నాడు కదా నీలాటిది నిన్నూ నాలాటి వాడు నన్నూ పట్టుకుని తిప్పలు పెడతారని! ఆ మాట ఇలా నిజమైంది. నీకేం భయం వద్దు. నేనిప్పుడే వెళ్ళి నా కత్తి తీసుకొచ్చి వీడి అంతు చూస్తాను” అని బయల్దేరబోతుంటే రెండో వాడు,</p><p><br /></p><p>“అంత పోటుగాడివైతే ఇప్పుడే రా, నా కత్తి కూడా పారేస్తాను,నీ సంగతేమిటో చూస్తాను” అంటూ కత్తి పారేసి మల్ల యుద్ధానికి దిగటంతో ఇద్దరూ హోరాహోరీ బాహాబాహీ ముష్టాముష్టీ తలపడితే</p><p><br /></p><p>వాళ్ళలో పచ్చ దట్టీ ఉన్నవాడు తన ప్రియుడనీ చంద్రకావి దట్టీ ఉన్నవాడు రెండో వాడనీ గుర్తు పెట్టుకుని రంభ చూస్తూండగా రకరకాల విన్యాసాల్తో ఎంతో సేపు పోరాడి ఇద్దరూ అలిసిపోయి చతికిల పడగా</p><p><br /></p><p>రంభకి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది!</p><p><br /></p><p>“మీ యుద్ధం ఆపండింక! నేనొక రహస్యవిషయం అడగబోతున్నా. దాన్ని బట్టి ఎవరు నిజమో తెలుస్తుంది” అని ఇద్దర్నీ విడివిడిగా తీసుకెళ్ళి,</p><p><br /></p><p>“మనం కళాపూర్ణుడి విషయం ఏ సందర్భంలో మాట్లాడుకున్నాం?” అని అడిగేసరికి రెండో వాడు! టక్కుమని సమాధానం చెప్పాడు!</p><p><br /></p><p>ఆమె అప్పటి దాకా నిజం నలకూబరుడు అనుకుంటున్న మొదటి వాడు తెల్లబోయి నిలబడ్డాడు!</p><p><br /></p><p>“అయ్యయ్యో! ఇందాకట్నుంచి నువ్వే అసలు నలకూబరుడివనుకున్నా కదా! ఓరి మాయావీ!” అని రెండో వాడి దగ్గరికి పరిగెత్తింది రంభ కంగారుగా.</p><p><br /></p><p>మహాకోపంతో వాణ్ణి అల్పాయుష్కుణ్ణి కమ్మని శపించాడు నలకూబరుడు!</p><p><br /></p><p>రంభ “అసలెవరివి నువ్వు? ఎందుకీ వేషం వేశావ్?” అనడుగుతుంటే, “ఐన ఆలస్యం చాలకనా ఇంకా వాడితో మాటలు? పద పోదాం” అని నలకూబరుడు ఆమెని తీసుకుని వెళ్ళిపోయాడు.</p><p><br /></p><p>మాయానలకూబరుడు కొంతసేపు నిట్టూరుస్తూ నిలబడి మణికంధరుడి పర్ణశాల వైపుకి వెళ్తుంటే అతను వదిలేసిన నా కత్తిని తీసుకుని ఆనందంగా ఇక్కడికి వచ్చాన్నేను! పైగా నా గురువు గారు ఈ కత్తిని నాకిస్తూ దీంతో నువ్వు ఎవర్ని చంపబోతావో వాళ్ళని ఎప్పటికైనా ఈ కత్తే చంపుతుందన్నారు. నేను దీంతో కలభాషిణ్ణి చంపాలనుకున్నా గనక అప్పటికి తప్పించుకున్నా …” అని ఆపైన అనటానికి నోర్రాక దిక్కులు చూడసాగాడు మణిస్తంభుడు.</p><p><br /></p><p>“నీకు జంకేం అక్కర్లేదు. ఎలా జరగాలో అలా జరుగుతుంది లే!” అంది కలభాషిణి ధైర్యంగా.</p><p><br /></p><p>“వివేకవంతురాలివి గనక అలా అనగలిగావ్! సరే గాని, మరి నీ కథేమిటో చెప్పు. నిన్ను వదిలేసి నేను పారిపోయాక ఎక్కడ వెదికినా కనపడలేదు నువ్వు! ఏమయ్యావ్, ఎలా మాయమయ్యావ్?” అనడిగాడు మణిస్తంభుడు.</p><p><br /></p><p>నవ్వింది కలభాషిణి, “నా కథంతా నువ్వే చెప్పేశావ్! ఇంక నేను చెప్పాల్సింది ఏముంది?” అంటూ!</p><p><br /></p><p>“ఆ నలకూబరుడు నన్ను చూపించమని నిన్ను లాక్కొస్తుంటే మీకు ఎదురు పడ్డ రంభ ఎవరో కాదు, నేనే!</p><p><br /></p><p>నిన్ను విడిపించి అతన్ని తీసుకెళ్ళి అతన్తో కొంతసేపు రతిక్రీడలు సాగించా. ఇంతలో అసలు రంభ అక్కడికి రావటం, ఆమెతో పోట్లాడి చివరికి బయటపడి కత్తి వేటుతో చచ్చే శాపం తెచ్చుకోవటం అన్నీ నువ్వే చెప్పేశావ్!” అని చెప్పింది కలభాషిణి అందర్నీ ఆశ్చర్యంలో ముంచుతూ!</p><p><br /></p><p>“అలానా! మరి రంభగా మారే శక్తి నీకెలా వచ్చింది?” అనడిగాడు మణిస్తంభుడు నమ్మలేక పోతూ!</p><p><br /></p><p>“అది నారదుడిచ్చిన వరం. జింక ఎదురొచ్చి రంభ నలకూబరుడి వెంట వెళ్ళకుండా ఆగటంతో ఇదే సమయమనుకుని నేను ఆమె రూపంలో అతన్ని దక్కించుకున్నాను. పాపం, ఆ నారదుల వారు కూడ నా మొహం చూసి నేనెవర్నో బయటపెట్టకుండా వెళ్ళిపోయారు. … చివరికి ఎలాగూ శాపం రానే వచ్చింది గనక అదేదో ఈ దేవి దగ్గరే అనుభవిద్దామని ఇక్కడికొచ్చానిప్పుడు. మీ గురువు గారి మాట నిజం కావటానికేనేమో నువ్వూ నేనూ కూడా ఇక్కడికే చేరాం!” అన్నది కలభాషిణి తన్లో తను మాట్టాడుకుంటున్నట్టు!</p><p><br /></p><p>అంతలోనే ఆమెకి మరో విషయం గుర్తొచ్చింది.</p><p><br /></p><p>దాన్తో పాటు ఒక పెద్ద నిట్టూర్పు కూడ బయటికొచ్చింది.</p><p><br /></p><p>“నేను పడ్డ ప్రయాసకి కనీసం నలకూబరుడన్నా దక్కాడని ఆనందిస్తుంటే, ఆ తరవాత అసలు నలకూబరుడొచ్చి నాతో ఉన్నవాణ్ణి శపించాడని చెప్తున్నావ్ నువ్వు! ఇంతకూ ఆ మాయలమారి మోసగాడు ఎవడో!” అని కలభాషిణి అంటూంటే</p><p><br /></p><p>“అట్టె, అట్టె! ఇంకేమీ అనొద్దు!</p><p><br /></p><p>అలా నలకూబరుడి రూపంలో ఉంది ఎవరో గాదు నేనే!” అన్నాడు మణికంధరుడు నవ్వుతూ!</p><p><br /></p><p>(ఇంకా ఉంది)</p><p><br /></p><p>👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿</p>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-55618192375684529312020-10-12T22:54:00.000-07:002020-10-12T22:54:03.771-07:00🚩కళాపూర్ణోదయం -2: మణికంధరుడి తపోభంగం! <div style="text-align: left;"><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh5E4v1C3Gt3BHtaPZ62yTrX1lDmU2PSRWY2PabAXgn5iZ45Axc0FJTOa6V_tqot4U8cj8lsz93UO3Ivfe0HK6xetzskWRzFEk3CXdyx1qDBWneQ5oBGqmd3QLsNwu_im2Ej49ldCpPl3on/s566/121180665_5184162071609150_230201505352651126_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="566" data-original-width="438" height="809" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh5E4v1C3Gt3BHtaPZ62yTrX1lDmU2PSRWY2PabAXgn5iZ45Axc0FJTOa6V_tqot4U8cj8lsz93UO3Ivfe0HK6xetzskWRzFEk3CXdyx1qDBWneQ5oBGqmd3QLsNwu_im2Ej49ldCpPl3on/w627-h809/121180665_5184162071609150_230201505352651126_n.jpg" width="627" /></a></div> <span style="font-size: large;">🚩కళాపూర్ణోదయం -2: మణికంధరుడి తపోభంగం!</span></div><br /><div><br /></div><div><span style="font-size: large;">👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿</span></div><div><span style="font-size: large;">(జరిగిన కథ ద్వారకలో కృష్ణుణ్ణి చూడటానికి, శిష్యుడు మణికంధరుడితో</span></div><div><span style="font-size: large;">వెళ్తున్న నారదుడు రంభా నలకూబరుల్ని కలుస్తాడు. రంభకి గర్వభంగం</span></div><div><span style="font-size: large;">చెయ్యాలనుకుంటాడు. కలభాషిణి రంభానలకూబరులు విమానంలో</span></div><div><span style="font-size: large;">మాట్లాడుకున్న కొన్ని విషయాల గురించి నారదుణ్ణడుగుతుంది.నారదుడు</span></div><div><span style="font-size: large;">ద్వారకలో సంగీతం నేర్చుకుని తిరిగి వెళ్తూ ఏ స్త్రీ రూపం కావాలనుకుంటే</span></div><div><span style="font-size: large;">ఆ రూపం వచ్చే వరం కలభాషిణికి ఇస్తాడు. ఒకరోజు కలభాషిణి తోటలో</span></div><div><span style="font-size: large;">ఉండగా ఓ సిద్ధుడు సింహం మీద ఆకాశంలోంచి దిగుతాడు.</span></div><div><span style="font-size: large;">ఆమె గతచరిత్రని వల్లిస్తూ కుశలమడుగుతాడు. ఇక చదవండి.)</span></div><div><span style="font-size: large;">🚩</span></div><div><span style="font-size: large;">“అయ్యా! మీకేవో గొప్ప శక్తులున్నట్టున్నాయి. నువ్వు కపిలముని లాటి</span></div><div><span style="font-size: large;">సిద్ధుడివో లేకపోతే స్వయంగా దేవుడివేనో! మీ పేరేమిటో విశేషాలేమిటో</span></div><div><span style="font-size: large;">వినాలనుంది నాకు”</span></div><div><span style="font-size: large;">“నా పేరు మణిస్తంభుడు. నువ్వు చెప్పిన వాళ్ళలో ఎవణ్ణీ కాను. కేవలం</span></div><div><span style="font-size: large;">మామూలు సిద్ధుణ్ణి”</span></div><div><span style="font-size: large;">“మీ మాటలు ఒక్కొక్కటి వింటుంటే నాకు మతిపోతోంది. ఇవి మామూలు</span></div><div><span style="font-size: large;">సిద్ధులకి ఎలా తెలుస్తాయి? మరో విషయం మీరిందాక మణికంధరుడు</span></div><div><span style="font-size: large;">ఇప్పుడు తపస్సు చేస్తున్నాడన్నారు. అదెలా జరిగిందో తెలుసుకోవాలని</span></div><div><span style="font-size: large;">కుతూహలంగా వుంది”</span></div><div><span style="font-size: large;">“అమ్మాయీ! నాకు దూరదృష్టి, దూరశ్రవణ శక్తులున్నాయి. అందువల్ల</span></div><div><span style="font-size: large;">నేను ఉన్నచోటునుంచి కదలకుండా అన్ని విషయాలు తెలుసుకుంటూ</span></div><div><span style="font-size: large;">ఉంటాను. నీ గురించి నేను చెప్పిన వన్నీ నిజమే కదా! ఇక నిన్ను విడిచిపెట్టి</span></div><div><span style="font-size: large;">వెళ్ళాక మణికంధరుడు ఏం చేశాడో చెప్తాను విను.</span></div><div><span style="font-size: large;">“నువ్వు వాళ్ళ దగ్గర్నుంచి వచ్చెయ్యటం తోటే నారదుడు మణికంధరుణ్ణి</span></div><div><span style="font-size: large;">చూసి అన్నాడు “శిష్యా! నువు నేర్చుకున్న సంగీతానికి న్యాయం జరగాలంటే</span></div><div><span style="font-size: large;">నువ్వు చెయాల్సింది ఎప్పుడూ ఆ విష్ణువుని కీర్తిస్తూ పాడుతూ ఉండటం.</span></div><div><span style="font-size: large;">సంగీతం కన్నా ఆయనకి ఇష్టమైంది ఇంకోటి లేదు. అందుకే నేనూ,</span></div><div><span style="font-size: large;">విశ్వావసుడు, తుంబురుడు, చివరకు ఆ సరస్వతీ దేవీ ఎప్పుడూ అదే పన్లో</span></div><div><span style="font-size: large;">ఉంటాం. నిజంగా నీ అదృష్టం కాకపోతే శ్రీకృష్ణుడంతటి వాడు తనంతట</span></div><div><span style="font-size: large;">తను నీకు సంగీతం నేర్పుతాడా! కనక ఆ విద్యని నువ్వు సరైన విధంగా</span></div><div><span style="font-size: large;">వాడుకో, నీ కోరికలు తీరతాయి….</span></div><div><span style="font-size: large;">ఇక నే వెళ్ళి స్వర్గంలోనో బ్రహ్మ లోకంలోనో కైలాసంలోనో లేకపోతే ఈ</span></div><div><span style="font-size: large;">గొడవంతా మొదలైన ఆ వైకుంఠంలోనో మదమెక్కి మిడిసిపడుతున్న</span></div><div><span style="font-size: large;">తుంబురుణ్ణి గానవిద్యలో ఓడించి నా కష్టాలకి ఫలితం దక్కించుకోవాలి”</span></div><div><span style="font-size: large;">అన్నాడు హుషారుగా.</span></div><div><span style="font-size: large;">“అతనలా అనేసరికి మణికంధరుడు కుతూహలంతో “అంటే తుంబురుడికీ</span></div><div><span style="font-size: large;">మీకూ ఏదో పోటీ ఉందన్నమాట! నాతో ఎప్పుడూ చెప్పలేదే?” అనడిగాడు.</span></div><div><span style="font-size: large;">దానికి నారదుడు ఇలా చెప్పుకొచ్చాడు</span></div><div><span style="font-size: large;">“ఒకనాడు వైకుంఠంలో విష్ణువు కొలువు తీరాడు.</span></div><div><span style="font-size: large;">దేవతలు, మునులు, యోగులు సభంతా నిండిపోయారు.</span></div><div><span style="font-size: large;">నేనూ, తుంబురుడు, విశ్వావసుడు లాటి వీణాధరులం కూడా అక్కడున్నాం.</span></div><div><span style="font-size: large;">విష్వక్సేనుడు బెత్తం పట్టుకుని సభని అదుపు చేస్తున్నాడు.</span></div><div><span style="font-size: large;">దివ్య వారాంగనలు నాట్యాలు చేస్తున్నారు.</span></div><div><span style="font-size: large;">అంతలో</span></div><div><span style="font-size: large;">మేఘాల మధ్య మెరుపు లాగా సఖుల మధ్య ఉండి లక్ష్మీదేవి అక్కడికి</span></div><div><span style="font-size: large;">వస్తున్నది.</span></div><div><span style="font-size: large;">ఆమె అలా కనిపించిందో లేదో ఇలా వేత్రధరులు వచ్చి జనాన్ని బెత్తాల్తో</span></div><div><span style="font-size: large;">బాదేశారు.</span></div><div><span style="font-size: large;">శివుడు, బ్రహ్మ లాటి వాళ్ళే దూరంగా పారిపోయారంటే ఇక మాలాటి వాళ్ళ</span></div><div><span style="font-size: large;">విషయం చెప్పాలా? తలా ఓ దిక్కు పరిగెత్తాం.</span></div><div><span style="font-size: large;">ఇంతలో ఎవరో వచ్చి “ఓయ్ తుంబురుడా! ఎక్కడున్నావ్ ! ఇటు రావయ్యా!”</span></div><div><span style="font-size: large;">అని అతన్ని లోపలికి తీసుకుపోయారు.</span></div><div><span style="font-size: large;">“అతన్నెందుకు పిలిచుంటారు?” అని అందరూ చెవులు కొరుక్కుంటుంటే,</span></div><div><span style="font-size: large;">“ఎందుకేమిటి? విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి తుంబురుడి చేత ప్రత్యేకంగా</span></div><div><span style="font-size: large;">పాడించుకుని వింటున్నారు” అని అక్కడికి దగ్గర్లో ఉన్న వాళ్ళన్నారు.</span></div><div><span style="font-size: large;">నాకు మనసు భగ్గుమంది.</span></div><div><span style="font-size: large;">ఇక కొంతసేపటికి తుంబురుడు బయటికొచ్చాడు.</span></div><div><span style="font-size: large;">ఇప్పుడతని ఒంటినిండా మెరుగుపూత, మెళ్ళో కొత్త పతకం,</span></div><div><span style="font-size: large;">బుజాన కొత్త గుడ్డలు!</span></div><div><span style="font-size: large;">అందరూ అతని చుట్టూ చేరి పొగడటం!</span></div><div><span style="font-size: large;">నాకు ఒళ్ళు మండి పోయింది.</span></div><div><span style="font-size: large;">“తగుదునమ్మా అని ఒక్కడివే వెళ్ళి పాడటమే కాకుండా ఒంటి నిండా</span></div><div><span style="font-size: large;">బహుమానాలు తగిలించుకుని అందరికీ చూపిస్తూ మరీ వస్తావా!</span></div><div><span style="font-size: large;">ఓరి పాపీ!” అని పళ్ళు పటపట కొరుక్కుని ఏదో ఒక విధంగా వాడితో</span></div><div><span style="font-size: large;">పోట్లాట పెట్టుకుని సంగీతంలో ఓడించాలని నిర్ణయించుకున్నా.</span></div><div><span style="font-size: large;">ఐతే ఎందుకైనా మంచిదని వెంటనే బయటపడకుండా కొన్నాళ్ళు</span></div><div><span style="font-size: large;">మామూలుగా ఉండి ముందుగా అతని పాటలో బలహీనతల్ని</span></div><div><span style="font-size: large;">తెలుసుకోవాలని యుక్తి పన్నా.</span></div><div><span style="font-size: large;">ఆ పని మీదే ఓ రోజు అతని ఇంటికెళ్ళా.</span></div><div><span style="font-size: large;">అప్పుడే అతను తన వీణని మేళవించి బయట వుంచి లోపలికెళ్ళాడు.</span></div><div><span style="font-size: large;">ఇదీ బాగుంది, ఈ వీణ ఎలాటిదో చూద్దామని నేను దాన్ని పలికిద్దును కదా</span></div><div><span style="font-size: large;">దాని అపూర్వమైన శ్రుతులు వినేసరికి నాలో ఆశ్చర్యం, భయం, లజ్జ కలిగాయి.</span></div><div><span style="font-size: large;">సిగ్గుతో వెంటనే తిరిగొచ్చేశాను.</span></div><div><span style="font-size: large;">“ఆహా! నిజానికి నాకన్నా గొప్ప విద్య తన దగ్గర ఉన్నా కూడా నాతో కలిసి</span></div><div><span style="font-size: large;">పాడేటప్పుడు ఎప్పుడూ నన్ను మించటానికి చూడలేదు! పైగా నేను</span></div><div><span style="font-size: large;">గొప్పవాణ్ణని అందరూ అంటున్నా కిక్కురు మనలేదు! ఇప్పుడు విష్ణువు</span></div><div><span style="font-size: large;">పిలిపించి పాడించే వరకూ బయటపడలేదు. నీరు కొద్దీ తామరన్నట్టు</span></div><div><span style="font-size: large;">నిజంగా గొప్పవాళ్ళు ఎవరి దగ్గర ఎంత అవసరమో అంత విద్యే</span></div><div><span style="font-size: large;">ప్రదర్శిస్తారు కదా!” అని ఆశ్చర్యపడ్డాను.</span></div><div><span style="font-size: large;">ఇక అప్పట్నుంచి అతన్తో సమానమైన విద్య సంపాయించాలని</span></div><div><span style="font-size: large;">ఎన్ని పాట్లు పడ్డానో!</span></div><div><span style="font-size: large;">ఎక్కడెక్కడో తిరిగాను, ఎంతమందినో కలిశాను. ఏమీ లాభం కలగలా.</span></div><div><span style="font-size: large;">చివరికి ఆ విష్ణుమూర్తే దిక్కని ఆయన్ని గురించి ఎంతోకాలం తపస్సు</span></div><div><span style="font-size: large;">చేశాను.</span></div><div><span style="font-size: large;">అప్పుడాయన ప్రత్యక్షమైతే “తుంబురుణ్ణి సంగీతంలో గెలవాలనే”</span></div><div><span style="font-size: large;">వరం కోరుకున్నాను. దానికాయన “ద్వాపర యుగంలో నేను కృష్ణుడిగా</span></div><div><span style="font-size: large;">ద్వారకలో పుడతాను. అప్పుడు వచ్చి నన్ను కలువు, నీ కోరిక తీరుస్తాను”</span></div><div><span style="font-size: large;">అన్నాడు. ఇలా చివరికి ఇప్పుడు నా కోరిక తీరబోతోంది” అని ముగించాడు</span></div><div><span style="font-size: large;">నారదుడు.</span></div><div><span style="font-size: large;">“అదంతావిన్న మణికంధరుడు ఆలోచనలో పడ్డాడు.</span></div><div><span style="font-size: large;">“మరి తుంబురుడు ఒక్కసారి వైకుంఠంలో పాడటమే అంత గొప్ప</span></div><div><span style="font-size: large;">విషయమైతే ఇక ఎప్పుడూ వైకుంఠంలోనే ఉండి పాడగలిగే అదృష్టం</span></div><div><span style="font-size: large;">ఎలా కలుగుతుందో కదా!” అని పైకే అనేశాడు.</span></div><div><span style="font-size: large;">ఆ మాటతో నారదుడికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది.</span></div><div><span style="font-size: large;">“భేష్, భేష్! నీకీ ఆలోచన రావటమే బ్రహ్మాండంగా ఉంది.</span></div><div><span style="font-size: large;">సామాన్యంగా ఎంత చదివి ఎన్ని తెలుసుననుకున్న వాళ్ళైనా వెర్రి</span></div><div><span style="font-size: large;">కుదిరింది రోకలి తలకి చుట్టమన్నట్టు మళ్ళీ వాళ్ళనీ వీళ్ళనీ</span></div><div><span style="font-size: large;">కొలవటానికి తయారౌతారు.</span></div><div><span style="font-size: large;">అలా కాకుండా వైకుంఠంలో విష్ణువుని పూజిస్తూ ఉండాలంటే పెద్ద వాళ్ళ</span></div><div><span style="font-size: large;">నించి నేను విన్న ఆలోచన ఇది</span></div><div><span style="font-size: large;">శక్తి కొద్దీ కృష్ణార్పణంగా మంచి పన్లే చెయ్యటం, చెడ్డ పన్లు చెయ్యకపోవటం,</span></div><div><span style="font-size: large;">విష్ణువు మీద భక్తి, ఆయన భక్తుల్తో స్నేహం, ఆయన వెలిసిన దివ్యక్షేత్రాలు</span></div><div><span style="font-size: large;">చూడటం, బ్రహ్మచర్యం, తపస్సు, వైరాగ్యం వీటిలో కొన్ని పాటించినా</span></div><div><span style="font-size: large;">చాలునని.</span></div><div><span style="font-size: large;">కాబట్టి నువ్వు నీకున్న గొప్ప సంగీత విద్యతో తిరుపతి, శ్రీరంగం లాటి క్షేత్రాల్లో</span></div><div><span style="font-size: large;">విష్ణు సంకీర్తనలు చెయ్యి. నీకు శుభం జరుగుతుంది” అని చెప్పి</span></div><div><span style="font-size: large;">ఆ ఉద్రేకంలో పులకరిస్తూ కృష్ణుడి గురించి పాడుతూ ఆడుతూ</span></div><div><span style="font-size: large;">తన్మయంగా ఎటో వెళ్ళిపోయాడు నారదుడు.</span></div><div><span style="font-size: large;">అది చూసిన మణికంధరుడు కూడా “ఆహా! ఈ నారదుడెంత</span></div><div><span style="font-size: large;">అదృష్టవంతుడు! ఇతనికి ఎంత భక్తి!” అనుకుని అతను దూరం</span></div><div><span style="font-size: large;">వెళ్ళేవరకు అతన్నే చూస్తూ నిలబడి ఇక తను కూడా తీర్థయాత్రలకి</span></div><div><span style="font-size: large;">బయల్దేరాడు.</span></div><div><span style="font-size: large;">“అలా వెళ్ళిన మణికంధరుడు యమునా నదిని చూశాడు.</span></div><div><span style="font-size: large;">ఆనందించాడు. అక్కడ కూర్చుని విష్ణువు గురించి గొప్పగా పాడాడు.</span></div><div><span style="font-size: large;">మధుర, హరిద్వారం, సాలగ్రామ పర్వతం, బదరికాశ్రమం, నైమిశారణ్యం,</span></div><div><span style="font-size: large;">కురుక్షేత్రం, ప్రయాగ, కాశి, అయోధ్య, గంగా సంగమం చూసి అన్ని చోట్లా</span></div><div><span style="font-size: large;">స్నానాలూ, దానాలూ చేశాడు. సముద్రం పక్కనే ఉన్న నీలాచలానికి వెళ్ళి</span></div><div><span style="font-size: large;">అక్కడ ఇంద్రద్యుమ్నం అనే సరస్సులో రోహిణీ కుండంలో స్నానం చేశాడు.</span></div><div><span style="font-size: large;">గానంతో జగన్నాథుణ్ణి కొలిచాడు.</span></div><div><span style="font-size: large;">తర్వాత శ్రీకూర్మం, సింహాచలం, అహోబలం, అక్కడి నుంచి తిరుపతి</span></div><div><span style="font-size: large;">వెళ్ళాడు.</span></div><div><span style="font-size: large;">అక్కడ మహామహిమలున్న స్వామి పుష్కరిణిలో స్నానించాడు.</span></div><div><span style="font-size: large;">క్షితి వరాహ మూర్తిని కొలిచాడు. శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధికి వెళ్ళాడు.</span></div><div><span style="font-size: large;">మృదువైన పాదాలు, మెరుగు అందెలు, బంగారు దుప్పటి, ముప్పేట</span></div><div><span style="font-size: large;">మొలతాడు, మణుల వడ్డాణం, బొడ్డులో మాణిక్యం, వైజయింతి పూమాల,</span></div><div><span style="font-size: large;">వక్షాన లక్ష్మి, వరదహస్తం, కటిహస్తం, మిగిలిన రెండు చేతుల్లో శంఖ</span></div><div><span style="font-size: large;">చక్రాలు, తార హారాలు, చక్కటి కంఠం, నవ్వు ముఖం, మకరకుండలాలు,</span></div><div><span style="font-size: large;">తామర కళ్ళు, అందాల ముక్కు, కలికి కనుబొమ్మలు, ముత్యాల నామం,</span></div><div><span style="font-size: large;">రత్నాల నుదురు ఇవన్నీ ఉన్న వెంకటేశ్వరుడి విగ్రహాన్ని అంగాంగం చూసి</span></div><div><span style="font-size: large;">తపించి పులకించి ఆయన గురించి మూడు రాత్రింబగళ్ళు పరవశంతో</span></div><div><span style="font-size: large;">పాడి అక్కడున్న జనాన్నందర్నీ ఆనందాశ్చర్యాల్లో ముంచేశాడు.</span></div><div><span style="font-size: large;">అక్కడినుంచి కాంచీపురంలో ఏకామ్రనాథుణ్ణీ, కామాక్షినీ సేవించాడు.</span></div><div><span style="font-size: large;">కరిగిరి కి వెళ్ళి కన్నుల పండుగ్గా వరదరాజ దేవుణ్ణి చూసి పాడి</span></div><div><span style="font-size: large;">ఆనందించాడు.</span></div><div><span style="font-size: large;">ఆ కాంచీపురం నుంచి సస్యశ్యామలంగా ఉన్న చోళ మండల మహా</span></div><div><span style="font-size: large;">గ్రామాల్ని దాటుతూ కావేరీతీరం చేరాడు.</span></div><div><span style="font-size: large;">కావేరిని పొగిడి ఇంతింతని వర్ణించలేని అద్భుతాలున్న శ్రీరంగం</span></div><div><span style="font-size: large;">చేరుకున్నాడు.</span></div><div><span style="font-size: large;">పాటల్ని ఆశువుగా పాడి ఆ శ్రీరంగనాథుణ్ణి సేవించాడు.</span></div><div><span style="font-size: large;">అక్కణ్ణుంచి తూర్పుగా కుంభకోణం వెళ్ళి విష్ణువునీ, కుంభేశ్వరుడినీ</span></div><div><span style="font-size: large;">పూజించాడు. దర్భశయనంలో రాముణ్ణి కొలిచాడు.</span></div><div><span style="font-size: large;">తర్వాత సేతుబంధం వెళ్ళి రామేశ్వరుణ్ణి ఆరాధించాడు.</span></div><div><span style="font-size: large;">అప్పటికీ తృప్తి కలక్కపోగా ఇనుమడిస్తున్న భక్తి ఆవేశంతో అక్కడికి</span></div><div><span style="font-size: large;">పడమరగా చక్కగా దట్టంగా పెరిగివున్న ఒక పూలతోటలో కూర్చుని విష్ణువు</span></div><div><span style="font-size: large;">గురించి తపస్సు చెయ్యటం మొదలుపెట్టాడు.</span></div><div><span style="font-size: large;">తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు అతను చేసిన అద్భుతమైన గానాన్ని నేను</span></div><div><span style="font-size: large;">ఒళ్ళంతా చెవులుగా విన్నాను. ఇప్పుడతని తపస్సు వల్ల నాకా అదృష్టం</span></div><div><span style="font-size: large;">పోయింది.</span></div><div><span style="font-size: large;">అదుగో, ఇప్పుడతను పద్మాసనంలో కూర్చుని గొప్ప సమాధి అవస్థలో</span></div><div><span style="font-size: large;">ఉన్నాడు” అంటూ మణికంధరుడి వ్యవహారమంతా వినిపించాడు</span></div><div><span style="font-size: large;">మణిస్తంభుడు కలభాషిణికి.</span></div><div><span style="font-size: large;">(ఇక్కడ మనం “మణికంధరుడు”, “మణిస్తంభుడు” అనే పేర్ల గురించి</span></div><div><span style="font-size: large;">జాగ్రత్తగా లేకపోతే కలగాపులగమై పోయే అవకాశం ఉంది.</span></div><div><span style="font-size: large;">మొదటివాడు గంధర్వుడు, నారదుడి శిష్యుడు, ఈ కథకి నాయకుడు;</span></div><div><span style="font-size: large;">రెండో వాడొక సిద్ధుడు. ఇతను కూడా కథలో ఒక ముఖ్య పాత్ర ధారే.)</span></div><div><span style="font-size: large;">ఆ కథంతా విని ఆశ్చర్యంలో మునిగిపోయింది కలభాషిణి.</span></div><div><span style="font-size: large;">“ఐతే మీకళ్ళకతను ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నాడా?” అనడిగింది</span></div><div><span style="font-size: large;">ఇంకా నమ్మలేక.</span></div><div><span style="font-size: large;">“నీకనుమానంగా ఉంటే నీ చెలికత్తెల్ని అవతలికి పంపించు. వాళ్ళ</span></div><div><span style="font-size: large;">ప్రవర్తనంతా కళ్ళక్కట్టినట్టు నీకు చెప్తాను. తమాషా చూద్దువు గాని” అని</span></div><div><span style="font-size: large;">బలవంతంగా ఇద్దరు చెలికత్తెల్ని దూరంగా పంపించి వాళ్ళ పనులు,</span></div><div><span style="font-size: large;">మాటలు అన్నీ చెప్పి నిజమే నని నిరూపించాడు.</span></div><div><span style="font-size: large;">ఆ తర్వాత, ” “దగ్గర వాళ్ళ గురించి చెప్పగలిగాడు గాని బాగా దూరంగా</span></div><div><span style="font-size: large;">ఉన్న విషయాలు చూడగలడా?” అని నీకు అనుమానం రావొచ్చు.</span></div><div><span style="font-size: large;">కానీ ఆ అనుమానం తీర్చే దారి లేదు కదా!” అని కొంచెం బాధ పడ్డాడు.</span></div><div><span style="font-size: large;">ఐతే అంతలోనే “నువ్వు మణికంధరుడి తపసు గురించి చెప్పిందాంట్లో ఒక్క</span></div><div><span style="font-size: large;">ముక్క కూడ అబద్ధం లేదు” అని చెప్పింది ఆ పక్కనే చెట్టు మీద నుంచి</span></div><div><span style="font-size: large;">ఒక చిలక!</span></div><div><span style="font-size: large;">“ఆశ్చర్యంగా ఉందే! నువ్వెక్కడి నుంచొచ్చావ్? అతను చెప్పేది నిజమని</span></div><div><span style="font-size: large;">నీకెలా తెలుసు?” అని ఆ చిలకని అడిగింది కలభాషిణి.</span></div><div><span style="font-size: large;">అప్పుడా చిలక, “అసలు నాది స్వర్గంలో నందనవనం. శ్రీకృష్ణుడు</span></div><div><span style="font-size: large;">పారిజాతపు చెట్టుని అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేటప్పుడు మిగిలిన</span></div><div><span style="font-size: large;">పక్షులన్నీ పారిపోయినా నా భార్య ప్రసవసమయం గనక ఏమైతే</span></div><div><span style="font-size: large;">అయిందని ఒక తొర్రలో వుండిపోయింది. పిల్లలు పెరిగి వాళ్లకి యీకలు</span></div><div><span style="font-size: large;">వచ్చేదాకా తీసుకెళ్ళటం వీలుగాక ఇక్కడి తోటల ముందు నందనవనం</span></div><div><span style="font-size: large;">ఎందుకూ చాలకపోయినా చుట్టాలందరూ అక్కడే ఉన్నారు గనక నేను</span></div><div><span style="font-size: large;">అటూఇటూ రాకపోకలు సాగిస్తున్నాను. అలా ఇంతకుముందు నేను నా</span></div><div><span style="font-size: large;">భార్య దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ “మణికంధరుడి” మాట వినపడి</span></div><div><span style="font-size: large;">ఏమిటోనని ఆగాను.</span></div><div><span style="font-size: large;">ఎందుకంటే ఇందాక ఇంద్రుడు, శచీదేవి నందనవనంలో ఉండగా</span></div><div><span style="font-size: large;">చారుడొకడు వచ్చి, “దేవరా, నేనుండే తోటలోకి ఒకతను వచ్చి కొన్నాళ్ళ</span></div><div><span style="font-size: large;">నుంచి తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడా తపస్సు చాలా తీవ్రరూపంలో ఉంది.</span></div><div><span style="font-size: large;">“ఆతోటలో చేసే తపస్సు ఎనిమిది నెలల్లో సిద్ధిస్తుంది గనక జాగ్రత్తగా</span></div><div><span style="font-size: large;">ఉండమ”ని మీరిదివరకు చెప్పారు గనక ఈ విషయం మీకు చెప్దామని</span></div><div><span style="font-size: large;">వచ్చాను” అన్నాడు.</span></div><div><span style="font-size: large;">ఇంద్రుడు కూడా, “ఔనౌను. అందుకే నిన్నక్కడ ఉంచాను” అని వెంటనే</span></div><div><span style="font-size: large;">రంభను పిలిపించాడు. “రంభా! ఆ తపస్సు చేస్తోంది ఎవరో గాని నా</span></div><div><span style="font-size: large;">రాజ్యం కోసమైనా అయుండొచ్చు. గోరంత ఆలస్యానికి కొండంత నష్టం</span></div><div><span style="font-size: large;">రావొచ్చంటారు. ఇలాటి పనులకి అప్సరసలు బాగా పనికొస్తారు.</span></div><div><span style="font-size: large;">వాళ్ళలోనూ నీకున్న పనితనం ఇంకెవరికీ లేదు. కనక నువ్వు వెంటనే వెళ్ళి</span></div><div><span style="font-size: large;">ఆ పులిలాటి మునిని మన్మథుడికి జింకగా చెయ్యాలి. బయల్దేరు” అని</span></div><div><span style="font-size: large;">ఆజ్ఞాపించాడు ఇంద్రుడు.</span></div><div><span style="font-size: large;">దానికి రంభ, “ఆ ముని ఎవరనుకుంటున్నారో! అతను నారదుడి శిష్యుడు</span></div><div><span style="font-size: large;">మణికంధరుడని విన్నాను. అతన్ని ఇదివరకే చూశాన్నేను.అప్పుడే మాలాటి</span></div><div><span style="font-size: large;">వాళ్ళని లెక్కచెయ్యని వాడు ఇప్పుడు ఇంత తపస్సు చేశాక లొంగుతాడని</span></div><div><span style="font-size: large;">నమ్మకం లేదు” అని అనుమానంగా మాట్లాడింది.</span></div><div><span style="font-size: large;">“అలాగైతే నీకు అద్భుతమైన రూపం, సరికొత్త యవ్వనం ఇస్తున్నా.</span></div><div><span style="font-size: large;">ఇంక వెళ్ళి పనిపూర్తిచెయ్యి” అని పంపాడు ఇంద్రుడు.</span></div><div><span style="font-size: large;">రంభ కూడ కొత్తగా వచ్చిన లావణ్యం, దానికి తోడు గొప్ప అలంకారాల్తో</span></div><div><span style="font-size: large;">మణికంధరుడి దగ్గరికి బయల్దేరటం నేను చూశా. ఈ పాటికి అతని</span></div><div><span style="font-size: large;">తపోభూమికి చేరి ఉండొచ్చు” అని తను చూసిన దాన్ని వివరించింది</span></div><div><span style="font-size: large;">చిలక.</span></div><div><span style="font-size: large;">ఆనందంతో ఆ చిలకని పొగిడి పంపింది కలభాషిణి.</span></div><div><span style="font-size: large;">అప్పుడు సిద్ధుడు మళ్ళీ “ఇంతకూ నేను ఇక్కడికి వచ్చింది నీ పాట</span></div><div><span style="font-size: large;">వినటానికి. ఇకనైనా వినిపిస్తావా?” అనడగటంతో, “అలాగే” అని కొంత</span></div><div><span style="font-size: large;">సేపు పాడి వినిపించింది కలభాషిణి.</span></div><div><span style="font-size: large;">అదే సమయంలో</span></div><div><span style="font-size: large;">మణికంధరుడి తపోవనంలో</span></div><div><span style="font-size: large;">మెరుపుతీగల్లాగా అప్సరసలు నడుస్తుంటే మేఘాల్లాగా వాళ్ళ వెనక</span></div><div><span style="font-size: large;">వస్తున్నాయి జడలు!</span></div><div><span style="font-size: large;">చేతులు, పాదాల కాంతులు అకాల సంధ్యని పుట్టిస్తుంటే, వాళ్ళ గోళ్ళ మీది</span></div><div><span style="font-size: large;">చుక్కలు తారకల్లాగా మెరుస్తున్నాయి!</span></div><div><span style="font-size: large;">అలా కదిలి మణికంధరుడి దగ్గరికి చేరారు రంభా, ఆమె చెలికత్తెలూ.</span></div><div><span style="font-size: large;">అక్కడి పరిస్థితి చూస్తే వాళ్ళకు భయం వేసింది</span></div><div><span style="font-size: large;">ఆవులు నాకుతుంటే ఆనందంగా పడుకున్న పులులు;</span></div><div><span style="font-size: large;">పులుల చన్నులు కుడుస్తున్న లేళ్ళు;</span></div><div><span style="font-size: large;">లేళ్ళు ఆడుతుంటే హాయిగా చూస్తున్న సింహాలు;</span></div><div><span style="font-size: large;">సింహాలు గోకుతుంటే సంతోషిస్తున్న ఏనుగులు;</span></div><div><span style="font-size: large;">ఏనుగుల ముందు ఆడుతున్న పాములు;</span></div><div><span style="font-size: large;">పాముల్ని లాలిస్తున్న డేగలు;</span></div><div><span style="font-size: large;">డేగల్తో ఆడుకుంటున్న ఎలకలు;</span></div><div><span style="font-size: large;">ఎలకల్ని పెంచే పిల్లులు!</span></div><div><span style="font-size: large;">వాటి మధ్య మణికంధరుడు</span></div><div><span style="font-size: large;">పావనత్వం, పుణ్యం, శాంతం, తపస్సు, సత్వగుణం, వైరాగ్యం, యోగవిద్య,</span></div><div><span style="font-size: large;">తత్వబోధ, వీటన్నిటి కలబోతలాగా!</span></div><div><span style="font-size: large;">ఇలాటి వ్యక్తి తపస్సునా చెడగొట్టటం?</span></div><div><span style="font-size: large;">సాధ్యమైన పనేనా?</span></div><div><span style="font-size: large;">కాని ప్రయత్నం చెయ్యక తప్పదు. ఇంద్రుడి ఆజ్ఞ!</span></div><div><span style="font-size: large;">వనవిహారం మొదలెట్టారు ఉయ్యాలలూగుతూ, ఆడుతూ, పాడుతూ,</span></div><div><span style="font-size: large;">పరిహాసాలాడుతూ!</span></div><div><span style="font-size: large;">అతనికి దగ్గర్లో తారట్లాడుతోంది రంభ కొత్త అందాల్తో, తళుకు బెళుకు</span></div><div><span style="font-size: large;">కులుకుల్తో!</span></div><div><span style="font-size: large;">ఎందుకు ఎలా జరిగిందో చెప్పటం కష్టం దైవ యోగం అనుకోవాలేమో!</span></div><div><span style="font-size: large;">మణికంధరుడి సమాథి స్థితి భగ్నమైంది.</span></div><div><span style="font-size: large;">వాళ్ళ రొద అతని చెవుల్లోకి దూరింది.</span></div><div><span style="font-size: large;">ఆమె రూపం అతని కళ్ళలోకి జొరబడింది.</span></div><div><span style="font-size: large;">“కృష్ణ కృష్ణ” అని కళ్ళు మూయటమే గాని కనబడుతున్నది మాత్రం రంభే!</span></div><div><span style="font-size: large;">ఇదే సమయం అని మన్మథుడు ఇద్దరి మీదా విపరీతంగా బాణాలు</span></div><div><span style="font-size: large;">కురిపించేశాడు.</span></div><div><span style="font-size: large;">“ఇది రంభ లాగా ఉందే! ఇదివరకు లేని యవ్వనపు సొంపులూ</span></div><div><span style="font-size: large;">అందాలూ కూడా వచ్చాయి” తో మొదలై, “ఈమె దొరకని వైకుంఠంలో</span></div><div><span style="font-size: large;">ఉండటం కంటే ఈమె తాకే చెట్టునైనా మేలు” అనుకునేదాకా</span></div><div><span style="font-size: large;">చేరుకున్నాడతను అలా చూస్తూండగనే!</span></div><div><span style="font-size: large;">ఇంక తపస్సుని తీసి గంగలో కలిపేసి తరుణీమణి వెంట పడ్డాడు.</span></div><div><span style="font-size: large;">“ఇక్కడికెందుకొచ్చావ్? ఎక్కడి నుంచి వచ్చావ్? నా చెవుల పండగ్గా</span></div><div><span style="font-size: large;">వినిపించు” అని బతిమాలాడు.</span></div><div><span style="font-size: large;">“ఆడుకోవటానికి” అంది రంభ అతన్ని ఊరిస్తూ.</span></div><div><span style="font-size: large;">“అబద్ధం! నువ్వు వచ్చింది నాకోసమే! ఔనా?”</span></div><div><span style="font-size: large;">చిరునవ్వే ఆమె సమాధానమైంది.</span></div><div><span style="font-size: large;">కొంగుపట్టుకు లాగటం అతని వంతైంది.</span></div><div><span style="font-size: large;">“ఐపోయిందైపోయింది! అయ్యగారి తపసుకీ అమ్మాయి గారి సొగసుకీ</span></div><div><span style="font-size: large;">చెల్లైపోయింది!” అని నవ్వుకున్నారు రంభ చెలికత్తెలు.</span></div><div><span style="font-size: large;">రంభా మణికంధరులు దగ్గర్లో ఉన్న పొదరింటికి చేరి రతిక్రీడల్లోకి దిగారు.</span></div><div><span style="font-size: large;">అదే సమయంలో</span></div><div><span style="font-size: large;">ఇక్కడ ద్వారకలో</span></div><div><span style="font-size: large;">మణిస్తంభుడు కలభాషిణి పాట వింటున్నాడు. మాటల్లో మణికంధరుడి</span></div><div><span style="font-size: large;">విషయం వచ్చింది.</span></div><div><span style="font-size: large;">“మరి రంభ వచ్చాక మణికంధరుడి పరిస్థితి ఏమైందో చూస్తారా?”</span></div><div><span style="font-size: large;">అనడిగింది కలభాషిణి.</span></div><div><span style="font-size: large;">అతను తన దూర దృష్టితో అటు చూసి, “ఇంకేం తపస్సు? ఇప్పుడు</span></div><div><span style="font-size: large;">మణికంధరుడు ఒక పొదరింట్లో ఉన్నాడు రంభ కౌగిట్లో!” అన్నాడు</span></div><div><span style="font-size: large;">నవ్వుతూ!</span></div><div><span style="font-size: large;">ఆమె ఇంకా ఆశ్చర్యపడుతూ అతన్ని పొగిడి, “మీరు నిజంగా</span></div><div><span style="font-size: large;">మహానుభావులు! మా ఇంట్లో ఓ రెండు రోజులుండి వెళ్ళండి” అని</span></div><div><span style="font-size: large;">ప్రాధేయపడింది.</span></div><div><span style="font-size: large;">“ఏదో నీపాట వినిపోదామని వచ్చా గాని వాళ్ళూ వీళ్ళూ లాగా పట్నాలకి</span></div><div><span style="font-size: large;">వెళ్ళి మహిమలు చూపించే వాణ్ణి కాను నేను. రహస్యంగా ఐతేనే నీ</span></div><div><span style="font-size: large;">ఆతిథ్యం తీసుకుంటా” అని అక్కడో రెండు మూడు రోజులున్నాడా సిద్ధుడు.</span></div><div><span style="font-size: large;">కలభాషిణికి ఎలాగైనా నలకూబరుణ్ణి కలవాలనే కోరిక పెరిగిపోతోంది!</span></div><div><span style="font-size: large;">అడిగీ అడగనట్టుగా అతన్నడిగింది “మరి మణికంధరుడు మళ్ళీ తపస్సు</span></div><div><span style="font-size: large;">మొదలెట్టాడా లేక ఇంకా రంభతోనే ఉన్నాడా? ఒక్కసారి చూసి చెప్పరూ?”</span></div><div><span style="font-size: large;">“తపస్సూ లేదు గిపస్సూ లేదు. రంభ కౌగిలే ధ్యానం” అంటూ అంతలోనే</span></div><div><span style="font-size: large;">చెవులు నిక్కబొడుచుకుని జాగ్రత్తగా విని, “ఓర్నీ, యీ వేశ్యలు ఎంతకైనా</span></div><div><span style="font-size: large;">తగుదురు సుమా!” అని పగలబడి నవ్వటం మొదలెట్టాడు</span></div><div><span style="font-size: large;">మణిస్తంభుడు.</span></div><div><span style="font-size: large;">“ఏమిటేమిటి? ఏంజరిగింది?” అనడిగింది కలభాషిణి.</span></div><div><span style="font-size: large;">“ఏం చెప్పమంటావ్! నవ్వలేక చస్తున్నాను.అతని తపసునట్లా చెడగొట్టి</span></div><div><span style="font-size: large;">తర్వాత రంభ ఏం చేసిందో చూశావా? మణికంధరుడితో రతిక్రీడలో</span></div><div><span style="font-size: large;">ఉండగా “నేనలిసిపోయాను, ఇక చాలురా నలకూబరా!” అని మూలిగింది</span></div><div><span style="font-size: large;">పరవశంతో. మణికంధరుడు పాపం మనసు చివుక్కుమని వెళ్ళిపోయాడు”.</span></div><div><span style="font-size: large;">“ఆఁ! రంభ మాత్రం ఏం చేస్తుందిలే! నలకూబరుడు ఆమెని అంత ప్రేమగా</span></div><div><span style="font-size: large;">చూసుకుంటాడన్న మాట! .. ఇంతకూ మరి ఇప్పుడు</span></div><div><span style="font-size: large;">నలకూబరుడెక్కడున్నాడో?”</span></div><div><span style="font-size: large;">“ఔనౌను. నీకు ముఖ్యమైంది అదే కదా! ఉండు చూడనీ! తను పక్కనుంటే</span></div><div><span style="font-size: large;">రంభ వెళ్ళి తపస్సు చెడగొట్టలేదు, దాని వల్ల ఇంద్రుడికి కోపం వస్తుందని</span></div><div><span style="font-size: large;">ఆ నలకూబరుడు ఇప్పుడు మణికంధరుడి తపోవనానికి దగ్గర్లోనే ఒక</span></div><div><span style="font-size: large;">తోటలో చెట్టుకింద ఉన్నాడు….</span></div><div><span style="font-size: large;">అతని మీద పరాకుతో నువ్వింకేం పాడుతావు గాని ఇక నే వెళ్ళొస్తాను” అని ప్రయాణం కట్టాడు మణిస్తంభుడు.</span></div><div><span style="font-size: large;">భోరుమంది కలభాషిణి!</span></div><div><span style="font-size: large;">“నన్నిలా నట్టేట్లో ముంచి వెళ్ళొద్దు. ఎలాగైనా సరే ఈ రోజే, ఇప్పుడే, నేను</span></div><div><span style="font-size: large;">అతని దగ్గరికి చేరాలి. మీరు తప్ప నాకు దిక్కు లేరు”</span></div><div><span style="font-size: large;">“వీలైతే చెయ్యనా? కానీ అది దగ్గరా దాపా? మా గురువుగారు ఎంతో చక్కగా</span></div><div><span style="font-size: large;">శిక్షణ ఇచ్చిన ఈ సింహానికైనా నాలుగ్గడియలు పడుతుందే!</span></div><div><span style="font-size: large;">ఐనా నిన్ను దీని మీద ఎక్కించుకుపోవాలంటే అవ్వ! సాటి సిద్ధులంతా</span></div><div><span style="font-size: large;">ముక్కున వేలేసుకోరా! అదీ గాక నేను నిన్ను తాకలేను కూడ.</span></div><div><span style="font-size: large;">ఇదంతా ఎందుగ్గాని, దూరదృష్టి, దూరశ్రవణాల్తో చెయ్యగలైగిన పని ఉంటే</span></div><div><span style="font-size: large;">చెప్పు, తప్పకుండా చేస్తా”.</span></div><div><span style="font-size: large;">ఇంక కలభాషిణి నిలవలేక పోయింది.</span></div><div><span style="font-size: large;">“అయ్యా! వట్టి మాటల్తో పనిజరగదు. ఎలాగైనా నన్ను మీరు అతని దగ్గరికి</span></div><div><span style="font-size: large;">చేర్చాల్సిందే! ఐనా, ఎవరేమనుకుంటే మీలాటి మహాత్ములకి ఏం</span></div><div><span style="font-size: large;">తక్కువౌతుంది!” అంటూ కాళ్ళా వేళ్ళా బడింది. అతికష్టం మీద ఒప్పుకున్నాడతను.</span></div><div><span style="font-size: large;">ముందుగా తను సింహం మీద ఎక్కాడు.</span></div><div><span style="font-size: large;">“నన్ను తాకకుండా దీని నడుం మీద కూర్చోగలవా వెనక ఆ మరకొమ్ము</span></div><div><span style="font-size: large;">పట్టుకుని?”</span></div><div><span style="font-size: large;">“మీ అనుగ్రహం అయింది. అదే చాలు. మీరెలా చెయ్యమంటే అలా చేస్తా”</span></div><div><span style="font-size: large;">అంటూ తనూ ఎక్కింది కలభాషిణి.</span></div><div><span style="font-size: large;">“థే!” అని అదిలించటంతోటే సింహం అమాంతం అకాశానికెగిరి వేగంగా</span></div><div><span style="font-size: large;">పరిగెత్తింది.</span></div><div><span style="font-size: large;">కొంత దూరం వెళ్ళారు.</span></div><div><span style="font-size: large;">హఠాత్తుగా పక్కనున్న మేఘం చాటునుంచి ఘుమ ఘుమ సువాసనలు,</span></div><div><span style="font-size: large;">నవ్వులు, పాటలు!</span></div><div><span style="font-size: large;">ఎవరో కాదు, మణికంధరుడి తపస్సు చెడగొట్టటానికి రంభతో వెళ్ళిన</span></div><div><span style="font-size: large;">చెలులు!</span></div><div><span style="font-size: large;">మణిస్తంభుడికి వాళ్ళతో కబుర్లు కలపాలనిపించింది.</span></div><div><span style="font-size: large;">“ఇదేమిటి మీ చెలిని వదిలేసి మీరే దేవలోకానికి తిరిగెళ్తున్నారు?</span></div><div><span style="font-size: large;">ఆవిడ మణికంధరుడితో ఇంకొన్నాళ్ళు గడపబోతోందా?”</span></div><div><span style="font-size: large;">“ఇంకెక్కడి మణికంధరుడు? ఏమయ్యాడో, ఎటు పోయాడో! ఇప్పుడు రంభ నలకూబరుడితో హాయిగా ఉంది ఆ తోటలోనే! ఇన్నాళ్ళు విరహంలో ఉన్న వాళ్ళని విడదియ్యటం ఇష్టం లేక మేమే వెళ్ళిపోతున్నాం”.</span></div><div><span style="font-size: large;">తుర్రుమన్నారు వాళ్ళు, “కలికాలం కాకపోతే ఆ బీరజడల జోగికీ ఈ అందాల బొమ్మకీ జోడేమిటో! ఆమెని చూశారా, స్వర్గంలో ఒక్క నిముషం ఉంటే చాలు దేవతావిటులందర్నీ ఒకాట ఆడించేట్టుంది!” అని బుగ్గలు నొక్కుకుంటూ.</span></div><div><span style="font-size: large;">సిద్ధుడికి అర్థమైపోయింది పొరపాటు జరిగిందని.</span></div><div><span style="font-size: large;">ఇప్పుడు వాళ్ళు చెప్పింది కలభాషిణికి దుర్వార్తే!</span></div><div><span style="font-size: large;">“అమ్మాయ్! నీకు చింతేం వద్దు! ఇంకెంత సేపు నీ బాధంతా పోగొడతానుగా, అలా చూస్తుండు” అన్నాడు ఆమెకి ఉత్సాహం కలిగిస్తూ.</span></div><div><span style="font-size: large;">“అదెలాగ?”</span></div><div><span style="font-size: large;">“తినబోతూ రుచడగటం ఎందుకు?” అంటూండగానే</span></div><div><span style="font-size: large;">ఒక్కసారి తలపైకెత్తి చూసి టక్కుమని నిలిచిపోయింది సింహం!</span></div><div><span style="font-size: large;">ముందుకు నడిపించటానికి అతను రకరకాల ప్రయత్నాలు చేశాడు గాని తోకతిప్పుతూ వెనకడుగే తప్ప ముందడుగు వెయ్యదే!</span></div><div><span style="font-size: large;">కలభాషిణికి కంగారెత్తిపోయింది.</span></div><div><span style="font-size: large;">“ఏమైందేమైంద”ని అరిచింది భయంగా!</span></div><div><span style="font-size: large;">ఒక్క క్షణం ఆలోచించాడు సిద్దుడు.</span></div><div><span style="font-size: large;">“అబ్బే, ఏమీలేదు. మాటల హడావుడిలో ఒక ముఖ్య విషయం మర్చిపోయాను” అంటూ సింహాన్ని నేలకి దించి మేతకి విడిచి, “ఎదురుగా ఎంతో మహిమ గల కాళికాలయం ఒకటుంది. అక్కడ ఉన్న సింహానికి భయపడి ఈ దాపుల వెళ్ళటానికి జంకుతాయి ఎంత గొప్ప సింహాలైనా! మనం వెళ్ళి దేవికి నమస్కరించి వద్దాం. అంతా సక్రమంగా జరుగుతుంది” అంటూ ఒక కత్తి ఉన్న ఎలుగుబంటి చర్మపు ఒరని తీసుకుని గుడికి దారితీశాడు.</span></div><div><span style="font-size: large;">“నువ్విక్కడే ఉండు. నే వెళ్ళి పూలు కోసుకొస్తాను” అని పక్కనున్న పూలతోటలోకి పరిగెత్తాడు సిద్ధుడు.</span></div><div><span style="font-size: large;">అయోమయంగా దిక్కులు చూస్తూ నిలబడింది కలభాషిణి.</span></div><div><span style="font-size: large;">హఠాత్తుగా</span></div><div><span style="font-size: large;">కసువు బుట్టలాగా నెరిసిన జుట్టుతో మన్మధుడు ఖాళీ చేసి వెళ్ళిన పాడుమేడ లాటి ఓ ముసలావిడ వచ్చిందక్కడికి.</span></div><div><span style="font-size: large;">ఆమెలో విపరీతమైన ఆందోళన!</span></div><div><span style="font-size: large;">“అయ్యయ్యో! ఎక్కడ్నించి వచ్చావు నువ్వు? బావురుబిల్లిని నమ్మిన చిలకలాగా ఉన్నావే! ప్రాణాల మీద ఆశ ఉంటే వాడు తిరిగిరాక ముందే నువ్విక్కడ్నించి పారిపో! పో!”</span></div><div><span style="font-size: large;">హడావుడిగా మాట్లాడేస్తోందామె.</span></div><div><span style="font-size: large;">(ఇంకా ఉంది)</span></div>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-65880874087915688262020-10-11T00:46:00.000-07:002020-10-11T00:46:07.930-07:00కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం<div style="text-align: left;"><div><span style="font-size: large;"><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiIvQ3-j7ypcztQETADJzA7F2CbAcmnGbmRn4pwigEX5_RK6sRhw1OwCqQs9GGvvyLhntvCvPTC2MB7ix-ajhgObuivbe-N09_UJbbNKSqvX_VQOubi67hj11no247J_ybhQoE31hUTH2R7/s960/7dbf3b81d04deb3a01a0880ca5bde18d.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="960" data-original-width="785" height="815" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiIvQ3-j7ypcztQETADJzA7F2CbAcmnGbmRn4pwigEX5_RK6sRhw1OwCqQs9GGvvyLhntvCvPTC2MB7ix-ajhgObuivbe-N09_UJbbNKSqvX_VQOubi67hj11no247J_ybhQoE31hUTH2R7/w667-h815/7dbf3b81d04deb3a01a0880ca5bde18d.jpg" width="667" /></a></div><br /> కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;"> (రచన: శ్రీ కె. వి. ఎస్. రామారావు గారు .. వారికీ కృతజ్ఞతో ..)</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">🚩ద్వారకానగరం!-లక్ష్మీ నిలయం!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">విష్ణువుకి ఆటస్థలం!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">సముద్రుడి తొడ మీద కూర్చుని వున్న అతని కూతురా అనిపిస్తోంది ద్వారక అంత చక్కటి, భాగ్యవంతమైన ద్వీపం! ఎ్తౖతెన బంగారు మేడల్తో నిండి “ఎవరం గొప్పో తేల్చుకుందాం రా!” అని స్వర్గంలోని అమరావతిని కొంగుపట్టుకు లాగుతోంది!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ద్వారకకు నాలుగు వైపులా రైవతకం మొదలైన పర్వతాలు స్తంభాలైతే, ఆకాశం వాటిమీద పరిచిన చలువరాతి కప్పు!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">వరుణదేవుడి పట్టణంలోని మేడలు వచ్చి ద్వారకలోని మేడలకి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాయా అన్నట్టుంది సముద్రంలోంచి వచ్చి ఒడ్డున ఆగిపోయే కెరటాల నీళ్ళలో ద్వారక మేడల నీడలు పడుతుంటే!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఊరికి అన్నివైపులా మొగ్గలు, పూలు, పుప్పొళ్ళు, పిందెలు, కాయల్తో నిండిన తోటలు. నందనవనం వాటిముందో లెక్కా పత్రమా?</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఊళ్ళోని జనం సుగుణాల గురించి చెప్పాలంటే అందుకు తగిన మాటలు భాషలోనే లేవు!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఇక అక్కడి వేశ్యలా? అందంలో అప్సరసలు! విటుల డబ్బు దోచటంలో మహాఘటికులు! ఎప్పుడైనా దేవతా విటులొస్తారేమో నని చూసేంత ఎ్తౖతెన మేడల్లో వాళ్ళుండేది!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఈ విశేషాలన్నీ ఒక ఎత్తయితే, మరొక ఎత్తు విష్ణువు ఈ అవతారంలో పదహారువేల నూట ఎనిమిది మంది భార్యల్తో వైకుంఠంలో ఎప్పుడూ దొరకని ఆనందాలు అనుభవిస్తూ ఉండటం!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఆ వూళ్ళో ఒక పడుచుపిల్ల పేరు కలభాషిణి!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఒక గొప్ప నటుడి కూతురు. అద్భుతమైన సౌందర్యం. మంచి గుణాలు. మాటల్లో గొప్ప చాతుర్యం. పేరే అది మరి!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">యవ్వనంలో ఉంది. విలాసమైన చూపులు. చెప్పేదేముంది! మగవాళ్ళని చంపేస్తోంది ఆ చూపుల కత్తిపోట్ల తోటి!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">అందుకే మరి ఆడవాళ్ళని “కటారి కత్తుల”నేది!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">పాడటంలో, ఆడటంలో, కనీ వినీ ఎరగని రతిక్రీడల్లో దిట్ట! ఆమె కొన చూపు తాకిడికి విటుల మనసులూ, డబ్బూ కూడా హుష్కాకి!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">వసంతకాలం ఊరు చుట్టూ తోటలు విరగబూసి విలాసంగా ఉన్నయ్!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">చెలికత్తెల్ని, దాసీల్ని వెంటేసుకుని ఓ తోటకి విహారానికి వెళ్ళింది కలభాషిణి. అంతమంది ఆడవాళ్ళు! ఎక్కడ చూసినా పూలూ, లతలూ, చెట్లూ!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఏమౌతుందో చెప్పాలా! నవ్వులు, కేరింతలు, హాస్యాలు, అపహాస్యాలు, ఆటలు, పాటలు, మొక్కల మీదా చెట్ల మీద కథలూ కాకరకాయలూ!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఆటలయ్యాయి. ఇంక ఉయ్యాల లూగితే బాగుంటుంది!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">సరే, తీగల్తో కట్టిన ఉయ్యాల్లెక్కారు. పాదాలు ఆకాశానికి చాపి మంచి ఉద్ధృతంగా, ఉత్సాహంగా ఊగుతున్నారు పైకి, పైపైకి!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">సరిగా అప్పుడే ఆకాశమార్గాన వస్తున్నాడక్కడికి కలహభోజనుడు నారదుడు!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">పక్కనే శిష్యుడు మణికంధరుడు!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">కృష్ణుడితో ఓ పని పడింది నారదుడికి!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">మణికంధరుడు గంధర్వుడు. మంచి వయసులో ఉన్నాడు. దానికి తోడు కవి కూడ! ఉత్సాహం ఉరకలేస్తూ ఉయ్యాలలూగుతున్న ఆడవాళ్ళని చూశాడు. అతనికి మతిపోయింది! “ఆహా! పంతాలేసుకుని ఉల్లాసంగా ఉయ్యాలలూగుతున్న ఈ అమ్మాయిల పాదాలు చూశారా! స్వర్గంలో దేవతాస్త్రీల మీద “కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు” వుందే వీళ్ళ వ్యవహారం చూస్తుంటే!” అనకుండా ఆగలేకపోయాడు!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">నారదుడు మాత్రం తక్కువ తిన్నాడా? “కవివంటే నువ్వేనోయ్శిష్యా! భలే అన్నావ్! ఇలాటి అమ్మాయిల్ని నేనూ ఎక్కడా చూడలేదంటే నమ్ము! కానీ వీళ్ళ వాలకం చూస్తుంటే దేవతల మీద కయ్యానికి కాదు, వాళ్ళ “తల దన్నటానికే” ఆ పాదాలు వెళ్తున్నాయనటం నిజానికి ఇంకాస్త దగ్గరోయ్!” అన్నాడు ఇంకా హుషారుగా!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">సరిగ్గా ఈ మాటలనే సమయానికే వాళ్ళ పక్కన ఉన్న నల్ల మబ్బు వెనక విమానంలో రంభ! పక్కనే ఆమె ప్రియుడు నలకూబరుడు!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఎంతైనా అప్సరస! ఆపైన మహా అందగత్తె!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఆ మాటలు వినేసరికి మనసు చివుక్కుమంది!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“విన్నావు కదా, అవి నారదుడి మాటల్లాగా ఉన్నాయి. ఒక్కసారి ఆయన్ని పలకరించి వెళదాం” అంది నలకూబరుడితో.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“ఓహో, ఈ చుట్టుపక్కల ఎవరో ఉన్నారే!” అంటూ అటు చూశాడు నారదుడు కూడా.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">మబ్బు అడ్డు తొలిగింది. చటుక్కున నారదుడి పాదాల కిందికి దిగింది వాళ్ళ విమానం. రంభా నలకూబరులు అతనికి పాదాభి వందనం చేశారు! పారిజాత పూల పరిమళం వెదజల్లే శిరసుల్తో!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“ఒకళ్ళ మీద ఒకళ్ళకి విడిపోని ప్రేమతో వర్ధిల్లండి!”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">రంభ మనసు కుతకుతలాడుతోంది.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“మీ దీవన వల్ల అతనికి నా మీద ప్రేమ కాస్తో కూస్తో ఉంటుందేమో కాని ముందు ముందు మానవ స్త్రీల అందానికి లొంగిపోడని నమ్మకం ఏముందిలెండి!” అంది మూతితిప్పుకుంటూ.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“అదేమిటి, అలా అన్నావ్?”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“అన్నీ మాట్లాడుకుందాం. ఒకసారి మా విమానంలోకి వచ్చి మమ్మల్ని పావనం చెయ్యండి”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">గురుశిష్యులు విమానం ఎక్కారు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ప్రేయసీప్రియులు చామరాలు తీసుకుని నారదుడికి రెండు వైపుల్నించి విసురుతున్నారు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">రంభ అంది “మునీంద్రా! కిందినుంచి ఎవరో ఉయ్యాలలూగుతుంటే ఇందాక మీరు ఏదో అన్నారు, మళ్ళీ సెలవిస్తారా?”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“దానికేం, శుభ్రంగా! “కవివంటే నువ్వేనోయ్శిష్యా! భలే అన్నావ్! ఇలాటి అమ్మాయిల్ని నేనూ ఎక్కడా చూడలేదంటే నమ్ము! కానీ వీళ్ళ వాలకం చూస్తుంటే దేవతల మీద కయ్యానికి కాదు, వాళ్ళ “తల దన్నటానికే” ఆ పాదాలు వెళ్తున్నాయనటం నిజానికి ఇంకాస్త దగ్గరోయ్!” అన్నాను. తప్పేం వుంది? నీకు నచ్చకపోతే చెప్పు. మన్లో మనకి దాగుడుమూతలెందుకు?”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“మీరు పెద్దవాళ్ళు. గొప్పవాళ్ళు. మీ మాటకి అడ్డేమిటి? ఐనా ఏదో అతిశయోక్తిగా అలా అని ఉంటారు గాని లేకపోతే వాళ్ళకీ, మాకూ పోలికా? వాళ్ళు మా ముందు దిగదుడుపు అనటానికి జగన్మోహనమైన అందగాడు ఈ నలకూబరుడు నా చెప్పుచేతల్లో ఉండటమే నిదర్శనం!” అంది నిష్టూరాన్నీ, గర్వాన్నీ కలబోస్తూ.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">నారదుడికి ఒక వంక నవ్వూ, మరో వంక చిరాకు!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఐనా తనేనా మాటల్లో తగ్గేది?</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“సరేలేమ్మా! ఇప్పుడు అతనికి నీమీద విపరీతమైన ప్రేమ ఉంది గనక నువ్వేమన్నా చెల్లుతుంది. కాని ఒకటి గుర్తుంచుకో! అన్ని రోజులూ ఇలాగే ఉండవు. నీకూ ఓ సవతి రావొచ్చు. నీలాటి స్త్రీ నీకూ, అతని లాటి వాడు అతనికీ తగిలి మిమ్మల్ని తిప్పలు పెట్టొచ్చు. ముందెలా ఉందో ఎవరు చూడొచ్చారు?”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“నవ్వులాటకైనా అలాటి మాటలనకండి మహానుభావా! అసలే మీ మాట అమోఘమైంది. దయచేసి ఆపండి!”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఆపాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఐతే అప్పటికే ఆలస్యం జరిగిపోయింది!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఆమెకి తెలీదు సరిగ్గా అక్కడే, అప్పుడే మంచి రసవత్తరమైన కథకి అంకురార్పణ జరిగిందని!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ంంంంంంంంంంంంంంంంంంంంంంంం</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">నారదుడి ఆజ్ఞ ప్రకారం కలభాషిణీ వాళ్ళున్న తోటలోకి దిగింది విమానం.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">కృష్ణుడి భవనం వైపుకి తిరిగి నమస్కరించి రంభానలకూబరులు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళారు. ఈలోగా కలభాషిణి విమానం దిగుతున్నప్పుడు అందులోంచి వాళ్ళ మాటలు విన్నది. ధగధగలాడే విమానాన్ని, అందులో నిగనిగలాడే నలకూబరుణ్ణి చూసింది. అతని సౌందర్యానికి ముగ్ధురాలయింది. ఇంకా ఇంకా తనివి తీరక వాళ్ళ విమానం వెంటబడి కొంత దూరం వెళ్ళింది.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">విమానం దూరమైంది.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">కలభాషిణి వెనక్కు తిరిగింది.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“అబ్బ! ఎంత అందగాడు! విన్న కొన్ని మాటల్ని బట్టి అతను నలకూబరుడని పిస్తోంది. మరి అతన్ని దక్కించుకున్న అదృష్ట వంతురాలు ఎవరో కదా! నలకూబరుడి ప్రియురాలు రంభ అంటారు. ఈమె ఆమేనా? ఏమైనా ఈవిషయం వెంటనే ఆ నారద మునిని అడిగి తెలుసుకోవాల్సిందే!” అనుకుంది.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఒంటరిగా నారదుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించింది. “మహర్షీ! ఇప్పుడు విమానంలో వెళ్ళిన వాళ్ళు రంభా నలకూబరులే కదా?” అనడిగింది వినయంగా.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“ఔను. నీకెలా తెలిసింది?”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“మీరు మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను లెండి”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“ఓహో! ఐతే మేం ఆకాశంలో మాట్లాడుకున్నవి కూడా విన్నావా?”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“విన్నాను స్వామీ! తన అద్భుత సౌందర్యంతో నలకూబరుణ్ణి పూర్తిగా వశం చేసుకున్నట్టు రంభ అనటం, ఆ మాట మీకు నచ్చకపోవటం కూడా గమనించాను”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“నిజమే మరి. గర్వంతో కన్నూ మిన్నూ కనపడ్డం లేదు ఆ రంభకి. ఐనా ముందుందిలే ముసళ్ళ పండగ! ఆమెకో విచిత్రమైన సవతిపోరు తగలబోతోంది! ఆమాటకొస్తే, వేరే ఎవరో ఎందుకు, కాలం కలిసిరావాలే గానీ, నువ్వే ఆ సవతివి కావొచ్చు!”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“సరేలెండి. అంతటి సౌందర్య వతులకి తప్ప మాలాటి వాళ్ళం ఎన్ని తిప్పలు పడినా కాలం కలిసొస్తుందా?”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“అదేం మాట! అసలు నీ అందం ముందు రంభ గాని, మిగిలిన అప్సరసలు గాని సరిపోతారా?….. అది సరే! నిన్ను ఇదివరకు ఎక్కడో చూశానే! శ్రీకృష్ణుల వారి కొలువుకి వస్తుంటావా నువ్వు?”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“అవును స్వామీ! అక్కడ ఇదివరకు మిమ్మల్ని చూశాను కూడా”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“నిజమే, నిజమే. ఇప్పుడు గుర్తొస్తోంది. కొన్నాళ్ళ క్రితం నా శిష్యుడు … ఈ మణికంధరుడు … తొలిసారిగా కృష్ణుల వారిని చూడటానికి వచ్చి భక్తి పారవశ్యంతో ఒక దండకం పాడి ఆయన్ని స్తోత్రం చేశాడు. అప్పుడు నువ్వు ఏకసంథాగ్రహణంతో దాన్ని పట్టేశావు! నీ పేరు కలభాషిణి కదూ? బలే బలే. అన్నట్లు, ఆ దండకం నీకింకా గుర్తుందా?”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“ఎందుకు లేదు? ఇదుగో వినండి” అంటూనే మధురంగా పాడి వినిపించింది కలభాషిణి. వినిపించి అన్నది “అప్పుడు శ్రీకృష్ణుల వారు మెచ్చుకుని ఇచ్చిందే కదా మీ శిష్యుడి మెళ్ళో వేలాడుతున్న ఆ రత్నహారం! ఐనా ఎంతో అద్భుతమైన చక్కటి కవిత్వం చెప్పిన వాళ్ళను ఎవరు మాత్రం మెచ్చుకోరు? ఏం ఇవ్వరు? … అలాగే, మీలాటి మహాత్ములతో తిరిగితే చాలు మాలాటి వాళ్ళ కోరికలన్నీ తీరతాయి. అందువల్ల దయచేసి మీ వీణని మోసుకురావటానికి నాకు అవకాశం ఇవ్వండి. ఎలాగూ మీరు కృష్ణుల వారి అంతఃపురానికి వెళ్ళేటప్పుడు యీ మణికంధరుణ్ణి బయటే ఉంచి మీ వీణని మీరే మోసుకుపోతారు కదా? ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని ఈ కోరిక కోరాలనుకుంటున్నా”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“సరే, అలాగే, దాన్లో ఏవుందీ!”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“ఈ మహాత్ముడి అనుగ్రహం కొంత కలిగింది. ఇక మెల్లగా నా కోరిక కూడ తీరొచ్చు” అనుకునేలోగా మరో విషయం గుర్తొచ్చింది కలభాషిణికి.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఆ విషయం నారదుణ్ణి అడుగుదామా వద్దా అని తటపటాయిస్తుంటే</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“ఇదేదో రహస్యం లావుంది. నేనిక్కడుండటం బావుండదు” అని పక్కకి తప్పుకున్నాడు మంచిబాలుడు మణికంధరుడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">అదుగో అక్కడే అతను పప్పులో కాలేశాడు!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఈ చిన్న పని ఆ తర్వాత అతని జీవితాన్ని ఎన్ని వింత మలుపులు తిప్పబోతోందో తెలిస్తేనా బహుశా అలా చేసుండేవాడే కాడు!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">అలా మణికంధరుడు పక్కకు వెళ్ళాక నారదుడితో కలభాషిణి అంది కదా “మునీంద్రా! మీరు నేల మీద వుండగా వాళ్ళు ఆకాశంలోకి వెంటనే ఎగిరిపోవటం బాగుండదని ఆ జంట వాళ్ళ విమానాన్ని కొంత దూరం నేలకి దగ్గర్లోనే పోనిచ్చారు. నేనేమో ఎందుకో తెలియకుండానే దాని పక్కనే వెళ్ళాను. అప్పుడు నలకూబరుడు అన్నాడు కదా “ఓ రంభా! మధ్యలో యీ నారదుడు రావటం వల్ల ఆపేశావు. ఆ కళాపూర్ణుడి విషయం ఏదో చివరిదాకా చెప్పు మరి” అని. దానికా రంభ, “నీకు చెప్పే విషయమైతే అప్పుడే చెప్పేదాన్ని కదా! ఇంక ఆ విషయం అడగొద్దు.అంతేకాదు ఇంతకుముందు నేను చెప్పింది కూడ బయటికి పొక్కనివ్వొద్దు. నామీదొట్టు!” అంది. మరి స్వామీ! ఆ కళాపూర్ణుడెవరో అతని కథేమిటో, రంభ ఏంచెప్పిందో ఏం చెప్పలేనందో నాకు చెప్పండి దయచేసి” అనడిగింది నారదుణ్ణి.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">నారదుడికి బోలెడంత ఆశ్చర్యం వేసింది తనకి తెలియని కథ కూడా ఉందా అని!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">కొంచెం సేపు కదలకుండా నిలబడ్డాడు నారదుడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ప్రపంచంలోని భూతభవిష్యత్వర్తమానాల్ని చూశాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“అబ్బో! ఆ రంభ అతన్తో చెప్పలేనన్న కథ చాలా అపూర్వమైంది. నేను కూడా చెప్పేది కాదు” అన్నాడు నమ్మలేనట్లుగా.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“సరే, పోనీ చెప్పలేంది వదిలేసి వాళ్ళిద్దరి మధ్యా అసలా విషయం ఎందుకొచ్చిందో ఐనా చెప్పండి”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“ఏం చెప్పమన్నావ్! వీళ్ళద్దరూ ఎంత కాముకులంటే ఒకర్నొకరు చూస్తే చాలు ఉద్రేకం వచ్చేస్తుంది వాళ్ళకి! ఇందాక నన్ను చూడటానికి ముందు వాళ్ళు విమానంలో ఎగురుతున్నప్పుడు ఉదయిస్తున్న సూర్యుడి పక్కన ఒక తెల్లటి మేఘం కనపడింది. ఆ దృశ్యాన్ని చూసి రంభ అవి రెండూ బ్రహ్మా సరస్వతుల్లాగా కనిపిస్తున్నాయని పోలిక చెప్పింది. దాన్లో ఏవుందో, ఆ మాటకే వాడు రెచ్చిపోయి ఆమెని ముద్దాడి పెదాల్ని పంటితో నొక్కాడు. అప్పుడు దాని గొంతులోంచి అదివరకెప్పుడూ వినపడని ఒక కోమలమైన శబ్దం బయటికొచ్చింది. వాడేమో, “ఇదేదో భలే వుందే, యింకో సారను” అంటూ వెంట పడ్డాడు. కాసేపు సరసాలయాక ఇక తప్పదని అది వాడి కోరిక తీర్చింది. వాడంతటితో ఊరుకున్నాడా? “ఇదెప్పుడు నేర్చుకున్నావు చెప్పు, చెప్పు” అనడిగితే అది “ఎప్పుడో నేర్చుకున్నాను గాని ఓ కారణం వల్ల ఇన్నాళ్ళూ దాచాను. ఇప్పుడు అనుకోకుండా బయటపడింది” అంది. “ఎందుకు దాచావ్?” అని మళ్ళీ వాడడిగితే, “ఆ సందర్భంలో కళాపూర్ణుడి విషయం వస్తుందేమోనని భయపడి దాచాను” అంది రంభ. అంతటితో ఆపకుండా, “కళాపూర్ణుడి విషయం వస్తే చిక్కేమిటంటే, ఇక ఆ కథ చెప్పిన వాళ్ళు, విన్న వాళ్ళు భూలోకంలో ఎన్నో తరాల పాటు సంపదలు, సుఖాలు పొందుతారు. కనక నీకు నేను చెప్తే దానివల్ల మనం భూలోకంలో పుట్టవలసొస్తుంది. “మరి నువ్వు విన్నావు కదా” అని నన్ను అడగొచ్చు నువ్వు. జరిగిందేమిటంటే, నేను ఆ కథంతా విన్న తర్వాత ఒక అమోఘమైన వాక్కు వున్న వ్యక్తి ఈ ఫలశ్రుతి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆ కథ చెప్పకూడదు” అంది రంభ”</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">అని చెప్పి నారదుడు ” అమ్మాయీ! ఆ రంభ కున్న భయమే నాకూ వుంది గనక నేనూ నీకు ఆ కళాపూర్ణుడి కథ చెప్పలేను. ఐతే ఒకటి మాత్రం నిజం. తొందర్లోనే ఆ కథ బయటికి రాబోతున్నది” అని ముగించాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">అప్పటిదాకా దూరంగా ఉన్నాడు మణికంధరుడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">నారదుడు అతన్ని పిలిచి కృష్ణుడి దగ్గరికి బయల్దేరాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">కలభాషిణి కూడా కొలువు సింగారం చేసుకోవటానికి ఇంటికి పరిగెత్తింది.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“కాస్త చుట్టు దారైనప్పటికీ ఉపయోగమే కలిగింది. సవతి పోరు కలిగించి రంభ మదం దించటానికి అంకురార్పణ జరిగింది” అనుకుంటూ ఆనందంగా నడవసాగాడు నారదుడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">పక్కనే వీణ మోసుకుంటూ శిష్యుడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఆశ్చర్యంగా చూసేవాళ్ళు, నమస్కారాలు చేసేవాళ్ళు, ఎవరికి తగువులు పెట్టబోతున్నాడో అనుకునే వాళ్ళు, వాహనాలు దిగి సాష్టాంగపడేవాళ్ళు దారిలో జనం అంతా హడావుడి పడిపోయారు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">నారదుడు కూడ అందర్నీ రకరకాలుగా ఆనందపరుస్తూ దార్లో విశేషాలు గమనిస్తూ కృష్ణుడి కొలువుకూటం ప్రాంతాలకి చేరుకున్నాడు ఎప్పటికప్పుడే వింతగా కనిపిస్తూ వైకుంఠాన్ని గుర్తుకు తెస్తుందే అని ఆశ్చర్యపోతూ.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">దంతంతో చేసిన ఉయ్యాల మంచం మీద కూర్చుని వున్నాడు కృష్ణుడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">నారదుడి రాక వినటంతో తటాల్న లేచి, “ఎప్పుడూ ఆకాశం నుంచి నేరుగా ఇక్కడే దిగేవాడు ఇవేళ ఇలా రావటం చాలా చిత్రంగా ఉందే” అంటూ ఎదురువెళ్ళి ఆదరంగా తీసుకొచ్చాడు. చకచక కొలువు ముగించుకుని అతన్ని అంతఃపురానికి తీసుకెళ్ళాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">మణికంధరుడు లోపలికి వెళ్ళకూడదు కదా కలభాషిణి నారదుడి వీణ తీసుకుని నడిచింది. కృష్ణుడు కూడా ఆమెని చూసి “భేష్! నేనెప్పట్నుంచో అనుకుంటున్నాను నువ్వు నారదుడికి శిష్యురాలివైతే బాగుంటుందని” అన్నాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">సిగ్గుపడింది కలభాషిణి.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ముగ్గురూ జాంబవతి ఇంటికి చేరారు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“జాంబవతీ! తనకు గానవిద్య బాగా వచ్చినా కూడా తుంబురుడితో పోటీ కోసం మన దగ్గర నేర్చుకోవటానికి వచ్చాడీ నారదుడు. ఇతనికి నీకు వచ్చిన విద్యంతా నేర్పాలి మరి!” అన్నాడు కృష్ణుడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“తప్పక అలాగే చేస్తాను. ఐతే ముందు నా విద్యలో తప్పులేమన్నా ఉన్నాయేమో చూడండి” అంటూ అద్భుతంగా పాడి వినిపించింది జాంబవతి.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ముగ్ధుడయ్యాడు కృష్ణుడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">“ఏ విషయంలోనూ ఏమాత్రం కొరత లేదు. ఇక ఈయనకి నేర్పటమే ఆలస్యం” అని నారదుణ్ణి ఆమెకి అప్పగించి కదిలాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఓ సంవత్సరం పాటు నారదుడికీ, కలభాషిణికీ సంగీతం నేర్పింది జాంబవతి.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">సత్యభామ, రుక్మిణి కూడ చెరో ఏడు శిక్షణ ఇచ్చారు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">స్వయంగా కృష్ణుడే మరో సంవత్సరం పాటు నేర్పాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">పాపం మణికంధరుడికి అంతఃపుర ప్రవేశం లేదుకదా! ఐతేనేం, కృష్ణుడు అతన్ని కూడ నారదుడంతడి వాడిగా తీర్చిదిద్దాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">అలా ఆ ముగ్గురూ సంగీతంలో ఆరితేరారు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">నారదుడి శిక్షణ పూర్తయింది.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">అంతఃపురంలో అందరూ “గానంలో నిన్ను మించిన వాళ్ళు లేరు” అని పొగుడుతున్నారు నారదుణ్ణి.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఐతే అవి ఒట్టి పైపై మాటలా నిజమా? అని సందేహం పట్టుకుందతనికి!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">తెలుసుకోవటానికి కలభాషిణి ఒక సలహా చెప్పింది “నేను వెళ్ళి కనుక్కోవచ్చు గాని ఇలా వెళ్తే వాళ్ళు నా ముందైనా నిజం చెప్తారో లేదో! కనక నాకు ఎవరు కావాలంటే ఆ స్త్రీ రూపం ధరించే వరం యిస్తే నేను వాళ్ళవాళ్ళ ఇష్ట సఖుల రూపాల్లో వెళ్ళి అసలు విషయం తెలుసుకుని వస్తాను మరి!” “ఈ నెపం పెట్టుకుని రంభ రూపంలో వెళ్ళి తను నలకూబరుణ్ణి కలవాలని దీని ఆలోచన. సరే, మనక్కావల్సిందీ అదే!” అనుకుని ఆనందంగా అలాగే వరం ఇచ్చాడు నారదుడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">కలభాషిణి వెళ్ళి జాంబవతి, రుక్మిణి, సత్యభామలు నారదుడి గురించి అన్నది నిజమే నని తెలుసుకుని వచ్చింది.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఆ సంతోషంలో నారదుడు, “అమ్మాయీ! నువ్విది వరకు కోరుకున్న వాణ్ణి, నలకూబరుడి రూపంలో ఉన్న వాణ్ణి కలుస్తావు పో!” అని దీవించి పంపాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఈ మాటల్ని జాగ్రత్తగా గమనించాలి మనం. ముందు ముందు ఉపయోగం ఉంటుంది!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఇక నారదుడు, మణికంధరుడు బయల్దేరారు. కొంతసేపు మాట్లాడుకున్నాక నారదుడు ఒక వైపు వెళ్ళాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">అతని ఆదేశం ప్రకారం తీర్థయాత్రలకు వెళ్ళాడు మణికంధరుడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">మరి ఇప్పుడు మనం కలభాషిణి విషయం చూద్దాం. ఇదివరకులా కొలువుకు వెళ్ళటం తగ్గింది. గానాభ్యాసం కూడా తగ్గింది. దాంతో మళ్ళీ నలకూబరుడి మీదికి గాలి మళ్ళింది. ఐతే అతని దగ్గరికి వెళ్ళే దారి మాత్రం కనపడటంలేదు! అసలతను ఎక్కడుంటాడో కూడా తెలీదుగా!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">కాలం గడుస్తోంది. ఒకనాడు ఒక్కతే వీణ తీసుకుని ఇంటితోట లోకి వెళ్ళింది కలభాషిణి ఏమీ తోచక.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">అంతలో సింహం మీదెక్కి ఆకాశంలోంచి ఆ తోట లోకి దిగాడొక సిద్ధుడు!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">బూడితపూత, యోగదండం, చిన్న జడలు, మందుల పుస్తకం, నాగబెత్తం, వీణ, గంజాయి గొట్టం ఇదీ అతని వాలకం!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఆశ్చర్యంతో వెళ్ళి అర్య్ఘం ఇచ్చింది కలభాషిణి!</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">మర్యాదలు చేసింది.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">వెంటనే కుశలప్రశ్నలు గుప్పించాడతను ఎప్పట్నుంచో ఎరిగున్న దగ్గరి చుట్టం లాగా “ఐతే కలభాషిణీ! నారదుడు ఈ మధ్య ఇటువైపు రావటం లేదు కదా! ఇంకేం పని లేక నీ మనసు పూర్తిగా నలకూబరుడి మీదే ఉండి ఉండాలి! ఐనా తను వెళ్ళేటప్పుడు నారదుడు నీ కోరిక తీరేట్లు దీవించాడు కదా! ఆయన మాట జరిగితీరుతుంది, నీకేం బెంగ అక్కర్లేదు! …. ఇక అసలు విషయానికొస్తే, ఈ ప్రపంచంలో నాకు నచ్చిన గానాలు ఇద్దరివే ఒకటి మణికంధరుడిదీ, రెండోది నీదీ! కానీ ఈ మధ్య తపసులోకి దిగి మణికంధరుడు పాడటం మానేశాడాయె! నువ్వైనా కాసేపు హాయిగా వీణ వాయించి నా చెవుల తుప్పు వదిలిస్తావని ఇటొచ్చా” అన్నాడతను హడావుడిగా.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">అతననే ఒక్కో మాటకీ ఆశ్చర్యం పెరిగిపోతోందామెలో. ఎవరితను? ఇంత రహస్యమైన విషయాలు ఎలా తెలుసునితనికి?</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">(ఇంకా ఉంది)</span></div></div>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-80374569769930659842020-10-09T05:36:00.001-07:002020-10-09T05:36:18.749-07:00🚩🚩జాబిలి మహా ఋషి!🚩🚩<div style="text-align: left;"><div><span style="font-size: large;"><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiF9C_6m1Ins7aLI2QG2EOs39UUPBcaO3FYQi5KL-3IaGb3v9na6UKZChmKYq4QfFJDjoU0dCgYLWrEzHiYs-nx81PTtZUQ1eac4wHzeK25nuUUNaSJXyj-24tfFrwWsvqi_2tCYHOKBiLI/s400/120936771_5163807556977935_4612996388576073978_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="268" data-original-width="400" height="348" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiF9C_6m1Ins7aLI2QG2EOs39UUPBcaO3FYQi5KL-3IaGb3v9na6UKZChmKYq4QfFJDjoU0dCgYLWrEzHiYs-nx81PTtZUQ1eac4wHzeK25nuUUNaSJXyj-24tfFrwWsvqi_2tCYHOKBiLI/w520-h348/120936771_5163807556977935_4612996388576073978_n.jpg" width="520" /></a></div><br />🚩🚩జాబిలి మహా ఋషి!🚩🚩</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">#వేదాలు అపౌరుషేయాలు అని నమ్ముతారు. అంటే వాటిని ఎవరూ ప్రత్యేకంగా రాయలేదనీ, స్వయంసిద్ధంగా వెలువడ్డాయనీ అర్థం. కానీ వేదాంతాలు అనదగ్గ ఉపనిషత్తులకి అనేకమంది కర్తలు ఉన్నారు. వేదాలలో నిగూఢంగా ఉన్న ఆధ్యాత్మిక విషయాలను ఉపనిషత్తులు వెలువరించాయి అని కొందరు అంటే, అసలు వేదాలలో చెప్పకుండా వదిలేసిన విషయాలను ఇవి పూర్తి చేశాయి అని మరికొందరు అంటారు. ఏది ఏమైనా జ్ఞానసంబంధమైన గొప్ప చర్చలను లేవనెత్తిన పాఠాలు ఈ ఉపనిషత్తులు. ఉపనిషత్ మంత్రాలు జ్ఞానాన్ని సూటిగా చర్చించడమే కాదు. కొన్ని చక్కటి కథలను, ఉపమానాలను కూడా అందించాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది సత్యకామ జాబాలుని కథ. ఈ కథ ఛాందోగ్య ఉపనిషత్తులో కనిపిస్తుంది.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ఒకానొకప్పడు #జాబాలి అనే కుర్రవాడు ఉండేవాడు. తన తోటివారంతా వేదవిద్యను అభ్యసిస్తుంటే జాబాలికి కూడా జ్ఞానాన్ని అర్జించాలన్న కోరిక కలిగింది. తనను శిష్యునిగా చేర్చుకోమని #గౌతముడు అనే ఋషి దగ్గరకు వెళ్లి అర్థించాడు జాబాలి. ‘సరే నీ తల్లిదండ్రులు ఎవరో, నీ గోత్రం ఏమిటో చెప్పు’ అన్నాడు గౌతముడు. ఆ ప్రశ్నకి జాబాలి దగ్గర జవాబు లేకపోయింది. ఎందుకంటే చిన్ననాటి నుంచి అతను తన తండ్రిని ఎరుగడయ్యే! ఇక తన గోత్రమూ తనకు తెలియదు. అందుకని దాసిగా పనిచేసే తన తల్లి దగ్గరకు వెళ్లి గౌతముని ప్రశ్నలకు జవాబుని కోరాడు. ‘నాయనా! నిజానికి నీ పుట్టుకకు కారణం ఎవరో నాకు కూడా తెలియదు. నేను యువతిగా ఉన్నప్పుడు ఎందరితోనో గడిపాను. వారిలో ఎవరి గోత్రం నీదని చెప్పను! కానీ ఒకటి. నా పేరు జాబాల కాబట్టి నా కుమారుడమైన నిన్ను జాబాలి అని పిలుచుకుంటూ వస్తున్నాను. ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పగల ధైర్యం నీకు ఉందని నమ్ముతున్నాను. అంతేకాదు! ఇకమీదట ఎప్పుడూ సత్యాన్నే వాంఛించు. దానికి గుర్తుగా నీకు ‘#సత్యకాముడు’ అన్న పేరుని అందిస్తున్నాను’ అని చెప్పి పంపింది.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">తన తల్లి చెప్పిన మాటలను యథాతథంగా సత్యకామజాబాలి, గౌతమునితో చెప్పాడు. జాబాలి సత్యవాక్కుకు సంతోషించిన గౌతముడు అతణ్ని తన శిష్యగణంలో చేర్చుకున్నాడు. జ్ఞానానికే అంతిమం అనదగ్గ బ్రహ్మజ్ఞానాన్ని గౌతముని వద్ద పొందాలన్నది జాబాలి కోరిక. కానీ జ్ఞానం పట్ల జాబాలికి ఉన్న తపనను పరీక్షించి కానీ అతనికి విద్యను అందించేందుకు సిద్ధంగా లేడు గౌతముడు. అందుకోసం జాబాలికి ఆవులు, ఆంబోతులు ఉన్న పశుమందను అప్పగించి. ‘వీటి సంఖ్య వేయిగా మారేంతవరకూ నువ్వు వాటిని అడవులలో సంరక్షిస్తూ ఉండు’ అని ఆదేశించాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">గురువుగారి ఆదేశం మేరకు సత్యకాముడు పశువుల మందను మేపుతూ అడవులలో తిరగసాగాడు. కానీ అతని మేధోశక్తికి ప్రకృతిలోని ప్రతి అణువూ ఏదో ఒక రహస్యాన్ని చెబుతున్నట్లే తోచేది. లేత చిగుళ్లు జీవనంలోని సౌకుమార్యాన్ని సూచిస్తే, ఎండిన ఆకులు లయతత్వాన్ని బోధించాయి. కొండలు స్థిరత్వం గురించి చెబితే, సెలయేళ్లు సంతోషానికి శబ్దాన్ని ఇచ్చాయి. అలా అడవిలో తిరుగుతూ, కాలం గడుపుతూ…. తనకు తెలియకుండానే ఈ ప్రకృతిలోని పరమజ్ఞానాన్ని పొందసాగాడు సత్యకాముడు. ఇలా ఉండగా ఒకరోజున అతని మందలోని ఒక ఆంబోతు అతని దగ్గరకు వచ్చి ‘సత్యకామా! మా సంఖ్య వేయిని చేరుకుంది. ఇక నువ్వు నీ గురువుగారి దగ్గరకు బయల్దేరవచ్చు. అయితే అందుకు ముందుగా నీకు బ్రహ్మజ్ఞానంలోని తొలి పాదాన్ని వివరిస్తాను విను. ఈ విశ్వంలోని నాలుగు దిక్కులూ ఆ బ్రహ్మతత్వంలోని భాగమే!’ అని చెప్పింది.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">సత్యకాముడు ఆ సాయంత్రం వెలిగించిన అగ్ని నుంచి వెలువడిన #అగ్నిదేవుడు ‘ఈ జగత్తులో భాగమైన భూమి, ఆకాశం, సముద్రాలు అన్నీ కూడా బ్రహ్మంలోని భాగమే. ఇదే బ్రహ్మజ్ఞానంలోని రెండో పాదం’ అని విశదీకరించాడు. ఇక మర్నాడు ఒక హంస అతని చెంతకు చేరి వెలుతుర్ని ప్రసాదించే రూపాలు (అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు) కూడా బ్రహ్మకు ప్రతిరూపాలే అని చెప్పి ఎగిరిపోయింది. ఇక బ్రహ్మజ్ఞానంలోని చివరి పాదాన్ని ఒక నీటి పక్షి అతనికి అందించింది. ‘మనిషి ఉనికికి ఆధారభూతమైన ప్రాణం, దృష్టి, వినికిడి, మనస్సు కూడా బ్రహ్మలోని అంతర్భాగాలే’ అని ఆ నీటి పక్షి అతనికి చెప్పింది. అలా సత్యకాముడు బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడై సంతృప్తిగా తన గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">సత్యకామునిలో వెలుగొందుతున్న బ్రహ్మవర్చస్సుని అల్లంత దూరాన చూసిన గురువుగారు జరిగింది గ్రహించారు. ‘సత్యకామా! నీకు ఇక నా అవసరం లేదు. నీ అంతట నువ్వే కావల్సిన జ్ఞానాన్ని సాధించగలిగావు’ అన్నారు. కానీ సత్యకామునిలో తాను జ్ఞానాన్ని పొందానన్న గర్వం లేశమంతైనా లేకపోయింది. ‘గురువుగారూ! జ్ఞానానికి అంతు ఎక్కడ? నాకు ఆ ఆంబోతు, అగ్ని, హంస, నీటిపక్షి బ్రహ్మజ్ఞానాన్ని నేర్పిన మాట నిజమే. కానీ మీ నుంచి కూడా ఎంతో కొంత విద్యను ఆర్జించాలనుకుంటున్నాను. దయచేసి ఈ దీనుడి కోరికను మన్నించండి’ అని వినమ్రతతో వేడుకున్నాడు. సత్యకాముని వినమ్రతకు ముగ్థుడైన గౌతముడు తనలో ఉన్న జ్ఞానసారాన్ని కూడా సత్యకామునికి అందించాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">సత్యకాముని కథ కేవలం ఛాందోగ్య ఉపనిషత్తుతోనే ముగిసిపోలేదు. #సత్యాకముడు, #పిప్పలాదుడు అనే ఋషికి చెప్పిన మంత్రాలతో కూడిన ‘#జాబాలి ఉపనిషత్తు’ కూడా ప్రముఖమైందే. ఇక రామాయణంలోనూ జాబాలి ప్రస్తావన వస్తుంది. అయితే జాబాలిని ఒక నాస్తికునిగా రామాయణం ఎంచుతుంది. తనలో ఉన్న బ్రహ్మమే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉందన్న జాబాలి భావన వల్ల అతడిని నాస్తికునిగా ఎంచి ఉండవచ్చు. అతనికి ఆంబోతు, అగ్ని, హంస, నీటిపక్షి అందించిన బ్రహ్మజ్ఞానంలోని సారం ఇదే కదా! నర్మదా నదీతీరాన జాబాలి తపస్సు చేసుకున్న ప్రాంతమే ఇప్పటి జబల్పూరుగా మారిందని చెబుతారు. తిరుమలలోని జాబాలి తీర్థం వద్ద కూడా ఆయన కొన్నాళ్లు తపస్సు చేసుకున్నాడని ప్రతీతి. జాబాలిని పురాణాలు ఒక ఋషిగా ఎంచి, ఆయన పేర ఒక గోత్రాన్ని నెలకొల్పాయి. మొత్తానికి తన సత్యనిష్ఠతో, జ్ఞానతృష్ణతో గోత్రమంటూ లేని జాబాలి తనే ఒక గోత్రానికి స్థాపకుడు అయ్యేంతటి ఋషిగా మారాడు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩</span></div></div>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-59406871687933125562020-09-28T07:16:00.000-07:002020-09-28T07:16:07.271-07:00🚩🚩వెండితెర శ్రీరామచంద్రులు!🚩🚩 (తెలుగు, తమిళ ప్రేక్షకులకు రాముడంటే ఎన్ టి ఆర్ నే.)<div style="text-align: left;"><div><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhOeO-LcZ1FCBBZeFhvbCoTUXGLyOvX3I3FueXkZYAue8GCkxlPnVp2eOUNM9JlUvf999lX5wBZwlUQSLrIc98UX442kkgAXqQoOZ1R5udwd5DWawhl2svqssEepdIrI3khZFllfkYYWdfU/s884/71161341_3643752152316824_7065991053332971520_n.jpeg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="884" data-original-width="430" height="816" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhOeO-LcZ1FCBBZeFhvbCoTUXGLyOvX3I3FueXkZYAue8GCkxlPnVp2eOUNM9JlUvf999lX5wBZwlUQSLrIc98UX442kkgAXqQoOZ1R5udwd5DWawhl2svqssEepdIrI3khZFllfkYYWdfU/w398-h816/71161341_3643752152316824_7065991053332971520_n.jpeg" width="398" /></a></div><br /> 🚩🚩వెండితెర శ్రీరామచంద్రులు!🚩🚩</div><div> (తెలుగు, తమిళ ప్రేక్షకులకు రాముడంటే ఎన్ టి ఆర్ నే.)</div><div><br /></div><div>‘శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం</div><div>సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం</div><div>ఆజానుబాహు మరవింద దళాయతాక్షం</div><div>రామం నిశాచర వినాశకరం నమామి.’’</div><div><br /></div><div>-ఈ శ్లోకం, త్రేతాయుగ కథా నాయకుడు, అవతార పురుషుడు అయిన శ్రీరామచంద్రమూర్తి బాహ్య సౌందర్యాన్ని, అత్యంత శక్తివంతమైన, అంతర్గత లక్షణాలను వివరిస్తుంది.</div><div>తెలుగు సినీ చరిత్రలో, ఆ శ్రీరామచంద్రుని పాత్రకు తమ అభినయం ద్వారా ప్రాణప్రతిష్ఠచేసిన మహానటుల అభినయాన్ని రేఖామాత్రంగా అవలోకిద్దాం..</div><div><br /></div><div>ఆంధ్ర దేశంలో తొలి సినిమా ప్రదర్శనశాల విజయవాడలోని మారుతి టాకీస్ దాని యజమాని, పోతిన శ్రీనివాసరావు, 1933లో నిర్మించిన చిత్రం ‘పృథ్వీపుత్ర’. ఇందులో శ్రీరాముని పాత్రను ఈలపాట రఘురామయ్య పోషించారు. ఆయన అసలు పేరు ‘కల్యాణం వెంకట సుబ్బయ్య’. 8 సంవత్సరాల వయస్సులో ‘రామదాసు’ నాటకంలో బాలనటుడిగా ‘రఘురాముని’ పాత్రను పోషించారు. అది చూసి ముచ్చటపడ్డ, కాశీనాథుని నాగేశ్వరరావుగారు, ఆ బాలుడి పేరుమార్చి ఇక నుంచి నీ పేరు రఘురాముడు అని ఆశీర్వదించారు. ఆ తరువాత ఈల పాటలో ప్రావీణ్యం పొంది ‘ఈల పాట రఘురామయ్య’గా ప్రసిద్ధినొందారు. ఈయన శ్రీరాముని పాత్ర పోషించిన మరో చిత్రం 1945లో విడుదలయిన ‘పాదుకా పట్ట్భాషేకం.’</div><div><br /></div><div>1934లో వేల్ పిక్చర్స్ పేరిట, పి.వి.దాసు నిర్మాతగా చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో రూపొందిన ‘సీతాకల్యాణం’ చిత్రంలో ప్రముఖ రంగస్థల నటుడు ‘‘మాస్టర్ కల్యాణి’’ శ్రీరాముని పాత్రను పోషించి, కల్యాణరాముడు ఎలా వుంటాడో అంత చక్కటి రూపంతో అభినయంతో రాణించారు.</div><div><br /></div><div>1934లో ఈస్టిండియా కంపెనీవారు, తారాబ్రహ్మగా పేరొందిన, సి.పుల్లయ్య దర్శకత్వంలో తీసిన, ‘లవకుశ’ చిత్రంలో ప్రముఖ రంగస్థల నటుడు పారుపల్లి సుబ్బారావు శ్రీరాముని పాత్రను పోషించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. వీరికి జంటగా సీతాదేవి పాత్రలో సీనియర్ శ్రీరంజని ఉదాత్తంగా నటించారు.</div><div><br /></div><div>ఇదే సి.పుల్లయ్య 1963లో ఎన్.టి.రామారావు, అంజలిదేవి కాంబినేషన్లో తీసిన ‘లవకుశ’ చిత్రానికి, 1934లో వచ్చిన ఈ ‘లవకుశ’ చిత్రంలోని సన్నివేశాలు, అభినయం స్ఫూర్తినిచ్చాయి.</div><div><br /></div><div>1936లో నిడమర్తి సోదరులు రాజమండ్రిలో తొలిసారిగా అవుట్డోర్లో తీసిన ‘సంపూర్ణ రామాయణం’లో ‘కడారురాజు’ శ్రీరామునిగా నటించారు. ఈ దశాబ్దంలో వచ్చిన చిత్రాల్లో శ్రీరాముని పాత్రను పోషించిన వారంతా సంగీత విద్యలో ప్రవీణులై, పద్యాలు పాడడంలో ప్రసిద్ధులైన రంగస్థల నటులే.</div><div><br /></div><div>‘జీవనజ్యోతి’ సాంఘిక చిత్రంలో కథానాయకుడిగా పరిచయమైన నటుడు, సిహెచ్.నారాయణరావు. ఈయన 1942లో నటుడు నాగయ్య నటించిన వాహిని వారి భక్తపోతన’ (దర్శకునిగా కె.వి.రెడ్డి తొలి చిత్రం)లో శ్రీరామచంద్రుని పాత్రను పోషించారు.</div><div><br /></div><div>అక్కినేని నాగేశ్వరరావును నిర్మాత ఘంటసాల బలరామయ్య సినీ రంగానికి శ్రీరామచంద్రుని పాత్రలో పరిచయం చేసిన చిత్రం ‘శ్రీ సీతారామ జననం’ 1944. వీరి సరసన రంగస్థల నటి ‘బాలాత్రిపురసుందరి’ సీత పాత్రను పోషించారు.</div><div><br /></div><div>1956 ప్రాంతంలో ప్రముఖ నిర్మాత ఎం.ఏ.వేణు అక్కినేని నాగేశ్వరరావును కలిసి తాను తీయబోతున్న ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలో శ్రీరాముని పాత్ర ధరించవలసినదిగా కోరారు. అప్పుడు నాగేశ్వరరావు ఈ వ్యాసం ప్రారంభంలో వున్న శ్లోకాన్ని చదివి అర్ధాన్ని వివరించి ఆ పాత్రకు తనకంటే తన సహ నటుడు, నందమూరి తారకరామారావు అన్నివిధాల తగినవారని సూచించారు. ఆ సూచన ప్రకారం ఎన్.టి.రామారావు తొలిసారిగా శ్రీరామచంద్రునిగా నటించిన తమిళ చిత్రం ‘సంపూర్ణ రామాయణం’ (14-04-1958 ) . ఇందులో సీతగా పద్మిని నటించారు.</div><div>(Reference: - ఎస్.వి.రామారావు -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి, 25-03-2018, Andhra bhoomi sunday main feature)</div><div><br /></div><div>20-12-1956 నిర్మాత శంకరరెడ్డి రూపొందించిన సాంఘిక చిత్రం ‘చరణదాసి’లో ఒక సన్నివేశంలో అంతర్నాటకంలో అంజలిదేవి, ఎన్.టి.రామారావు ‘సీతారాములు’గా నటించారు. దానిని చూసి ముచ్చటపడ్డ నిర్మాత శంకర్రెడ్డి 1934లో లవకుశ తీసి, విజయం సాధించిన సి.పుల్లయ్య దర్శకత్వంలో రంగులలో ‘లవకుశ’ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 6 సంవత్సరాలు అనేక వ్యయప్రయాసలకోర్చి, దాన్ని పూర్తిచేసి 29-03-1963 విడుదల చేశారు. ఆంధ్ర ప్రజానీకం, రామారావు, అంజలిదేవిల నటనకు నీరాజనం పట్టారు. రికార్డు స్థాయిలో ప్రదర్శింపబడి, కలెక్షన్స్ రాబట్టి చరిత్రను సృష్టించిన చిత్రంగా నిలిచిపోయింది.</div><div><br /></div><div>శ్రీరామచంద్రుడు, సీతాసమేతుడై అయోధ్య నగరంలో పట్ట్భాషిక్తుడు కావటం నుంచి సీతాపరిత్యాగం, లవకుశల జననం, సీతాదేవి అవతార సమాప్తి, లవకుశుల పట్ట్భాషేకం వరకూ గల ముఖ్య ఘట్టాలను ఏర్చికూర్చిన నవరస భరిత చిత్రం ‘లవకుశ’.</div><div><br /></div><div>పట్ట్భాషిక్తుడైన శ్రీరామచంద్రుడు మహారాజుగా, ప్రజారంజకమైన పరిపాలన అందిస్తానని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని మాట ఇస్తాడు. సుదీర్ఘ విరామానంతరం, సీతాదేవితో అన్యోన్యంగా వుంటూ, తన ప్రేమానురాగాలను భర్తగా అందిస్తుంటాడు. సామాన్యుని నిందా వాక్కులకు విలువనిచ్చి, సీతాదేవిని, అడవులలో వదిలి రావటానికి నిర్ణయించే సందర్భంలో పరిపాలనా బాధ్యతను, స్వీకరించమని సోదరులను అర్ధించటం, రాజసింహాసనం, తననూ తన దేవేరిని దూరంచేయటం, ఆపైన సీతా వియోగంతో అంతర్మధనం చెందటం, రాజమందిరంలో లవకుశల గానాన్ని విని ముచ్చటపడి, వారు తమ కుమారులని తెలియకపోయినా, వారిని ఆశీర్వదించటం, లోక కల్యాణంకోసం, అశ్వమేధ యాగాన్ని తలపెట్టడం, యజ్ఞవాటికలో అర్ధాంగి సీతకు బదులు స్వర్ణ సీతను నిలపటం, అశ్వాన్ని బంధించిన లవకుశలతో పోరాటంలో ముందు బుజ్జగించి, ఆపై హెచ్చరించి, చివరి ప్రయత్నంగా అస్త్రప్రయోగం చేయటం, పోరు నిలవరించవచ్చిన సీతాదేవి వలన వారు తమ కుమారులని తెలిసి ఆనందించటం, తన జీవిత పరిసమాప్తి అని సీత భూమాత ఒడిలో ఐక్యం కావటం. ఆమెపట్ల గల ప్రేమ, ఆరాధనలను తలంచుకొని సామాన్య మానవునివలె శ్రీరాముడు విలపించటం, తుదకు వాల్మీకి సూచనతో లవకుశులకు పట్ట్భాషేకం చేయటం, ఈ ఘట్టాలన్నిటిలో ధీర, ఉదాత్త, మహోదాత్త నటనను ప్రదర్శించి శ్రీరాముని పాత్రకు, ప్రాణప్రతిష్టచేసి, త్రేతాయుగ శ్రీరామచంద్రుని మన కనులముందు సాక్షాత్కరింపచేసిన మహానటుడు నందమూరి తారక రామారావు.</div><div><br /></div><div>వారితో అంత ధీటుగా సీతాదేవి పాత్రకు ప్రాణం పోసి, సీతమ్మకు మారుపేరుగా నిలిచారు నటీమణి అంజలిదేవి. అంత ఉదాత్తంగా వారికి సమఉజ్జిగా లక్ష్మణుని పాత్రను పోషించారు నటులు కాంతారావు. వీరి చిత్రాలుగల కేలండర్లు, ఆరోజుల్లో ఆంధ్రదేశంలో ప్రతి ఇంటా దర్శనమిచ్చాయి.</div><div><br /></div><div>23-12-1964లో నటులు నాగయ్య నిర్మించిన చిత్రం ‘రామదాసు’. ఆ చిత్రంలో అతిథి నటులుగా రామ, లక్ష్మణుల పాత్రలను ఎన్.టి.రామారావు, శివాజీ గణేషన్ పోషించారు.</div><div><br /></div><div>‘రామ నామమా, లేక రామబాణమా’ ఏది శక్తివంతమైనది అనే కథాంశంతో కూడిన చిత్రం ‘శ్రీరామాంజనేయ యుద్ధం’. 10-01-1975 శ్రీరామ భక్తులలో ఒకడైన యయాతి మహారాజు విధి విలాసంవల్ల చేసిన తప్పు దాన్ని విని, అతనిని సంహరిస్తానని శ్రీరాముడు నిర్ణయించటం, ఆ సంగతి తెలియక శరణార్థియైన యయాతిని రక్షిస్తానని శ్రీరామభక్తాగ్రేసరుడు ఆంజనేయుడు అభయమివ్వటం, ఫలితంగా దైవమయిన శ్రీరామునికి భక్తుడైన ఆంజనేయునికి మధ్య పోరాటం. ఈ కథలో ఆంజనేయుని పట్ల గల అవ్యాజ్య ప్రేమ ఒకవైపు, తన శపథం నెరవేరాలని పంతగించి, ఆ ఆంజనేయుని పైనే ఆగ్రహంతో చండ్ర నిప్పులు కురిపించటం, ఈ రెండు పార్శాల నడుమగల సంఘర్షణను అద్భుతంగా ఆవిష్కరించారు, శ్రీరామ చంద్రునిగా ఎన్.టి.రామారావు, సీతాదేవిగా బి.సరోజాదేవి నటించారు.</div><div><br /></div><div>పరస్పర విరుద్ధమైన, శ్రీరామ, రావణాబ్రహ్మ పాత్రలను పోషించి, స్వీయ దర్శకత్వంలో 07-09-1978లో ఎన్.టి.రామారావు రూపొందించిన చిత్రం ‘శ్రీరామ పట్ట్భాషేకం’. సీతగా సంగీత నటించారు.</div><div><br /></div><div>ఆదుర్తి సుబ్బారావు తొలి చిత్రం ‘అమర సందేశం’ ద్వారా కథా నాయకుడిగా పరిచయమైన అమర్నాథ్ శ్రీరామునిగా నటించిన చిత్రం 1958లో విడుదలైన ‘శ్రీరామాంజనేయ యుద్ధం’.</div><div><br /></div><div>దర్శకులు గుత్తా రామినీడు, ‘మా ఇంటి మహాలక్ష్మి’ చిత్రం ద్వారా పరిచయం చేసిన, ఆరడుగుల అందగాడు, స్ఫురద్రూపి, విశాల నేత్రుడు ‘హరనాథ్’. అతని రూపానికి ముచ్చటపడ్డ ఎన్.టి.రామారావు, తాను ప్రతినాయకుడైన రావణాబ్రహ్మ పాత్రను పోషిస్తూ తీసిన ‘సీతారామకల్యాణం’ చిత్రంలో శ్రీరాముని పాత్రనిచ్చి ‘హరనాథ్’ను ప్రోత్సహించారు. విశ్వామిత్రుని ఆజ్ఞననుసరించి దానవ సంహారం చేసినపుడు వీరోచితంగానూ, శివధనుర్భంగ సన్నివేశంలో గంభీరంగానూ, కల్యాణ ఘట్టంలో లాలిత్యంగానూ నటించి శ్రీరామ పాత్ర, పోషణకు ఎన్.టి.ఆర్.కు వారసుడేమో అనిపించుకున్నారు.</div><div><br /></div><div>హరనాథ్, శ్రీరామునిగా నటించిన మరో చిత్రం హాస్య నటుడు పద్మనాభం రూపొందించిన ‘శ్రీరామకథ’ (1968) సీతగా శారద నటించారు. హరనాథ్, శ్రీరామునిగా మరో చిత్రం భీమాంజనేయ యుద్ధం’ (1966).</div><div><br /></div><div>నారద పాత్ర పోషణకు తనకు తనేసాటి అనిపించుకున్న కాంతారావు శ్రీరామచంద్రునిగా నటించిన చిత్రాలు ‘మైరావణ’(1964), ‘పాదుకా పట్ట్భాషేకం’(1966) ‘వీరాంజనేయ’ (1968). సీత వియోగంలోగల బాధను ‘వీరాంజనేయ’చిత్రంలో చక్కగా ప్రదర్శించారు కాంతారావు. సీతాదేవిగా అంజలిదేవి నటించారు.</div><div><br /></div><div>బాపు, రమణల కాంబినేషన్లో రూపొందిన కమనీయ, రమణీయ చిత్రం ‘సంపూర్ణ రామాయణం’ (1972) సాంఘిక చిత్రాలలో కథానాయకునిగా మహిళాప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శోభన్బాబు ఈ చిత్రంలో శ్రీరాముని పాత్ర పోషించటం విశేషం. తండ్రి ఆజ్ఞ శిరసావహించే శ్రీరామునిగా గురువు విశ్వామిత్రుని లక్ష్యాన్ని సాధించి దనుజ సంహారం చేసిన శిష్యునిగా క్రీగంట సీతాదేవిని చూసి, అభిమానించిన, కల్యాణరామునిగా శివ ధనుర్భంగంచేసిన వీరునిగా, విర్రవీగిన పరశురాముని, విష్ణుచాపాన్ని సంధించి, అతని గర్వాంధకారాన్ని తొలగించి, కనువిప్పు కలిగించిన అవతారమూర్తిగా, సంగర రంగంలో తన వీరత్వంతో, ఔదార్యంతో చిరుమందహాసంతో రావణుని అంతరంగంలో కల్లోలం సృష్టించిన కారణజన్మునిగా తక్కువ మాటలతో, అత్యంత సంయమనంతో ఇది ‘బాపూ, రమణ’లు సృష్టించిన ‘శ్రీరామచంద్రుని’ పాత్ర అనే ముద్ర స్పష్టంగా కన్పించే విధంగా ప్రేక్షకులను మెప్పించారు శోభన్బాబు. సీతాదేవిగా చంద్రకళ నటించారు.</div><div><br /></div><div>బాపూ రమణల మరోసృష్టి 1976లో నిర్మాత పింజల సుబ్బారావు తీసిన ‘సీతాకల్యాణం’. ఈ చిత్రంలో ‘రవి’ అనే నటుడిని, శ్రీరామునిగా పరిచయం చేశారు.</div><div><br /></div><div>కళాత్మక విలువలతో కూడిన ఈ చిత్రం విదేశాల్లో పాఠ్యాంశంగా ఫిలిం టెక్నిక్కోర్సు సిలబస్లో చేర్చబడింది. ఇదే నిర్మాత పౌరాణికబ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందించిన ‘సీతారామ వనవాసం’ చిత్రంలో కూడా శ్రీరామునిగా రవి నటించారు. ఈ రెండు చిత్రాలలోనూ సీతాదేవిగా జయప్రద నటించారు.</div><div><br /></div><div>1997లో అందరూ బాల నటీనటులతో సహజ కవి, మల్లెమాల గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించిన రామాయణం చిత్రంలో ఈనాటి మేటి, యువకథానాయకుడు జూనియర్ యన్.టి.ఆర్. శ్రీరామునిగా నటించి అగ్ర నటులు యన్.టి.ఆర్.కు నట వారసుడనిపించుకున్నారు.</div><div><br /></div><div>2006లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ‘శ్రీరామదాసు’ చిత్రంలో సాంఘిక చిత్రాలలో కథానాయకునిగా నటించిన ‘సుమన్’ను శ్రీరామచంద్రునిగా తీర్చిదిద్దారు. సీతగా అర్చన నటించింది.</div><div><br /></div><div>నిర్మాత వై.సాయిబాబా, బాపూ, రమణల కాంబినేషన్లో ‘లవకుశ’ కథాంశంతో రూపొందించిన మహత్తర చిత్రం ‘శ్రీరామరాజ్యం’ (2011). ఈ చిత్రంలో పైన పేర్కొన్న ‘లవకుశ’ (1963) చిత్రంలోని ముఖ్యాంశాలన్నీ ఈ చిత్రంలోనూ కీలకమవటం వాటిని తన అభినయంతో రక్తికట్టించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. నందమూరి బాలకృష్ణ, నయనతార సీతాదేవిగా నటించారు.</div><div><br /></div><div>ఒకే వంశానికి చెందిన నందమూరి తారకరామారావు, వారి తనయుడు నందమూరి బాలకృష్ణ, ఆయన మనవడు జూనియర్ ఎన్.టి.ఆర్, ఆంధ్రుల ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుని పాత్రలను పోషించి మెప్పించటం. తెలుగు సినీ చరిత్రలో రికార్డుకాదగ్గ ప్రధాన అంశం.</div><div><br /></div><div>నిద్రాహారాల్లేకుండా బతకొచ్చేమోగానీ భారతదేశంలో రామా అనకుండా జీవించడం కష్టం. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. రాముడు మంచి బాలుడు అన్న సామెత ఇందులోనిదే. అలాంటి రాముడికి తెలుగు సిన్మాకు అవినాభావ సంబంధం వుంది. రాముని అవతారం ఎంతో ఉన్నతమైనది. ఆ అవతారంలో ఎన్నో మానవీయ విలువలు. మరెన్నో సంస్కృతి సంప్రదాయాలు..కుటుంబ వ్యవస్థలోని అనుబంధాలు రామాయణం చూస్తే అర్థమవుతుంది. ఇగ మనతెలుగు సిన్మాల్లో రాముడికి ప్రత్యేక స్థానం వుంది. తింటే గారాలే తినాలి. వింటే భారతం వినాలి. కంటే రామాయణం కనాలన్న సూత్రాన్ని ఫాలో కావడం భారతీయులకున్న అలవాట్లలో కొన్ని. అందునా తెలుగువాళ్లకు రాముడంటే వల్లమాలిన అభిమానం. అలనాటి ‘లవకుశ’ నుంచి నేటి ‘శ్రీరామరాజ్యం’ వరకు రామగాధను గానం చేసినవే. రాముడి గొప్పతనాన్ని తెలిపినవే.</div><div><br /></div><div>అసలు తెలుగు సిన్మా పౌరాణికాలతో ప్రారంభమయింది. రామకథతో వచ్చిన తొలి సిన్మా ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. 1932లో విడుదలైన ఈ సినిమాలో యడవల్లి సూర్యనారాయణ తొలిసారి రాముని పాత్రలో కనిపించారు. ఆ తర్వాత కొంత మంది నటులు రాముని పాత్రలో కనిపించిన...తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇప్పటికే రాముడంటే ఎన్టీఆరే.</div><div><br /></div><div>వెండితెర శ్రీరాముడిగా ప్రశంసలు అందుకుని రాముడంటే ఇలాగే ఉంటాడా....అనిపించే స్థాయిలో నటించిన ఘనత ఎన్.టి.ఆర్ కే దక్కుతుంది.అసలు రామచంద్రుడి క్యారెక్టర్ చాలా ఉన్నతమైనది. ఆ పాత్రలో ఓ స్వచ్చత, ఓ సచ్చీలత, ఓ శాంత గుణం కనిపించాలి. శ్రీరాముడి పాత్రకు ఏ మేరకు నటించాలో అంతగా నటించి అద్భుతం అనిపించారు ఎన్టీఆర్. సీతా వియోగ ఘట్టంలో విషాదాన్ని, రావణ సంహారంలో కోపాన్ని, మహారాజుగా శాంతాన్ని ఇలా నవరసాలను మేలవించి శ్రీరాముడి పాత్రలో లీనమై నటించారు ఎన్టీఆర్.</div><div><br /></div><div>రామో విగ్రహవాన్ ధర్మహ: అన్న ఆర్యోక్తి శత్రువు సైతంరాముడి గొప్పదనాలను తెలిపేవే.</div><div>అప్పటి వాళ్లకే కాదు. ఇప్పటి వాళ్లు కూడా రాముడు గొప్పవాడని ఒప్పుకుంటారు. రాముడిది ఒకే మాట. ఒకే బాణం..ఒకే భార్య ...ఒకే విధానం. ప్రెజెంట్ సొసైటీ వెళ్తున్న మార్గాన్ని అనుసరించి చెబితే...రాముడి వ్యక్తిత్వం సమాజానికి ఎంతో అవసరం. ఇదీ వెండితెరపై తెలుగు రాముడి లీల.</div><div>తెలుగు, తమిళ ప్రేక్షకులకు రాముడంటే ఎన్ టి ఆర్ నే.</div></div>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5836802122867912200.post-21441951681866895612020-09-28T05:34:00.001-07:002020-09-28T05:34:18.319-07:00🚩🚩రాకెట్ ప్రయోగాలు ఆంధ్రప్రదేశ్ నుండే ఎందుకు జరుగు చున్నాయి?<div style="text-align: left;"><div><span style="font-size: large;"><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhOTwxDqnGiU8pcga2evosGNGkUWwgoNrTp_mJrR7uXWxfN99HRqAO0vJ5PBa2z15DeTGVKA1p1F5X3lAmPzxxVh8ZGFul-BqadQVX6v-9cxr-NH-SlHmPy4IHKHu34cRHyLbW2RWW0y8tF/s739/800x800bb.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="415" data-original-width="739" height="357" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhOTwxDqnGiU8pcga2evosGNGkUWwgoNrTp_mJrR7uXWxfN99HRqAO0vJ5PBa2z15DeTGVKA1p1F5X3lAmPzxxVh8ZGFul-BqadQVX6v-9cxr-NH-SlHmPy4IHKHu34cRHyLbW2RWW0y8tF/w634-h357/800x800bb.jpg" width="634" /></a></div><br />🚩🚩రాకెట్ ప్రయోగాలు ఆంధ్రప్రదేశ్ నుండే ఎందుకు జరుగు చున్నాయి?</span></div><div><span style="font-size: large;">ఎవరికీ దక్కని అదృష్టం ఆంధ్రా కే.. అక్కడి నుంచే రాకెట్లు ఎందుకు పంపిస్తారు?</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">భారత దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్ కన్నా అధికంగా సముద్రతీర ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అయినా.. కూడా ఇక్కడే నుంచే రాకెట్ ప్రయోగాలు జరుగుతుంటాయి. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ఉపగ్రహాలు ఇక్కడి నుంచే గగనతలంలోకి వెలుతూ ఉంటాయి. ఎందుకు అంటే? అన్ని విధాలా రాకెట్ ప్రయోగాలకు అత్యుత్తమ ప్రదేశం శ్రీహరికోట. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన రాకెట్ ప్రయోగ కేంద్రం అది. ఇంత ప్రత్యేకత ఏంటి..? ఏమిటి ఆ అనుకూలతలు అంటారా..?</span></div><div><span style="font-size: large;">Why rocket launches from Andhra Pradesh?</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోటను ఎంపిక చేయడానికి ప్రధానంగా 5 కారణాలు చెప్పుకోవచ్చు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">అందులో మొదటిది భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం. దీనివల్ల ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే సెకనుకు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. భూ భ్రమణం వల్ల రాకెట్కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాకెట్ ప్రయోగ కేంద్రాలను ఒకసారి పరిశీలిస్తే.. భారత్లో శ్రీహరికోట, ఫ్రెంచ్ గయానాలోని కౌరూ, అమెరికాలో ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్లు భూమధ్య రేఖకు సమీపంగా ఉన్నాయి. ఈ కారణంగానే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచే యూరప్ దేశాలు తమ రాకెట్లను ప్రయోగిస్తున్నాయి.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">భూ భ్రమణానికి-రాకెట్ వేగానికి సంబంధం ఏమిటి?</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">భూ భ్రమణానికి-రాకెట్ వేగానికి సంబంధం ఏమిటి? అనే ప్రశ్న సామాన్యుల్లో తలెత్తవచ్చు. దీనికి శాస్త్రవేత్తలు చెప్పేది ఒక్కటే.. గంటకు లక్షా 8వేల కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. భూమి తిరుగుతున్న దిశలో రాకెట్ను ప్రయోగిస్తే అది కూడా మంచి వేగం అందుకుంటుంది. అయితే, భూపరిభ్రమణ వేగం అంతటా ఒకేలా ఉండదు. అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మన శ్రీహరి కోటలో ఈ అనుకూలత చాలా కీలకమైంది. మరోవైపు.. శ్రీహరికోట తూర్పు తీరంలో ఉంది. భూమి పశ్చిమం నుంచి తూర్పు దిశగా తిరుగుతోంది. రాకెట్ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే, భూ పరిభ్రమణ వేగం కారణంగా అది అదనపు స్పీడ్ అందుకుంటుంది. అందుకే ప్రపంచంలో ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాలు అన్నీ భూమధ్య రేఖకు సమీపంగానే ఏర్పాటు చేశారు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">సుదీర్ఘ తూర్పు తీరప్రాంతం:</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">రాకెట్ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా నింగిలోకే వెళ్తుందన్న గ్యారెంటీ లేదు. సాంకేతిక కారణాలతో అప్పడప్పుడు రాకెట్లు గాడి తప్పి కూలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ రాకెట్ శకలాలు జనావాసాల మీద పడితే ప్రాణనష్టం జరుగుతుంది. కానీ, శ్రీహరి కోట చుట్టూ.. బంగాళాఖాతం, పులికాట్ సరస్సు ఉంటాయి. ఈ పరిసరాల్లో పెద్దగా జన సంచారం గానీ, ఇళ్లు కానీ లేవు. ఏదైనా ప్రమాదం జరిగినా.. రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోతాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం ఉండదు.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">రోడ్డు, రైలు, జల రవాణా సదుపాయం:</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">రాకెట్ ప్రయోగాలకు పెద్ద పెద్ద యంత్రాలు, పరికరాలు అవసరం అవుతాయి. కొన్నింటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను రాకెట్ ప్రయోగ కేంద్రాల కోసం ఎంపిక చేస్తారు. శ్రీహరికోట ఈ పరీక్షలో కూడా పాసైంది. శ్రీహరికోటకు సమీపంలోనే రైలు, రోడ్డు, నౌకామార్గాలు ఉన్నాయి. జాతీయ రహదారి రహదారి అతిసమీపం నుంచి వెలుతోంది. దీంతోపాటు.. శ్రీహరికోటకు ఇరవై కిలోమీటర్లలో రైల్వే స్టేషన్, 70 కిలోమీటర్ల దూరంలో చెన్నై పోర్టు ఉన్నాయి.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">ప్రయోగాలకు అనుకూల వాతావరణం:</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">రాకెట్ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉండకూడదు. ఎండలు మండకూడదు. శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది. వర్షాలు, ఎండలు అతిగా ఉండవు. ఒక్క అక్టోబర్, నవంబర్లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10 నెలలు ప్రయోగాలకు అనుకూల సమయమే.</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">భూమి స్వభావం కూడా ముఖ్యమే:</span></div><div><span style="font-size: large;"><br /></span></div><div><span style="font-size: large;">రాకెట్ ప్రయోగం సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి అత్యంత ధృడంగా ఉండాలి. శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత ధృడంగా ఉంటుంది. రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు శ్రీహరికోట ఒక ఆప్షన్ కాదు. భారత్కు ఉన్న అరుదైన అవకాశం. శ్రీహరికోటను మించిన ప్రదేశం మరొకటి భారతదేశంలో లేదు. అందుకే ఇది 'రాకెట్ ప్రయోగాల కోట' అయింది. నిజానికి అంతరిక్ష పరిశోధనా ప్రయోగ కేంద్రాన్ని మొదట కేరళలోని తుంబలో ఏర్పాటు చేశారు. తొలుత రాకెట్ల ప్రయోగ కేంద్రంగా ఉన్న తుంబ, తర్వాత పూర్తి స్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా మారింది. ఈ ఐదు కీలక అనుమతులు శ్రీహరికోటను అంతర్జాతీయ రాకెట్ ప్రయోగ కేంద్రంగా తీర్చిదిద్దాయి. భారతదేశ కీర్తితో పాటు... ఆంధ్రప్రదేశ్ పేరుకు అంతర్జాతీయంగా గుర్తింపును తీసుకువచ్చాయి.</span></div><div><span style="font-size: large;">🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳</span></div></div>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5836802122867912200.post-24416199483704276632020-09-22T05:51:00.003-07:002020-09-22T05:51:30.933-07:00🚩🚩పుత్తడి బొమ్మ పూర్ణమ్మ!🚩🚩<h2><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgDlldH57tfhdDDl839TLdlMp7hTpHYDQfLy45r_f7DaVsrFGo61NX1w0nQEavuSYyfBoMBrXhyphenhyphenDjiQbq2AHYGGVYwMw2B39yPN3PqMd9vxS3pBIdEw61tJJ3mDDiAz33wbHM19v6OijYo6/s917/0c4fe60bf5e45cfd40f71627feb0e191a8a64cc8bfa1ebf8e66a1245b71c1521._RI_V_TTW_.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="610" data-original-width="917" height="518" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgDlldH57tfhdDDl839TLdlMp7hTpHYDQfLy45r_f7DaVsrFGo61NX1w0nQEavuSYyfBoMBrXhyphenhyphenDjiQbq2AHYGGVYwMw2B39yPN3PqMd9vxS3pBIdEw61tJJ3mDDiAz33wbHM19v6OijYo6/w778-h518/0c4fe60bf5e45cfd40f71627feb0e191a8a64cc8bfa1ebf8e66a1245b71c1521._RI_V_TTW_.jpg" width="778" /></a></div><br /> 🚩🚩పుత్తడి బొమ్మ పూర్ణమ్మ!🚩🚩</h2><h2><br /></h2><h2>#గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం.</h2><h2>ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా పూర్ణమ్మ కథ పేరుతో ఈ రచన చేసారు గురజాడ. ‘పుత్తడిబొమ్మా పూర్ణమ్మా’అంటూ అందచందాల రాశిపోసిన ముగ్ధ అయిన ఓ కన్య బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరును ఈ కథలో వివరించారు గురజాడ.</h2><h2>ఇది కన్యాశుల్కం ద్వారా చిన్న వయసులోనే ధనం ఆశతో పిల్లల్ని ముసలి వరులకు తండ్రులు పెళ్ళిచేయడాన్ని ఇతివృత్తంగా రచించినది.</h2><h2>ఒక పూజారింటను పుట్టిన పూర్ణమ్మ అనే బాలిక కన్యాశుల్కం కారణంగా తాత వయసు వున్న వరుడితో బాల్యవివాహమై మూఢాచారానికి బలయిన తీరు అర్ధంతరంగా తనువు చాలించిన విషాదం మనసున్న ఎవరికైనా కళ్ళను చమర్చేటట్లు చేస్తుంది.</h2><h2><br /></h2><h2>*మేలిమి బంగరు మెలతల్లారా !</h2><h2>కలువల కన్నుల కన్నెల్లారా !</h2><h2>తల్లులగన్నా పిల్లల్లారా !</h2><h2>విన్నారమ్మా ఈ కథను ?</h2><h2><br /></h2><h2>*ఆటల పాటల పేటికలారా !</h2><h2>కమ్మని మాటల కొమ్మల్లారా !</h2><h2>అమ్మలగన్నా అమ్మల్లారా !</h2><h2>విన్నారమ్మా మీరీ కథను ?</h2><h2><br /></h2><h2>*కొండల నడుమను కోనొకటున్నది !</h2><h2>కోనకి నడుమా కొలనొకటుంది !</h2><h2>కొలని గట్టునా కోవెల లోపల</h2><h2>వెలసెను బంగరు దుర్గమ్మ.</h2><h2><br /></h2><h2>*పూజారింటను పుట్టెను చిన్నది</h2><h2>పుత్తడి బొమ్మా పూర్ణమ్మా,</h2><h2>అన్నల తమ్ముల కనుగై దుర్గకు</h2><h2>పూజలు పువ్వులు కోసేది.</h2><h2><br /></h2><h2>*ఏయే వేళల పూసే పువ్వుల</h2><h2>ఆయా వేళల అందించి</h2><h2>బంగరు దుర్గను భక్తితొ కొలిచెను</h2><h2>పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.</h2><h2><br /></h2><h2>*ఏయే ఋతువుల పండే పళ్ళను</h2><h2>ఆయా ఋతువుల అందించి</h2><h2>బంగరు దుర్గను భక్తితొ కొలిచెను</h2><h2>పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.</h2><h2><br /></h2><h2>*పళ్ళను మీరిన తీపుల నడలును</h2><h2>పువ్వుల మీరిన పోడుములున్</h2><h2>అంగము లందున అమరెను పూర్ణకు</h2><h2>సౌరులు మించెను నానాటన్.</h2><h2><br /></h2><h2>*కాసుకు లోనై తల్లీ తండ్రీ</h2><h2>నెనరూ న్యాయం విడనాడి</h2><h2>పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక</h2><h2>ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ.</h2><h2><br /></h2><h2>*ఆమని రాగా దుర్గ కొలనులో</h2><h2>కలకల నవ్వెను తామరలు</h2><h2>ఆమని రాగా దుర్గ వనములో</h2><h2>కిలకిల పలికెను కీరములు.</h2><h2><br /></h2><h2>*ముద్దు నవ్వులూ మురిపెములూ మరి</h2><h2>పెనిమిటి గాంచిన నిమిషమున</h2><h2>బాసెను కన్నియ ముఖ కమలమ్మున</h2><h2>కన్నుల గ్రమ్మెను కన్నీరు.</h2><h2><br /></h2><h2>*ఆటల పాటల తోటి కన్నియలు</h2><h2>మొగుడు తాత యని కేలించ,</h2><h2>ఆటల పాటల కలియక పూర్ణిమ</h2><h2>దుర్గను చేరీ దుక్కించె</h2><h2><br /></h2><h2>*కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను</h2><h2>పుత్తడి బొమ్మను పూర్ణమను</h2><h2>చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను</h2><h2>పుత్తడి బొమ్మకు పూర్ణమకు.</h2><h2><br /></h2><h2>*పసుపు రాసిరి బంగరు మేనికి</h2><h2>జలకము లాడెను పూర్ణమ్మ</h2><h2>వదినెలు పూర్ణకు పరిపరి విధముల</h2><h2>నేర్పులు మెరసీ కై చేస్రీ.</h2><h2><br /></h2><h2>*పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ</h2><h2>తల్లీ తండ్రీ దీవించ్రీ</h2><h2>దీవన వింటూ పక్కున నవ్వెను</h2><h2>పుత్తడి బొమ్మా పూర్ణమ్మ !</h2><h2><br /></h2><h2>*చిన్నల నందర కౌగిట చేర్చుకు</h2><h2>కంటను బెట్టెను కన్నీరూ !</h2><h2>అన్నల తమ్ముల నప్పుడు పలికెను</h2><h2>పుత్తడి బొమ్మా పూర్ణమ్మా.</h2><h2><br /></h2><h2>"*అన్నల్లారా తమ్ముల్లారా !</h2><h2>అమ్మను అయ్యను కానండీ</h2><h2>బంగరు దుర్గను భక్తితొ కొలవం</h2><h2>డమ్మల కమ్మా దుర్గమ్మ.</h2><h2><br /></h2><h2>"*ఆయా వేళల పూసే పువ్వుల</h2><h2>ఆయా ఋతువుల పళ్ళన్నీ,</h2><h2>భక్తిని తెచ్చీ శక్తికి యివ్వం</h2><h2>డమ్మల కమ్మా దుర్గమ్మ</h2><h2><br /></h2><h2>*నలుగురు కూచుని నవ్వే వేళల</h2><h2>నా పేరొక తరి తలవండి</h2><h2>మీమీ కన్న బిడ్డల నొకతెకు</h2><h2>ప్రేమను నా పేరివ్వండి."</h2><h2><br /></h2><h2>*బలబల కన్నుల కన్నీరొలికెను</h2><h2>పుత్తడి బొమ్మకు పూర్ణమకు</h2><h2>కన్నులు తుడుచుకు కలకల నవ్వెను</h2><h2>పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.</h2><h2><br /></h2><h2>*వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు</h2><h2>తల్లియు కంటను తడిబెట్టన్</h2><h2>కాసుకు లోనై అల్లుని చూసుకు</h2><h2>ఆనందించెను అయ్యొకడె.</h2><h2><br /></h2><h2>*యెప్పటి యట్టుల సాయంత్రమ్మున</h2><h2>యేరిన పువ్వులు సరిగూర్చి</h2><h2>సంతోషమ్మున దుర్గను కొలవను</h2><h2>వొంటిగ పోయెను పూర్ణమ్మ.</h2><h2><br /></h2><h2>*ఆవులు పెయ్యలు మందలు జేరెను</h2><h2>పిట్టలు చెట్లను గుమిగూడెన్</h2><h2>మింటను చుక్కలు మెరయుచు పొడమెను</h2><h2>యింటికి పూర్ణమ రాదాయె.</h2><h2><br /></h2><h2>*చీకటి నిండెను కొండల కోనల</h2><h2>మేతకు మెకములు మెసల జనెన్</h2><h2>దుర్గకు మెడలో హారము లమరెను</h2><h2>పూర్ణమ యింటికి రాదాయె.</h2><h2><br /></h2><h2>*కన్నుల కాంతులు కలవల చేరెను</h2><h2>మేలిమి జేరెను మేని పసల్ !</h2><h2>హంసల జేరెను నడకల బెడగులు</h2><h2>దుర్గను జేరెను పూర్ణమ్మ.</h2><h2><br /></h2><h2>🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻</h2>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-16758190701682321352020-09-15T00:47:00.003-07:002020-09-15T00:47:29.805-07:00 ❤️🔻🚩-స్త్రీ స్వేచ్చ - చలం (మైదానం)..నుండి ...విశ్వనాధ(చెలియలికట్ట)వరకు .<p> </p><div class="separator" style="clear: both; text-align: center;"><img border="0" data-original-height="576" data-original-width="944" height="351" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgaix4r_h0a_gH_wUgbfa0HzO4xirNO7s7l4s7Os4t_3M8h9fj6GytyfeqqBf_fDRugQtHyXekw4nEk4_Y2RFecOXw-QBL2wQWCafP-es9I6NuTIHj1C11YZ_jyMe9-5xQUFvl7chJxSz1n/w576-h351/bapu+%252839%2529.jpg" width="576" /></div><br />❤️🔻🚩-స్త్రీ స్వేచ్చ -<p></p><p><br /></p><p>చలం (మైదానం)..నుండి ...విశ్వనాధ(చెలియలికట్ట)వరకు .</p><p><br /></p><p><br /></p><p><br /></p><p>స్త్రీల సామాజిక దుస్థితి గురించి,వారి స్వేచ్చా స్వాతంత్ర్యాలని గురించి తన ఆందోళనని జీవితాంతమూ కొనసాగించిన రచయిత గుడిపాటి వెంకటాచలం.(చలం అనే పేరు తో ప్రాచుర్యం).</p><p><br /></p><p>#చలం సాహిత్య ప్రభావం బలమైనది.</p><p>తెలుగు సాహిత్యం లో చలం అంతటి వివాదాస్పద రచయిత మరొకరు లేరు.స్త్రీ పురుష సంబందాల మధ్య ఏ అంశాలనయితే ముట్టుకోడానికి కూడా మిగతా రచయితలు వేల ఏళ్ళుగా సాహసించ లేదో,ఆ సాహసాన్ని స్త్రీ కోసం మనసారా చేసిన తొలి రచయిత</p><p>చలం.పురుషుల నిరంకుశ ధోరణి కింద స్త్రీలు అనుభవించే హింస తాలూకు బహు ముఖాలనీ తన సాహిత్యంలో నిజాయితీగా బొమ్మ కట్టి మరీ చూపినవాడు చలం.</p><p><br /></p><p>పురుషాధిక్య సమాజపు వికృత నీతిని తన రచనల్లో ఏ ముసుగులూ వెయ్యకుండా భాషించ గలిగిన వాడు చలం. సాహిత్యం లో శశిరేఖ,అరుణ,వంటి వ్యక్తిత్వం ఉన్న స్త్రీలను చిరస్థాయిగా ఉంచిన వాడు చలం.</p><p>అయితే చలం రచనల్లో ఎక్కువ సంచలనాన్ని సృష్టించిన నవల మాత్రం "మైదానం". ఈ మైదానం నవలని చలం 1925 లో రాశారు.మైదానం నవల చాలా చర్చలను రేపింది.ప్రతికూల విమర్శల నెదుర్కొన్నది.స్త్రీ స్వేచ్చ మీదా,స్త్రీ పురుషుల సంబందాల మీదా కొత్త సిద్ధాంతాలు చేసింది</p><p>.ఈ నవల వివాదాస్పదంగా మారడానికి కారణాలేమిటి?</p><p><br /></p><p>ఒక సంప్రదాయ బ్రాహ్మణ గృహిణి ఒక ముస్లింతో కలిసి</p><p>వెళ్లిపోవడం మాత్రమేనా? కాదు ..</p><p>తనకి నచ్చిన మనిషితో వెళ్లిపోయి మైదానం కధానాయిక</p><p>#రాజేశ్వరి ఎలా బతికి ఉన్నా ఇంత గొడవ జరిగేది కాదు.</p><p>ఆమె తన చర్య తోపాటు అభేద్యమైనదని సంప్రదాయ వర్గాలు అనుకుంటూ ఉన్న వివాహ వ్యవస్థ ఎంత లొసుగులతో ఉందో</p><p>వివరం గా మాట్లాడుతుంది.</p><p>పవిత్రమైనవంటూ ప్రచారం చేసే దాంపత్య సంబంధాలలోని</p><p>బోలు తనాన్ని నిగ్గదీసి అడుగుతుంది.</p><p>ఇందుకూ- ఈ పుస్తకం సమాజాన్ని ఎక్కువ కలవరపరచింది.</p><p><br /></p><p>ఎన్ని విప్లవాలు నడచినా పర్వాలేదు కానీ ,</p><p>కుటుంబ వ్యవస్థ కూలిపోతుంటే మాత్రం ...దాన్ని ఆధారం గా</p><p>చేసుకుని అధికారం చెలాయిస్తున్న పురుష ప్రభుత్వాలకు</p><p>విపరీతమైన భయం పుడుతుంది.</p><p>అందువల్ల తమ మధ్య ఉండే సైద్ధాంతిక విభేదాలన్నీ</p><p>కూడా వదిలేసి ఈ విషయంలో అన్ని వర్గాలకు చెందినవారూ</p><p>ఏకమై ముక్తకంఠంతో ఇటువంటి రచనల పట్ల వ్యతిరేకతను కనబరుస్తారు.సంప్రదాయానికి ఉనికిపట్టులైన యునివర్సిటీ</p><p>వాళ్ళు మైదానం పుస్తకానికి బహుమతి ప్రకటించడానికి భయపడ్డారు.</p><p>.</p><p>#చలం మైదానానికి సమాధానంగా</p><p><br /></p><p>1933 లో#విశ్వనాథ సత్యనారాయణ "చెలియలికట్ట" అనే నవల రాశారు.</p><p>60లలొ గోపీచంద్ కూడా చలం భావజాలం మీదనే స్పందించి</p><p>"గడియ పడని తలుపులు","మెరుపులమరకలు","గతించని గతం" వంటి పుస్తకాలు రాశారు.</p><p>చెలియలికట్ట లో నాయిక రత్నావళి, ఆమె మరిది</p><p>(చలం భావాలకు ప్రేరేపితుడై జీవించిన) రంగారావూ</p><p>నవల చివరిలో ఆత్మహత్య చేసుకునేందుకు సముద్రం లోకి కలిసికట్టుగా పోతారు.</p><p>.</p><p>గోపీచంద్ రాసిన గడియపడని తలుపులు నవలలో కూడా ఆధునిక వేషం తో స్వేచ్చగా సంచరించినట్టు రచయిత చిత్రించిన నాయిక కోటేశ్వరమ్మ నవల చివరిలో పశ్చాత్తాపంతోనే సనాతన ధర్మం వైపు మల్లి కృశించి చచ్చిపోతుంది.</p><p><br /></p><p>మైదానం లో చలం కధానాయిక రాజేశ్వరి విసిరిన</p><p>సవాళ్ళకు బదులుగా ఒక రత్నావళిని తయారు చేసిన</p><p>బహు దిట్టమైన రచన విశ్వనాథ వారి చెలియలికట్ట మాత్రమే.</p><p><br /></p><p>అందుచేత చలం మైదానాన్ని,విశ్వనాథ చెలియలి కట్టనీ</p><p>రెండింటినీ తీసుకుని, అవి రెండూ స్త్రీ స్వేచ్చ కోసం చూపిన మార్గాల బలాబలాలను ఇక్కడ చర్చిద్దాం.</p><p><br /></p><p>మధ్య తరగతి వర్గం అతి ముఖ్యమైనవిగా స్త్రీలకి నూరిపోసిన</p><p>"పరువు-ప్రతిష్ట " ఈ రెంటినీ గంగలో కలిపి బ్రాహ్మణ గృహిణి రాజేశ్వరి - సంసారంలో తనకి అన్ని హంగులూ అమర్చగలిగిన లాయర్ భర్తనీ,తన కుటుంబాన్నీ,తాను జీవించే సమాజాన్నీ వదిలి పెట్టి ,సమాజం లో గౌరవించగలిగే అర్హతలేవీ లేని అమీర్ అనే డబ్బులేని తక్కువ రకం తురక వాడితో పురుష సమాజ పరిభాషలో "లేచిపోతుంది".</p><p><br /></p><p>సరిగ్గా ఈ వాక్యం తోనే మైదానం నవల మొదలవుతుంది.</p><p>అలా తాను కలిసి వచ్చేసిన అమీర్ తననెంత ఘాడంగా ప్రేమిస్తాడో ..... తామిద్దరూ కలిసి మైదానంలో ఏ మిధ్యా గౌరవాలకూ ప్రాధాన్యత లేని చిన్న గుడిసెలో... దాని పక్క నదీ తీరంలో స్వేచ్చగా అనుభవించిన శృంగారానుభావాలన్నీ నవల ఆసాంతం రాజేశ్వరి తన స్నేహితురాలితో కధగా చెప్తుంది.</p><p>అంతే కాకుండా స్త్రీ మనసులో కూడా ఏకకాలంలో ఒకరి కన్నా ఎక్కువ మంది మీద ఇష్టం కలిగే అవకాశం ఉందంటూ తాను అమీర్ తోపాటు మీరా అనే మరొక ముస్లిం కుర్రాడిని అభిమానించిన విషయం,దానితో తన జీవితం లో ఎదురైన కల్లోలమూ.... దాని పర్యవసానమూ కధలో వివరిస్తుంది.ఇదీ మైదానం నవల.</p><p>.</p><p>ఇక చెలియలికట్టలో సీతారామయ్య రెండో భార్య రత్నావళి</p><p>ముందు భార్య రత్నమ్మ చనిపోతే రత్నావళితో అతనికి మళ్ళీ</p><p>పెళ్లి జరుగుతుంది. సీతారామయ్య తమ్ముడు రంగారావు (రంగడు) ను అతికష్టం మీద డబ్బులు పంపి లక్నోలో చదివిస్తుంటాడు.</p><p>ఈ రంగారావు ఆధునిక భావాలను పెంచుకుంటూ అటు పాశ్చాత్య రచయితలనీ,ఇటు పాశ్చాత్య భావాలు పలికే (చలం వంటి)</p><p>తెలుగు రచయితలనీ చదివి ఆ స్త్రీ స్వేచ్చా భావాలన్నీ</p><p>కెక్కించుకుని సనాతన ధర్మాలకు దూరం కావడమే కాకుండా,</p><p>తన అన్న భార్య అయిన రత్నావళికి కూడా తాను చదివే పుస్తకాలిచ్చి, తన భావాలన్నీ నూరిపోసి ఆమెలో విప్లవ భావాలను నాటుతాడు.</p><p>వీటన్నిటి మూలంగానే ఆమె సీతారామయ్య పట్ల విముఖురాలై రంగడితో మదరాసు "లేచి" వచ్చేస్తుంది.ఇక ఇక్కడి నుంచి రత్నావళి రంగడి సిద్ధాంతాలు ఎలా తప్పుల తడకలో నిరూపించడం కోసం పేజీ పేజీ లోనూ వాదనలను పెంచుకుంటూ పోతుంది.</p><p>చివరికి ఆమెకి చదువు చెప్పడానికిసాక్షాత్తూ</p><p>#విశ్వనాధసత్యనారాయణ గారే ముకుందరావు అనే పాత్ర గా ప్రవేశించి రత్నావళి లో రంగడి సిద్ధాంతాల పట్ల ఏర్పడిన చులకన భావాలకు నీరు పోసి,మరింతగా పెంచి తన వాదనాపటిమతో, బోధనా గరిమతో రత్నావళిని తిరిగి సనాతన ధర్మం వైపు మళ్ళించి తనంత దానిగా తయారు చేస్తారు.</p><p>రత్నావళి నవలలో చివర్లో మాట్లాడినవన్నీ ఈ ముకుందరావు మాటలే.చేసిన నిర్ణయాలన్నీ ముకుందరావు చూపిన మార్గానికి నడవడం కోసం చేసినవే.ఒకసారి వివాహవ్యవస్థ కాదని కాలు బయటపెట్టిన ఆడదానికి మరణం లో తప్ప నిష్కృతి లేదు కనుక, రత్నావళి నవలచివర్లో ఈ సంగతి మిగతా పాత్రలతోనూ</p><p>(పాఠకుల తోనూ) చెప్పి మరీ చనిపోతుంది.</p><p>చనిపోయే ముందు ఆమె తాను విడిచివచ్చిన సీతారామయ్య</p><p>కాళ్ళ మీద పడుతుంది.</p><p>మద్రాసులో విదుషీమణి (తెలుగు టీచరు రత్నావళి)తాను సంపాదించిన డబ్బును ,తన భర్త మూడవ భార్య (రత్నావళి వెళ్ళిపోయాక సీతారామయ్య మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు)</p><p>రాజ్యలక్ష్మికి పుట్టిన కొడుకు పేర రాసి వాడు తనకి తద్దినాలు పెట్టేట్లుగా వాగ్దానం చేయించుకుని అప్పుడు చచ్చిపోవడానికి వెళ్ళిపోతుంది.</p><p>చివరికి ఆమె తోపాటు #రంగారావు (చలం భావజాలాన్ని నమ్మినవాడు)కూడా తన తప్పులన్నీ ఒప్పుకుని రత్నావళితో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఉప్పెన ముంచుకొస్తున్న</p><p>సముద్ర తీరానికి వెళ్ళిపోతాడు.</p><p><br /></p><p>క్లుప్తంగా ఇదీ కధ.</p><p><br /></p><p>🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿</p>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-40977007275547836362020-09-09T23:29:00.000-07:002020-09-09T23:29:31.677-07:00🚩కవిసమ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు!<p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiFn-ULzOwuGlOZKlWiKkOM_6gehwu4GalRuK0XBkElpraFe4BKH3XHDKEuzzSBqH757uwa-7suA6kSX2CkOs6e5U-Q4SILcazG26ESAV7w2viXjwlits1uPrFSCav4KEWt7MZeysMdeDVq/s816/april_2016_varna.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="816" data-original-width="610" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiFn-ULzOwuGlOZKlWiKkOM_6gehwu4GalRuK0XBkElpraFe4BKH3XHDKEuzzSBqH757uwa-7suA6kSX2CkOs6e5U-Q4SILcazG26ESAV7w2viXjwlits1uPrFSCav4KEWt7MZeysMdeDVq/s320/april_2016_varna.jpg" /></a></div><br /> 🚩కవిసమ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు!<p></p><p><br /></p><p>(</p><p>👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏</p><p>-</p><p>శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు 10-09-1895 న కృష్ణాజిల్లా లోని</p><p>నందమూరు అనే గ్రామంలో శ్రీ శోభనాద్రి,పార్వతమ్మ దంపతులకు</p><p><br /></p><p>జన్మించారు.</p><p><br /></p><p>వారి ప్రాధమిక విద్యాభ్యాసం అంతా నందమూరు,ఇందుపల్లి,పెదపాడు</p><p><br /></p><p>గ్రామాలలో జరిగింది.</p><p><br /></p><p>ఉన్నత విద్య అంతా బందరులో జరిగింది.వారి అదృష్టం కొద్దీ</p><p><br /></p><p>బందరులో వారికి తెలుగు ఉపాధ్యాయుడిగా శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి</p><p><br /></p><p>గారు ఉండేవారు.ఆ రోజుల్లో వీరిపై పింగళి లక్ష్మీకాంతం,కాటూరి</p><p><br /></p><p>వెంకటేశ్వరరావు,కోట వెంకటాచలం గార్ల వంటి ప్రఖ్యాత కవుల ప్రభావం</p><p><br /></p><p>ఉండేది.</p><p><br /></p><p>పదునాలుగు ఏండ్ల ప్రాయం నుండే రచనలు ప్రారంభించారు.కానీ</p><p><br /></p><p>అవి తరువాతి కాలంలో ప్రచురించపడ్డాయి. B.A. పూర్తి చేసిన తరువాత</p><p><br /></p><p>కొంత కాలం బందరులోనే ఉపాధ్యాయవృత్తిలోకొనసాగారు.ఉపాధ్యాయ</p><p><br /></p><p>వృత్తి కొనసాగిస్తూనే private గా మద్రాసు విశ్వవిద్యాలయం నుండి</p><p><br /></p><p>సంస్కృతంలో M.A పట్టాను పొందారు.</p><p><br /></p><p>ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మహాత్మా గాంధీ గారి ప్రేరణతో</p><p><br /></p><p>సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు.ఆ తరువాత మళ్ళీ వివిధ</p><p><br /></p><p>కళాశాలల్లో ఉపన్యాసకుడిగా పనిచేసారు.బందరులోని ఆంద్ర జాతీయ</p><p><br /></p><p>కళాశాల,గుంటూరులోని ఆంద్ర క్రైస్తవ కళాశాలలో,విజయవాడలోని</p><p><br /></p><p>SRR&CVR కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేసారు. ఆతరువాత</p><p><br /></p><p>కరీంనగర్ లోని ప్రభుత్వ కళాశాలకు ప్రిన్సిపాల్ గా కొంత కాలం</p><p><br /></p><p>పనిచేసారు.</p><p><br /></p><p>-వారు తమ రచనా వ్యాసంగాన్ని 1916 లో "విశ్వేశ్వర శతకం" తో</p><p><br /></p><p>ప్రారంభించారు.అదే కాలంలో వీరు "ఆంధ్రపౌరుషం"అనే ప్రసిద్ధ</p><p><br /></p><p>కావ్యాన్ని వ్రాసారు. ఆ కావ్యంతోనే వీరికి కవికులంలో ఒక విసిష్ఠ స్థానం</p><p><br /></p><p>వచ్చిందని చెప్పటంలో సందేహం లేదు.అదంతా దేశభక్తి మరియూ</p><p><br /></p><p>ప్రబోధాత్మక కావ్యం. ఆ తదుపరి "ధ్యాన కైలాసం" అనే</p><p><br /></p><p>నాటకాన్ని,"అంతరాత్మ" అనే నవలను వ్రాసి వినుతికెక్కారు.ఆ రోజుల్లోనే</p><p><br /></p><p>వీరు అనేక భక్తి, ఆధ్యాత్మిక సంబంధిత గ్రంధాలు వ్రాసారు."కిన్నెరసాని</p><p><br /></p><p>పాటలు ","గిరికుమార గీతాలు",</p><p><br /></p><p>నర్తనశాల,శృంగారవీధి,అనార్కలి,చెలియలికట్ట,ఏకవీర, మొదలగు</p><p><br /></p><p>శతాధికగ్రంధాలనువ్రాసారు..</p><p><br /></p><p>పద్యాలు,గద్యాలు,శతకాలు,నాటకాలు,గేయాలు ,నవలలు,కథలు---</p><p><br /></p><p>ఇలా వారు చేపట్టని సాహితీ ప్రక్రియ లేనేలేదని చెప్పటంలో సందేహం</p><p><br /></p><p>ఏమాత్రం లేదు.అతి ప్రఖ్యాతమైన వీరి "వేయి పడగులు" నవలను</p><p><br /></p><p>శ్రీ పీ.వీ.నరసింహారావు గారు "సహస్ర ఫణ్" అనే పేరుతో హిందీ</p><p><br /></p><p>భాషలోకి అనువదించారు. ఆ తరువాతనే వీరికి జ్ఞానపీఠం వారి</p><p><br /></p><p>పురస్కారం లభించింది.</p><p><br /></p><p>వీరు కవిసమ్రాట్ అనే బిరుదుకు పూర్తి అర్హులు. ఆంద్ర విశ్వవిద్యాలయం</p><p><br /></p><p>వారు వీరిని "కళా ప్రపూర్ణ"బిరుదుతో సత్కరించారు.</p><p>-</p><p>ఆ తరువాత "రామాయణ కల్పవృక్షం" అనే పద్య కావ్యంలో</p><p><br /></p><p>రామాయణం లోని వివిధ ఘట్టాలను ఆయన తనదైన బాణీలో వ్రాసి</p><p><br /></p><p>వినుతికెక్కారు. పాముపాట,తెరచిరాజు ,పిల్లల రామాయణం ...ఇలా</p><p><br /></p><p>ఎన్నని చెప్పగలం?.ఈ కవికులతిలకుని తెలుగు ప్రజలు, వారి షష్టిపూర్తి</p><p><br /></p><p>సందర్భంలో గుడివాడలో గజారోహణంచే సత్కరించి,తమ సాహితీ</p><p><br /></p><p>ప్రేమను చాటుకున్నారు.కొంతకాలం ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీకి</p><p><br /></p><p>ఉపాధ్యక్షులుగా పని చేసారు.1958 లో M.l.C.గా నియమించపడ్డారు.</p><p><br /></p><p>ఆ తరువాత ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం వీరిని ఆస్థానకవిగా నియమించి</p><p><br /></p><p>గౌరవించింది.భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ బిరుదుతో</p><p><br /></p><p>సత్కరించింది.పూర్తి సాంప్రదాయ వాది అని చాలా మంది</p><p><br /></p><p>అనుకుంటారు. అది కొంతవరకు పొరపాటు.కొత్తదనాన్ని కూడా</p><p><br /></p><p>కొంతవరకు ప్రేమించారు</p><p>-</p><p>శ్రీశ్రీకి వీరికి చుక్కెదురు."నా వంటి కవి మరో వెయ్యేళ్ళ వరకూ పుట్టడు"</p><p><br /></p><p>అని విశ్వనాధవారు అంటే,</p><p><br /></p><p>శ్రీ శ్రీ గారు"నిజమే! వారు పుట్టి వెయ్యేళ్ళు అయింది" అనే వారు.</p><p><br /></p><p>అయినప్పటికీ శ్రీశ్రీ గారి మహా ప్రస్తానంలోని "కవితా! ఓ కవితా" అనే</p><p><br /></p><p>గేయాన్ని శ్రీశ్రీ ముఖతః విన్న తరువాత ఆనంద బాష్పాలతో మనసారా</p><p><br /></p><p>శ్రీశ్రీ ని కౌగలించుకొని అభినందించారు.అలాగే శ్రీశ్రీకి కూడా వీరంటే</p><p><br /></p><p>గౌరవం.శ్రీశ్రీ ఇలా విశ్వనాథను పొగిడారు ఒక సందర్భంలో,"నేను</p><p><br /></p><p>చిన్నతనంలో కలం పట్టిన కొత్తరోజుల్లో నన్ను బాగా ఆకర్షించిన ఇద్దరు</p><p><br /></p><p>కవులలో విశ్వనాథవారొకరు. నేనంటే సత్యనారాయణగారికి వాత్సల్యం</p><p><br /></p><p>. వారంటే నాకు గౌరవ భావం. ఎన్నో విషయాలలో వారికీ నాకూ</p><p><br /></p><p>చుక్కెదురు. అయినా భారతీయ భాషలన్నిటిలోనూ ఒక్క తెలుగులోనే</p><p><br /></p><p>గొప్ప కవిత్వం ఉందనడంలో ఇద్దరమూ ఏకీభవిస్తాం."</p><p>.</p><p>శ్రీ విశ్వనాధ వారు నిరంకుశుడు,అహంభావి అని పేరు</p><p><br /></p><p>తెచ్చుకున్నారు.అభిమానులు మాత్రం అది అహంభావం</p><p><br /></p><p>కాదు,ఆత్మాభిమానం,స్వాతిశయం అని చెబుతుంటారు.పూర్వపు</p><p><br /></p><p>కవులలో 'కవి సార్వభౌముడు' అనే బిరుదు శ్రీనాధ కవికి ఉండేది.</p><p><br /></p><p>శ్రీ విశ్వనాధ వారి సమకాలికులైన శ్రీ నోరి నరసింహశాస్త్రి</p><p><br /></p><p>గారికి కూడా'కవి సమ్రాట్' అనే బిరుదు వుంది.</p><p><br /></p><p>శ్రీ నోరి వారు రేపల్లెకు చెందిన వారు.వృత్తి రీత్యా న్యాయవాది.ప్రవృత్తి</p><p><br /></p><p>అంతా సాహితీ సేవే! ఎన్నో నవలలు వ్రాసారు. వాటిలో ప్రఖ్యాతి</p><p><br /></p><p>గాంచినది 'శ్రీ నాధుడు' అనే నవల.(ఈ నవలను ఆధారంగా చేసుకొనే</p><p><br /></p><p>బాపూరమణులు NTR తో శ్రీనాధ సార్వభౌమ అనే సినిమాను తీసారు</p><p><br /></p><p>. సమకాలికుడైన వీరిని కూడా'కవి సమ్రాట్' అని పిలవటం విశ్వనాధ</p><p><br /></p><p>వారికి అంత రుచించలేదు.ఆ విషయాన్ని అన్యాపదేశంగా ఒక వ్యాసంలో</p><p><br /></p><p>ప్రస్థావిస్తూ,ఇలా వ్రాసారు--" రాజులు ఎందరైన ఉండవచ్చు,చక్రవర్తులు</p><p><br /></p><p>కొందరే ఉంటారు.చక్రవర్తులు మరెందరో ఉండవచ్చు,కానీ,</p><p><br /></p><p>'సమ్రాట్'ఒక్కడే ఉంటాడు" అని వ్రాసారు. దాని భావం, తన కాలంలోని</p><p><br /></p><p>సాహితీ ప్రపంచానికి తానే'సమ్రాట్' అని చెప్పటమే! గురువులపట్ల</p><p><br /></p><p>ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాధకు తన ప్రతిభ గురించి అపారమైన</p><p><br /></p><p>విశ్వాసం కూడా కలిగి ఉండేవారు. తనంతటివాడు శిష్యుడయ్యాడని</p><p><br /></p><p>చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు లభించలేదని,</p><p><br /></p><p>చెళ్ళపిళ్ళవారికే దక్కిందని ఒకమారు తమ గురువుగారి</p><p><br /></p><p>సన్మానసభలో అన్నారు విశ్వనాధ. ఆ పద్యం ఇలాగా ఉంటుంది.</p><p><br /></p><p>అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం</p><p><br /></p><p>డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో</p><p><br /></p><p>హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే</p><p><br /></p><p>శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్</p><p><br /></p><p>"పూర్వపు కవులైన నన్నయ్య,తిక్కనలకు లేనటువంటి గౌరవం,</p><p><br /></p><p>మా గురువు గారు శ్రీ చెళ్ళపిళ్ళ వారికి దక్కింది.దానికి కారణం,నా వంటి</p><p><br /></p><p>శిష్యుని పొందటమే!"</p><p><br /></p><p>చూడండీ! వారి చమత్కారం! గురువుగారి గొప్ప తనాన్ని చెబుతూ</p><p><br /></p><p>మధ్యలో ఆయన గొప్పతనాన్ని కూడా ఎంత చక్కగా చెప్పారో!</p><p><br /></p><p>తన శిష్యుని గురించి గురువు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు ఇలా అన్నారు ----</p><p>నా మార్గమ్మును కాదు, వీని దరయన్ నా తాత ముత్తాతలం</p><p><br /></p><p>దే మార్గమ్మును కాదు; మార్గమదియింకేదో యనంగా వలెన్</p><p><br /></p><p>సామాన్యుండనరాదు వీని కవితా సమ్రాట్వ్త మా హేతువై,</p><p><br /></p><p>యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్.</p><p><br /></p><p>ఆ గురు శిష్యుల ప్రేమాను రాగాలు అలా ఉండేవి.</p><p>.</p><p>.</p><p>విశ్వనాధ వారు మంచి చమత్కార సంభాషణా ప్రియులు.</p><p><br /></p><p>ఒక సారి,తిరుపతి దేవస్థానం వారు వీరికి సన్మానం చేసి,మంచి</p><p><br /></p><p>శాలువ,వెయ్యినూట పదహారు రూపాయలతో సత్కరించారు.</p><p><br /></p><p>ఆ సందర్భంలో వారు చమత్కారంగా ఇలా అన్నారు----</p><p><br /></p><p>అందరికీ గొరిగేవాడికి గొరిగే అదృష్టం నాకు కలిగించినందులకు</p><p><br /></p><p>దేవస్థానం వారికి కృతజ్ఞతలు.మరొక సందర్భంలో వీరికి ఒక పట్టణంలో</p><p><br /></p><p>సన్మానం ఏర్పాటు చేసారు. నిర్వాహకులు కప్పిన శాలువ ఆయనకు</p><p><br /></p><p>నచ్చలేదు.ఆ సందర్భంలో ఇలా అన్నారు---</p><p><br /></p><p>ఈ సన్మానసభ నిర్వాకులకు నేను ఎంతో ఋణపడి ఉన్నాను.</p><p><br /></p><p>ఈ రోజు చేసిన సన్మానం వల్ల నాకన్నా నాభార్య ఎక్కువ</p><p><br /></p><p>సంబరపడిపోతుంది. కారణమేమిటంటే,ఆవిడ చాలా కాలం నుంచి</p><p><br /></p><p>వడియాలు పెట్టుకోవటానికి తగిన వస్త్రం దొరకక ఇబ్బంది</p><p><br /></p><p>పడుతుంది.నేటి ఈ శాలువాతో నిర్వాహకులు ఆమెను కూడా సంతోష</p><p><br /></p><p>పెట్టారు.</p><p><br /></p><p>ఆయన విసిరిన చెణుకుకు నిర్వాహకుల ముఖంలో నెత్తురు</p><p><br /></p><p>చుక్కలేదు.మరొక సందర్భంలో శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారు,శ్రీ జాషువా</p><p><br /></p><p>గారు ఒక చోట సమావేశమై ఏదో కవితా గోష్టి చేస్తున్నారు.వీరిద్దరూ '</p><p><br /></p><p>కవికోకిల' బిరుదాంకితులు.విశ్వనాధ వారి దృష్టి వీరి మీద</p><p><br /></p><p>పడింది.వెంటనే ఆయన ---ఏమిటీ! పక్షులు రెండూ ఒకే చోట చేరాయి?</p><p><br /></p><p>అని ఒక చమత్కార బాణం విసిరారు</p><p>.</p><p>పుంభావనా సరస్వతి,బహుముఖ ప్రజ్ఞావంతుడైన ఈ కవిసమ్రాట్</p><p><br /></p><p>18-10-1976 న తుది శ్వాస విడిచారు.</p><p><br /></p><p>🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿</p>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5836802122867912200.post-4664415629986109892020-09-01T06:00:00.004-07:002020-09-01T06:00:54.718-07:00🔻**సాలిగ్రామం, గండకీ కథ**🔻<p> </p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgyMdAoBU-tWSfCGXo5QX0KI7iY-NQHR0FlptwPOM_YKCjKIU18F88SIBlpSkJNDf9It63PdFPrRU1S0m8MP1O-VX24RKFgKJClDbCkVQYN3U8hdfCD6W922DNxmDTaT5trpbZhF_CNuVMC/s973/Capture.PNG" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="493" data-original-width="973" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgyMdAoBU-tWSfCGXo5QX0KI7iY-NQHR0FlptwPOM_YKCjKIU18F88SIBlpSkJNDf9It63PdFPrRU1S0m8MP1O-VX24RKFgKJClDbCkVQYN3U8hdfCD6W922DNxmDTaT5trpbZhF_CNuVMC/s640/Capture.PNG" width="640" /></a></div><br /> <p></p><p> 🔻**సాలిగ్రామం, గండకీ కథ**🔻</p><p><br /></p><p>#సాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా?</p><p>ఇది ఊరి పేరు కాదు. గ్రామం అస్సలే కాదు.</p><p>విష్ణువు ఆకారంలో ఉండే చిన్నచిన్న రాళ్లనే సాలి గ్రామం</p><p>అంటూ ఉంటారు. వాటిపై విష్ణువు రూపం ఉటుంది.</p><p>అయితే ఇవన్నీ కూడా ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి.</p><p>గండకి నది గర్భంలోనే ఇలాంటి రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి.</p><p>వీటిని చాలా మంది పూజగదిలో ఉంచుకుని పూజిస్తుంటారు.</p><p>వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం.</p><p>ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి.</p><p>తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి.</p><p>లోపల విష్ణువు కనపడతాడు. ఇంత ప్రత్యేకమైన సాలి గ్రామాలు గండకి నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది.</p><p><br /></p><p>*పూర్వం గండకీ అనే అమ్మాయి ఉండేది.</p><p>ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే.</p><p>శ్రావస్తి అనే నగరంలో ఈ గండకీ ఉండేది.</p><p>గండకీ ఒక వేశ్య.</p><p><br /></p><p>గండకీతో ఒక్కరాత్రి గడిపితే చాలు వాళ్ల తలరాతలు మారిపోయేవి. వాళ్ల అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా, గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకీ మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు.</p><p>చెడ్డ వాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక్క వ్యక్తితోనే గడిపేది.</p><p>భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది</p><p>తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది.</p><p>కేవలం సుఖం అందించడమే కాదు తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా తట్టుకోలేకపోయేది.</p><p><br /></p><p>#గండకి గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు. ఒక రోజు ముందు మారువేషంలో వెళ్లి గండకితో బేరం కుదుర్చుకున్నాడు.</p><p>గండికి కూడా అతను మంచి వాడిలాగా కనిపించాడు కాబట్టి ఒక రోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. తనకు ముందుగా భార్యలా స్నానం చేసి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు.</p><p>సరే అని.. గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది.</p><p>బట్టలు తీసి వేస్తే ఒంటినిండా పుండ్లు కనపడ్డాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధద్రవ్యాలను గండకి ఆయన్ని పూసింది. కొత్త బట్టలు తొడిగించింది.</p><p>పక్క మీదకు తీసుకెళ్తుంది</p><p>తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోతాడు.</p><p>దాంతో ఆమెనే తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకెళ్తుంది. కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజు అంతా సేవ చేస్తుంది గండకి. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు.</p><p><br /></p><p>తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకుని సతీసహగమనం చెయ్యడానికి సిద్ధం అవుతుంది.</p><p>అందరూ అడ్డుకున్న కూడా వినదు. తన దగ్గరుండే సొమ్మునంతా బీదలకు పంచిపెడుతుంది. తర్వాత శ్మశానంలో చితిలోకి దూకుతుంది.</p><p><br /></p><p>*అయితే మంటలు ఒక్కసారిగా మల్లె పూల మాదిరిగా మారుతాయి.</p><p>విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చింది అంటాడు. గండకీ సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది.</p><p>నీకు ఏ వరం కావాలో కోరుకో గండకీ అంటాడు విష్ణు మూర్తి. గండకీ విష్ణువునే తన గర్భానా పుట్టాలని కోరుకుంటుంది. సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది. నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు.</p><p>గండకీ మరు జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే సాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి.</p><p>ఇది సాలిగ్రామం, గండకీ కథ.</p><p><br /></p><p>🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻</p>Vinjamuri Venkata Apparaohttp://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.com0