Posts

Showing posts from January, 2019

.పద్మశ్రీ ప్రకాశరావు గారు .🌹

Image
పద్మశ్రీ ప్రకాశరావు గారు .🌹 🌺🌺🌺🌺🌺 లవ్ యూ బాబాయ్..మీలాంటిల వాళ్ళుండబట్టే యగాంతాలు ఆగిపోతున్నాయ్..లేకపోతే ఈ పాడులోకం పాడు జనాల చేసే కుల,వర్ణ,మత,డ బ్బు రాజకీయాలకు భూమి ఎప్పుడో అనంతవాయువుల్లో కలిసిపోయేది టీ ఆమ్మే తెలుగు వాడికి పద్మశ్రీ గౌరవం… ఎవరాయన, ఏమాకథ తెలుగు పత్రికల్లో ఒక వార్త ఈ రోజు కనిపించలేదు. తెలుగువాళ్లకు పద్మశ్రీ వచ్చినట్లు పత్రికల్లోవచ్చిన పేర్లలో ఒక పేరు మిస్ అయింది. ఆయన చాలా చిన్నవాడు, జీవితంలో తళుకులు బెళుకులు లేని వాడు. ఎపుడూ సంపాదన మీద దృష్టిపెట్టని వాడు. ఉన్నదాంట్లో సగం, అది ఇల్లూ కావచ్చు, సంపాదన కావచ్చు, ఎపుడూ పేద పిల్లలతో పంచుకునేవాడు. ఆయనే దేవరపల్లి ప్రకాశ్ రావు. ఒరిస్సాలోని కటక్ లో టీ బంకు నడుపుతూ ఉంటాడు. తన టీ స్టాల్ తో ఆయన విప్లవం తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రకాశరావు చాలా కిందట ఒరిస్సా వెళ్లి, అక్కడ రకరకాల మార్గాల్లో బతుకు పోరాటం సాగించి చవరకు టీ బంకుతో సెటిల్ అయ్యారు. అయితే, తానుంటున్న బస్తీలో పేద పిల్లలకు స్కూల్ లేకపోవడంతో తన చిన్న ఇంట్లో నే స్కూల్ తెరిచారు. తన సంపాదనలో సగంతో పిల్లల మీద ఖర్చ పెట్టి చాలా పెద్ద వాడయ్యాడు. ఆంధ్ర ప

🌹🌺సుభద్రా పరిణయం.🌺🌹

Image
🌹🌺సుభద్రా పరిణయం.🌺🌹 (విజయవిలాసం-కర్త చేమకూరవేంకటకవి. ) 🥀🥀🥀🥀 క్లుప్తంగా కథ: ద్వారకనుండి గదుడనేవాడు పాడవులను దర్శించటానికి వస్తాడు. ఆప్పుడు అర్జునునితో శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్ర సౌందర్యన్ని వర్ణిస్తాడు. కానన్ సుభద్రకున్ సమంబు గాఁగ నే మృగి విలో కనన్ ; నిజంబు గాఁగ నే జగంబునందుఁ జూచి కా కానన్ దదీయ వర్ణనీయ హావభావ ధీ వయః కన న్మనోఙ్ఞ రేఖ లెన్నఁగాఁ దరంబె గ్రక్కనన్? . ఆమె అద్భుత సౌందర్యాన్ని గురించి విన్న అర్జునుడు ఆమెపై మరులుకొంటాడు. పాండవులు తమలో తాము ఒక నియమాన్ని ఏర్పరచుకున్నారు. అదేమిటంటే ద్రౌపతి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి వద్ద ఉండేటట్టుగానూ ఆ సమయంలో మిగిలిన వారు వారి ఏకాంతతకు భంగం కలిగించ రాదని, ఒకవేళ అలా భంగం కలిగించితే వారు ఒక సంవత్సరకాలం దేశాటన చేయ్యాలని నియమం. ఒక వృద్ధ బ్రాహ్మణుని గోసంరక్షణార్ధం అర్జునుడు ఆ నియమాన్ని ఉల్లంఘించి అన్నగారైన ధర్మరాజు మందిరంలో ఉన్న తన శస్త్రాస్త్రాలను తెచ్చుకొని నియమ భంగం చేస్తాడు. నియమోల్లంఘన జరిగింది కాబట్టి అర్జునుడు భూప్రదక్షిణకి బయలుదేరతాడు. అన్నగారు వారించినా ఒప్పుకోలేదు. ఆ సాకుతో ద్వారకకు వెళ్ళి సుభద్రని చేపట

యస్యామతం తస్య మతం

Image
శుభోదయం .🌹 🌺🌺 యస్యామతం తస్య మతం  మతం యస్య న వేద సః  అవిజ్ఞాతం విజానతాం  విజ్ఞాతమవిజానతామ్..... 🌺🌺🌹🌹🌹🌺🌺 ఎవరైతే తనకు తెలియదని అనుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియును. కారణం అతనికి బ్రహ్మము ఇంద్రియ గోచరం కాదు, దానిని సమాధి నిష్ఠలో మాత్రమె తెలుసుకోగలమనే జ్ఞానం ఉంది గనుక. ఎవరైతే తనకు బ్రహ్మము తెలుసుననుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియదు. దానికి కారణం బ్రహ్మము ఇంద్రియగోచరమనే భ్రమలో అతడు ఉన్నాడు గనుక. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

మేఘ సందేశం !

Image
మేఘ సందేశం ! - మేఘ సందేశం లేదా మేఘదూతం (Meghasandesam or Meghadiootam) సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచించిన ఒక కావ్యము. కాళిదాసు రచించిన కావ్యత్రయం అని పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి. (మిగిలిన రెండు రఘు వంశము, కుమార సంభవము) కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్నకావ్యము కాళిదాసు రచనలలోను, సంస్కృత సాహిత్యంలోను విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు కొలువునుండి ఒక సంవత్సరం పాటు బహిష్కారానికి గురవుతాడు. ఆ యక్షుడు హిమాలయాలలోని కైలాసగిరికి పైన, అలకాపురిలో ఉన్న తన ప్రియురాలికి ఒక మేఘం ద్వారా సందేశం పంపుతాడు. మార్గసూచకంగా యక్షుడు ఆ మేఘానికి హిమాలయాలకు పోయే దారిలోనున్న పెక్కు దృశ్యాలను వర్ణిస్తాడు. 1813లో ఈ కావ్యం 'హోరేస్ హేమాన్ విల్సన్' (Horace Hayman Wilson) చే ఆంగ్లంలోనికి అనువదింపబడింది. మేఘ సందేశంలో శ్లోకాల సంఖ్యపై కొంత అనిశ్చితి ఉంది. మూల కావ్యంలో 110 లేదా 111 శ్లోకములని అంటారు. పూర్వ మేఘంలో 63, ఉత్తర మేఘంలో 48 శ్లోకాలున్నాయని సుశీలకుమార దేవుడు చెప్పాడు. వావిళ్ళవారి ప్రతిలో 124 శ్లోకాలు, మరి కొన్ని ప్రతులలో 129 శ్లోకాలు చెప్పబడ్డాయి.

ఆశ -దోస -అప్పడం.🌹

Image
ఆశ -దోస -అప్పడం.🌹 🙃🙃🙃🙃 సర్కస్ లో రింగ్ మాష్టర్ ఉద్యోగానికని వెళ్ళి మేనేజర్ ని కలిశాడు సుబ్బు. "పద... ఈవేళ షో చూద్దువుగాని!" అంటూ సర్కస్ జరుగుతున్న గుడారంలోకి సుబ్బూని తీసుకెళ్ళాడు మేనేజర్. . అప్పుడు ఒక పాతికేళ్ళు పడుచు, చిన్నచెడ్డీ, బాడీ వేస్కుని చేతిలో కొరడా పట్టుకుని సింహాలనూ, పులులనూ ఆడిస్తూవుంది. కొరడాని అదిలించి సింహాలు, పులులూ చిన్ని చిన్న స్టూల్స్ మీద కూర్చునేలా చేసింది ఆ అమ్మాయి .. తర్వాత నేలమీద వెల్లకితలా పడుకుంది. అప్పుడు ఆ సింహాలూ, పులులూ స్టూలు మీది నుండి క్రిందికి దూకి ఆ అమ్మాయి చుట్టూ మూగి ఆ అమ్మాయి శరీరాన్ని అప్యాయంగా నాకసాగాయి. "చూశావా? నువ్వు అలా చెయ్యగలవా?!" అడిగాడు మేనేజర్. "ఓ... మీరు ఆ పులులనూ బోనుల్లోకి పంపించేస్తే నేను అంతకంటే ఎక్కువే చేస్తా" ఆశగా ఆ అమ్మాయి వంక చూస్తూ అన్నాడు సుబ్బూ. 😉😉😉😉😉😉😉😉😙😙😙😙😉😉😉😉😉😉😉😉

ఏమని పాడెదనో ఈ వేళ...🎼

Image
ఏమని పాడెదనో ఈ వేళ...🎼 - 58 ఏళ్ళ క్రితం తెలుగు సినిమాల్లో తొలి వీణ పాట పి. సుశీల గాత్రంలో పుట్టింది. అభ్యుదయ గీతాలకు పేరుపొందిన శ్రీశ్రీ ఈ పాటను రాయడం విశేషం. లలిత సంగీత శాఖకు ఆద్యుడైన సాలూరి రాజేశ్వరరావే స్వరాలు సమకూర్చి వీణ పాటకు నాంది పలికారు. ఆ సినిమా ‘భార్యాభర్తలు’(1961). ఇన్నేళ్ళయినా వన్నె తరగని పాట ఇది. చిత్ర కథాపరంగా... విషాద గంభీరంగా సాగుతుందీ పాట. ‘నిదురించిన వే-ళా’ అనే పదాల దగ్గర స్వర విన్యాసం చూడండి. చరణాల్లో కూడా ఇలాంటి చాతుర్యమే కనపడుతుంది. మొదటి చరణం వరకూ చూస్తే .. కలత నిదుర‘లో ’ కాంచిన కల‘లే’ గాలి మేడ‘లై’ ... ఆ చివరి అక్షరాల విరుపుల మెరుపులు గమనించండి. అది రాజేశ్వరరావు గారి ముద్ర. 1977లో విడుదలైన ‘కురుక్షేత్రము’లోని ‘మ్రోగింది కల్యాణ వీణ’ పాటలోనూ, 1978లో వచ్చిన ‘ప్రేమ-పగ’లోని ‘కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ’ పాటలోనూ... ఇలాంటి స్వర విన్యాసాన్నే మరింత విస్తారంగా చేశారు ఎస్ రాజేశ్వరరావు. సెకండ్ వాయిస్  ఈ పాటను రికార్డు చేసినపుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రచయిత్రి ఇంద్రగంటి జానకీబాల తన అనుభవాన్ని భూమిక పత్రికలో

ఇటాలియను భాష“తెలుగు ఆఫ్ యూరోపు” 🌹

Image
ఇటాలియను భాష“తెలుగు ఆఫ్ యూరోపు” 🌹🌺 తెలుగు భాషకి గల గొప్పతనమును గురించి చెప్పే ప్రతి సారీ చాలా మంది తెలుగు ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగు భాషని ఎక్కడో వాడుకలో ఉన్న ఇటలీ భాషతో పోలుస్తారు. తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. ఇటాలియన్ భాష కూడా అచ్చుతోనే అంతము అవుతుంది. హిందీ మొదలయిన చాలా భారతీయ భాషలు హలంత భాషలు అనగా హల్లులతో అంతమయ్యే భాషలు. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా అభివర్ణించాడు. హెన్రీ మారిస్ మరియు చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ లు కనుగొన్న విషయం ఇటాలియన్ భాష,తెలుగు భాష రెండింటి ఉచ్ఛారణలో ఉన్న సారుప్యాన్ని కనుగొన్నారు. ఇటాలియన్ భాష లో ప్రతి పదం పలికేటప్పుడు చివర లో ఉచ్చరించేది “ఒక అచ్చు” ను అదే విధానం తెలుగుకూ ఉండటం తో “తెలుగు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ” అయ్యింది.ఒక ఇటాలియను పదం ఉదాహరణ గా మనకి తెలిసిన “ఫియట్” కారుని విస్తరిస్తే ఫాబ్రికానా ఇటాలియానాఆటోమొబైలో టొరినో గా ప్రతి పదం చివర అచ్చు వచ్చి చేరుతుంది. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్

మాతృత్వం’ అనే అందం 🌺🌹

Image
మాతృత్వం’ అనే అందం 🌺🌹 🌺🌺🌺🌺 ఈ ప్రపంచంలో ప్రతి జీవికీ అందం అనేది సహజంగా వచ్చేస్తుంది.... ఈ రంగులను, ఈ రంగు రంగులతో కూడిన అందమైన పూలను, పళ్లను, పక్షులను, వాటినన్నిటినీ తనలో ఇముడ్చుకున్న ఈ ప్రకృతిని ఎవరు సృష్టించారో తెలీదు.. కొందరు భగవంతుడంతారు.. కొందరు ప్రకృతే సృష్టించింది అంటారు.. కానీ ఈ ప్రకృతిలో జీవ రాసులన్నిటిలోనో ఉన్న ఒకే ఒక్క తేడా ఆడ మగ... మనము ఎన్ని తేడాలు ఏర్పరుచుకున్నప్పటికీ.. దేవుడు సృష్టించిన తేడా ఇదేనేమో... ( నాకు ఇంతకన్న తేడాలు ఏమున్నాయో తెలీదు మరి) ఈ అందం అనే ఆలోచన మనిషికి వచ్చిందేనేమో.. లేకపోతే ఈ ఒక్క చిన్న విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతో మంది ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు.. ఎందరో తాము అందంగా లేమని పక్క వారితో పోల్చుకుని భాదలు పడుతున్నారు.. మరి కొందరు అందాన్ని ఇనుమడించుకోవాలని తాము సంపాదించిన దానిని అంతా బ్యూటీ పార్లర్లకు సమర్పించు కుంటున్నారు.... మగ వారి సంగతి ఏమో గానీ ఆడవాళ్ళు మాత్రం అందం అనే విషయానికి అధిక ప్రాముఖ్యతని ఇస్తున్నారు... అందుకేనేమో ఆడవాళ్ళ మీద వారి అందం మీద, వారు తయారు అవడానికి పట్టే సమయం మీద అనేక రకాల జోకులు పుట్ట

అసలు శ్రీకృష్ణుడు ఎవరు?

Image
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 అసలు శ్రీకృష్ణుడు ఎవరు? 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 భాగవతం, హరివంశం, మహాభారతం, బ్రహ్మవైవర్తపురాణం చదివితే ఆయన వృత్తాంతం తెలుస్తుంది. దశవతారాలలో ఆయన ఉన్నాడా? లేకపోతే దశావతారాలు ఏమిటి? కృష్ణస్తు భగవాన్ స్వయం - అని వ్యాసుడు ఎందుకు అన్నాడు?  జయదేవుని అష్టపదులు చెప్పినది ప్రమాణంకాదు.  పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు మాత్రమే విష్ణువు దశావతారాలలోనికి వస్తారు. అవి విష్ణువు అంశలు.  కృష్ణావతారం అంటాము కాని అది కృష్ణుడి స్వయం అవతరణ.  ఈ కృష్ణుడికి, విష్ణువుకి సంబంధం ఏమిటి? . కృష్ణుడు-విష్ణువు వీరిసంబంధం తెలియాలంటే మత్స్యావతారంనుండి శ్రీరామునివరకూ గల అవతారాలనూ శ్రీకృష్ణుని ప్రత్యేకతనూ పరిశీలించాలి. . సృష్టిలో ద్వంద్వాలు ఎప్పుడూ ఉంటాయి.  దేవతలను సృష్టించిన పరమేశ్వరుడే, రాక్షసులనీ సృష్టించాడు. పూర్వయుగాలలో రాక్షసులూకూడా తపస్సులుచేసి లోకకంటకులైనప్పుడు, విష్ణువు ఒకొక అవతారంలో ఒకొక బలీయమైన దుష్టశక్తిని పరిమార్చాడు. క్రితము ద్వాపరయుగంనాటికి అటువంటి రాక్షసులు లేరు.  రాక్షసత్వం, కౄరత్వం, అధర్మం చాలామందిలో ప్రవేశించింది.  కంస, జర