Posts

Showing posts from November, 2018

🌹🏵️అహ నా పెళ్ళంట - లక్ష్మీపతి!🤣🌹

Image
🌹🏵️అహ నా పెళ్ళంట - లక్ష్మీపతి!🤣🌹 🤣🤔🤣🤔🤣🤔🤣🤔🤣🤔🤣🤔🤣🤔 ఆదివిష్ణు రాసిన 'సత్యం గారి ఇల్లు ' కధ/నవల లోని సత్యం పాత్రనే లక్ష్మీపతి గా మార్చారు.ఆ పాత్రలో కోట శ్రీనివాసరావు నిజంగా జీవించారనే చెప్పాలి. లక్ష్మీపతి పాత్రను తొలుత రావుగోపాలరావు చేత వేయించాలనుకున్నారు.లుక్ పరంగానూ,నేటివిటీ పరంగానూ ఆయన కరక్ట్ కాదేమోనని ఎవరో సందేహం వెలిబుచ్చటంతో జంధ్యాల కోటను ఎన్నుకున్నారు.అప్పటికి కోట సినిమా ఫీల్డ్ కొచ్చి రెండేళ్ళు అవుతోంది. సినిమాల్లోకొచ్చేముందు కోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం చేస్తూ తీరిక దొరికినప్పుడల్లా నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు.జంధ్యాల "అమరజీవి" సినిమా చేస్తున్నప్పుడు సరదాగా కోట తో ఓ వేషం వేయించారు. అక్కినేని ఇంటి ఓనర్ పాత్రలో కనిపిస్తారాయన.కోటకి నటునిగా తొలి చిత్రం "ప్రాణం ఖరీదు".ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తో అమరజీవి లో నటించారు.తర్వాత బాబాయ్ అబ్బాయ్ లో కూడా ఓ పాత్ర పోషించారు. కోట కి ఎయిర్‌పోర్ట్ లో కనపడ్డ రామానాయుడు ఆహా నా పెళ్ళంట లో జంధ్యాల గారు నీతో పెద్ద వేషం వేయించాలనుకుంటున్నారు అని చెప్పడంతో తెగ ఆనందపడిపోయారు

🌹మన సాహితీ ప్రముఖులు (10)🌹 🙏శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు.🙏

Image
🌹మన సాహితీ ప్రముఖులు (10)🌹 🙏శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు.🙏 👉 నా అక్షరాలు కన్నీటి జడులలో తడిపే దయాపారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.. అంటూ తన కవితా పరమార్థం చెప్పుకున్న,  భావ కవులలో అభ్యుదయ కవీ,  అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్ .  ఇతను కవి, కథకుడు, నాటక కర్త. సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి.. అంటూ బలమైన కంఠంతో విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవేయడమే ధ్యేయంగా, కరుణ కలికితురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ, అమృతమయమైన కవితా ఝురిని ప్రవహింపజేసిన కవితా తపస్వి దేవరకొండ బాలగంగాధర తిలక్ . పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న తిలక్ జన్మించాడు. తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచి

🌹మన సాహితీ ప్రముఖులు (9)🌹

Image
🌹మన సాహితీ ప్రముఖులు (9)🌹 🙏శ్రీ సముద్రాల వేంకట రాఘవాచార్యులు. గారు.🙏 👉 ఆశామోహముల దరి రానీకోయి బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్, ఆ యెఱుకే నిశ్చలానందమోయ్, బ్రహ్మానందమోయ్!! 🌹🙏 చిత్రం - పద్మ కృష్ణ గారు.🙏🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

🌹🙏సంస్కర్త సంత్‌ కబీర్‌దాస్‌🙏🏿🌹

Image
🌹🙏సంస్కర్త సంత్‌ కబీర్‌దాస్‌🙏🏿🌹 🏵️🏵️ భక్తి ఉద్యమకారుడుగా, సామాజిక సంస్కర్తగా, సమతా ఉద్యమకారునిగా ప్రజాకవిగా సంత్‌ కబీర్‌దాస్‌ పేరు పొందాడు. కాశీ కేంద్రంగా క్రీ.శ.1455-1518 మధ్య వారు జీవించారు. వారు జేష్ఠ పౌర్ణమి నాడు జన్మించారు. వారి జీవనానికి సంబంధించి అనేక వైరుధ్య కథనాలు వినపడు తున్నాయి. వారి జీవన కాలం విదేశీ ముస్లిం పాలకుల దౌర్జన్యం తీవ్రంగా ఉన్న సమయం. సమాజంలో దురాచారాలకూ కొదవలేదు. విదేశీ పాలకుల దుర్మార్గం ముందు సమాజం నిలబడలేని నిస్సహాయ స్థితిలో ఆ కాలంలో దేశం నలుమూలలా భక్తి ఉద్యమం ఉద్భవించింది. ఆ రోజుల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా భక్తి ఉద్యమాన్ని అందివ్వడంతో పాటు, ఆడంబరాలు, మూఢాచారాలు, పటాటోపాలకు దూరంగా సంస్కరణలను, సామాజిక సమతా ఫలాలను అందించిన మహాకవి సంత్‌ కబీర్‌దాస్‌. 🏵️🏵️ సంత్‌ కబీర్‌దాస్‌ రచనల్లోని కొన్ని దోహాలను మచ్చుకు తెలుసుకుందాం. కబీర్‌ దోహాలు🌹 👉 జాతి న పూఛో సాధు కీ, పూఛి లీజియే జ్ఞాన | మోల కరో తలవార్‌ కా, పడా రహన దో మ్యాన్‌ || సాధువుల కులం అడగవద్దు. వారినుండి జ్ఞానాన్ని పొందండి. కత్తికి గల పదును ముఖ్యం, ఒర ముఖ్యం క

🌹మన సాహితీ ప్రముఖులు (6)🌹

Image
🌹మన సాహితీ ప్రముఖులు (6)🌹 🙏శ్రీ శ్రీ గారు.🙏 👉 నీ ప్రతిమాట నెత్తుటి మంటై కొత్త వెలుగులు చూపింది.! నీ ప్రతివాక్యం ప్రభాత కిరణమై చీకటి కోణాలను చీల్చింది..!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

🌹మన సాహితీ ప్రముఖులు (5)🌹 🙏శ్రీ గిడుగు రామమూర్తి గారు.🙏

Image
🌹మన సాహితీ ప్రముఖులు (5)🌹 🙏శ్రీ గిడుగు రామమూర్తి గారు.🙏 👉 గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు,  వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు, తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు  కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకములు .. 21-31

Image
మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకములు .. 21-31 .  "పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్ ఇహ సంసారే బహుదుస్తారే కృపయాఽపారే పాహి మురారే "|| 21 || . మరల పుట్టుక మరల మరణము  మరల తల్లిగర్భంలో నివాసము అను దాటలేని  అపారమైన సముద్రం నుండి ఓ కృష్ణా! దయతో రక్షించుము. . "రథ్యా చర్పట విరచిత కంథః పుణ్యాపుణ్య వివర్జిత పంథః యోగీ యోగనియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవ "|| 22|| . కూడలిలో దొరికిన పీలిగుడ్డలను కట్టుకుని,  పాపపుణ్యములంటని కర్మలనాచరించుచూ,  యోగముచే చిత్తవృత్తులను నిరోధించు యోగి  బాలునివలే ఉన్మత్తునివలే ఆనందించుచుండును. "కస్త్వం కోఽహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారమ్ విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్ "|| 23 || . నీవెవరు?నేనెవరు? ఎక్కడినుండి వచ్చావు? నాతల్లి ఎవరు? నాతండ్రి ఎవరు? స్వప్నమువలే కనబడు  ఈ ప్రపంచమును విడిచి అంతా నిస్సారమే అని భావించుము. . "త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదజ్ఞానమ్ &qu

🌹రాజశ్రీ - ఇందుకూరి రామకృష్ణంరాజు🌹

Image
🌹రాజశ్రీ - ఇందుకూరి రామకృష్ణంరాజు🌹 రాజశ్రీ తెలుగు సినిమాలలో అనువాద రచనలో ప్రముఖులు. వీరు ఆగష్టు 31, 1934 సంవత్సరం విజయనగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఇందుకూరి అప్పలరాజు, నారాయణమ్మ. వీరు విజయనగరం మహారాజా కళాశాల నుంచి బి.ఎస్సీ. పట్టా పొందారు. వీరు తొలినుంచి నాటక సాహిత్యాభిలాషి. వీరి 'వదిన', 'ఆంధ్రశ్రీ' నాటకాలు రాఘవ స్మారక కళాపరిషత్తులో ఉత్తమ రచనలుగా ఎన్నుకోబడ్డాయి. విశాఖ జిల్లా బోర్డు కార్యాలయంలో స్టెనో టైపిస్టుగా కొంతకాలం పనిచేశారు. చలనచిత్ర రంగానికి తరలి వెళ్ళి పినిశెట్టి శ్రీరామమూర్తి, మానాపురం అప్పారావు వద్ద సహాయ దర్శకునిగా చేరారు. తరువాత తమిళ చిత్రసీమ వీరిని కథకునిగా పరిచయం చేసింది. రాజశ్రీ (సినీ రచయిత) ఈయన ఎక్కువగా అనువాద చిత్రాలకు మాటలు మరియు పాటలు రాసాడు. బి.యస్సీ ఫిజిక్సు చేసి ఆ తర్వాత రెండు మూడేళ్ళు విజయనగరం తహసిల్దారు వద్ద పి.ఏ. గా చేసి, అక్కడ నచ్చక మద్రాసు వెళ్ళిపోయారు. అక్కడ ఎం.జి.ఆర్. ని కలిసి ఆయన కోసం రాసిన ఒక కథను వినిపించారు. అది ఎం.జి.ఆర్. గారికి నచ్చడంతో "తేడివంద మాప్పిళ్ళ"పేరుతో సినిమా తీయబడినది. అది విజయవంతం అయ్యి

అచ్చ తెలుగు తిట్లు ఎంత బాగుంటాయో!

Image
అచ్చ తెలుగు తిట్లు ఎంత బాగుంటాయో! 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔 ఆనాటి రోజులు వేరు. అనుభవించిన మాలాంటి వాళ్లకు అర్థమవుతాయి. ఒక 40, 50 యేళ్ల క్రితం, దాదాపు ప్రతి ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, పెదనాన్నలు, బాబాయిలు, మేనత్తలు వుండేవారు. అందరూ ప్రేమ, ఆప్యాయతలతో పాటు అప్పుడప్పుడూ చిరు కోపాన్ని ప్రదర్శిస్తూ వుండేవాళ్లు. కారణం, పిల్లలమంతా వాళ్లకు ఏదో ఒక రకంగా కోపం తెప్పించే దుర్మార్గపు పనులు చేస్తుండే వాళ్లం. ఒకరో, ఇద్దరో కొంచెం కోపం ప్రదర్శించి కొట్టినా, ఎక్కవగా తెలుగు తిట్లను వెదజల్లి, వాళ్ల కోపాలను మరు క్షణంలో అణచుకొని మరచిపోయే వాళ్లు. అచ్చ తెలుగు తిట్లు ఎంత బాగుంటాయో! అదరహో! అంటే, అంత అందంగా వుంటాయన్న మాట. ఎంతో ప్రేమగా కూడా వుంటాయి....ప్రేమతో అంటారు కూడా! తెలుగు తిట్లు అత్యంత మాధుర్యమే గాక, ఒక ప్రత్యేకతను సంతరించుకొని, ఒక రకంగా మరీ మరీ వినేలా వుంటాయి. తెలుగువారి కొన్ని అచ్చ తెలుగు తిట్లు ఆగ్రహం తెప్పించవు సరికదా, సరదాగా నవ్వు తెప్పిస్తుంటాయి. కొన్ని తిట్లు ముద్దుగా, మురిపెంగా, మహా గోముగా వుంటాయి. మచ్చుకు కొన్ని తిట్లను చూడండి:-- ""శుంఠా", "అప్ర

శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 231118)

Image
శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 231118) 🏵️ శక్రసుతు గాచుకొఱకై చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ విక్రమ మేమని పొగడుదు నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా! 🏵️ భావం: కృష్ణా! అర్జునుడు, భీష్ముడు యుద్ధం చేస్తున్న సమయంలో భీష్ముని ధాటికి తాళలేకపోతున్న అర్జునుడిని రక్షించడానికి నువ్వు చేతిలో చక్రాయుధాన్ని ధరించి పరాక్రమాన్ని ప్రదర్శించావు. అటువంటి నిన్ను వర్ణించటం ఎవరితరమూ కాదు. కురుక్షేత్ర యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయుధం ముట్టుకోనని చెప్పిన శ్రీకృష్ణుడు తనకు ఇష్టుడైన అర్జునుడిని రక్షించడం కోసమని రథం మీద నుంచి ఒక్క దూకు దూకి చక్రాయుధాన్ని చే తబట్టి భీష్ముడి మీదకు బయలుదేరతాడు.  అర్జునుడి మీద ఉన్న ప్రేమతో తన మాట తానే మర్చిపోయాడు.  కృష్ణునికి అర్జునుడంటే అంత ప్రీతి. ఆ విషయాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు. 🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏

🌹గుర్తుకు వచ్చిన -జంధ్యాల మచ్చుతునకలు🌹

Image
🌹గుర్తుకు వచ్చిన -జంధ్యాల మచ్చుతునకలు🌹 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 భర్త భార్యను ప్రేమించే పద్ధతికి, భార్య భర్తను వేదించే పద్ధతికి సరైన నిర్వచనం :- పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క - ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లంచెక్క, -నీ పీకనొక్క! 🤔😃🤔 మొక్కుబడికి బుక్కులన్నీ చదివినా కుక్కగొడుగు మొక్కలా, చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా, కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా, బిక్క మొహం వేసుకొని, వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ డెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ, ఇక్కడే ఈ ఉక్కలో గుక్కపెట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపీనుగులా చక్కిలాలు తింటూ, అరటి తొక్కలా, ముంగిట్లో తుక్కులా, చిక్కు జుట్టు వేసుకొని ముక్కు పొడి పీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్ళాన్ని రక్కుతూ, పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ, రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కినక్కి ఈ చెక్క బల్ల మీద బక్క చిక్కి ఇలా పడుకోకపోతే --- ఏ పక్కకో ఓ పక్కకు వెళ్ళి పిక్క బలం కొద్దీ తిరిగి, నీ డొక్క శుద్ధితో వాళ్ళని ఢక్కాముక్కీలు తినిపించి, నీలక్కు పరీక్షించుకుని

శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 22 1118)

Image
శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 22 1118) 🏵️ అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా! 🏵️ భావం: ఓ కృష్ణా! బాల్యంలో నీ కాళ్లకు అందంగా అలంకరించిన అందెలు, గజ్జెలను ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తూ గంతులేస్తూ, నందుని భార్య అయిన యశోద ఎదుట నిలబడి ఆమెకు ముద్దు కలిగించేలా ఆడుతుంటావు. ప్రతిపదార్థం: కృష్ణా అంటే శ్రీకృష్ణా; అందెలు అంటే కాలికి అలంకారంగా పెట్టుకునే కడియాల వంటి ఆభరణం; గజ్జెలు అంటే ఘల్లుఘల్లుమని శబ్దం చేసే కాలియందు ధరించిన గ జ్జెలు; మ్రోయగన్ అంటే శబ్దం చేస్తుండగా; చిందులు అంటే కాళ్లతో అస్తవ్యస్తంగా చిందులు; త్రొక్కుచును అంటే వేస్తూ; వేడ్క అంటే ఆనందం; చెలువారంగా అంటే అందం ఎక్కువ అవుతుండగా; నందుని సతి అంటే గోకులంలో ఉండే నందుని భార్య అయిన యశోద; ఆ గోపిక అంటే గోపకాంతకు (తల్లి అయిన యశోదకు); ముందర అంటే ఎదురుగా నిలబడి; మిగుల అంటే ఎక్కువగా; మురియుచు అంటే ఆనందిస్తూ; ఆడుదువు అంటే నాట్యం చేస్తావు. పసిపిల్లల కాళ్లకు కడియాలు అలంకరించి తల్లి మురిసిపోతుంది. కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమని శబ్దం

శ్రీ కృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 21 1118)

Image
శ్రీ శ్రీ కృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 21 1118) 🏵️ హరియను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజ నాభా హరి నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా! 🏵️ ప్రతిపదార్థం:  అంబుజ నాభా అంటే నాభియందు పద్మం ఉన్న ఓ విష్ణుమూర్తీ! ( శ్రీ కృష్ణా); హరి + అను అంటే ‘హ’ ‘రి’ అనే రెండు అక్షరాలు; పాతకములను అంటే చేసిన పాపాలను; హరియించును అంటే పోగొడతాయి; హరి అంటే హరి అనెడి; నీ నామ మహాత్మ్యము అంటే నీ పేరులో ఉన్న గొప్పదనం; హరిహరి అంటే ఆహా; పొగడంగ అంటే స్తుతించడం; వశమె అంటే సాధ్యమగునా! భావం: ఓ శ్రీకృష్ణా! ‘హ’ ‘రి’ అనే రెండు అక్షరాలను కలిపి పలికినంత మాత్రానే అంతవరకు చేసిన పాపాలనన్నిటినీ హరిస్తావు. ఓ శ్రీకృష్ణా! నీ పేరులో ఉన్న గొప్పతనాన్ని వర్ణించి చెప్పటం ఎవ్వరితరమూ కాదు కదా! హరి అనే రెండు అక్షరాలను స్మరించిన ప్రహ్లాదుడు కష్టాలను అధిగమించాడు.  శ్రీహరిని ధ్యానించిన గజేంద్రుడు మోక్షం పొందాడు. శ్రీహరికై తపస్సు చేసిన ధ్రువుడు ఆకాశంలో నక్షత్రరూపంలో శాశ్వత స్థానాన్ని పొందాడు.  ఇంకా ఎందరో భక్తులు ఆ హరిని ప్రార్థించి మహనీయులు అయ్యారు.  హరి అనే రెండు అక్షరాల పదా

మనం చేసింది పాపమా.. పుణ్యమా..!!

Image
మనం చేసింది పాపమా.. పుణ్యమా..!! (తాళపత్ర నిది నుండి .మీకోసం సేకరణ .) *మనం పాపాలు చేసామా..?* *పుణ్యాల చేసామా..?* మనలో పాపం ఎక్కువ నిలువ ఉందా? లేదా పుణ్యం ఎక్కువ నిలువ ఉందా? అన్న విషయం ఎలా తెలుస్తుంది? అన్న సందేహం మనకురావచ్చు! శరీరాలు మూడు రకాలుగా ఉంటాయి. 1. స్థూల శరీరం (సాధారణ భౌతిక శరీరం) 2. సూక్ష్మ శరీరం (కేవలం మనస్సు, బుద్ధిలతో కూడినది) 3. కారణ శరీరం (పాప పుణ్యాల శేష ఫలితాలు బీజరూపకంగా ఉన్న శరీరం)ఇలా మనం చేసిన పాపం ఈ మూడు శరీరాల్లో నిలువ ఉంటుందని శాస్త్రం చెబుతుంది. మనలో పాపం ఎక్కువ నిలువ ఉందా?  లేదా పుణ్యం ఎక్కువ నిలువ ఉందా?  అన్న విషయం ఎలా తెలుస్తుంది? అన్న సందేహం మనకు రావచ్చు! దుర్గంధాన్ని బట్టి చెడువస్తువులనూ,  సుగంధాన్ని బట్టి మంచి వస్తువులను అంచనా వేసినట్లు ఈ మూడు శరీర లక్షణాలను బట్టి మనలో నిలువ ఉన్న పాప పుణ్యాలను కూడా అంచనా వేయవచ్చు ! 1. స్థూల శరీర లక్షణాలు : సాధారణంగా స్థూల శరీరలక్షణాలు ఎక్కువగా ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలమీద ఆధారపడి ఉంటాయి. అ) స్థూల శరీరం పాపరహితంగా పవిత్రంగా ఉంటే తెల్లవారు జామునే మేల్కొంటుంది.  (లేదా తెల్

శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 18 1118)

Image
శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 18 1118) 🏵️ శ్రీరుక్మిణీశ కేశవ నారద సంకీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్ధన కారుణ్యము తోడ మమ్ము గాపుము కృష్ణా! 🏵️ ప్రతిపదార్థం: శ్రీ అంటే లక్ష్మీదేవి అవతారంగా పుట్టిన; రుక్మిణి అంటే విదర్భ రాజైన భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణీదేవికి; ఈశ అంటే భర్త అయినటువంటి వాడా; కేశవ అంటే పరమేశ్వరా; నారద అంటే నారదుడు అనే పేరుగల ఋషి ఆలపించే; సంగీత అంటే గానమునందు; లోల అంటే ఆసక్తి కలవాడా; నగ అంటే కొండను; ధరా అంటే ధరించినవాడా; శౌరీ అంటే ప్రతాపము కలవాడా; ద్వారక అంటే ద్వారక అను పేరు గల నగరంలో; నిలయ అంటే నివసించేవాడా; జనార్దన శిష్టులైన వారిని రక్షించువాడా; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా! కారుణ్యము తోడన్ అంటే దయతో; మమ్ము అంటే మమ్మల్ని అందరినీ; కావుము అంటే రక్షించుము. భావం: ఓ శ్రీకృష్ణా! నువ్వు రుక్మిణీ దేవికి భర్తవు. పరమేశ్వరుడవు. నారద మహర్షి చేసే గానమునందు ఆసక్తి ఉన్నవాడివి. గోవర్థనమనే కొండను ఎత్తినవాడివి. ద్వారకానగరంలో నివసించినవాడవు. జనులు అనే రాక్షసులను చంపినవాడవు. ఇన్ని విధాలుగా గొప్పవాడివయిన నీవు మావంటి మానవులను దయతో రక్ష్మించుము. శ్రీకృష

శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 19 1118)

Image
శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 19 1118) 🏵️ నీవే తల్లివిఁ దండ్రివి నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా 🏵️ భావం: ఓ కృష్ణా! నువ్వే నాకు తల్లి, తండ్రి. నిరంతరం నన్ను వెంటాడుతూ, నాకు తోడునీడగా ఉండేది నీవే. నీవే నాకు స్నేహితుడివి. నాకు గురువు, దేవుడు కూడా నీవే. నీవే నాకు ప్రభువు. నాకు దిక్కు నీవే. నా సమస్తము నీవే. కృష్ణా అంటే ఓ కృష్ణా; నిజముగ అంటే వాస్తవంగా; నీవే అంటే నువ్వే; నాకు అంటే నిన్ను పూజించే నాకు; తల్లివి అంటే కనిపెంచే తల్లితో సమానం; తండ్రివి అంటే కన్నతండ్రివలె రక్షించేవాడివి; నీవే అంటే నువ్వే; నా తోడు అంటే నాకు సహాయకుడివి; నీడ అంటే వెన్నంటి ఉండే నీడ వంటి వాడివి; నీవే అంటే నువ్వే; సఖుడు + ఔ అంటే ప్రాణమిత్రుడివి; నీవే అంటే నువ్వే; గురుడవు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి; దైవము అంటే దేవుడవు; నీవే అంటే నువ్వే; నా పతియు అంటే నాకు ప్రభువు; గతియు అంటే దిక్కు. ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు భగవంతుడని, ఆయనే శ్రీకృష్ణుడని కవి ఈ పద్యంలో వివరించాడు. ఇందులో ఉపయోగించిన పదాలన్నీ చాలా చ

🌹మోహముద్గరః (భజ గోవిందం)🌹 రచన: ఆది శంకరాచార్య (శ్లోకములు .1నుండి 10 వరకు .)

Image
🌹మోహముద్గరః (భజ గోవిందం)🌹 రచన: ఆది శంకరాచార్య (శ్లోకములు .1నుండి 10 వరకు .) భజగోవిన్దం భజగోవిన్దం గోవిన్దంభజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే॥1॥ గోవిందుని సేవించుము,గోవిందుని సేవించుము, ఓమూఢమానవుడా! గోవిందుని సేవించుము. మరణము సమీపించునప్పుడు " డు కృఞ కరణే" అను వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించదు(గోవిందుని స్మరణతప్ప వేరేవీ రక్షించలేవని భావము). 🏵️ మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్ యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్ || 2 || ఓ మూర్ఖుడా! ధనసంపాదనపై ఆశవదులుము. వైరాగ్యభావనను మనసులో నింపుకొనుము.స్వశక్తిచే సంపాదించిన ధనముతో ఆనందించుము. 🏵️ నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్ ఏతన్మాంసవసాదివికారం మనసి విచింతయ వారం వారమ్ || 3 || యువతుల స్తనములను,నాభిని చూచి మోహావేశం పొందకుము.అవన్నీ మాంసపుముద్దలే అని మరల మరల మనసులో తలచుము. 🏵️ నలినీదలగత జలమతితరలం తద్వజ్జీవితమతిశయచపలమ్ విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్ || 4 || తామరాకుపై నీటిబొట్టువలే జీవితము మిక్కిలి

నేనేమో తేనె గుంటలో... మీరేమో మురికి గుంటలో..!!

Image
నేనేమో తేనె గుంటలో... మీరేమో మురికి గుంటలో..!! ఒక రోజున శ్రీకృష్ణదేవ రాయలవారికి తెనాలి రామలింగడిని ఏడిపించాలనిపించింది. ఆరోజు ఉదయాన్నే సభ ప్రారంభం అయిన తరువాత సభికులను ఉద్దేశించి తనకో బ్రహ్మాండమైన కల వచ్చిందని చెప్పారు. వెంటనే తెనాలి రామలింగడిని ఉద్దేశించి "రామలింగా.. మీరూ, నేనూ ఓ కొత్త ప్రదేశంలో నడుస్తున్నామట. ఎక్కడికోగానీ మనం ఇద్దరిమే వెళుతున్నామట. నడుస్తూ, నడుస్తూ ఓ రెండు పెద్ద గుంటల మధ్యలో మనం పోవాల్సి వచ్చింది. ఒక గుంట నిండా తేనె ఉంటే, మరో గుంటనిండా మురికి ఉంది. మురికి గుంటలో మలమూత్రాదులతోపాటు చెత్తా, చెదారం అన్నీ ఉన్నాయి. దారి కూడా చాలా ఇరుకుగా ఉంది. అయితే ఆ దారిలోనే మనం నడవాల్సి వచ్చింది" అంటూ ఆపకుండా చెబుతున్నారు రాయలవారు. మళ్లీ కొనసాగించిన రాయలవారు "ఇద్దరం మునివేళ్లమీద మెల్లగా అడుగులేస్తూ పోతున్నామట. అయితే ఆ సన్నటి దారిలో నడవటం సాధ్యంకాక మీరూ, నేనూ పట్టుతప్పి పక్కనుండే గుంటల్లోకి జారి పడిపోయామట. నేనేమో తేనె గుంటలో పడిపోతే, మీరేమో మురికిగుంటలో పడిపోయారు. నేనేమో హాయిగా తేనె గుంటలో పడిపోయి తియ్యటి తేనెను తాగుతూ ఆనందంగా ఉంటే.. మీరేమో..... అబ్బ నేను చ

వేదాంతం సత్యనారాయణ శర్మ !!

Image
భామనే.........! భామనే...సత్యభామనే , భామనే...సత్యభామనే , సుందరవదనం నాదేనే , సుందరి అంటే నేనేనే , పంతం అంటే నాదేనే , పౌరుషమంటే నేనేనే , చిలకల పలుకులు నావేనే , అలకల మొలకను నేనేనే , శ్రీకృష్ణుని కిష్టం నేనేనే , శ్రీకృష్ణసత్యను నే...నే...నే , భామనే...సత్యభామనే , భామనే...సత్యభామనే . ****** ఉషాకన్యగా పేరుగాంచిన వేదాంతం సత్యనారాయణ శర్మ 1934 సెప్టెంబరు 9న కూచిపూడిలో వేదాంతం వెంకటరత్నం, సుబ్బమ్మలకు మూడో సంతానంగా జన్మించారు. వేదాంతం ప్రహ్లాదశర్మ, వీరరాఘవయ్య ఈయన సోదరులు. సత్యనారాయణ శర్మకు 18వ ఏట 1952లో పసుమర్తి కొండలరాయుడు కనిష్ట పుత్రిక లక్ష్మీనరసమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సత్యనారాయణ శర్మ చిన్ననాటనే జావళీలు, రామదాసు, త్యాగరాజు కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థుల తరంగాలు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలను ఔపోసన పట్టారు. యక్షగానాల్లో చెలికత్తెగా అభినయించారు. వేదాంతం తన పెద్దన్న ప్రహ్లాదశర్మ, పినతండ్రి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్ర్తీ, భరత కళాప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందారు.  కూచిపూడి నాట్యాన్ని

గుప్పిట మూస్తేనే గుట్టు!! 🏵️🏵️🏵️🏵️🏵️🏵️

Image
గుప్పిట మూస్తేనే గుట్టు!! 🏵️🏵️🏵️🏵️🏵️🏵️ . గుప్పిట మూస్తేనే గుట్టు తెరిస్తే ఏమి ఉండదు. పమిట జారినట్లు చూపితే ఉన్న సెక్సప్పీల్ చీర విప్పితే ఉండదు. మధురవాణి పాత్రలో కళ్ళలో చిలిపితన్ంతో,మత్తు నవ్వుతో మరచిపోలేని మధురానుభూతిని సెక్సప్పీల్ ను సావిత్రి చూపించింది కన్యాశుల్కం సినిమా లో..... వీలైతే ఈ నాటి దర్శకులకు, నటీమణులకు ఒకసారి ఆసినిమాలో ఆ సన్నివేశాన్ని చూపించండి. సినిమా చూసేవాళ్లని యోగివేమనలను చేయవద్దు. 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

నాకు కొంత కాలం బతకాలని... (Sailaja గారి కవిత Nov .2012.)

Image
నాకు కొంత కాలం బతకాలని... (Sailaja గారి కవిత Nov .2012.) అక్కడ మబ్బులు భయ భయంగా నిలుచున్నాయి .. ఇక్కడ గాలులు దూర దూరంగా జరుగుతున్నాయి  రండి.. పక్షులూ... ఎగిరి వచ్చి ఇక్కడ దాక్కోండి . ఇప్పుడు నా గుండె, గుడిలో గూడులా మారింది.. అక్కడ విప్పారిన రెక్కలతో..నిటారైన శరీరాలతో  కాల ప్రపంచం నుండి మాటలు వినబడుతున్నాయి  ఇక్కడ తల్లి కొంగు చాటున దాగున్న పిల్లల్లా సంధ్యా కాంతులు నన్ను చూసి నవ్వుతున్నాయి.. రండి..వెలుగులూ..వచ్చి నా ఒడినిండా పరుచుకోండి ఇప్పుడు నా ఆనంద ప్రవాహాలకు తీరం కనబడుతోంది.. అక్కడ అందమయిన గులాబీలు  ముళ్ళను కాపాడుతున్నాయి..  ఇక్కడ పిడికిట్లో దాగున్న సంతోష వీచికలు  గంధం తెరల మధ్య దాగున్న విషాదాన్ని దాస్తున్నాయి  రండి క్రీనీడలూ.. వచ్చి నా వెనుకగా దాక్కోండి  ఇప్పుడు నా హృదయ ప్రయాణం దారి అర్థమవుతోంది... అక్కడ ఆశా పతాకాలు అరుణిమ దాల్చి  నాకేసి ఉరిమి చూస్తూ మంచు బిందువులు రాల్చుతున్నాయి.. ఇక్కడ దిక్కులు నాలుగు అయిష్టంగానే  మానవీయ సరస్సులో ఈత కొడుతున్నాయి  రండి..ప్రతీకలూ... వచ్చి నా ప్రతి పనిలోనూ ఉండిపొండి  ఇప్పుడు నా ఆత్మానుభుతుల్

వచ్చినవాడు ఫల్గునుడు"

Image
" వచ్చినవాడు ఫల్గునుడు" మనసుకు నచ్చిన మహాభారత పద్యం.! (తిక్కన్న గారి పద్యం.) . వచ్చినవాడు ఫల్గునుడు , అవశ్యము గెల్తుమనంగ రాదు , రా లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే ? హెచ్చేగుంగుందగున్ దొడరుతెల్ల విధంబుల కోర్చు టట్లుగా కిచ్చ దలంచి యొక్కమెయి నిత్తరి బొందగు చేతయున్ దగున్ . మహాభారత విరాట పర్వం లోనిదీ పద్యం .  ఉత్తర గోగ్రహణాన్ని నిలువరించడానికి గాండీవాన్ని పూరిస్తూ , అర్జునుడు ,  కౌరవ సేనకు అడ్డంపడ్డాడు .  . కురుపితామహుడైన భీష్ముడు ఆ సందర్భంలో దుర్యోధనునితో చెప్పిన పద్యమిది . . ” వచ్చిన వాడు అర్జునుడు . యుధ్ధంచేస్తే మనమే గెలుస్తామని వక్కాణించి చెప్పలేము . యుధ్ధంలో రెండుపక్షాలూ గెలవలేవు కదా . జయాపజయాలకు మనం సిధ్ధంగా ఉండాలి . దేనికైనా ఓర్చుకోవాలి . ఈ సమయంలో సంధి చేసుకోవడం కూడా సరియైనదే” . అనుభవంతో పండిపోయిన వారి ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి . అర్జునుడితో యుధ్ధం అంత సులభం కాదనే భావన వ్యక్తం చేసాడు . యుధ్ధంలో జయాపజయాలు దైవధీనాలని జ్ఞాపకం చేసాడు . ఒకవేళ ఓడిపోతే కలిగే అవమానం భరించరానిది కనుక సంధి చేసుకోవడంలో తప్పులేదని సూచించాడు . ఇంత యుక్తి

పద్మనాభం!! 😁😃😁

Image
పద్మనాభం!! 😁😃😁 హాస్యనటుడిగా ప్రసిద్ధిపొందిన బి.పద్మనాభం  ( ఆగస్టు 20, 1931 - ఫిబ్రవరి 20, 2010) (Padmanabham) ప్రముఖ తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. ఈయన తొలి తెలుగు సినిమా విడుదలైన సంవత్సరం 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా (ఇప్పటి వై యస్సార్ జిల్లా) పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు.ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో "ద్రౌపదీ వస్త్రాపహరణం", "వందేమాతరం", "సుమంగళి", శోభనావారి "భక్త ప్రహ్లాద" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు. రంగస్థలానుభవం: ఐదేళ్ళ వయసులో (1936లో) "చింతామణి" నాటకంలో కృష్ణుడివేషం వేసి వన్స్ మోరులతోబాటు ఒక వెండికప్పు బహుమతిగా పొం

నమ్మకమే భక్తికి మూలం

Image
నమ్మకమే భక్తికి మూలం (దేవరహస్యం) ఒకసారి నారద మహర్షి భూలోక సంచారం చేస్తుండగా ఇద్దరు మహా శివభక్తులను గమనించారు. అందులో ఒకరు పరమనిష్ఠాగరిష్ఠుడైన అర్చక స్వామి- నిత్యం శివపంచాక్షరి జపిస్తూ భక్తితత్వం ఉట్టిపడేలా వ్యవహరించే వాడు, మహా భక్తునిగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు గాంచినవాడు. మరొకరు అతి సామాన్య కుటుంబీకుడు. వృత్తిరీత్యా గానుగ ఆడించి నూనె అమ్ముకొనే వ్యాపారి. ఆయన కూడ సదా శివపంచాక్షరి జపిస్తూ, తన వృత్తి ధర్మాన్ని నిర్వహించుకునేవాడు. ఈ ఇద్దరిలో ఎవరు మంచి భక్తులనే అనుమానం నారద మహర్షికి కలిగింది. కైలాసం వెళ్లినప్పుడు పరమశివునితో ఈ విషయం ప్రస్తావించారు. ఆ ఇద్దరిలో ఎవరికి కైలాస ప్రవేశార్హత ఉందో, ఎవరు ముందుగా శివసాన్నిధ్యం పొందగలరో సెలవియ్యమన్నారు. పరమశివుడు చిరునవ్వుతో నారదుని చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. మహర్షి భూలోకం వెళ్లినప్పుడు ముందుగా అర్చక స్వామిని కలిశా రు. ‘ ఓ నమఃశ్శివాయ’ అంటూ మహర్షికి నమస్కరించి తగు విధంగా సపర్యలు గావించాడు. ‘‘ఏమిటి మహర్షి విశేషం? పరమేశ్వరుడు ఏమి చేస్తున్నాడు? తమరు ఇప్పుడు అక్కడ నుంచే వస్తున్నామని చెప్పారుగా!’’ అని అడిగాడు. అందుకు మహర్షి క్షణం ఆగి ‘‘నిజం

🙏పరమశివుని నివాసం వారణాసీ పురం 🙏

Image
🙏పరమశివుని నివాసం వారణాసీ పురం 🙏 👉నగరవాసం మీద తనకేమాత్రం మోజులేనప్పటికీ,  సుకుమారంగా పెరిగిన సతీదేవి తనతోపాటు కొండల్లో - కోనల్లోను, మేఘాల మీదను విహరింపవలసి రావడం పరమశివునికీ  బాధ కలిగించేదిగానే వుంది. . 👉నివాసానికి అనుకూలమైన ప్రదేశం కోసం లోకాలన్నీ పరికించి చూశాడు. భూలోకంలో గంగానది ఒడ్డున ఉన్న వారణాసీ పురాన్ని, తాను ఇంతకుముందే చూసివున్నాడు. బాగా యోచించి అదే తన నివాస స్థానంగా చేసుకోవాలని భావించాడు. 👉వెంటనే, అక్కడున్న నికుంభుడనే గణనాయకుని పిలిచి, వారణాసీ వాటికలో ఎలాంటి అకృత్యాలూ చేయకుండా, ఆ పురాన్ని ప్రజలచేత ఖాళీ చేయించమన్నాడు. 👉అప్పుడక్కడ దివోదాసుడనే ధర్మప్రభువు రాజ్యం చేస్తున్నందున శివుడలా ఆనతిచ్చి ఉన్నాడు. శివదీక్షాపరుడైన మంకణుని సాయం తీసుకుని నికుంభుడు నేర్పుగా ఖాళీ చేయించాడు ఆ పట్టణాన్ని. . 👉అలా ఖాళీ అయిన ఆ నగరాన్ని స్వర్గంతో తులతూగేలా - వాసయోగ్యంగా నిర్మించి ఇవ్వమని శంకరుడు పరమాత్ముని ధ్యానించాడు. 👉సంకల్పమాత్రాన అది అపురూప నగరిగా రూపాంతరం చెందింది. సతీ సమేతుడై శంకరుడానగరిలో చిరకాలం సుఖించాడు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌹శృంగార వైషథంలో విద్యుద్దీపాల సౌరులు 🌹

Image
🌹శృంగార వైషథంలో విద్యుద్దీపాల సౌరులు 🌹 (కీర్తి శేషులు శ్రీ వాకాటి పాండురంగారావు గారు నాకు చెప్పిన విశేషం. ) 🏵️ శ్రీనాధుని శృంగార వైషథంలో అలాంటి దొకవిషయం ఉంది.  మనం యిప్పుడు విద్యుత్ శక్తి ని వాడుకుంటున్నాం.  దీవిని భారతీయులు18 శతాబ్దం వరకు యెరుగరు. కానీ, శ్రీనాధకవి తనశృంగార నైషధంలో 7 వ ఆశ్వాసంలో,  నలదమయంతుల రహఃకేళీ సమయంలో వర్ణించిన వర్ణనలు, విద్యుద్దీపాల సౌరులను వెలయించాయి. వినండి ఆపద్యం! 👉 . సీ: ఒక దీప మార్పిన నున్నదీపంబులు నప్పుడ తమకు దామారుటయును; తాల వృంతా నిల చేలాంచెలాదిక వ్యాపారముల దీప మారుటయును; నాఱిన దీపంబు లప్రయత్నంబున మఱిఁజూడ జూడంగ మండుటయును; మండి యాఱియు నాఱి మండిన దీపంబు వెలుగుఁ జీకటియు గావించుటయును; . తే: కలుగు నట్లుగ పరశక్తి కలన రాజు /  శిల్పముల నవ్వుటాలకుఁజేయు చుండ  తరుణి కుతుక త్రపాద్భుతాతంకభార,/  సంకట స్థాయియై హరిణాంకయయ్యె . అది నలదమయంతులకు ప్రథమ సమాగమసమయం. అంతవరకూలేని సిగ్గు ఆమెకు ముంచుకొని వచ్చింది నలుడుచుంబనమాసించి ముందుకేగ నామె చేతులతో నడ్డుచున్నది. రేయంతయు నట్లే నడచు నట్లు దోచినది.  నలుడింక నామెను తనవ

ఎస్ .వరలక్ష్మిమన స్వర లక్ష్మి !!

Image
ఎస్ .వరలక్ష్మిమన స్వర లక్ష్మి !! . ఎం.ఎస్ .సుబ్బలక్ష్మి సరి తూగే గాయని  జమున మించిన సత్య భామ ... ఈమె సినిమాలలో నోరు కొద్దీ మాట్లాడే దురహంకారి:. నక్కజిత్తుల మాయలమారి , ఈమె అంటే కోడళ్ళకు హడల్ ..అల్లులకు సవాల్  - మా చిన్నప్పటి మంచి హీరోయిన్  మంచి నటి , గాయకురాలు.బాలరాజు లో ఈమె పాడిన రాగమాలిక  "రూపం నీ య్యారయ్యా....పతి రూపం నీ య్యారయ్యా"శాస్త్రీయ సంగీతంలో ఒక తలమానిక.  ఈమె సతి సావిత్రి ,సతి సక్కుబాయి సినిమాలు తీసి మునిగెరు.  ఆమె తమిళ్ సిన్మాలు లో కూడా చాల ప్రముఖ నటి. ఆమె సినిమాకు ఆరోజులలో రేండు లక్షలు ఇచ్చేవారు. ఆరోజులలో ఎం.ఎస్ .సుబ్బలక్ష్మి కి ఈమె పెద్ద పోటీ ఈమె ,ఈమె దురదృష్టం తెలుగు పుట్టుక పుట్టడం . సహజ గాయని ఎస్. వరలక్ష్మి! . నా అభిమాన గాయని s.వరలక్ష్మి గారు. చాలా ప్రత్యేకమైన కంఠం ఆమెది . “లీలా కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా!!” నేను తరుచూ hum చేసుకునే పాటల్లో ముఖ్యమైనది. ఆవిడ పాటలే కాదు తన ధాటీ ఐన కంఠం తో పద్యాల్ని కూడా ఎంతో బాగా చదివేది. పద్య పఠనంలో పి.లీల గారిదీ , యస్ . వరలక్ష్మి గారిదీ ప్రత్యేకమైన బాణీ!! శాస్త్రీయ సంగీత

అర్ధ రాత్రి వరకూ అరవ చాకిరీ ...

Image
అర్ధ రాత్రి వరకూ అరవ చాకిరీ ... రవం అంటే శబ్దం ,చప్పుడు  అరవం అంటే నిశ్శబ్దం, చప్పుడు లేకుండా  ఆరవ చాకిరీ అంటే నసుగుడు విసుగు లేకుండా పని చెయ్యడం . వారు అరవ చాకిరి చేస్తున్నారు: అనగా చాల కష్ట పడుతున్నారు: = ఒక జాతీయము.

కంచికి పోతావా కృష్ణమ్మా” – పల్లవికి అర్థం ఏంటమ్మా? 🌹🌹

Image
కంచికి పోతావా కృష్ణమ్మా” – పల్లవికి అర్థం ఏంటమ్మా? 🌹🌹 “శుభోదయం” చిత్రంలోని మధుర గీతం “కంచికి పోతావా కృష్ణమ్మా” ఎంత బావుంటుందో! వేటూరి ముద్దుగా రాసిన సాహిత్యానికి మామ మహదేవన్ ఎంతో సొగసుగా బాణీ కట్టారు. అయితే ఆ పాట పల్లవిలో “కంచి”, “కృష్ణమ్మా” ఎందుకొచ్చాయో ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ మధ్య వేటూరి తనయులు శ్రీ రవి ప్రకాశ్ గారిని అడిగితే – “వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పిల్లల పాట ఒకటి ఉంది. ఆ పాట ప్రేరణతో వేటూరి గారు ఈ పల్లవి రాశారు!” అన్నార బాలభాష 🌹 శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కంచికామాక్షమ్మ కంచికామాక్షమ్మ కంచికి పోతావా కృష్ణమ్మా! ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా? కంచిలో ఉన్నది అవ్వ; ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ. బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా? కోమటి యింటిది అప్పు; ఆ - అప్పు నాకు పెట్టు పప్పు. పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా? దొడ్లోను ఉన్నది బీర; ఆ - బీర నాకు పెట్టు కూర. కూర ఉన్నదిగాని కృష్ణమ్మా; నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా? కోమటి అక్కెమ్మ చెయ్యి; ఆ - చెయ్యి నాకుపోయు నెయ్య

భర్తృహరి సుభాషిత రత్నావళి (త్రిశతి) 🙏

Image
భర్తృహరి సుభాషిత రత్నావళి (త్రిశతి) 🙏           (నీతి,  శృంగార, వైరాగ్యముల బోధింౘునది)                      ( ఏనుగు లక్ష్మణకవి ప్రణీతము)                                    నీతి శతకము                                  మానశౌర్య పద్ధతి _3                                      శ్లోకము ( 23 ) అవతారిక: నీౘులయొక్కయూ నుత్తములయొక్కయూ నడవడిలోని తారతమ్యమును సూచింౘుౘున్నాడు. శ్లోకము :             లాంఙ్ఞిల చాలనమధశ్చరణావఘాతం             భూమౌ నపత్య వదనోదర దర్శనంచ,             శ్వా పిణ్డదశ్య కురుతే గజ పుఙ్గవస్తు             ధీరం విలోకయతి చాటు శతైశ్చ భుఙ్క్తే !! టీక : శ్వా = కుక్క, పిండదశ్యం =  కూటిముద్ద వేయువాని ఎదుట,  లాంగూల చాలనం = తోఁ కనాడింౘుటను, అధః = క్రింద , చరణ అవఘాతం =  కాళ్ళతో కొట్టుటను,  భూమౌ = నేలయందు, నిపత్య = వెల్లకిల పడి, వదన ఉదర దర్శనంచ = నోటిని కడుపునూ ౘూపుటను,  కురుతే = చేయును,  గజ పుంఙ్గవ తు = మంచి ఏనుఁ గు అన్ననో, పిండదుని = ముద్ద పెట్టువానిని ధీరం = బెట్టుగా , విలోకయతి = ౘూౘును, చాటు శతైః = వంద మంచి మాటల  చే

వాళ్ళే వ్రాసుకుంటారు-మనం నిమిత్తమాత్రులం ! 😁

Image
సినిమా వాళ్ళు ,మన డైలాగులు మనల్ని వ్రాయనివ్వరు! వాళ్ళే వ్రాసుకుంటారు-మనం నిమిత్తమాత్రులం ! 😁 👉కొన్నేళ్ళక్రితం రాచకొండ విశ్వనాధ శాస్త్రిగారు ఒక సిన్మాకి మాటలు రాసే నిమిత్తం మద్రాసు వెళ్ళారు. కొన్నాళ్ళుండి తిరిగి విశాఖ వెళ్తున్న శాస్త్రి గారిని ఓ శిష్యుడు “గురువు గారూ ఎలా వుంది సిన్మా ప్రపంచం?” అని అడిగాడు. అందుకు శాస్త్రి గారు చిదానందంగా నవ్వి ఇలా అన్నారట. “ఏముంది? బానే వుంది! సిన్మా వాళ్ళతో చాలా సుఖం, మన గదికి మన్ని అద్దె చెల్లించనివ్వరు! వాళ్ళే చెల్లిస్తారు. మన సిగరెట్లు మనం కొనే పని లేదు- వాళ్ళే కొనిస్తారు, మన మందు మనం కొనక్కర్లేదు, మన తిండి మనల్ని తిననివ్వరు! వాళ్ళే ఏర్పాటు చేస్తారు. మన డైలాగులు మనల్ని వ్రాయనివ్వరు! వాళ్ళే వ్రాసుకుంటారు 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁 .

వ్యవహారం కోర్టు కెక్కింది.

Image
!!ఎప్పుడో వంద సంవత్సరాలు పైగా కిందటి విషయం.!! (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి స్వీయచరిత్ర నుండి కొన్ని భాగాలు) ...........................వ్యవహారం కోర్టు కెక్కింది. విచారణా జరిగింది విశాఖపట్నం జిల్లా కోర్టులో. ............................. ఇంతలో జడ్జీ వచ్చాడు. జడ్జి యూరోపియన్. వారందరూ లేచినుంచున్నారు. జడ్జీ గద్దెయెక్కాడు. బిలబిల్లాడుతూ వారూ కూర్చున్నారు. కూచున్నారు; గాని మళ్ళీ లేచినుంచున్నారు వెంటనే. పిడపర్తి పెద్ద దక్షిణామూర్తి శాస్త్రిగారు హాల్లో ప్రవేశించారు, మరి. చూడగా, బ్రహ్మవర్చస్సు మూర్తీభవించిన ట్టున్నారు వారు. అది చూసి చకితుడైనాడు; కాని '' యేం లేచారూ?" అనడిగాడు వకీళ్ళను జడ్జి. ''అరుగో, వారు దయచేశారు. దైవజ్ఙులు వారు. దైవం తరువాత మాకంతటివారున్నూ. అలాంటివారికి ప్రత్యుత్థానం చెయ్యడం అనివార్యం మాకు'' అని బదులుచెప్పారు వకీళ్ళు, తమ నాయకుని పరంగా.''అలాగా?" అన్నాడు జడ్జి, జిజ్ఙాసతో. యూరోపియను అతడు. తా నిది అర్థంచేసుకోలేడు; గాని మనస్సు గుబగుబలాడిపోయింది, తానూ లేచేశా డనుకోకుండా.. ''వారి విశిష్టత యేమిట