Posts

Showing posts from February, 2018

విష్ణు సహస్రనామ స్తోత్రము ! (ఫలశ్రుతి-ఉపదేశాలు.)

Image
విష్ణు సహస్రనామ స్తోత్రము ! (ఫలశ్రుతి-ఉపదేశాలు.) విశ్వం అనే నామంతో మొదలైన సహస్ర నామ జపం  సర్వ ప్రహరణాయుధ అనే వెయ్యవ నామంతో ముగుస్తుంది. ఈ ప్రధాన స్తోత్ర భాగంలో 108 శ్లోకాలలో వేయి నామములు పొందుపరచబడి ఉన్నాయి. పరమాత్ముని వివిధ లక్షణ గుణ స్వభావ రూపములు వివిధనామములలో కీర్తించబడ్డాయి.  అనంత గుణ సంపన్నుడైన భగవానుని వేయి ముఖ్యగుణములను కీర్తించే పుణ్యశబ్దాలుగా ఈ వేయి నామాలను సాంప్రదాయికులు విశ్వసిస్తారు. విష్ణు సహస్రనామాల గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు రచించిన భాష్యము వీటిలో ప్రథమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించింది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు. వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప

ఏంటి ఈ లోకం!

Image
ఏంటి ఈ లోకం! -- "ఏది సత్యం, ఏదసత్యం,  ఏది పుణ్యం, ఏది పాపం, ఏది చీకటి ఏది వెలుగు ఏది జీవితమేది మృత్యువు ఏది పుణ్యం ఏది పాపం ఏది నరకం ఏది స్వర్గం ఏది సత్యం ఏదసత్యం ఏదనిత్యం ఏది నిత్యం ఏది ఏకం ఏదనేకం ఏది కారణమేది కార్యం ఏది తెలుపు ఏది నలుపు ఏది గానం ఏది మౌనం ఏది నాది ఏది నీది ఏది నీతి ఏది నేతి నిన్న స్వప్నం నేటి సత్యం నేటి ఖేదం రేపు రాగం ఒకే కాంతి ఒకే శాంతి

విష్ణు సహస్రనామ స్తోత్రము-

Image
విష్ణు సహస్రనామ స్తోత్రము- ===వేయి నామములు===vishnu sahasram ప్రధాన వ్యాసము: విష్ణువు వేయి నామములు- 1-1000 1) విశ్వం - మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు. 2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు. 3) వషట్కార: - వేద స్వరూపుడు. 4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు. 5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు. 6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు. 7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు. 8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు. 9) భూత భావన: - జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు. 10) పూతాత్మా - పవిత్రాత్ముడు. 11) పరమాత్మ - నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు. 12) ముక్తానాం పరమాగతి: - ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు. 13) అవ్యయ: - వినాశము కానివాడు. వినాశము లేని వాడు. 14) పురుష: - నవద్వారములు కలిగిన పురములో ఉండువాడు. 15) సాక్షీ - చక్కగా సమస్తమును దర్శించువాడు. 16) క్షేత్రజ్ఞ: - శరీరములో జరుగు క్రియలన్నింటిని గ్ర

కీచక వధ- మూడవ వ భాగం -

Image
కీచక వధ- మూడవ వ భాగం - ద్రౌపది సుధేష్ణ వద్ద విలపించుట! - ద్రౌపది తనను ఒక దూర్తుని ఇంటికి మదిరకు పంపిన సుధేష్ణకు తన బాధ చెప్పుకోటానికి ఆమె మందిరానికి వెళ్ళింది. సుధేష్ణ ద్రౌపదిని చూసి కంగారు నటిస్తూ " మాలినీ ! ఏందుకు ఇలా ఉన్నావు. నిన్ను ఎవరేమి అన్నారు. ఏమి జరిగిందో చెప్పు వారి అంతు చూస్తాను " అన్నది. ద్రౌపది నిర్వేదంగా నవ్వి " అమ్మా ! అన్నియు తెలిసి కూడా ఇలా అడిగితే ఏమి చెప్ప గలను. నీవు కీచకుని ఇంటికి మధిర కోసం నన్ను పంపావు. అతను నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. నేను పరుగెత్తాను. అతడు నన్ను వెంబడించి నా జుట్టు పట్టుకుని కొట్టాడు. ఇంతకంటే ఏమి చెప్పేది " అన్నది. సుధేష్ణ ద్రౌపదితో " ద్రౌపదీ! విచారించకు నేను ఆ కీచకుని దండిస్తాను " అని అనునయంగా అన్నది. ద్రౌపది సుధేష్ణతో " అమ్మా! తమరు అంతగా చింతించ పనిలేదు. నా భర్తలైన అయిదుగురు గంధర్వులు కీచకునిపై పగతీర్చుకుంటారు " అని పలికింది. ఆ మాటలు విన్న సుధేష్ణ భయభ్రాంతురాలయ్యింది. ద్రౌపదిని ఎన్ని విధాలుగానో ఓదార్చింది. ద్రౌపది కోపం తగ్గలేదు. అన్న పానీయాలు విసర్జించి తన నివాసమునకు పోయి రోది

విష్ణు సహస్రనామ స్తోత్రము! (మొదటి భాగం. )

Image
విష్ణు సహస్రనామ స్తోత్రము! (మొదటి భాగం. ) VINJAMURI VENKATA APPARAO·SUNDAY, 25 FEBRUARY 2018 విష్ణు సహస్రనామ స్తోత్రము! - శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన vedic ప్రార్థనలలో ఒకటి. పేరును బట్టి ఇది శ్రీమహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు. విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడింది. - ప్రార్థన శ్లోకములు, స్తోత్రము ఆవిర్భవించిన సందర్భ వివరణ ఈ పూర్వపీఠికలో ఉన్నాయి. ముందుగా వినాయకు నకు, విష్వక్సేను నకు, వ్యాసు నకు, ఆపై విష్ణువుకు ప్రణామములతో స్తోత్రము ఆరంభమౌతుంది. స్తోత్ర కథ అనేక