Posts

Showing posts from April, 2018

మను చరిత్రము 🌷

Image
మను చరిత్రము 🌷 🌷అరుణాస్పదపుర వర్ణనము! 👉మ. వరణాద్వీపవతీ తటాంచలమున\న్‌ వప్రస్థలీ చుంబితాం బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబున\న్‌ బుర మొప్ప\న్‌, మహికంఠహార తరళస్ఫూర్తి\న్‌ విడంబింపుచు\న్‌. 🌷ప్రవరుని సౌశీల్యాది ప్రశంస! 👉ఉ. ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై. 👉సీ. తీర్థసంవాసు లేతెంచినారని విన్న, నెదురుగా నేఁగు దవ్వెంతయైన, నేఁగి తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చుఁ, దెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు, నిచ్చి యిష్టాన్న సంతృప్తులఁగాఁ జేయు, జేసి గూర్చున్నచోఁ జేరవచ్చు, వచ్చి యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి, త్తీర్థమాహాత్మ్యముల్‌ దెలియ నడుగు, తే. నడిగి యోజన పరిమాణ మరయు నరసి పోవలయుఁ జూడ ననుచు నూర్పులు నిగుడ్చు ననుదినము తీర్థసందర్శనాభిలాష మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి. 👉ప్రవరుని స్వగ్రామం అరుణాస్పద పురము. అరుణాస్పద పురము వరణ నది ప్రక్కన గలదు. 🌷🌷

👉కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన!

Image
👉కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన! 🤲కారులో షికారు కెళ్ళే పాట తోడికోడళ్ళు (1957) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన సందేశాత్మక లలితగీతం. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు. (కొందరు అనుకునట్లు ఈ పాట శ్రీ శ్రీ రాసింది కాదు.) 👉వివరణ! 🌷ఈ పాటలో సోషలిజం లోని కొన్ని అంశాల్ని ఒక అందమైన ధనవంతురాలైన అమ్మాయికి అర్ధమయ్యేటట్లుగా పాట రూపంలో చెప్పడం ఇక్కడ విశేషం. మనం జీవితంలో అనుభవిస్తున్న ఎన్నో సుఖాలకు వెనుక ఎంతో మంది కష్టజీవుల శ్రమ దాగి వుంటుందనే జీవితసత్యాన్ని తెలియజేస్తుంది 🌷ఈ పాట. వానికి గృహ నిర్మాణ రంగంలోని మేస్త్రీలను, దుస్తుల్ని తయారుచేసే నేతగాళ్ళను రెండు ఉదాహరణలుగా చెబుతాడు. చివరికి "చాకిరొకడిది సౌఖ్యమొకడిది" తెలుగుకోమని అంటాడు. 👉కోసమెరుపు .. 🌷ఈ పాట సినిమా కోసం వ్రాసింది కాదు.ఆత్రేయ గారు నెల్లూరు కస్తూరిదేవివిద్యాలయంలొ నటకలురీహార్సల్స చేయిస్తుండగా ఆ విద్యాలయానికి పట్టుపావడలు,పరికిణీలతొ నాజూకుగా రోజు జట్కాలలొ వస్తున్న అమ్మాయిల దుస్తులనుచ

చిన్నజాలి - ప్రేమ కధ!

Image
చిన్నజాలి - ప్రేమ కధ! 🌷🌷🌷🌷 ఒక అమ్మాయికి ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం ( ప్రేమ ). ఎప్పుడూ అతనుండే ప్రదేశాలకు వెళ్తూ అతన్నే చూస్తుండేది... అతనికీ ఆమె అంటే ఇష్టమే.. ఒకరోజు ఆ అమ్మాయి అతనికి ఐలవ్ ‍యూ అని చెప్పి.. తన లవ్ ని ప్రపోస్ చేసింది.. అందుకు అతను నన్ను చూడకుండా, తలచుకోకుండా ఒక్కరోజు అంతా ఉండగలవా ? అప్పుడు నీ ప్రేమను అంగీకరిస్తాను అని చెప్పాడు. 🌷🌷🌷 కట్ చేస్తే ... ఆమె సరేనని ఒకరోజంతా అతని గురించి అలోచించకుండా భారంగా గడిపేసింది... మరుసటి రోజు ఉదయాన్నే ఆమె అతని ఇంటి దగ్గరికి వెళ్ళగానే అక్కడ అంతా ఏడుపులు, జనాలు.. లోపలికి వెళ్ళి చూస్తే జీవం లేకుండా ఉన్న అతని శరీరం కనపడింది.. అతనికి తెలుసు తన జీవితం ఇక మిగిలింది ఆ ఒక్కరోజే అని అందుకనే అలా చెప్పాడు.... చివరగా ఆమెకు ఒక ఉత్తరం కూడా రాసాడు..అందులో ఏం రాసుంది అంటే.... 💔💔💔💔💔💔💔💔 . " ప్రియ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం.. కానీ నా జీవితం ఇక ఎంతో కాలం లేదు అని నాకు తెలుసు అందుకనే అలా చెప్పాను... నన్ను చూడకుండా,తలచుకోకుండా ఒక రోజంతా ఉండగలిగావు కదా..

👉నలుపులోని అందం తెలుపు లో ఎక్కడిది .

Image
శుభోదయం! .  👉నలుపులోని అందం తెలుపు లో ఎక్కడిది . మన సంస్కృత కావ్యాల లో అందం అంటే శ్యామ వర్ణం . గీతగోవిందం లో రాధ రంగు నీల మేఘం . ఆమె నల్లని గోపాలుడికి తగియా జోడి గా వర్ణించబడింది . ఇక కాళిదాసుని దాదాపు అన్ని కావ్యాలలో స్త్రీలు నల్లని వారే . ద్రౌపతి తెలుపు కానేకాదు . భవభూతి ఉత్తర రామ చరిత లో సీతని పాల మీగడ రంగాని వర్ణించలేదు . కంబ రామాయణం లో కూడా సీత ని ఎర్రని బుగ్గల యువతి గా వర్ణించలేదు . వాత్స్యయనుడి కామసూత్ర లోని వేశ్యలు కూడా నల్లని వారే . ఈ పుస్తకం లో ఒక అంకం అంతా నలుపు అందం గురించే కేటాయించడం జరిగింది . అందం నల్లని రంగు లో ఆకృతి లో ఉందని వ్రాసారు . (శ్యామ వర్ణం సౌన్దర్య భూతం ప్రతిమనహ్ అస్తి ) 😀😀😀😀😀😀😀

మనసుకు హత్తుకున్న విషయం !

Image
🙏🙏🙏💐💐🙏🙏🙏 మనసుకు హత్తుకున్న విషయం ! 🙏🙏🙏💐💐🙏🙏🙏 ఆ దంపతులిద్దరినీ చూసి, పీఏ ముఖం చిట్లించుకుంది. ముతక వస్త్రధారణలో ఉన్న ఆ ఇద్దరు వృద్ధులను, ప్రెసిడెంట్ దగ్గరికి పంపడానికి ఆమె అంగీకరించలేదు. లేకపోతే, ఈ ముసలివాళ్ళకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ తో పనేమిటి ? ఇంతలో ఆ అధ్యక్షుడే గదిలోంచి బయటకు వచ్చాడు...... "చెప్పండి ,ఏం కావాలి? "అడిగాడు ప్రెసిడెంట్.  "మేము విరాళం ఇద్దామనుకుంటున్నాము" చెప్పాడు ముసలాయన....... ఆయనకు నమ్మకం కలగలేదు. అయినా బయటపడకుండా "ఎంత ఇవ్వాలను కుంటున్నారు?" అన్నాడు...... "మా పదహారేళ్ళ కొడుకు టైఫాయిడ్ తో చనిపోయాడు. వాడి ఙ్ఞాపకార్ధం ఈ యునివర్సిటీ క్యాంపస్ లో ఒక భవనం నిర్మించాలని మా ఆశ " చెప్పంది వృద్ధురాలు...... "బిల్డింగ్ కు ఎంతవుతుందో తెలుసా?" ప్రశ్నించాడు ప్రెసిడెంట్...... "ఎంత ?" చాలా మామూలు గా అడిగాడు ముసలాయన...... చెప్పాడు ప్రెసిడెంట్.... ముసలాయన ఆశ్చర్యపోయాడు..... ముసలావిడ కూడా ఆశ్చర్యపోయింది. "అంటే ఈ లెక్కన ఓ యూనివర్సిటీ స్థాపించాలంట

🌷🌷🌷🌷🌷🌷 మాటాలెంట్ ని గుర్తించండి 🌷🌷🌷🌷🌷

Image
🌷🌷🌷🌷🌷🌷 మాటాలెంట్ ని గుర్తించండి 🌷🌷🌷🌷🌷 👉ఒకసారి తిరుపతి వేంకటకవులైన .. దివాకర్ల తిరుపతి శాస్త్రిగారిని, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారిని చూసి .. పద్యాలు రాసుకునే మీకు మీసాలెందుకయ్యా అని అంటే..వాళ్ళిద్దరూ కలిపి అప్పటికప్పుడు ఇలా పద్యం చెప్పారు .. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 "దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ, మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే" 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 అంటే తెలుగులోనూ,సంస్కృతం లోనూ మాలా పద్యాలు రాసి చెప్పగలిగేవారిని చూపించండీ మా మీసాలు తీసి మీకాళ్ళకు మొక్కుతాం అని. ఒక పామరుడు కూడా పద్యం పాడగలిగే స్థాయికి వాళ్ళు పద్యాలకి ప్రచారం కల్పించారు🙏🙏 అంతేకానీ మా కులాన్నిమీరు గుర్తించండి అనలా.... మాటాలెంట్ ని గుర్తించండి అన్నారు.. అది తేడా..😊

👉సత్యహరిశ్చంద్రీయము : కాశీపుర స్మశాన పరిసరారణ్యము. 👈 (బలజేపల్లి లక్ష్మి కాంత కవి .)

Image
👉సత్యహరిశ్చంద్రీయము : కాశీపుర స్మశాన పరిసరారణ్యము. 👈 (బలజేపల్లి లక్ష్మి కాంత కవి .) సీ. కాఁబోలు బ్రహ్మరక్షస్సమూహం బిది- ఘోషించుచుండె ఋక్కుల క్రమంబు కాఁబోలు వీరు విగత జీవబాంధవు- లడలుచుండిరి మహార్తారవములఁ గాఁబోలు వీరు టక్కరి భూతమాంత్రికుల్‌- నెమకుచుండిరి కపాలముల కొఱకు గాఁబోలు నిది పిశాచీబాంధవ శ్రేణి- పలలంపు బువ్వంపు బంతి సాగెఁ జిట్లుచున్నవి కాఁబోలు చితులలోనఁ- గాల్పఁబడెడు శవాల కంకాళ సమితి నెటఁబెడీలను రవములే యొసఁగుచుండు- దిక్కులన్నిండ మార్మోగింత పిక్కటిల్ల. . గీ. కాటిసుంకంబు చెల్లింపకయె శవాల మసనమునఁ గాల్పరే కద మనుజులార? కాఁపు లేదనుకొంటిరేమో పదండు దళిత ఘోరారి యీ వీరదాసు గలఁడు. 🤲 శా. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌ నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్‌. 🤲 ఓహో! ఎవ్వతె వీవు? స్రగ్ధర: పడతీఁ యేకాకివై నిర్భయమున నిటకున్‌ వచ్చి నా యాజ్ఞ లేకీ నడిరేయిన్‌ వల్లకాట న్శవ దహన విధి న్సల్పుచ

👉చందమామ కధ.!

Image
👉చందమామ కధ.! పూర్వం విష్ణు శర్మ అనే ఒక రాజుండే వాడు. అతడికి విపరీత మయిన కథల పిచ్చి.తన ఆస్థానం లో వున్న వారి నందరినీ కథలు చెప్పమని సతాయించేవాడు. అందరికీ విసుగై పోయింది. మంత్రి రాజుతో సంప్రదించి రాజుకు కథలు చెప్పడానికి ఎవరైనా రావచ్చుననీ తగిన బహుమానం యివ్వ బడుతుందనీ టముకు వేయించాడు. ఎంతమందో వచ్చి ఆయనకు ఎన్నో కథలు వినిపించేవారు. ఎన్ని చెప్పినా ఆయన యింకా చెప్పమని అడిగే వాడు. అతనికి విసుగే వుండేది కాదు.ఎంత మంది వచ్చినా రాజును తృప్తి పరచ లేక పోయారు.నాకు కథలు చెప్పి తృప్తి పరిస్తే సగం రాజ్యమిస్తాను లేకుంటే మరణ శిక్ష అని ప్రకటించాడు. కొంత మంది యువకులుసగం రాజ్యం ఆశతోవచ్చారు ఆ యనను సంతృప్తి పరచలేక మరణించారు. ఆఖరుకు మరణ భయం తో ఎవరూ రావడం లేదు.రాజు మంత్రిని పదే పదే ఈ విషయం గురించి సతాయించే వాడు. ఒకనాడు ఒక బీద బ్రాహ్మణుడు నేను మీకు కథ చెప్తానని వచ్చాడు.సరే నని రాజు కూర్చున్నాడు. ఆ బ్రాహ్మణుడు కథ చెప్పడం మొదులు పెట్టాడు. ఒక వూరిలో ఒక రైతు ఉండేవాడు అతను తనపొలం లో జొన్నలు పండించాడు.ఆ సారి వర్షాలు బాగా పడి విపరీత మైన పం

👉చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం 👈 (శంకరాభరణం....నేపధ్య సంగీతం)

Image
👉చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం 👈 🤲🤲🤲🤲“శంకరాభరణం....నేపధ్య సంగీతం 🤲🤲🤲 శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం. నది తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి తులసీరాం హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది. బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు . ఇదంతా వాచ్యం కానీ నేత్రానంద రసస్ఫోరక కలభిజ్నత . 🌷🌷ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం .🌷🌷🌷 శంకర శాస్త్రి ని పరిచయం చేస్తూ ఆయన పద సవ్వడిలో మంద్రగానం ధ్వనిమ్పజేయటం అతని లోని కలాభి లజ్ఞాతకు నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది 👉తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు ”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం 👉అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే అన్న నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట. 👉రేప్ సీన్ లో శంకరాభరణ రాగాన్ని,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం

ఒక కుమారి జాలి కధ !

Image
ఒక  కుమారి జాలి కధ ! 🌷🌷🌷🌷🌷🌷🌷🌷 పదారేళ్ల వయసులో జయలలిత ఇలానే కల కంది.  ఓ మామూలు ఆడపిల్లలా కలల రాకుమారుడు వస్తాడని,  పెళ్లి చేసుకుంటాడని, ఓ మంచి గృహిణిగా బతకాలనీ కోరుకుంది...! ‘ఆజా సనమ్‌.. మధుర చాందినీ మె హమ్‌.. తుమ్‌ మిలే తో విరానే మే భీ ఆ జాయేగీ బహార్‌.. జూమే లగేగా ఆసమాన్‌..’ అంటూ ఇష్టంగా, తన్మయత్వంతో పాడేది. ఆ క్షణంలో... ఆ కళ్లల్లో గతం తాలూకు కలల మెరుపులు. బహుశా ఈ కల నిజమై, ఆమె కోరుకున్న మనిషితో పెళ్లి జరిగి, ఓ మంచి గృహిణిగా స్థిరపడి ఉంటే... భారత చరిత్రలో నిలిచిపోయే నాయకురాలు పుట్టేది కాదేమో! ‘ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి?’ అని అడిగితే ‘అన్‌కండిషనల్‌ లవ్‌ అనేదే నిజమైన ప్రేమ, ఎలాంటి షరతులు లేని ప్రేమ, అలాంటి ప్రేమ ఉందంటే నేను నమ్మను’ అని అంటారామె. ఎలాంటి నిజాన్నయినా చెప్పగలిగే ధైర్యం ఆమె సొంతం. ‘నారీ కాంట్రాక్టర్‌ అంటే నాకు ఇష్టం, అతన్ని చూడ్డం కోసమే మ్యాచ్‌లకి వెళ్లేదాన్ని. తర్వాత షమ్మీ కపూర్‌ మీద ఓ బలమైన ఆకర్షణ. జంగ్లీ సినిమాను ఎన్నిసార్లు చూశానో.. అన్ని పాటలు నోటికి వచ్చేవి అప్పట్లో’ అని జయలలిత చెప్పేవారు. ‘అమ్మ నన్ను వదిలి వెళ్లిపోతుందేమో అని,

అందెలు గజ్జెలు !

Image
అందెలు గజ్జెలు ! 🤲🤲🤲🤲 - అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా...!! 👉తాత్పర్యం : ఓ శ్రీకృష్ణా....!! పసితనంలో నీ కాళ్ళకు అలంకరించిన అందెలు, గజ్జెలు చప్పుడయ్యేటట్లు గంతులు వేస్తూ వేడుకగా నందుని భార్య అయిన యశోద ముందర ముద్దులొలికేటట్లు నీవు ఆడుచుంటివి కదా...!! అని ఈ పద్యం యొక్క భావం.- 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 పద్యం: అందెలు పాదములందున సుందరముగ నుంచినావు సొంపలరంగా మందరధర ముని సన్నుత నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా! 👉తాత్పర్యం: పాదములందు ముద్దులొలుకునట్లుగా అందమైన అందెలను ధరించి ఉన్నావు.మంధర పర్వతమును కూర్మావతారములో మోసినట్టి కృష్ణా మునులచేత నుతులను గైకొనువాడా! నందుని ప్రియపుత్రుడా!నిన్నే నమ్మితిని.నీవే నాకు దిక్కు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

సౌందర్యాన్ని ఆరాధించడం వేరు ఆకాంక్షించడం వేరు.

Image
శుభరాత్రి! - సౌందర్యాన్ని ఆరాధించడం వేరు ఆకాంక్షించడం వేరు. సౌందర్యాన్ని గుర్తించి, దానికి శిరసువంచి నమస్కరించి, ఆనందించగల సంస్కారం అలవరచుకుంటే తప్ప వచ్చేది కాదు. అదే రసికత. రసికత అంటే Sensual Pleasure కాదు. దురదృష్టవశాత్తూ దానికి ఆ అర్థం రూఢి అయిపోయింది . సౌందర్యం మనలో ప్రేమ కలిగించడమేమిటి? అని అనుకోవచ్చు. సౌందర్యం అన్నివేళలా మదనవికారాన్నే కలిగించనక్కరలేదు. ఒక ఆశ్చర్యం, ఒక విభ్రమం, ఒక ప్రశాంతత, ఒక అనిర్వచనీయమైన వాక్యసముదాయం ఏదైనా కలిగించవచ్చు. కేవలం ఊహే అయినప్పటికీ, బహుశా అటువంటి స్థితికి లోనయ్యేడేమో కాళిదాసు (సినిమాలో చూపించినట్టు) “మాణిక్య వీణాం…” అన్న శ్లోకం చదివే సందర్భంలో .  . మాణిక్య వీణా ముఫలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే! జగదేకమాతః జగదేకమాతః ...ఆ... మాతా...! మరకతశ్యామా! మాతంగీ మధుశాలినీ! కుర్యాత్కటాక్షం కల్యాణీ! కదంబ వనవాసినీ...! జ

👉ప్రపంచం ..తెలివి ..నీతి.!

Image
👉ప్రపంచం ..తెలివి ..నీతి.! 👉“ఈ ప్రపంచంలో తెలివైనవాడు నీతిని వదిలేస్తే కాపిటలిస్టు అవుతాడు .వదిలెయ్యకపోతే మేధావో, టీచరూ అవుతాడు. 👉బలమైనవాడు నీతిని వదిలేస్తే రాజకీయ నాయకుడు అవుతాడు. వదిలెయ్యకపోతే శ్రామికుడు అవుతాడు.” 👉మనుష్యులు రెండు రకాలు. తెలివైన వాళ్ళు.  తెలివితక్కువ వాళ్ళు. 👉మనుష్యులు రెండు రకాలు. బలమున్న వాళ్ళు.  బలంలేని వాళ్ళు. 👉తెలివిగానీ, బలముగానీ లేనివాళ్ళు  సామాన్యులవుతారు. 👉బలం వున్నవాడు  నీతిని వదిలేస్తే  పొలిటీషియన్ అవుతాడు. 👉తెలివి వున్నవాడు నీతిని వదిలేస్తే కాపిటలిస్ట్ అవుతాడు. 👉తెలివైనవాడు నీతిని వదిలెయ్యకపోతే  టీచరో, మేధావో అయి సంతృప్తి చెందుతాడు. 👉బలమైనవాడు నీతిని వదిలెయ్యకపోతే శ్రామికుడై శక్తి ధారపోస్తాడు. 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

👉👉ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 👈👈

Image
👉👉ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 👈👈 శ్రీ లలితా సహస్రనామం అత్యంత శక్తిమంతమైనదిగా ... మహా మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. 'బ్రహ్మాండపురాణం' లో ఉత్తరభాగంలో లలితా సహస్రనామావళి విశిష్టత కనిపిస్తుంది.  దీనిని మొదటిసారిగా హయగ్రీవ స్వామి ... అగస్త్య మహర్షికి బోధించాడు. ఆనాటి నుంచి కూడా లలితా సహస్రనామం తనని విశ్వసించిన వారిని ఒక రక్షణ కవచంలా కాపాడుతూ వస్తోంది. అందువల్లనే చాలామంది నిత్యం అమ్మవారి లలితా సహస్రనామావళిని చదువుతూ వుంటారు.చాలామంది లలితను చదవడం వలన ఒకే విధమైన ఫలితం ఉంటుందని అనుకుంటారు. కానీ ఇందులోని ప్రతి పంక్తి ఒక్కో దోషాన్ని నశింపజేసి ... ఒక్కో పుణ్య ఫలాన్ని అందిస్తుంది. ఆరోగ్యం .. సంపద .. సంతానం .. ఇలా ఏది కావాలనుకుంటే అది పొందడానికి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ఆ పద్ధతులను పాటిస్తూ లలిత చదవడం వలన ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. లలితాదేవిని నిత్యం సహస్ర నామాలతో ఆరాధిస్తూ .. అర్చిస్తూ వుండటం వలన ఆ తల్లి అనుక్షణం కాపాడుతూ వుంటుంది .. కరుణిస్తూ వుంటుంది. 👉అంబా శాంభవి చంద్రమౌళిరబలాzపర్ణా ఉమా

👉లోకానికి శుభ సందేశం... గీతోపదేశం.👈

Image
👉లోకానికి శుభ సందేశం... గీతోపదేశం.👈 💥💥💥💥💥💥జ్యోతిర్మయం💥💥💥💥💥💥 సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుంచి వెలువడిన భగవద్గీత పంచమవేదంగా, భారతామృత సర్వస్వం గా వినుతికెక్కింది. శ్రీకృష్ణస్వామి అర్జునుణ్ణి ఒక కారణంగా పెట్టుకుని లోకానికి అంతటికీ చేసిన గీతో పదేశం మానవులందరి దైనందిన జీవితాన్ని సంస్క రించడానికి ఉద్దేశించినది. భగవద్గీత అంటే ఒక మత గ్రంథం కాదు. అది అభిమత గ్రంథం. చదవా లనే జిజ్ఞాస కలవారందరికీ ఒక కరదీపిక. అధర్మాన్ని తుంచడానికీ, ధర్మాన్ని స్థాపించడానికీ ఉద్యుక్తుడు కావలసిన క్షణంలో అర్జునుడు కర్తవ్యతా విమూఢు డైనప్పుడు పరమాత్ముడు బోధించినదే గీత. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అగ్రహారం !

Image
అగ్రహారం ! 🌷🌷🌷🌷 అగ్రహారం అనే పదం చాలా గ్రామనామాలకు ఉత్తరపదంగా ఉంటుంది. బ్రాహ్మణులకు వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, వారి విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు. అలాంటి గ్రామాలను అగ్రహారమని పిలుస్తారు. అగ్రహారం అనే పదం అనుబంధంగా ఉండే గ్రామాలు ఈ కింది విధంగా ఉన్నాయి 👉పురుష నామసూచి: అగ్రహారం అన్న పదానికి ముందున్న పూర్వపదం పురుషనామ సూచిగా ఉండే గ్రామనామాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఎవరి పేరున ఐతే అగ్రహరం నామం ఏర్పడిందో వారికే ఆ అగ్రహారం దానంగా లభించిందని ప్రతీతులు ఉండడం కద్దు. 🙏ఉదాహరణలు: లింగరాజు అగ్రహారం, శంకర అగ్రహారం, సూరన అగ్రహారం, లింగన అగ్రహారం. 👉కుటుంబ నామసూచి: అగ్రహారం అన్న పదానికి ముందున్న పూర్వపదం కుటుంబ నామ సూచిగా ఉండే గ్రామనామాలు ఉన్నాయి. గ్రామనామం ఏర్పడిన కుటుంబీకులు అగ్రహారాన్ని అనుభవించేందుకు దానం లభించినవారయ్యే అవకాశాలు ఎక్కువ. 🙏ఉదాహరణలు: వేదంవారి అగ్రహారం, మధ్వపతివారి అగ్రహారం. 👉కులసూచి: కొన్ని అగ్రహారాలకు పూర్వపదంగా కులాల పేర్లు

ఒక ఇల్లాలి ఘోష.!🤲 (కరుణ శ్రీ కి క్షమాపణలతో )

Image
ఒక ఇల్లాలి ఘోష.!🤲 (కరుణ శ్రీ కి క్షమాపణలతో ) 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 ఉత్పల మాల. "నేను కిచెన్ను సింకు కడ నిల్చి చివాలున గిన్నె తీసి చే యానెడునంతలోన అవియన్నియు జాలి గ నోళ్ళు తెర్చి మా మై లానము శుద్ధి చేయమని మంచిగ యన్నవి కృంగి పోతి నా మానసమందెదో తళుకు మనది అంట్ల పురాణ కావ్యమై.! 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 . సింక్ లో అంట్ల గిన్నెలు ,ఇంకెప్పుడు వస్తావు ? అని జాలిగా పిలుస్తున్నాయి , అంతే మనకి ఇలాంటి పిలుపులే .., పిల్లలు ఇల్లు వదిలాక, అంట్లు ,గిన్నెలు ,తపాళాలు ఇవే చప్పుడు చేస్తున్నాయి ... 😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫

పగలే వెన్నెలా. జగమే ఊయలా -

Image
పగలే వెన్నెలా. జగమే ఊయలా - 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 .పగలే వెన్నెలా. జగమే ఊయలా - కదిలే ఊహలకే కన్నులుంటే' సినారె గారి అద్భుత కవిత్వం.🙏🙏🙏 చిన్నప్పటి నుంచీ నా మనస్సులో ముద్రించుకు పోయిన పాట ఇది. పూజాఫలం సినిమాలో జమున అందమైన కళ్ళతో అభినయం... .. ఊహ తెలి సే రోజుల్లో, ఓ ఎండాకాలం వెన్నెల రాత్రి మా అత్తయ్యకూతురు ఈ పాట పాడగా విన్నాను, అప్పటి నుంచీ ఈ పాట ఎక్కడ విన్నా, ఆగి పూర్తగా వినాల్సిందే. అంతగా కట్టివేసిందీ పాట నన్ను. ఓ మిత్రుడు అన్నట్లు కొన్ని పాటలు కళ్లు మూసుకొని వినాలి. కొన్ని చెవులు మూసుకొని వినాలి. ఈ పాట ఖచ్చితంగా కళ్లు మూసుకునే వినాలి. మిమ్మల్ని ఎక్కడో వెన్నెల నిండిన ప్రశాంత తీరాలకి తీసుకెళ్లి వదులుతుంది. దేవుడు మనకిచ్చిన వరాల్లో వెన్నెల ఒకటని నా స్వచ్చమైన అభిప్రాయం. వెన్నెలని అనుభవించని జీవితం అమావాస్యే. వెన్నెలకు వసంత కాలం తోడయిందనుకోండి పెసరట్టు ఉప్మా చందమే. 'అక్టోబర్ నెలా, మార్చి నెలా - ఈ రెండు నెలలూ, సంవత్సరం మొత్తానికి వరాల్లా అనిపిస్తాయి,  మిగిలిన కాలమంతా ముసురు, ఎండ, ఉక్క, చలి. అయినా భరిస్త

బాగు కోరేదే భాగవతం!

Image
- బాగు కోరేదే భాగవతం! 🙏🙏🙏🙏🙏🙏 శ్రీకృష్ణపరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తూ భాగవతంలో పెట్టి అంతర్ధానం అవుతాడు కాబట్టి ఎక్కడభాగవత కథా శ్రవణం జరుగుతుందో అదే పుణ్యతీర్థమని.వెయ్యి అశ్వమేధయాగాలు, వంద వాజపేయ యాగముల ఫలితం భాగవత కధా శ్రవణములో 16 వ వంతు సరితూగనిదనీ, ఈ ఒక్క భాగవత కథాశ్రవణ మా్తమ్రుననే శ్రీ మహావిషూ్ణవు భక్తుల హృదయాలలో సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి వక్కాణిస్తుంది. ఆర్తితో ఆపదలో మొరపెట్టుకొన్న ద్రౌపదిదేవికి అక్షయ వలువలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వసా్తల్రను ఎందుకని అపహరించాడుబాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీశుడైన తరువాతశమంతకమణిని అపహరించాలని ఆశతో ప్రసేనుడిని సంహరించాడనే నిందను మాపుకోవడనికి విశేష ప్రయత్నం చేసి శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు ఎందుకని శిశుపాలుడు, కంసుడు,జరాసంధుడు, బాణాసురుడు ఇంకా అనేకమంది దుష్టరాజులతో స్వయంగా యుధ్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవ పక్షపాతిగా ముద్ర వేయించుకొన్నప్పటికీ మహాభారత స
Image
👉బాపూబొమ్మాయణంలో ఆవకాయ .👈 ఆలూమగల అనురాగానికి ఆనవాలు ఆవకాయ అంటాడు బాపు. గోరంత ఆవకాయముద్దపెట్టించి కొండంత దాంపత్యమమకారం చూపుతాడు. ఇంటికి వచ్చిన అల్లుడికి మినపసున్ని, కూతురు కోసం ఆవకాయ పుట్టింటివారు ఇస్తారని కూడా అనేశాడు. తండ్రి కూతురు అనురాగానికి, భార్యాభర్తలప్రేమకు వారథి ఆవకాయనేట. కూతురు కలిపిన ఆవకాయన్నం అలనాడు అమ్మపెట్టిన గోరుముద్దలు ఒకటే అని ఒక తండ్రి భావన. కూతురు అల్లుడు సఖ్యతకు ఆవకాయకలిపి అన్నం ముద్దలే తార్కాణంగా అత్తమామలు తెలుసుకుంటారు. తెలుగు వారి జీవితాల్లో పెనవేసుకుపోయిన ఆవకాయను తన సినిమాల నుంచీ దూరం చేయని నిరంకుశుడు బాపు. ఆవకాయ, నెయ్యితో హాస్యం పుట్టించవచ్చని అల్లూరామలింగయ్య ద్వారా 8PMకి నిరూపిస్తాడు. ఆవకాయలోనే ఆయుధం కూడా ఉందని కళ్లలోకి చల్లి నిరూపించేస్తారు మనఊరిపాండవులు. అందాల రాముడికైనా భక్తశబరి వంటి బామ్మగారు తరవాణిలోకి ఆవకాయబద్దవేయలేకపోయానని బాధపడిపోయి అడగలేదేంరా రాముడూ అని నొచ్చుకుంటుంది. నాన్న తిండిపెట్టద్దని శాసిస్తే జొన్నకూడు తో వెళ్లిన చెల్లి ఆవకాయతోనే అన్నకు తూర్పు వెళ్లే రైలు చూపిస్త

గాయని ఎస్.పి. జానకి!

Image
- గాయని ఎస్.పి. జానకి! - జానకి గొంతు ఓ గంగా ప్రవాహం. వయసుతో నిమిత్తం లేని ఆమె స్వరం ఓ కోయిలగానం. ఆమె పలుకు ఓ ప్రకృతి పులకింపు. రూపంలొ 74 ఏళ్ళు కనిపిస్తాయేమోగానీ,ఆమె స్వరం మాత్రం 54ఏళ్ళుగా నిరంతరం వింటున్నా చైత్రమాసపు కోయిలగానం ఆమె స్వరం. సాధన సంగీతానికి ఆయువు పట్టయితే ఎస్ .జానకి ఆ సాధనకే ఓ ఉదాహరణ. కోకిల స్వరంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజండ్రీ నేపథ్య గాయని ఎస్.జానకి. తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో తన కమ్మని స్వరంతో గేయాలను ఆలపించిన గాయనిగా, సంగీత దర్శకురాలిగా 30వేల పాటలకు పైగా ఆలపించి సరికొత్త రికార్డు సృష్టించారు. నాదస్వరం విద్వాన్ శ్రీ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏటనే గాయనిగా అవతారమెత్తారు. మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి.. తెలుగులో హిట్ అయిన ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు. 1957వ సంవత్సరంలో తన కెరీర్‌ను ప్రారంభించిన జానకి.. తమిళం, తెలుగు సినిమాల కోసం తానే స్వయంగా పాటలు రాశారు. ఆమె తొలిసారిగా నేపథ్యగానం

మా అమ్మ పాత ట్రంకు పెట్ట!

Image
మా అమ్మ పాత ట్రంకు పెట్ట! 💟💟💟💟💟💟💟💟 చిన్నప్పటి సంగతే అయినా నిత్య నూతనమే! మా అమ్మ పెద్ద పెట్టె అంటేమా అందరికీ ఎంతిష్టమో! ముదురు పసుపు రంగు మీద పూల పూల డిజైన్తో పడవంత పెట్టె! దానికి సదా మండ్ర గప్పంతతాళం కప్ప! తాళం చెవి ఉనికి మా అమ్మ మంగళ సూత్రాల మధ్యలోనే! ఏం ఉంటాయో అందులో, ఎంత రహస్యమో! ఎన్ని ఆలోచనలో! బంగారు నగలా! ఉన్న రెండు తులాల పుస్తెల తాడూ, తులం నల్ల పూసల చేరూ, ఎప్పుడూ మెడలోనే గా పట్టు చీరలా ఎప్పుడూ కట్టడం చూడలేదే? నోట్ల కట్టలా ! కాదేమో! ఇరవయ్యో తారీకునించే ఒకటో తేదీ కోసం ఎదురు చూపులు చూసేది కదూ! మరేంటబ్బా! ఎప్పుడైనా ఆవిడ తెరవడం చూస్తే ఎగబడి, ఎగిరెగిరీ తొంగి తొంగి మరీ చూసేవాళ్లం! గుమ్మడి పండు లా ఉండే వెండి కుంకం భరిణ, పన్నీరు బుడ్డీ పట్టు రుమాలు, కొత్త జాకెట్టు బట్టలు ! పెట్టె తీసేసరికి గుప్పు గుప్పున కర్పూరం‌ వాసన! ' కలరా ఉండలే' ఆరిందా లా చిన్న చెల్లి కామెంట్స్! ఇంతలోనే అమ్మ పెట్టె వేసేసేది పెద్దవాళ్లం అయి, అమ్మా, నీకొ మంచి పెట్టె కొనీదా? అంటే, ఊఁహూఁ ఒప్పుకోదే &q

సీతమ్మ విలాపం-త్రిజటస్వప్నం !

Image
సీతమ్మ విలాపం-త్రిజటస్వప్నం ! - సీతమ్మ ’ దైన్య చిత్తయై హనుమంతుడు కూర్చుని ఉన్న అశోకవృక్షం కిందికి పోయి రాముణ్ణి తలచుకుంటూ దు:ఖిస్తూ నిలబడింది.  తన దుర్గతినంతా తలచుకొంటూ రోదించింది. అయ్యో! నాగుండె ఎంత గట్టిది! అది ఎందుకు పగిలిపోదు? అని నేలమీద పడిపోయి పొర్లుతూ ఆడు గుర్రపు పిల్లలాగా ఆమె ఆక్రందించింది. అక్కడున్న క్రూరచిత్తులైన ఆ రాక్షసాంగనల్తో ’నన్ను చంపండి, చీల్చండి, చిత్రవధ చేయండి. ఇక ఈ దు:ఖాన్ని నేను భరించలేను. సహించలేను’ అని అంగ లార్చింది. అయ్యో రాముడు ఎంత దివ్యపరాక్రముడు! జనస్థానంలో రాక్షసుడనేవాడు లేకుండా చేశాడే, ఆయనెందుకు నన్ను రక్షించడంలేదు? అని సీత కుమిలి కుమిలి ఆక్రోశించింది. త్రిజటా స్వప్నం రాక్షసులంతా ఆమెను హృదయవిదారకంగా భయపెడుతూ బెదిరిస్తూ ఉండగా ఆ రాక్షససమూహంలోనే వృద్దురాలు, త్రిజట అనే ఒక రాక్షసి ’సీతాదేవిని అట్లా భయపెట్టవద్దనీ, అది వాళ్ళకు చెరుపుచేస్తుందనీ లంకకు చేటు మూఢే కాలం అచిరకాలంలోనే సంభవించనున్నదనీ, తనకు రాత్రి ఒక కల వచ్చిందనీ, ఆ కల సీతాదేవికి సమస్త్శుభాలు చేకూర్చనున్నదనీ, రావణుడికి భయంకరమైన వినాశ

జయ జయ దేవ హరే ! (జయదేవ-గీత గోవిందం)

Image
జయ జయ దేవ హరే ! (జయదేవ-గీత గోవిందం)  . శ్రిత కమలాకుచ మండలా....... ద్రుత కుండలా....ఈ కలిత లలిత వనమాల.... జయ జయ దేవ హరే ...జయ జయ దేవ హరే....  ||జయ జయ||  దినమణి మండల మండనా...... భవ ఖండనా......ఈ మునిజన మానస హంసా ||జయ జయ|| కాళియ విష ధర గంజనా..........జన రంజన........ ఈ యదుకుల నళిన దినేశా  ||జయ జయ|| మధు ముర నరక వినాశనా......గరుడాసనా....... ఈ సురకుల కేళి నిదానా  ||జయ జయ|| అమల కమల దళ లోచనా........ భవ మోచనా.....ఈ త్రిభువన భవన నిదానా  ||జయ జయ|| జనక సుతా కృత భూషణా........ జిత దూషనా......ఈ సమరశమిత దశకంఠా  ||జయ జయ|| అభినవ జలధర సుందరా......... ద్రిత మంధరా......ఈ శ్రీముఖ చంద్ర చకోరా  ||జయ జయ|| తవ చరణే ప్రణతావయా........... ఇతి భావయా.....ఈ కురు కుశలం ప్రణతేశూ  ||జయ జయ|| శ్రీ జయదేవ కవేరిదం...............కురుతేముదం..... ఈ మంగళ ఉజ్వల గీతం  ||జయ జయ|| అర్ధ్ధం : లక్ష్మీదేవి ని వక్షస్థలమునందు,కర్ణములకు కుండలాలను, మెడలో తులసిమాలను ధరించిన హరీ నీకు జయము జయము.... ప్రచండ సూర్యునివలే ప

ఆరుద్ర - కూనలమ్మ పదాలు!

Image
ఆరుద్ర - కూనలమ్మ పదాలు! ‘ఓ కూనలమ్మా' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన “కూనలమ్మ పదాలు”, అనే చిన్ని చిన్ని మాటల ఈటెల "ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాసాడు ఆరుద్ర. ఈ కూనలమ్మ పదంలోని అందమంతా తొలి మూడు పాదాల అంత్యప్రాసలే ! కూనలమ్మ అంటే పార్వతీ దేవి కూతుళ్ళయిన ఏడుగురు అక్కలకు కాపగు పోతురాజు భార్య.  . కొన్ని కూనలమ్మ పదాలు . సర్వజనులకు శాంతి స్వస్తి, సంపద, శ్రాంతి నే కోరు విక్రాంతి ఓ కూనలమ్మ ! . ఈ పదమ్ముల క్లుప్తి ఇచ్చింది సంతృప్తి చేయనిమ్ము సమాప్తి ఓ కూనలమ్మ ! . సామ్యవాద పథమ్ము సౌమ్యమైన విధమ్ము సకల సౌఖ్యప్రథమ్ము ఓ కూనలమ్మ ! . సగము కమ్యూనిస్ట్ సగము కాపిటలిస్ట్ ఎందుకొచ్చిన రొస్టు ఓ కూనలమ్మ ! . మధువు మైకము నిచ్చు వధువు లాహిరి తెచ్చు పదవి కైపే హెచ్చు ఓ కూనలమ్మ ! . తమిళం గురించి - తమలముల

కరిమింగిన వెలగపండు !

Image
కరిమింగిన వెలగపండు ! "సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దాఁ బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ! . తాత్పర్యం: సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది. ఓ సుమతీ ! సంపద యొక్క రాకడ పోకడ రెండూ కూడ అద్ఫుతంగానే ఉంటాయి కొబ్బరి కాయలోకి నీరు ఎలా వచ్చాయో ఆ విధంగానే డబ్బు రావడం మొదలు పెడితే తెలియకుండానే కుప్పలు తెప్పలు గా వచ్చిపడుతుంది. ఆ సమయం లో తెలివైన వాడు విచక్షణ తో జాగ్రత్త పడి దాచుకుంటాడు. అలాగే డబ్బు పోవడం మొదలు పెడితే ఏనుగు మ్రింగిన వెలగ పండు లోని గుజ్జు లాగ మాయమై పోతుంది. కాబట్టి బుద్ధిమంతుడు సరైన సమయం లో జాగ్రత్త పడి పొదుపు చేయాలి. ‘ కరి మ్రింగిన వెలగపండు’ అనగా ‘ఏనుగు తిన్న వెలగ పండు’ అని, ఏనుగు యొక్క గొప్పదైన జీర్ణశక్తి వలన అది మ్రింగిన వెలగ పండు అలాగే ఉండి దాని లోని గుజ్జు మాయ మౌతుందని తెలుగు కవులు వ్రాశారు .  . కాని సంస్కృతం లో ‘గజ భుక్త కపిత్థవత్ ’ అని

సుచిత్రా సేన్!

Image
సుచిత్రా సేన్! . సుచిత్రా సేన్ బెంగాలీ చిత్రములో వహించిన పాత్రలను తెలుగులో సావిత్రి, హిందీలో వహీదా రహ్మాన్ పోషించారు. దీనిని బట్టి మనము బెంగాలీ చిత్రాలను చూడకపోయినా ఆమె నటనను గురించి ఊహించుకోవడానికి అవకాశము ఉంటుంది. ఉత్తంకుమారుతో ఆమె జోడీ హిందీలో రాజ్‌కపూర్-నర్గీస్, తెలుగులో నాగేశ్వరరావు-సావిత్రి లాటిది. వారిరువురు నటించిన చిత్రాలను ప్రేక్షకులు అమితముగా ఆదరించారు. ఏ కళాకారులకైనా ఆ కళను అనుభవించే రసికులు ఆదరిస్తే అంతకన్న కావలసినదేముంది? . ఆమె నటించిన కొన్ని చిత్రములను సంక్షిప్తముగా పరిశిలిస్తే ఆమెను ఎందుకు గొప్ప నటి అంటారో మనకు తెలుస్తుంది, కథా పాత్రల వైవిధ్యమును మనము అర్థము చేసికొనవచ్చును. ఇందులో ఎన్నో చలన చిత్రాలు యూట్యూబులో చూచి ఆనందించవచ్చును.

👉కొయ్యబారిన విష్ణువు - చమత్కార శ్లోకం!👈

Image
👉కొయ్యబారిన విష్ణువు - చమత్కార శ్లోకం!👈 ఒకాయన ఉత్కళ దేశం లో వున్న జగన్నాథుని దర్శించాడట. అక్కడి విగ్రహం చెక్కతో చేయబడి ఉండడం చూసి ఆశ్చర్య పోయాడట. ఎందుకు? సామాన్యంగా అన్ని దేవాలయాల్లో విగ్రహాలు రాతితోగానీ లోహాలతో గానీ చేయబడి వుంటాయి. ఆ దారుమూర్తిని చూసిన ఆదికవి మదిలో ఒక చమత్కార శ్లోకం మెరిసింది. 🙏 శ్లో."ఏకా భార్యా ప్రకృతి రచలా, చంచలాచ ద్వితీయా పుత్రోనంగో, త్రిభువన జయీ,మన్మథో దుర్నివారః శేషశ్శయ్యా ప్యుదధి శయనం, వాహనం పన్నగారిః స్మారం స్మారం స్వగృహ చరితం దారు భూతొ మురారి ! 🙏🙏🙏🙏 అదేమంటే శ్రీ మహా విష్ణువు తన కుటుంబం లోని వారి ప్రవర్తనలు చూసి తట్టుకోలేక కొయ్యబారి పోయాడట. విష్ణుమూర్తికి యిద్దరు భార్యలు ఒకావిడ ఒకరు కదలకుండా వుండే ప్రకృతి (భూదేవి)ఇంకొకావిడేమో ఒకచోట ఉండకుండా మనుష్యులను మారుస్తూ తిరుగుతూ వుంటుందిట. కొడుకు చూద్దామా అంటే ఎంతో దుర్మార్గుడని అందరితో తిట్లు తింటూ వుంటాడు .అందర్నీ బాధిస్తూ వుంటాడు. వాడేమైనా బలంగా వున్నాడా అంటే వాడికి శరీరమే లేదు. ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుందామా అంటే తాను నడ