Posts

Showing posts from June, 2017

ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి ?

Image
ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి ? - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రామాయణం నుండి ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఒక్క వేదంలోంచే తెలుసుకోవాలి, ఎందుకంటే ధర్మం చెప్పడానికి ఇంకెవరికీ అధికారం లేదు, నేను ధర్మం చెప్తానండీ అంటే ఇంకెవరికీ అధికారం లేదు ధర్మం చెప్పడానికి నేను చెప్తానండీ ధర్మం అంటే లేదు వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. వేదం చెప్పింది ధర్మం అయితే వేదం చదివి తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఇవ్వాళ ఎంతమందికి ఉంటుంది. వేదంలో ధర్మం ఇలా ఉంది అని మనం ఎలా చెప్పగలం చెప్పలేం కాబట్టి ఋషులేం చేశారంటే స్మృతులు కింద తీసుకొచ్చారు. గౌతముడు ఒక స్మృతి రచన చేశాడు. దానిని గౌతమ స్మృతి అంటారు. యజ్ఞవల్కడు ఒక స్మృతి చేశాడు ʻయాజ్ఞవల్క స్మృతిʼ, అత్రి ఒక స్మృతి చేశాడు ʻఅత్రి స్మృతిʼ స్మృతులొచ్చాయి, స్మృతులేం చేస్తాయంటే వేదంలో ఉన్నటువంటి ధర్మ సూత్రములను క్రోడీకరించి వాటిని అందంగా ఒక పొందికతో తీసుకొస్తారు దానికి ʻస్మృతిʼ అని పేరు ʻశృతిʼ ʻస్మృతిʼ రెండు విరుద్ధంగా ఉండవు, శృతిని స్మృతి అనుసరిస్తుంది. శృతిని స్మృతి ఎక్కడైనా తిరస్కరిస్తే దాన్ని మనం పాటించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే అది ధర్మ వి

పోతనగారి మహా భాగవతం ! (కృతిపతి నిర్ణయము.)

Image
పోతనగారి మహా భాగవతం ! (కృతిపతి నిర్ణయము.) "ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్ సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.! భావము: విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్ధంగా రాసిన భాగవతాన్ని మానవమాత్రులు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిదెబ్బలు తప్పవని తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను. . తే  చేతులారంగ శివునిఁ బూజింపఁడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని, దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ,  గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు. .. భావము: ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి కీర్తించాలి, సత్యం కరుణ

రుక్మిణీకల్యాణం ! (భాగవతం ....పోతన .)

Image
రుక్మిణీకల్యాణం ! (భాగవతం ....పోతన .) . "ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్ జగతీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.! . "కల్యాణాత్మకమైన విష్ణుకథ లాకర్ణించుచున్ ముక్త వై కల్యుం డెవ్వఁడు తృప్తుఁ డౌ; నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా కల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే; రుక్మిణీ కల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడిన్.! . "భూషణములు చెవులకు బుధ తోషణము లనేక జన్మదురితౌఘ విని శ్శోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణముల్."! . విష్ణుమూర్తి కథలు చెవులకు కర్ణాభరణాలు, బుద్ధిమంతులకు సంతోషం కలిగించేవి, జన్మజన్మ పాపాలని పోగొట్టేవి, మిక్కిలి శుభకరమైనవి."

కుమార శతకము! (ఫక్కి వేంకటనరసింహ కవి)

Image
కుమార శతకము! (ఫక్కి వేంకటనరసింహ కవి) . .క. శ్రీభామినీ మనోహర సౌభాగ్యు దయాస్వభావు సారసనాభున్‌ లో భావించెద నీకున్‌ వైభవము లొసంగుచుండ వసుధ కుమారా! 1 . క. ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్‌ బ్రాజ్ఞతను గలిగి యున్నన్‌ బ్రాజ్ఞులలోఁ బ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా! 2 . క. అతి బాల్యములోనైనను బ్రతికూలపు మార్గములఁ బ్రవర్తింపక స ద్గతిమీఱ మెలఁగ నేర్చిన నతనికి లోకమున సౌఖ్యమగును ముమారా! 3 . క. వృద్ధజన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుఁడనుచుఁ బూతచరితుఁడున్‌ సద్ధర్మశాలి యని బుధు లిద్ధరఁ బొగడెదరు ప్రేమ యెసఁగఁ గుమారా! 4 . క. పెద్దలు వద్దని చెప్పిన పద్దులఁ బోవంగరాదు పరకాంతల నే ప్రొద్దే నెదఁ బరికించుట కుద్దేశింపంగఁ గూడ దుర్విఁ గుమారా! 5 . క.తనపై దయ నుల్కొనఁగను గొన నేతెంచిన సుశీల గురుమతులను వం దనముగఁ బూజింపఁ దగు మనమలరఁగ నిదియ విబుధ మతము కుమారా!6 . క.ఉన్నను లేకున్నను పై కెన్నఁడు మర్మంబుఁ దెలుప నేగకుమీ నీ కన్న తలిదండ్రుల యశం బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁ గుమారా!7 . క.పెద్దలు విచ్చేసినచో బద్దకముననైన దుష్ట పద్ధతి నైనన్‌ హద్దెఱి

పోతన సరస్వతి స్తూతి ..తెలుగు భాగవతం !

Image
పోతన సరస్వతి స్తూతి ..తెలుగు భాగవతం ! . పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్ నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ మేల్ పట్టున్ నా కగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ! భావము:-- అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్థాంగీ! సరస్వతీదేవి! *నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను; బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను (రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను); పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను; కాని మాతా! ఈ భాగవత పురాణ రచన కూడ వారి లాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడ వారి రచనల వలెనె శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లీ! నిన్నే నమ్ముకున్నానమ్మా. నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు. దయామయీ!  {*‘పుట్టంబుట్టశిరంబునన్ మొలవ’ అనే పాఠ్యాంతరం ప్రకారం పుట్టలో పుట్టి శిరస్సున పుట్ట పుట్టిన వాల్మీకిని కాదు} ఉ. "శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా కారత నొప్పు నిన్ను

పోతన గారి శివ భక్తి !

Image
పోతన గారి శివ భక్తి ! . "వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయా శాలికి, శూలికిన్, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్, బాల శశాంక మౌళికిఁ, గపాలికి, మన్మథ గర్వ పర్వతో న్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్!! భావము:-- అనంత లీలాతాండవలోలు డైన పరమ శివునికి,  మిక్కలి దయ గలవానికి, త్రిశూల ధారికి,  పర్వతరాజ పుత్రి పార్వతీదేవి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుర్రెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వం అణిచేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించే వానికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను.

పోతన తెలుగు భాగవతం !

Image
పోతన తెలుగు భాగవతం ! . శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.! భావము: సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరితనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదాస్మరిస్తు ఉంటాను. ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంధారంభ ప్రార్థనా పద్యం. . (అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతమూ, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. (ఆ) లోకరక్షైకారంభకున్ అనటంలో హి

కర్పూరవసంతరాయలు ! రచన --డా; సి, నారాయణ రెడ్డి-

Image
కర్పూరవసంతరాయలు ! రచన --డా; సి, నారాయణ రెడ్డి- . ఇది ఒక కథాత్మక గేయకావ్యం-- క్రీస్తుశకం 1386 నుండి 1402 వరకు కొండవీడును రాజధానిగా చేసుకొని అంధ్రదేశాన్ని పాలించిన ' రసికప్రభువు' -కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి ఆస్తాన నర్తకి 'లకుమ; ఈ లకుమా ప్రభువుల ప్రణయగీతం కర్పూరవసంతరయలు మల్లంపల్లి సోమశేఖరశర్మగారి HISTORY OF REDDY'S KINGDOMS లో కుమారగిరి రెడ్డి కి కర్పురవసంతరయలు అన్న బిరుదు ఉన్నదని ఉదహరించటం జరిగింది. ప్రతి సంవత్సరం 9 రోజులు వసంతోత్సవాలు నిర్వహిస్తుండేవాడు 'కుమారగిరి'. పంజాబు నుండి కర్పూరాన్ని, గోవా నుండి కుంకుమ ద్రవ్యాలను తెప్పించి ఆ 9 రోజులు జనంపై వెదజల్లుతుండేవాడట. అందుకే అతనిని 'కర్పురవసంతరయలు గా పిలిచేవారట. కుమారగిరి రెడ్డి స్వయం గా పండితుడు, కవి. ఇతడు వసంతరాజీయ్యము అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని వ్రాసినట్లు చరిత్ర. రాజ్య భారాన్ని తన మంత్రి, బావ అయిన కాటయ వేమారెడ్డి పై మొపి, సంగీత, నాట్య, వినోదాలతో కాలాన్ని కర్పూరం వలె వెలిగించాడు. క్లుప్తంగా కథాశరీరం. 'కుమారగిరి', 'లకుమ' నాట్యానికి, ఆమె తనూ లావణ్యానికి దాసుడు అవుతాడు. రాజ్యాన