Posts

Showing posts from September, 2020

🚩🚩వెండితెర శ్రీరామచంద్రులు!🚩🚩 (తెలుగు, తమిళ ప్రేక్షకులకు రాముడంటే ఎన్ టి ఆర్ నే.)

Image
                                         🚩🚩వెండితెర శ్రీరామచంద్రులు!🚩🚩                            (తెలుగు, తమిళ ప్రేక్షకులకు రాముడంటే ఎన్ టి ఆర్ నే.) ‘శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు మరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.’’ -ఈ శ్లోకం, త్రేతాయుగ కథా నాయకుడు, అవతార పురుషుడు అయిన శ్రీరామచంద్రమూర్తి బాహ్య సౌందర్యాన్ని, అత్యంత శక్తివంతమైన, అంతర్గత లక్షణాలను వివరిస్తుంది. తెలుగు సినీ చరిత్రలో, ఆ శ్రీరామచంద్రుని పాత్రకు తమ అభినయం ద్వారా ప్రాణప్రతిష్ఠచేసిన మహానటుల అభినయాన్ని రేఖామాత్రంగా అవలోకిద్దాం.. ఆంధ్ర దేశంలో తొలి సినిమా ప్రదర్శనశాల విజయవాడలోని మారుతి టాకీస్ దాని యజమాని, పోతిన శ్రీనివాసరావు, 1933లో నిర్మించిన చిత్రం ‘పృథ్వీపుత్ర’. ఇందులో శ్రీరాముని పాత్రను ఈలపాట రఘురామయ్య పోషించారు. ఆయన అసలు పేరు ‘కల్యాణం వెంకట సుబ్బయ్య’. 8 సంవత్సరాల వయస్సులో ‘రామదాసు’ నాటకంలో బాలనటుడిగా ‘రఘురాముని’ పాత్రను పోషించారు. అది చూసి ముచ్చటపడ్డ, కాశీనాథుని నాగేశ్వరరావుగారు, ఆ బాలుడి పేరుమార్చి ఇక నుంచి నీ పేరు రఘురాముడు అని ఆశీర్వదించారు. ఆ తరువాత ఈల పాటలో ప్రావీణ్

🚩🚩రాకెట్ ప్రయోగాలు ఆంధ్రప్రదేశ్ నుండే ఎందుకు జరుగు చున్నాయి?

Image
🚩🚩రాకెట్ ప్రయోగాలు ఆంధ్రప్రదేశ్ నుండే ఎందుకు జరుగు చున్నాయి? ఎవరికీ దక్కని అదృష్టం ఆంధ్రా కే.. అక్కడి నుంచే రాకెట్లు ఎందుకు పంపిస్తారు? భారత దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్ కన్నా అధికంగా సముద్రతీర ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అయినా.. కూడా ఇక్కడే నుంచే రాకెట్ ప్రయోగాలు జరుగుతుంటాయి. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ఉపగ్రహాలు ఇక్కడి నుంచే గగనతలంలోకి వెలుతూ ఉంటాయి. ఎందుకు అంటే? అన్ని విధాలా రాకెట్ ప్రయోగాలకు అత్యుత్తమ ప్రదేశం శ్రీహరికోట. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన రాకెట్ ప్రయోగ కేంద్రం అది. ఇంత ప్రత్యేకత ఏంటి..? ఏమిటి ఆ అనుకూలతలు అంటారా..? Why rocket launches from Andhra Pradesh? రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోటను ఎంపిక చేయడానికి ప్రధానంగా 5 కారణాలు చెప్పుకోవచ్చు. అందులో మొదటిది భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం. దీనివల్ల ఇక్కడి నుంచి రాకెట్‌ ప్రయోగిస్తే సెకనుకు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. భూ భ్రమణం వల్ల రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాకెట్ ప్రయోగ కేంద్రాలను ఒకసారి పరిశీలిస్తే.. భారత్‌లో శ్రీహరికో

🚩🚩పుత్తడి బొమ్మ పూర్ణమ్మ!🚩🚩

Image
                    🚩🚩పుత్తడి బొమ్మ పూర్ణమ్మ!🚩🚩 #గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా పూర్ణమ్మ కథ పేరుతో ఈ రచన చేసారు గురజాడ. ‘పుత్తడిబొమ్మా పూర్ణమ్మా’అంటూ అందచందాల రాశిపోసిన ముగ్ధ అయిన ఓ కన్య బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరును ఈ కథలో వివరించారు గురజాడ. ఇది కన్యాశుల్కం ద్వారా చిన్న వయసులోనే ధనం ఆశతో పిల్లల్ని ముసలి వరులకు తండ్రులు పెళ్ళిచేయడాన్ని ఇతివృత్తంగా రచించినది. ఒక పూజారింటను పుట్టిన పూర్ణమ్మ అనే బాలిక కన్యాశుల్కం కారణంగా తాత వయసు వున్న వరుడితో బాల్యవివాహమై మూఢాచారానికి బలయిన తీరు అర్ధంతరంగా తనువు చాలించిన విషాదం మనసున్న ఎవరికైనా కళ్ళను చమర్చేటట్లు చేస్తుంది. *మేలిమి బంగరు మెలతల్లారా ! కలువల కన్నుల కన్నెల్లారా ! తల్లులగన్నా పిల్లల్లారా ! విన్నారమ్మా ఈ కథను ?

❤️🔻🚩-స్త్రీ స్వేచ్చ - చలం (మైదానం)..నుండి ...విశ్వనాధ(చెలియలికట్ట)వరకు .

Image
  ❤️🔻🚩-స్త్రీ స్వేచ్చ - చలం (మైదానం)..నుండి ...విశ్వనాధ(చెలియలికట్ట)వరకు . స్త్రీల సామాజిక దుస్థితి గురించి,వారి స్వేచ్చా స్వాతంత్ర్యాలని గురించి తన ఆందోళనని జీవితాంతమూ కొనసాగించిన రచయిత గుడిపాటి వెంకటాచలం.(చలం అనే పేరు తో ప్రాచుర్యం). #చలం సాహిత్య ప్రభావం బలమైనది. తెలుగు సాహిత్యం లో చలం అంతటి వివాదాస్పద రచయిత మరొకరు లేరు.స్త్రీ పురుష సంబందాల మధ్య ఏ అంశాలనయితే ముట్టుకోడానికి కూడా మిగతా రచయితలు వేల ఏళ్ళుగా సాహసించ లేదో,ఆ సాహసాన్ని స్త్రీ కోసం మనసారా చేసిన తొలి రచయిత చలం.పురుషుల నిరంకుశ ధోరణి కింద స్త్రీలు అనుభవించే హింస తాలూకు బహు ముఖాలనీ తన సాహిత్యంలో నిజాయితీగా బొమ్మ కట్టి మరీ చూపినవాడు చలం. పురుషాధిక్య సమాజపు వికృత నీతిని తన రచనల్లో ఏ ముసుగులూ వెయ్యకుండా భాషించ గలిగిన వాడు చలం. సాహిత్యం లో శశిరేఖ,అరుణ,వంటి వ్యక్తిత్వం ఉన్న స్త్రీలను చిరస్థాయిగా ఉంచిన వాడు చలం. అయితే చలం రచనల్లో ఎక్కువ సంచలనాన్ని సృష్టించిన నవల మాత్రం "మైదానం". ఈ మైదానం నవలని చలం 1925 లో రాశారు.మైదానం నవల చాలా చర్చలను రేపింది.ప్రతికూల విమర్శల నెదుర్కొన్నది.స్త్రీ స్వేచ్చ మీదా,స్త్రీ పురుషుల సంబందాల మీదా కొ

🚩కవిసమ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు!

Image
                                       🚩కవిసమ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు! ( 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 - శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు 10-09-1895 న కృష్ణాజిల్లా లోని నందమూరు అనే గ్రామంలో శ్రీ శోభనాద్రి,పార్వతమ్మ దంపతులకు జన్మించారు. వారి ప్రాధమిక విద్యాభ్యాసం అంతా నందమూరు,ఇందుపల్లి,పెదపాడు గ్రామాలలో జరిగింది. ఉన్నత విద్య అంతా బందరులో జరిగింది.వారి అదృష్టం కొద్దీ బందరులో వారికి తెలుగు ఉపాధ్యాయుడిగా శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు ఉండేవారు.ఆ రోజుల్లో వీరిపై పింగళి లక్ష్మీకాంతం,కాటూరి వెంకటేశ్వరరావు,కోట వెంకటాచలం గార్ల వంటి ప్రఖ్యాత కవుల ప్రభావం ఉండేది. పదునాలుగు ఏండ్ల ప్రాయం నుండే రచనలు ప్రారంభించారు.కానీ అవి తరువాతి కాలంలో ప్రచురించపడ్డాయి. B.A. పూర్తి చేసిన తరువాత కొంత కాలం బందరులోనే ఉపాధ్యాయవృత్తిలోకొనసాగారు.ఉపాధ్యాయ వృత్తి కొనసాగిస్తూనే private గా మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో M.A పట్టాను పొందారు. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మహాత్మా గాంధీ గారి ప్రేరణతో సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు.ఆ తరువాత మళ్ళీ వివిధ కళాశాలల్లో ఉపన్యాసకుడిగా పనిచేసారు.బందరులోని ఆంద

🔻**సాలిగ్రామం, గండకీ కథ**🔻

Image
                                                  🔻**సాలిగ్రామం, గండకీ కథ**🔻 #సాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఊరి పేరు కాదు. గ్రామం అస్సలే కాదు. విష్ణువు ఆకారంలో ఉండే చిన్నచిన్న రాళ్లనే సాలి గ్రామం అంటూ ఉంటారు. వాటిపై విష్ణువు రూపం ఉటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి. గండకి నది గర్భంలోనే ఇలాంటి రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది పూజగదిలో ఉంచుకుని పూజిస్తుంటారు. వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం. ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి. తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి. లోపల విష్ణువు కనపడతాడు. ఇంత ప్రత్యేకమైన సాలి గ్రామాలు గండకి నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది. *పూర్వం గండకీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకీ ఉండేది. గండకీ ఒక వేశ్య. గండకీతో ఒక్కరాత్రి గడిపితే చాలు వాళ్ల తలరాతలు మారిపోయేవి. వాళ్ల అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా, గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకీ మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు.