Posts

సావిత్రి అంటే ....

Image
సావిత్రి అంటే మృదుమధుర వాక్కుల మేలైన మధుపంబు మేళవింపు,  సావిత్రి అంటే రమణీయ రాజహంస నాట్యమయూరి నడకల రాణింపు, సావిత్రి అంటే వీనులవిందైన వసంత కోకిల వనవిహార సంగీత చాటింపు,  సావిత్రి అంటే కమనీయ కరుణారస కళా కావ్య కధా కోమల చిగురింపు!!  మరులుగొల్పు మలయ మారుత మత్తేభ మందగమన మాధుర్య మధుశాల సావిత్రి,  సొంపైన సొగసు సోయగాలు నింపి సుగంధ సౌరభాలు వెదజల్లు సుందరాంగి సావిత్రి,  నిండుదనమే నిచ్చెనగా,హుందాతనమే హొయలుగా రంజింపు రసమయే సావిత్రి,  గహన గాంభీర్య సన్నివేశ సమాహారంబున అలవోక సజీవ ప్రదర్శనమే సావిత్రి !!

విశ్వనాథ ....

Image
విశ్వనాథ వ్యక్తిత్వాన్ని చతుర్వేదుల లక్ష్మీనరసింహం ఇలా ప్రశంసించాడు: - "ఆహారపుష్టి గల మనిషి. ఉప్పూ కారం, ప్రత్యేకంగా పాలు ఎక్కువ ఇష్టం. కాఫీలో గాని, తాంబూలంలో గాని ఎక్కువగా పంచదార వాడేవారు. ఆజానుబాహువు. బ్రహ్మతేజస్సు ముఖాన, సరస్వతీ సంపద వాక్కున, హృదయ స్థానాన లక్ష్మీకటాక్ష చిహ్నంగా బంగారుతో మలచిన తులసీమాల. మనస్సు నవ్య నవనీతం. వాక్కు దారుణాఖండల శస్త్రతుల్యం. చదివేవి ఎక్కువ ఆంగ్ల గ్రంథాలు. వ్రాసేవి ఆంధ్ర సంస్కృత గ్రంథాలు. చిన్నలలో చిన్న, పెద్దలలో పెద్దగా ఒదిగి పోయే స్వభావం. శారీరకంగా వ్యాయామం, యోగాభ్యాసం అయన నిత్యం అభ్యసించేవి. విమర్శలూ, స్తోత్రాలూ, తిట్లూ, దీవెనలూ, దారిద్ర్యం, ఐశ్వర్యం - ఇలాంటి ద్వంద్వాలకు అతీతుడు. ఒకమాటలో ఆయన అపూర్వమైన 'దినుసు... గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాథకు తన ప్రతిభ పైన అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవాడు. తనంతటివాడు (అనగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివాడు) శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు లభించలేదని, చెళ్ళపిళ్ళవారికి దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో అన్నాడు విశ్వనాథ. అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం డ...

నారాయణ తీర్థులు (1580-1680)

Image
నారాయణ తీర్థులు  (1580-1680)   - రచన : తనికెళ్ళ భరణి      నా చిన్నతనంలో సంక్రాంతి పండుగని చాలా అద్భుతంగా జరువుపుకునేది ఊరు ఊరంతా.... పొద్దున్నే కుంకుడు కాయలు కొట్టి తలంటు స్నానం.... కొత్త బట్టలు...వాకిట్లో పట్టు పరికిణీలు కట్టుకుని కన్నెపిల్లల ముగ్గులు... గంగిరెద్దు మేళం...హరిదాసులూ... అలాంటప్పుడు ఓ హరిదాసు వచ్చేవాడు... చక్కగా ఊర్వ్థపుండ్రాలూ...వొంటినిండా! నెత్తిమీద ఎర్రగా మెరిసిపోతున్న రాగిచెంబూ దాని వెనకనుంచి మోకాళ్ళ దాక ఓ గుడ్డ... ఓ చేతిలో తంబూర...మరో చేతిలో చిడతలూ... కాళ్ళకి గజ్జెలు...మొలకి చిత్రంగా చీర....కట్టేవాడు విశేషం ఏమిటంటే... ప్రతి గుమ్మం ముందు ఆగి...కాసేపు చిందేస్తూ.. కృష్ణంకలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం గత విషయ తృష్ణం.... అంటూ అత్యంత మనోహరంగా పాడేవాడు... ఎన్నడూ ’భవతీ భిక్షాం దేహి’ అని అడిగి ఎరగడు... పిల్లల మందరం...ఆయన పాట పాడ్తోంటే చాలా దూరం వెంటపడే వాళ్ళం.. ఆ తర్వాత తెలిసింది...వాటిని ’కృష్ణలీలా తరంగాలు’ అంటారనీ అవి రాసినాయన `నారాయణ తీర్థులు’ అనీ.... నిజంగా ఆ పాటలు వింట...

రుక్మిణి అపహరణ....

Image
మాసరివాఁడవా మాపాపఁగొనిపోవ నేపాటి గలవాఁడ వేది వంశ మెందు జన్మించితి వెక్కడఁ బెరిఁగితి వెయ్యది నడవడి యెవ్వఁడెఱుఁగు మానహీనుఁడవీవు మర్యాదలెఱుఁగవు మాయఁగైకొనికాని మలయరావు నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు వసుధేశుఁడవు గావు వావిలేదు కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు విడువు విడువవేని విలయకాల శిఖిశిఖాసమానశితశిలీముఖముల గర్వమెల్లఁగొందుఁ గలహమందు

సాహితీ వనం - వర ప్రసాద్...

Image
సాహితీ వనం - వర ప్రసాద్... స్వాయంభువమనువు చరిత్రమును విన్నతర్వాత, తర్వాతి మనువు ఎవరు? అతని కథ ఏమిటో వివరించండి పుణ్యాత్ములారా! అని జైమిని మహర్షి అడిగాడు. పక్షులు వివరించడం ప్రారంభించాయి, అల్లసానివారి అల్లికకు అనుగుణముగా, ఈ విధముగా... వరణా ద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాం బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయ రుఙ్మండలీ హరిణంబై యరుణాస్పదం బనఁగ నార్యావర్త దేశంబునన్ బురమొప్పున్ మహికంఠహార తరళస్ఫూర్తిన్ విడంబింపుచున్ ‘వరణా’నదీ తీరంలో, ఆర్యావర్తము అని పిలువబడే ప్రాంతములో, ఆకాశాన్ని అంటుకునేట్లున్న భవన గోపురములను కలిగినది (వప్రస్థలీ చుంబితాంబరమై) తన పాలరాతి భవనముల తెల్లని కాంతులతో చంద్రుడి లోని జింకను కూడా తెల్లగా మెరిపించేది (సౌధసుధాప్రభాధవళిత ప్రాలేయ రుఙ్మండలీహరిణంబై) భూదేవి కంఠములో తళ తళలాడే హారములాంటి పట్టణము, అరుణాస్పదము అనే పట్టణము ఒకటి ఉండేది. వరణ – అసి అనే రెండు నదుల మధ్యన ఉన్న పవిత్ర ప్రాచీన నగరము వారణాసి (కాశి). అరుణాస్పదము అనే పట్టణం వరణ నదీ తీరములో ఉంది, అంటే దాదాపు కాశీలో సగము అనేంత పవిత్రత ఉన్న పట్టణము అన్నమాట! అక్కడ విశాలాక్షీ వరుడు, ఇక్కడ విప్రవరుడు ఉన్నార...

గజ్జెలు ఘల్లనిమ్రోయఁగ

Image
పోతనామాత్యుడు..భాగవతం... గజ్జెలు ఘల్లనిమ్రోయఁగ నజ్జలు ద్రొక్కుటలుమాని యతిజవమున యో షిజ్జనములు నగఁ దల్లియుఁ బజ్జంజనుదేర నతఁడు పరువిడెనధిపా స్తంభాదికంబులు దనకు నడ్డంబైన నిట్టట్టుచని పట్టనీనివాని నీతప్పు సైరింపుమింక దొంగిలఁబోవ నేనని మునుముట్ట నేడ్చువానిఁ గాటుక నెఱయంగఁ గన్నులునులుముచు వెడలుకన్నీటితో వెగచువాని నేదెస వచ్చునో యిదియని పలుమాఱు సురుఁగుచుఁ గ్రేఁగంటఁ జూచువాని గుడఁబాఱి పట్టుకొని వెఱపించుచుఁ జిన్నివెన్నదొంగ చిక్కెననుచు నలిగి కొట్టఁజేతులాడక పూఁబోణి కరుణతోడ బాలుఁగట్టఁ దలఁచి వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా యెన్నఁడును వెన్నఁగానరఁటకదా చోరత్వం బించుకయును నేరరట ధరిత్రినిట్టి నియతులు గలరే పట్టాసపడక నిన్నుం బట్టెదమని చలముగొనిన బట్టుట బెట్టే పట్టువడవండ్రు పట్టీ పట్టుకొనన్ నాకుఁగాక పరులకు వశమే ఆలలన గట్టె ఱోలన్ లీలన్ నవనీతచౌర్యలీలుం బ్రియవా గ్జాలున్ బరివిస్మిత గో పాలున్ ముక్తాలలామఫాలున్ బాలున్

శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్దులారగించుట.

Image
శ్రీమద్భాగవతం లోని దశమస్కందంలో పోతనగారి పద్యం. శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్దులారగించుట. సీ. మాటిమాటికి వ్రేలుమడచి యూరించుచు నూరుగాయలు నుచుండునోక్క  డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి “చూడు లే” దని నోరు సూపు నొక్క  డేగు రార్గుర చల్దు లెలిమి బన్నిద మాది కూర్కొని కూర్కొని కుడుచు నొక్క  డిన్ని యుండగ బంచి యిడుట నెచ్చలితన మనుచు బంతెనగుండు లాడు నొకడు ఆ. కృష్ణు జూడు మనుచు గికురించి పలు మ్రోల, మేలి భక్ష్యరాశి మెసగు నొకడు నవ్వు నొకడు, సఖుల నవ్వించు నొక్కడు, ముచ్చటాడు నొకడు, మురియునొకడు.  భావం: వ్రేళ్ళమధ్యలో ఊరుగాయ ముక్కలు ఇరికించుకొని మాటి మాటికి ప్రక్కవాడిని ఊరిస్తూ తింటున్నా డొక గోపబాలుడు. మరొకడు ప్రక్కవాని కంచంలోనిది గభాలున లాక్కొని మ్రింగివేసి, వాడు చూడవచ్చేసరికి “ఏదీ ఏమీ లేదే” అని తన నోరు చూపించాడు. మరొకడు పందెం వేసి, అయిదారుమంది తినే చల్దిని నోట కూరుకొని కూరుకొని తింటున్నాడు.”ఒరే ఇన్ని పదార్ధాలున్నాయి, స్నేహమంటే ఒకరిదొకరికి పంచి ఇవ్వాలట్రా !” అంటూ ఒక్కక్కరి కంచంలోనిది ఒక్కక్కటి తీసుకుంటూ ‘బంతెన గుండ్లు’ అనే ఆట ఆడుతున్నాడు మరొకడు. “ఒరే...