జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది
శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన పాట! . జగమంతకుటుంబం పాట పల్లవి : జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది సంసారసాగరం నాదే, సన్యాసం , శూన్యం నావేలే చరణం : కవినై ,కవితనై ,భార్యనై ,భర్తనై మల్లెలదారుల్లో , మంచు ఎడారుల్లో పన్నీటిజయగీతల,కన్నీటి జలపాతాల నాతో నేను సహగమిస్తూ ,నాతో నేను రమిస్తూ ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కలల్ని,కథల్ని ,మాటల్ని , పాటల్ని ,రంగుల్ని ,రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ,ఆడపిల్లల్ని //జగమంత// శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన ఈ పాట ఆధారంగా చేసుకుని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ' చక్రం ' సినిమా నిర్మించారు .కానీ బ్రతికేవాడు ఎలా బ్రతకాలో తెలిపే పాటను చావబోయే వాడు చచ్చే ముందు చెప్పే ఫిలాసఫీ గా మార్చేసారు . కానీ ఆ పాటను వెలుగులోకి తెచ్ఛిన ఘనత ఆయనదే . 1+1 × 1-1 = 1 రెండు ఒకటి ( X+1 × X-1)+1 × ( 1 )-1 = 1 పై సమీకరణంలో ‘1’ రెండుగా (1+1 × 1-1) విడిపోయింది . రెండిట్లో ఒకటి (1+1) తిరిగి, క్రింది సమీకరణంలో , రెండుగా...