పోతన గారి నారదుడు !- (తెలుగు భాగవతం -ప్రధమ స్కంధము.)

పోతన గారి నారదుడు !-

(తెలుగు భాగవతం -ప్రధమ స్కంధము.)

.

క.

"వాయించు వీణ నెప్పుడు 

మ్రోయించు ముకుందగీతములు జగములకుం

జేయించుఁ జెవుల పండువు 

మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే!

భావము:

“ నారదమహర్షి సర్వదా మహతీ విపంచి వాయిస్తు, ముకుందగీతాలు మ్రోయిస్తు, సకల జగత్తులకు వీనులవిందు చేస్తు, లోకుల పాపసమూహాలను మాయిస్తు, సంచరించే మేటి భక్తుడు. 

ఆయనకు ఆయనే సాటి.”

Comments