Skip to main content
పోతన గారి నారదుడు !- (తెలుగు భాగవతం -ప్రధమ స్కంధము.)
పోతన గారి నారదుడు !-
(తెలుగు భాగవతం -ప్రధమ స్కంధము.)
.
క.
"వాయించు వీణ నెప్పుడు
మ్రోయించు ముకుందగీతములు జగములకుం
జేయించుఁ జెవుల పండువు
మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే!
భావము:
“ నారదమహర్షి సర్వదా మహతీ విపంచి వాయిస్తు, ముకుందగీతాలు మ్రోయిస్తు, సకల జగత్తులకు వీనులవిందు చేస్తు, లోకుల పాపసమూహాలను మాయిస్తు, సంచరించే మేటి భక్తుడు.
ఆయనకు ఆయనే సాటి.”
Comments
Post a Comment