పోతన పద్య మధురిమలు ముద్దులుగార-కరుణశ్రీ! .

పోతన పద్య మధురిమలు ముద్దులుగార-కరుణశ్రీ!

.

ఉ.

ముద్దులుగార భాగవతమున్రచియించుచు పంచదారలో

అద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ

ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీసిన తాటియాకులో

పద్దెములందు ఈ మధురభావములెచ్చటనుండి వచ్చురా!

.

పోతన కవిత్వం పంచదార పాకానికిప్రసిద్ధి. పోతనగారు ముద్దులొలికేలా అంత మథురాతి మధురంగా ఎలా రాయగలిగాడు అనిసందేహం వచ్చిందిట. ఆయనంటే కష్టపడితాటియాకులపై గంటంతో రాసారు. మహాకవి కదా, రవి గాంచని చోటే కాదు కాలం కాంచనిది కూడకనగలడు. తరువాతి తరాలలో సులువుగా కలం సిరాలో ముంచి రాసేవాళ్ళం కదా. పంచదార వాడిమధుర పదార్థాలు చేసేవాళ్ళం కదా. అవన్నీ తెలిసిన వాడు కనుకపంచదారలో గంటం అద్ది తాటాకుల మీదచెమటలు కాదు ముద్దులు కారేలా రాసారు. అలాకాకుండా వట్టి గంటంతో తాటాకులమీద అక్షరాలుగీకేస్తే పద్యాలకి ఇంత మాధుర్యం రాదు కదా.అన్నారు మన కరుణశ్రీ. ఆ రోజుల్లో పంచదార ఎక్కడది అని అడక్కండి.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!