ఊర్మిళ దేవి నిద్ర...




ఊర్మిళ దేవి నిద్ర...


జనకుడు,కుశద్వజుడు అన్నదమ్ములు . జనకుడు మిధిలకు రాజు. కుశద్వజుడు నాంకశ్య దేశానికి ప్రభువు. జనకునికుమార్తె సీత, కుశధ్వజుడికి ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తి అని ముగ్గురు కుమార్తెలున్నారు శివధనుర్భంగం చేసి శ్రీరాముడు సీతను పెళ్ళాడిన సమయంలోనే కుశధ్వజుడు కూడా తన కుమార్తెలు ముగ్గురిని రాముడి తమ్ములగు లక్ష్మణ, భరత, శత్రుఘ్నలకు ఇచ్చి వివాహం జరిపించెను . లక్ష్మణుడి భార్య ఊర్మిళ, భరతుడి భార్య మాండవి, శత్రఘ్నుడి భార్య శ్రుతకీర్తి.


పితృవాక్య పరిపాలనార్దం శ్రీరాముడు సీతను వెంటపెట్టుకుని అరణ్యాలకు పయనమైనప్పుడు అతన్ని విడిచిపెట్టలేక తమ్ముడు లక్ష్మణుడుకూడా వనాలకు బయలుదేరాడు . అప్పుడు ఊర్మిళ తానుకూడా రావడానికి అనుజ్ణ ఇవ్వమని భర్తను వేడుకున్నది. అయితే లక్ష్మణుడు అందుకు అంగీకరించక...


దేవి ! నిద్రాహారాలు లేకుండా పదునాలుగేండ్లు సీతా – రాముల వెంట ఉండి వారికి సేవచేయడానికి వెడుతున్నాను నేను, అయిననూ సూర్య వంశ స్త్రీలు బావగారు నడిచిన త్రోవన నడవరాదు కాబట్టి నీవు అరణ్యాలకు రావడంతగదు అని నచ్చచెప్ప ప్రయత్నం చేయపోవునంతలో...


రక్షకబటుడు వచ్చి రాజా! మిమ్ములను రాముల వారు పిలిస్తున్నారు అని చెప్పెను అంత లక్ష్మణుడు ఊర్మిళతొ నీవు ఇచటనే నిలిచి ఉండు అన్నగారి తొ మట్లాడి వచ్చెను అని వెడలెను భర్త ఆజ్ణ శిరసావహించి అయోధ్యలోనే ఉండిపోయింది ఊర్మిళ. వెళ్ళిన వాడు ఎంత సేపటికీ రాక తన భర్త రాకకై ఎదురు చూస్తూ అలానే నిలిచి వున్నది.అంత లక్ష్మణుడు రాముడిని కలిసిన ఆనందంలో ఊర్మిళ విషయాన్ని మరిచి అరణ్యానికి పయనము అయ్యెను .


అక్కడ అడవుల్లో నిద్రాహారాలు లేకుండా, సీతారాములను కంటికి రెప్పలా కనిపెట్టుకుని సేవలు చేస్తూ కఠోరదీక్షలో ఉన్నాడు లక్ష్మణుడు ఇక్కడ ఊర్మిళా దేవి తన భర్త రాకకై తను నడిచి వెళ్ళిన మార్గంలొనె ఎదురు చూస్తూ అలానే నిలబడి వుంది .


అంత అక్కడ కఠోరదీక్షలో ఉన్న లక్ష్మణుడికి ఒకనాడు నిద్రాదేవి ప్రత్యక్షమై, అతనిముందు నిలిచింది . అప్పుడతను “ తల్లీ ! నా యందు దయవుంచి ఈ పదునాలుగేండ్లూ నాచెంతకు రాకు .. నాకు మారుగా అయోధ్యలో ఉన్న నా భార్య ఊర్మిళను ఆవహించు “ అని నిద్రాదేవిని వేడుకున్నాడు.


అంతే మరుక్షణం అక్కడ నిలిచి ఉన్న ఊర్మిళకు నిద్ర ముంచుకొచ్చింది ..ఆ మహాతల్లి ఆ పదునాలుగేండ్లు నిలిచే కళ్లు తెరిచి తన భర్త వెళ్లిన మార్గంలోకి చూస్తూ నిద్ర పోతూ ఉంది. ఆ మహాపతివ్రత ప్రబావం వలన రామ-రావణ యుద్దంలొ లక్ష్మణునికి ఎటువంటి హాని జరగలేదు అని ఒక నానుడి.


సీతా రామలక్ష్మణులు అయోధ్యకు తిరిగివచ్చిన తరువాత ఆ మహా తల్లిని నిద్రలేపారు. లక్ష్మణుడి ఆనవాళ్ళు చెప్పి అతనిని ఆమెకు చూపించిన తరవాత గాని ఆమె గుర్తించలేకపోయింది.

.


.

ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు. వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది. కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు. అలా ఒంటరిగా వదిలివేయబడ్డ ఊర్మిళా, అడివికి వెళ్ళిపోతున్న లక్ష్మణుడూ ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం లక్ష్మణుడు తన నిద్రని ఊర్మిళకిస్తాడు. ఊర్మిళ తన మెలకువని లక్ష్మణుడికిస్తుంది. తన భర్త అడివిలో ఉన్న పధ్నాలుగేళ్ళూ ఊర్మిళ నిద్రపోతుంది. లక్ష్మణుడు ఆ పధ్నాలుగేళ్ళూ పూర్తిగా మెలకువగానే ఉంటాడు. ఊర్మిళ భర్తృవిరహాన్ని అనుభవించనక్కర్లేకుండా, లక్ష్మణుడు తన భార్య జ్ఞాపకాన్ని మరిచిపోనక్కర్లేకుండా ఈ చమత్కారమైన ఊహ చేశారు తెలుగు ఆడవాళ్ళు.

.

శ్రీరామభూపాలుడూ పట్టాభిషిక్తుడై కొలువుండగా

భరత శతృఘ్నులపుడూ సౌమిత్రి వరుస సేవలు సేయగా

మారుతాత్మజులప్పుడూ రాఘవుల జేరి పాదములొత్తగా

సుగ్రీవుడాకొలువులో కూర్మితో నమ్రుడై కొలువుండగా

.

సకలదేవతలు గొలువా ఉదయాన పుష్పవర్షము గురిసెను

సీతాదేవి వచ్చి రాముడివైపు తిరిగి “రామమచంద్రా, మనం అడివికి వెళ్తున్నపుడు, లక్ష్మణుడితోపాటు ఊర్మిళ కూడా వొస్తానంది, అందుకు లక్ష్మణుడు ఒప్పుకోలేదు, అప్పటినించి ఆవిడ నిద్ర పోతోంది. లక్ష్మణుడిని వెళ్ళి ఆమెను లేపమనండి.” అని సవినయంగా మనవి చేస్తుంది.

తాము అడివికి వెళ్ళిన రోజు మొదలుకొని ఊర్మిళ నిరంతరాయంగా నిద్రపోతోందని రాముడికి అప్పుడే తెలుస్తుంది. వెంటనే తమ్ముణ్ణి వాళ్ళావిడ దగ్గరికి పంపిస్తాడు, ముందు ఊర్మిళని నిద్రలేపి ఆవిడని సంతోషపరచమని. రామాజ్ఞ శిరసావహించి లక్ష్మణుడు అప్పుడు భార్య దగ్గరికి వెళతాడు.

నిద్రపోతున్న ఊర్మిళ చీర సవరించి, ఆవిడ పక్కనే కూర్చుంటాడు. ప్రేమగా ఆవిడతో మాట్లాడడం మొదలు పెడతాడు.

కొమ్మ నీ ముద్దుమొగమూ సేవింప కోరినాడే చంద్రుడూ ….

అమృతధారలు కురియగా పలుకవే ఆత్మ చల్లన చేయవే

అ నిద్రలో తన గదిలోకి ఎవరో పరపురుషుడు ప్రవేశించాడనుకుంటుంది ఊర్మిళ.

తన్ను తా మరచియున్న ఆకొమ్మ తమకమున వణకదొడగే


మాతండ్రి జనకరాజూ వింటె మిము ఆజ్ఞసేయక మానడూ

మా యక్క బావ విన్నా మీకిపుడు ప్రాణముల హాని వచ్చూ

మాయక్కమరది విన్నా మిమ్మిపుడు బ్రతుకనివ్వరు జగతిలో

.

హెచ్చయిన వంశానికీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ

కీర్తి గల ఇంట బుట్టీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ


ఒకడాలి కోరిగాదా ఇంద్రునికి ఒడలెల్ల హీనమాయే

పరసతిని కోరి గాదా రావణుడు మూలముతొ హతమాయెనూ

.

ఆడతోడా బుట్టరా మావంటి తల్లి లేదా మీకును

.

శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరు గలరా?

జనకునల్లుని గానటే? భూమిలో జనకులనగా నెవ్వరు?

శతపత్రమున బుట్టినా చేడెరో సీతకూ మరిదిగానా?

సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ] సృష్టిలో నేను యెరుగ


న్ను బాసినది మొదలూ ప్రాణసఖి నిద్ర హారములెరుగనే

నీవు లేవకయున్ననూ ఓ సఖీ ప్రాణములు నిలుపలేనే


మా తండ్రి జనకరాజూ మిమునమ్మి మరచి కళ్యాణమిచ్చే

మానవంతల్లుడనుచూ తెలియకా మదిని ఉప్పొంగుచుండే

చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా


సింహవిక్రములు మీరూ ఉండగా సీతెట్లు చెరబోయెనూ?

ఇది విశేషమైన ప్రశ్న. లక్ష్మణుడి పరాక్రమం మీద ఊర్మిళకి అపారమైన విశ్వాసం ఉందని ఇప్పుడు చెప్పించడంలో కవయిత్రి ఉద్దేశించిన సూక్ష్మం ఒకటి వుంది. ఇంతవరకూ ఊర్మిళ అన్న మాటలవల్ల దెబ్బ తిని, కుంగిపోయిన అతని ఆత్మ విశ్వాసాన్ని, మళ్లా ఆవిడే పునరుద్ధరించగలదు. మొగవాళ్ల బలమూ బలహీనతా కూడా ఆడవాళ్ల చేతుల్లోనే వున్నాయని కవయిత్రికి తెలుసు..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!