ఆది శంకరాచార్య భజగోవిందం - (130217)

ఆది శంకరాచార్య భజగోవిందం - (130217)

.

శ్లోకం - 3

నారీస్తనభర నాభీదేశం 

దృష్ట్వా మాగామోహావేశం |

ఏతన్మాంసవసాది వికారం

మనసి విచింతయ వారం వారం ||

.

శ్లోకం అర్ధం : స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. 

అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల 

వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము.

తాత్పర్యము : స్త్రీల అందమైన సుందర భాగాలను గని మందమతివై భ్రమించకుము. 

అందాలు అనుకొనే ఆ శరీర భాగాలు రక్తము, మాంసము, కొవ్వు మొదలగు జుగుప్సాకరమైన పదార్థ నిర్మితములే. 

వయసు మళ్ళగా, వృధ్యాపము దాపరించగా, ఆ శరీరపు పొంగుల వన్నెలు తగ్గి, ఎముకల గూటిపై చర్మముగా మారును. 

ఈ శరీరము పుడమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూత నిర్మితమై, జడమైన రక్త, మాంస, రస దుర్గంధ భూయిష్టమై, కేవలము చర్మముతో కప్పబడిన తోలు తిత్తి. 

దానిని ఆ పంచభూతములే కాక, రోగము, వృధ్యాపము కూడా నాశనము చేయగలవు. కనుక ఆ శరీరపు అందములు చూచి మోసపోయి, వానిని బడయవలననే ఆశా మోహముల నొందకుము. 

సప్త వ్యసనాలలో ప్రధమమైనది, మహా భయానకమైనది స్త్రీ మోహం. 

దానివల్ల మానవ జాతికి ఎన్నో కష్టనష్టాలు జెరిగినవి. కనుక, 

ఈ విషయము ఎల్ల వేళలా గుర్తుంచుకొని సన్మార్గమునందు నడుద్దాము.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !