పోతన - శ్రీమద్భాగవతం....... పంచమ స్కంధం..

పోతన - శ్రీమద్భాగవతం....... పంచమ స్కంధం..

.

బహుకుటుంబి యగుచు బహు ధనాపేక్షచే

నెండమావుల గని యేగు మృగము

కరణి బ్రేమ జేసి పరువులు వాఱుచు

నొక్కచోట నిలువకుందురెపుడు

.

.

ఈ మనుషులు తమతమ కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటారు .

డబ్బు మీద వ్యామోహం పెంచుకుంటారు. లేళ్లు ఎండమావుల వెంట పరుగులు తీసే విధంగా కోరికలను నెరవేర్చుకోవాలనే అత్యాశతో మానవులు ఎక్కడా నిలకడగా ఉండక

నిరంతరం పరుగులు పెడుతుంటారు.

అల్పధనుడు విశ్రమాస్థానముల దృప్తి

బొందకొరుల ధనము బొందగోరి

యరిగి వారి వలన నవమానముల బొంది

యధికమైన దుఃఖమనుభవించు

.

ధనం తక్కువగా ఉన్నవాడు, అంటే కొద్దిపాటి ఆస్తి మాత్రమే ఉన్నవాడు, 

తనకు ఉన్న ధనం, గృహం, విశ్రాంతి మందిరాలతో తృప్తి చెందడు. 

అంతటితో ఊరుకోక పక్క వారి ధనాన్ని కూడా పొందాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఇతరుల వలన అవమానాలు పొందుతాడు.

అంతేకాక మరింత దుఃఖాన్ని అనుభవిస్తాడు.

.

అంతగొందఱల్ల నన్యోన్య విత్తాది

వినిమయమున గడుబ్రవృద్ధమైన

వైరములను బొంది పోరాట వొందుదు

రాత్మ చింతలేక యనుదినంబు

.

.

కొందరు డబ్బుకి సంబంధించిన లేదా ద్రవ్యానికి సంబంధించిన లావాదేవీల కారణంగా ఒకరితో ఒకరికి శత్రుత్వం ఏర్పడుతుంది. అంతేకాక ఆ శత్రుత్వం రోజురోజుకీ పెరుగుతుంది. ఇలా నిరంతరం పోరాడే స్వభావంతో ఒకరిమీద ఒకరికి ప్రేమ, అభిమానం లేకుండా పోతాయి...

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!