ఆంధ్రుల దాస్యవిముక్తి.

కామేశ్వర రావు భైరవభట్ల  గారి బ్లాగ్ నుండి.

ఆంధ్రుల దాస్యవిముక్తి


కాలము మారె; మ్రోడయిన కట్టెను కెంజిగురాకులొత్తే; జం

బాలమునందు రక్తదళ పద్మిని మోసిడి పూలు పూచె; నం

ధాలయమందు స్వర్ణ కిరణాంకురముల్ జనియించి భావ భూ

తాలను బారదోలి చిర దాస్యతమస్సు నడంచె నాంధ్రుడా!



ఇది దువ్వూరి రామిరెడ్డి పద్యం. ఈ పద్యాన్ని చదవగానే, ఎందుకో ఠక్కున మరో పద్యం గుర్తుకువచ్చింది. అది దాశరథి మహాంధ్రోదయంలోని పద్యం:


వెలుతురుబాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి గుం

డెలు జిలుజిల్లనన్ రుధిర నిర్ఝరిపారె, దిగంగనా ముఖ

మ్ముల నవకుంకుమప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు, త

ల్పులు తెరువుండు రండు పిలువుండు శయించినవారినెల్లరన్!


దువ్వూరి, దాశరథి వారి యీ రెండు పద్యాలలో నాకు చాలా సామ్యము కనిపిస్తోంది.

రెండు పద్యాలూ ఆంధ్రుల దాస్యవిముక్తి గూర్చినవి. రెంటిలోనూ దానిని ఒక నవోదయంతో పోల్చడమే కాక, ఆ ఉదయ వర్ణన కూడా చాలా దగ్గరగా ఉంది. ఇద్దరూ సూర్య కిరణాలనీ, తామర మొగ్గలనీ కొత్త ఆశలకు, ఆలోచనలకు ప్రతీకగా చేసుకున్నారు. "రుధిర నిర్ఝరిపారె" అని దాశరథి అంటే, "రక్త దళ పద్మిని మోసిడి పూలు పూచె" అని కవికోకిల అంటారు. ఇద్దరి లోనూ విప్లవ ఛాయ గోచరిస్తుంది.


Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.