మన రమణగారి జోకు..!

.

ఒక అడవిలో ముగ్గురు మునిపుంగవులు దీర్ఘ తపస్సు చేసుకుంటున్నారుట. 

ఒక గుర్రం వారి పక్కనించీ చకచకా పరుగెడుతుంది. 

ఆ గుర్రం అలా వెళ్ళిన ఆరు నెలలకి, ఒక ముని అంటాడు, “తెల్ల గుర్రం ఇలా పరుగెత్తింది” అని. 

అది విన్న ఇంకో సంవత్సరానికి, రెండో ముని అంటాడు, “అది తెల్ల గుర్రం కాదు. నల్ల గుర్రం” అని. 

అది జరిగిన ఇంకో రెండు సంవత్సరాలకి, మూడో ముని కోపంతో లేచి, “మీరు చీటికీ మాటికీ ఇలా వాదించుకుంటుంటే, నా తపస్సు ఎలా చేసుకునేది” అని అక్కడనించీ వెళ్ళిపోతాడు. 

అదీ మన రమణగారి జోకు.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!