భాగవతం ..పోతనామాత్యుడు !

భాగవతం ..పోతనామాత్యుడు !

.

"కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే

వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపైఁ

భేరైనం గలదే శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై

యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!

.

దానం ఈయవద్దని చెప్పిన రాక్షసగురువైన శుక్రాచార్యుడితో బలిచక్రవర్తి పలికిన పలుకులు.

ఓ గురుదేవా! ఆదినుండీ ఎందరెందరో రాజులు కాలేదా? వారికి ఎన్నెన్నో సామ్రాజాలు సిద్ధించలేదా? ఆ రజ్యాధీశులు ఎంతెంత గర్వాహంకారాలు ప్రదర్శించారో కదా? మరి వారంతా యేరి? సిరిమూటకట్టుకొని వెళ్ళగలిగారా? లేదే. ఈ భూమిపై వారి పేర్లైనా మిగిలి ఉన్నాయా? కానీ శిబిచక్రవర్తివంటి మహాదాతలు కీర్తికాములై, ప్రేమతో అడిగినవారి కోర్కెలు తీర్చలేదా? వారిని ఈనాటికైనా ఎవ్వరైనా మరచిపోగలిగారా?

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.