Skip to main content
---శుభోదయం -సూక్తులు------
---శుభోదయం -సూక్తులు------
భక్తి పత్రమొ పుష్పమో ఫలమో తోయ
మో యొసంగక వేలుపు లోసగ రెందు
బొంగి పొరలెడి ప్రేమ నొసంగు; వలయు
నన్ని సుఖములు తనుదానె కన్నతల్లి !
పత్రము,పుష్పము, ఫలము,నీరు భక్తితో సమర్పిస్తేనే దేవుడు వరాలిస్తాడట. (అదీ అనుమానమే) ప్రతిఫల మాసింపక మనకు అన్ని సుఖములు,ప్రేమ,వాత్సల్యము యిచ్చేది కన్నతల్లి ఒక్కతే
.
పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం నృణాం
ధర్మే స్వయ మనుస్టానం కస్య చిత్తు మహాత్మనామ్
.
అర్థము:-- పరులకు ఉపదేశము చేయడములో అందరూ మహా పండితులే కానీ స్వయముగా తాము
ధర్మము పాటించడము మాత్రం ఎవరో మహాను భావులు మాత్రమే చేయగలరు.
ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే
పయః పానం భుజంగానాం కేవలం విష వర్ధనం
తా:-నీచులకు ఉపకారము చేసినా వాళ్ళు మనకు అపకారమే చేస్తారు.ఎలాగయితే పాముకు పాలు పోయడం వలన దానికి విషము వృద్ధి యై మనల్ని కాటువేస్తుందో అలాగ.
మాతా పిత్రో ర్నిత్యం ప్రియం కుర్యాత్
ఆచార్యస్య చ సర్వదా
తేషు హి త్రిషు తృప్తేషు
తపస్సర్వ సమాప్యతే
.
అర్థము:-- తల్లి తండ్రులతో, గురువులతో ఎప్పుడూ ప్రియముగా మాట్లాడ వలయును. వారు చెప్పినట్టు నడుచుకొని వారికి సంతోషము కలుగ జేయ వలయును. ఈ ముగ్గురు తృప్తి చెందినచో సర్వ తపములు ఫలించి నట్లే.
మాతృవత్పరదారాంశ్చ పరద్రవ్యాణి లోష్టవత్
ఆత్మవత్స్స ర్వ భూతాని యః పశ్యతి స పండితః
అర్థము:-పరస్త్రీలను తల్లి లాగానూ, యితరుల ధనమును మట్టి పెళ్లలు లాగాను,
అన్ని భూతములు తనలాగా చూసే వారే నిజమైన పండితులు.
Comments
Post a Comment