గజేంద్ర మోక్షం పద్యాలు.
గజేంద్ర మోక్షం పద్యాలు. . కరి దిగుచు మకరి సరసికి కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ !! . కలడందురు దీనుల యెడ కలడందురు భక్త యోగి గణముల పాలం గలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో !! . లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !! . ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై? ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !! . లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !! . అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి హ్వల నాగేంద్ర...
.jpg)
సీతారాముల కథను మనకు చెప్పిన మొదటివారు వాల్మీకి మహర్షి. అయన వ్రాసినది ఆయనస్వకపోలకల్పితకథ అనుకుంటే దానిని మార్చిమార్చి వాల్మీకికి విరుధ్దంగా చెప్పి అదట ఇదట నిజం అనటంలో అర్థం లేదు. అది కాదండీ, వాల్మీకి రాముడికథను యథాతధంగా చెప్పారూ అంటారా, అప్పుడు ఆయన చెప్పినదే ప్రమాణం కాబట్టి వాల్మీకి చెప్పిన కధను మనం మార్పులు చేసి అది నిజం ఇది నిజం అనటం అనుచితం అవుతుంది. కాబట్టి వాల్మీకి చెప్పని విషయంతో జనానికి గందరగోళం సృష్టించటం మంచిది కాదు. దయచేసి ఇలాంటి కథలు చెప్పకండి. మరెవరు చెప్పినా వినకండి.
ReplyDeleteబాగుంది. మీ వివరణ.
DeleteThis comment has been removed by a blog administrator.
Delete