Skip to main content
త్రిజటా స్వప్న వృత్తాంతము !
త్రిజటా స్వప్న వృత్తాంతము !
( అధ్యాత్మ రామాయణము నుండి)
,
లంకా పట్టణములో - అశోక వనములో - శింశుపా వృక్షము నీడలో సీత కలదు.
ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా ఉంటున్నారు.
వారు సీతను భయపెట్టుచూ ఆమెపై ఒత్తిడి తెచ్చుచున్నారు -
అట్టి పరిస్థితులలో త్రిజట (విభీషణుని కుమార్తె) అక్కడి రాక్షస స్త్రీలతో
తన స్వప్న వృత్తాంతమును ఈ విధముగా తెలిపెను:
.
వనితారత్నములార! చోద్యమగు స్వప్నంబొండు నే గాంచితిన్
మనమారన్ వినిపింతు సత్యములగున్ నా స్వప్నముల్ సర్వదా
జనకేశాత్మజయైన యీ సుముఖియే సాక్షాద్రమాదేవి కా
వున నే దుష్కృతమైన పూన వలదీ పూబోడి పై నెన్నడున్
.
రాజీవ నేత్రుడౌ రాముడు సహజుతో
....నైరావతము నెక్కి యరుగుదెంచి
లంకాపురిని గాల్చి రావణాసురు గూల్చి
.
....సీతతో గిరిపైని చేరినట్లు
దశకంఠు డొడలికి తైలంపు బూతతో
....బట్టలు విడనాడి పట్టణమున
పుత్ర పౌత్రుల గూడి పుర్రెల చేబూని
....కొలనిలో దిగినట్లు గోచరించె
.
వినయమున రాముజేరె విభీషణుండు
కనుడు రావణ వంశ నాశనమొనర్చి
రాముడు విభీషణునకు నీ రాజ్యమునిడి
సీతతో తన నగరికిన్ జేరగలడు
.
త్రిజట మాటలు వినినట్టి స్త్రీలు మనము
లందు మిక్కిలి భయమొంది యవనిజాత
యందుదాసీనలై వ్రాలి యందు నందు
చింతనల మాని నిద్దుర జెంది రంత
Comments
Post a Comment