దోమలగూడ నుండి దానావాయి పేట వరకు.! .

దోమలగూడ నుండి దానావాయి పేట వరకు.!
.

ఈ విశాల ప్రపంచంలో ప్రాణికోటిని సృష్టిస్తున్న క్రమంలో ఆ భగవంతుడు దోమల్ని కూడా సృష్టించి భూమ్మీదకు వదులుతుండగా` ‘ఇంత చిన్నప్రాణులం. ఇంత పెద్ద మనుషుల మధ్య, జంతువులమధ్య మేం ఎలా బతికేది?‘అంటూ దోమలు భగవంతుడ్ని అడిగాయి. అప్పుడు ఆ దేవుడు`’ మూసీనదీతీరంలో అభయారణ్యంలో జీవించమని ఆదేశించాడు. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దోమలు గూడుకట్టుకున్న ప్రాంతం కావడంతో ఆ అడవి ప్రాంతం ‘దోమలగూడ’గా ప్రసిద్ధికెక్కింది. క్రమక్రమంగా దోమజాతి వృద్ధి చెందడంతో మరో సురక్షిత ప్రదేశం కోసం అన్వేషిస్తూ కొన్ని దోమలు గోదావరీనదీ తీరం చేరుకున్నాయి. అక్కడ నివశించే ప్రజల్ని చూడగానే దోమలకు ఉత్సాహం ముంచుకొచ్చి జనాన్ని కుట్టివాయించేశాయి, దోమలు వాయించే ప్రాంతం కావడంతో ఆ ప్రాంతం ‘దోమవాయిపేట’గా పిలవబడిరది.ఆ తర్వాత కాలంలో అదే దానవాయిపేటగా రాజమండ్రిలో ఓ భాగమైతే`దోమల గూడ హైదరాబాద్‌లో ఓ ముఖ్య ప్రాంతంగా విరాజిల్లుతోంది.

Comments