గోదావరి ..శ్రీ నాధుడు !

గోదావరి ..శ్రీ నాధుడు !
.
రాజమహేంద్రవరం వద్ద గోదావరి విస్తృతమైనట్లు శ్రీనాధుని కాలానికి వచ్చేటప్పటికి గోదావరి విస్తృత రచనావస్తువయింది. “త్ర్యంలుకాచల శిఖరాగ్రంబునందుండి” సముద్ర పర్యంతమూ ప్రవహించిన గోదావరిని శ్రీనాథుడు రసవత్తర పద్యాలలో ప్రతిబింబింపజేస్తూ “గౌతమీగంగ లవణాబ్దిగౌగలించే“ అంటూ ఆద్యంతం మనోహరంగా వర్ణిస్తాడు.

“కాశింజచ్చిన యంత వయంగారాని కైవల్యమ

క్లేశంబై నమవేద్యనాయకుని చే లీలాగతింజేరు రా

రో శీఘ్రంబున మర్తుయలారా! యను నారూపంబు

నమ్మోయునా కాశాస్పాలన గౌతమీజలధికీల్లోల స్థానముల్“

అంటూ శ్రీనాధమహాకవి తనన్పుకంఠంతొ మనుష్యులందర్నీ పాత్రోచితంగా ఆహ్వానించాడు. ఇందులో గోదారి పిలుపు తనకంఠంలో ప్రతిధ్వనించాడు.

“గోదావరి గోదావరి

గోదావరియంచు పల్కు గుణవంతులమేన్

గోదావరి తల్లి న

పాదింతు గదమ్మ భవ్య శుభంబుల్“

అంటూ నదీ మహాత్మ్యాన్ని తెలుపుతూ గోదావరి నామోచ్చారణతో పొంగి పులకించి పోయినవాడు శ్రీనాధుడు. తన కవితా మాధుర్యంతో “సప్తగోదావరీ జలముతేనె” అని రూఢిపరిచాడు. వార్ధులేడింటికిన్ వలపువనిత” అని గోదావరి మరో కోణంలోనూ చూపాడు. ఆ నకతశ్రేష్టుడైన శృంగారకవి “నేటివ్ స్పిరిట్” తో ” సన్నాఫ్ ది సాయిల్“గా తన వివిధ గ్రంధాలలో శ్రీనాధుడు గౌతముని ఆబగా వర్ణించాడు.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.