మూడు యేడుపులు ..తెనాలి వారి వ్యాఖ్య !

మూడు యేడుపులు ..తెనాలి వారి వ్యాఖ్య !

అల్లసానిపెద్దన అటు నిటుగా యేడ్చే..

అల్లసాని పెద్దన వ్రాసిన మనుచరిత్ర ప్రబంధం లోని వరూధిని ఏడుపు వర్ణన.

.

పాటున కింతు లోర్తురే కృపా రహితాత్మక నీవు త్రోవ ని 

చ్చోట భవన్నఖాంకురాము సోకే కనుంగొనుమంచు జూపి య 

ప్పాటల గంధి వేదన నెపంబిడి యేడ్చే కలస్వనంబుతో 

మీటిన గబ్బి గుబ్బ చనుమిట్టల నశ్రులు చిందువందగాన్ 

.

అర్థము:--

తనను ప్రేమించమని వేడుకుంటూ కాదంటే మీద పడి కౌగలించుకున్నవరూధినిని ప్రవరుడు తనచేతులతో త్రోసి వేశాడు.అప్పుడు ఆమె నీవు తోసి వేస్తేఆ దెబ్బకు ఆడవాళ్ళు ఓర్చుకుందురా?దయలేనివాడా నీవు త్రోసినప్పుడు నీ వేలి గోరు నాకు గ్రుచ్చుకొని గాయమయింది చూడు అని తన వక్షస్థలమును చూపి ఆ వరూధిని మధురమైన గొంతుతోవేదన అనే సాకు తో తన గోటి తో చిమ్మినకన్నీరు ఆమె వక్షస్థలము పై చింది పడుచుండగా యేడ్చేను.

.

ముక్కుతిమ్మన ముద్దు ముద్దుగా నేడ్చే...

ముక్కుతిమ్మన వ్రాసిన "పారిజాతాపహరణము"లో సత్యభామ ఏడుపు వర్ణన .

.

ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబు చే

గాసిలి యేడ్చే ప్రాణవిభు కట్టె దుటన్ లలితాంగి పంకజ 

శ్రీ సఖ మైన మోము పయి చేల చెరంగిడి బాల పల్లవ 

గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూ కల కాకలీ ధ్వనిన్ 

.

అర్థము:--

మనసులో ఈర్ష కోపము ,శోకము కలిసి హెచ్చిన దావానలముతో మండి పోయి వెక్కి వెక్కి తన భర్త యెదుటఆ లలితమైన అంగములు కల సత్యభామ తామర పూవు వంటిఅందమైన తన ముఖముపై పైట చెరగు కప్పుకొని లేత మామిడి చిగుళ్ళు తిని కూసిన కోకిల కూత వలె మధురము గా యేడ్చింది.

.

భట్టుమూర్తి బావురుమని యేడ్చే...

భట్టుమూర్తి వ్రాసిన వసు చరిత్ర లో నాయిక గిరిక ఏడుపు వర్ణన .

.

ఆజాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక రాకా నిశా

రాజశ్రీ సఖమైన మోమున పటాగ్రం బొత్తి యెల్గెత్తి యా 

రాజీవానన యేడ్చే కిన్నెర వధూ రాజత్కరాంభోజ కాం 

భోజీ మేళ విపంచికా రవ సుధా పూరంబు తోరంబు గాన్ 

.

ఆవెన్నెల వెలుగు రేపిన విరహాన్ని భరించలేక చంద్ర బింబము వంటి 

తన ముఖము పై తన పైట చెరగు కప్పుకొని ఆ తామరపూవు వంటి ముఖము గల వనిత కిన్నెర కాంతలు తమ వీణ మీద కాంభోజీ రాగము 

మేళ వించి పాడినట్టుగా అమృత మైన గొంతు తో ఎలుగెత్తి గట్టిగా యేడ్చింది

..

అందుకే ఈ మూడు యేడుపులమీద రామకృష్ణుడి వ్యాఖ్య 

.

అల్లసానిపెద్దన అటు నిటుగా యేడ్చే 

ముక్కుతిమ్మన ముద్దు ముద్దుగా నేడ్చే 

భట్టుమూర్తి బావురుమని యేడ్చే

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!