దీపం జ్యోతి పరబ్రహ్మః

దీపం జ్యోతి పరబ్రహ్మః

దీపం సర్వతమో పహమ్దీపేన సాధ్యతే సర్వమ్సంద్యాదీప నమోస్తుతే!!

సాయం సమయంలో...

సాయం సమయంలో ప్రమిదల్లో నూనె పోసి దీపాలను వెలిగించాలి. అది మనసంప్రదాయం కూడా. వాకిలి ముందు ప్రమిదలను వెలిగించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. దీపాన్ని ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ దీపదర్శనం చేస్తారో ఆ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారు పాప విముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందుతారు. ఇతరులు వెలిగించిన దీపాన్ని ఎవరు ఆరిపోకుండా చూస్తారో వారు ఉత్తతమమైన ఫలితాన్ని పొందుతారు. కార్తీకమాసంలో సువాసినులు ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఆ సమయంలో లక్ష్మీదేవిని ఓం లక్ష్మైనమః అన ధ్యానించి పూజిస్తారు. లక్ష్మీదేవి వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి సమస్త కోరికలు నెరవేరుతాయి

Comments