వివేకచూడామణి ! (2వ భాగం .)

వివేకచూడామణి !

(2వ భాగం .)


-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు. 

-

కాలం, దేశం, కారణం :

ఈ రెండు రకాలైన ప్రపంచాలకు కాల, దేశ, కారణ నియమాలు ఉన్నాయి. ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అనే ప్రశ్నలు సదా పుడుతుంటాయి. ఈ మూడుప్రశ్నలు కాల, దేశ, కారణాలకు సంబంధించినవి. బాహ్యాంతర ప్రపంచమంతా, ఈ మూడిటి సంయోగ ఫలితమే అని చెప్పవచ్చు.

ఉదయం తూర్పున ఉన్న సూర్యుడు, సాయంత్రం పడమరలో ఉంటాడు. ప్రొద్దు, సాయంత్రం కాలాన్ని తెలియచేస్తాయి; తూర్పు, పడమర దేశాన్ని తెలియచేస్తాయి. ఈ ఉదయాస్తమయాలను స్వాభావికమని మనసు ఒప్పుకోదు. దాని వెనకాల ఉన్న కారణం తెలుసుకోవాలనుకుంటుంది. ఎందువల్ల అనే ప్రశ్న పుడుతుంది. దానికి సమాధానం దొరికే వరకు మనసుకు శాంతి ఉండదు - ఎందువల్ల - ‘మనం భూమిమీద ఉన్నాం కాబట్టి, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది కాబట్టి, సూర్యుడు తానున్న చోటనే కదలకుండా ఉన్నందువల్ల, (ఈ మూడు ప్రశ్నలే కాక ‘ఎవరు’ ఏమిటి?’ అనే ప్రశ్న సాధారణంగా ఎదురవుతుంటుంది. అది నామ, రూపాలకు సంబంధించిన ప్రశ్న. ‘రాముడు ఎవరు?’ అని అడిగినప్పుడు పేరు తెలుసుకాని రూపం తెలియదని అర్థం; ‘అతను ఎవరు?’ అన్నప్పుడు రూపం తెలుసుకాని, పేరు తెలియదని అర్థం. ‘అది ఏమిటి?’ అన్నప్పుడు రూపం, పేరు కూడా స్పష్టంగా తెలియలేదని అర్థం).

‘రాముడు ఉన్నాడు’ అని మనం చెప్తే సరిపోదు. ‘ఎప్పుడు ఉన్నాడు?’ ‘ఎక్కడ ఉన్నాడు?’ ‘ఎందుకు ఉన్నాడు?’ అనే ప్రశ్నలు వెంటనే పుడతాయి. ఉదయం


భార్య మీద కోపంతో ఉడికిపోతున్న మనసు, రాత్రికి ప్రశాంతంగా అనురాగంతో నిండిపోతుంది. ఎందుకు? (ఆ ప్రశ్నకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు). దేశ నియమం, కాల నియమం, కారణ నియమం ఈ మూడు ఈ దృశ్య ప్రపంచానికి ప్రధాన లక్షణాలు. (Basic Qualities).

ఈ రోజు మన ఇంట్లో ఉన్న బల్ల, మంచం పది సంవత్సరాల క్రిందట అడవిలో ఒక చెట్టు. 100 ఏళ్ళ క్రిందట అది మరొక చెట్టు విత్తనం. మనకు ఇప్పుడు మహాసముద్రంగా కనపడే నీరు, ఒకప్పుడు నదీ ప్రవాహం. అంతకు ముందు అది వర్షం. అంతకు ముందు అది మేఘం. అంతకు ముందు అది వేరొక సముద్రం. ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే, ఈ దృశ్యప్రపంచం సదా మార్పులు చెందుతూ, ఇప్పుడు మనకు కనిపించే విధంగా పూర్వం లేదని, ఇక ముందు కూడా ఈ విధంగా ఉండదని మనం చెప్పగలం.

మార్పు, మార్పు, మార్పు – ఇది ఈ దృశ్యప్రపంచ ప్రధాన లక్షణం. ఈ మార్పు ఒక బాహ్య ప్రపంచానికే కాక, అంతఃప్రపంచంలో కూడా ఉంటుంది. ఒకప్పుడు కోపం, ఒకప్పుడు శాంతం, ఒక చోట ద్వేషం, ఒక చోట రాగం, విజయం సాధించటం వల్ల ఆనందం, ఓడిపోవటం వల్ల దుఃఖం, ఇవన్నీ మనకు అనుభవమే. ఈ దేశ, కాల, కారణాలతో నిమిత్తం లేని, ఈ మార్పులేని ప్రపంచాన్ని మనం ఊహించటం కూడా కష్టం.

(ఇంకావుంది.)


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!