వశిష్ఠుని విందు !

వశిష్ఠుని విందు !

-

విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు.


ఒకరోజు ఒక అక్షౌహిణి సైన్యంతో వేటకై వెళ్ళి, అలసి, వశిష్ఠ మహర్షి


ఆశ్రమానికి చేరుకొంటాడు. కుశల ప్రశ్నలు, అర్ఘ్యపాద్యాదులు అయ్యాక,


విశ్వామిత్రుడు సెలవు తీసుకోబోగా, వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం


స్వీకరించవలసిందిగా కోరుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు "మీ


దర్శనం వల్ల, అర్ఘపాద్యాదుల వల్ల ఇప్పటికే సంతుష్టుడనయ్యాను.


కాబట్టి సెలవు ఇప్పించవలసింది" అని అంటాడు.


కానీ వశిష్ఠుడు ఆతిథ్యం తీసుకోమని బలవంతపెట్టడంతో,


విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు.


వశిష్ఠుడు తన హోమధేనువు, కామధేనువు సంతతికి చెందినదీ


అయిన శబల అనే గోవును పిలిచి మహారాజుకు, ఆయన సైన్యానికి


వారివారి ఇచ్ఛానుసారం పదార్ధాలు తయారు చేసి, విందు


చెయ్యమంటాడు.


వశిష్ఠుని ఆజ్ఞ మేరకు శబల సైనికుల ఇష్ఠాలను గ్రహించి,


ఆ మేరకు వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి, అతిథి సత్కారాలు


చేస్తుంది.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !