ఆర్.కె.నారాయణ్ !

ఆర్.కె.నారాయణ్ !

-


ఆర్.కె. నారాయణ్ గా సుప్రసిద్ధుడైనా రాసిపురం కృష్ణస్వామీ అయ్యర్ నారాయణస్వామి (అక్టోబర్ 10, 1906 – మే 13, 2001) ఒక భారతీయ రచయిత. ఆయన భారత దేశములోని ఒక కాల్పనిక పట్టణములో ఉన్న మనుషులు, వాళ్ల వ్యవహారాల గురించి ధారావాహిక  నవలలు వ్రాసాడు. ఆంగ్ల భాషలో భారతసాహిత్య రంగం యొక్క ప్రారంభ దశకు చెందిన ముగ్గురు గొప్ప రచయితలలో అయన ఒకడు. ముల్క్ రాజ్ ఆనంద్ మరియు రాజా రావు మిగిలిన ఇద్దరు. ఆంగ్ల భాషలో భారతీయ సాహిత్యాన్ని ప్రపంచానికి తెలియ చేసిన వ్యక్తిగా ఆయినకు పేరు ఉంది. భారత దేశానికి చెందిన ఆంగ్లభాష నవల రచయితలలో అతి గొప్పవారిలో ఒకరిగా అయిన భావించబడుతున్నాడు.


తన గురువు మరియు మిత్రుడైన గ్రహం గ్రీన్ సహాయంతో నారాయణ్ వెలుగులోకి వచ్చారు. ఆయన వ్రాసిన మొదటి నాలుగు పుస్తాకాలను ప్రచురించడానికి ప్రచురణకర్తలను ఒప్పించడంలో గ్రహం గ్రీన్ ముఖ్య పాత్ర పోషించారు. వీటిలో స్వామీ అండ్ ఫ్రెండ్స్ , ది బాచేలర్ అఫ్ ఆర్ట్స్ , ది ఇంగ్లీష్ టీచర్  అనే మూడు సగం-స్వీయచరిత్ర పుస్తకాలు ఉన్నాయి. 1951 సంవత్సరపు అత్యుత్తమ అసలైన నవలగా పేరొందిన  ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మరియు 

సాహిత్య అకాడెమీ పురస్కారం గెలిచిన ది గైడ్ నారాయణ్ వ్రాసిన ఇతర నవలలలో కొన్ని. ది గైడ్ నవల హిందీ, ఆంగ్ల భాషలలో, బ్రాడ్వేలో చిత్రముగా తీయబడింది.


నారాయణ్ వ్రాసిన కథలలో అనేకము మాల్గుడి అనే ఒక కల్పిత పట్టణములో జరుతాయి. మొదటి సారిగా ఈ పట్టణము స్వామి అండ్ ఫ్రెండ్స్ నవలలో పరిచయం చేయబడింది. ఆయన కథలు సామాజిక సంబంధాలని ఎత్తి చూపి, రోజూవారి జరిగే యదార్ధ సంఘటనల ద్వారా పాత్రలకు ప్రాణం పోస్తాయి. నిజమనిపించే ఒక కల్పిత పట్టాణాన్ని సృష్టించి, దాని ద్వారా రోజువారి సామాన్య జీవితములోని హాస్యమునూ, సాదాసీదాతనాన్నీ బయటకు చూపి, తన రచనలో దయ, మానవత్వం చూపిన విల్లియం ఫాక్నేర్ తో ఆయినని పోలుస్తారు. నారాయణ్ చిరుకథలు వ్రాసే శైలిని గయ్ డే ముపస్సంట్ శైలితో పోల్చడుతుంది. వీరిద్దరకి కథాంశాలని తీసేయకుండా కథని తగ్గించే సామర్థ్యం ఉంది. అయితే వచనము మరియు పద ప్రయోగాలలో చాలా సాదాగా ఉండేవారని నారాయణ్ మీద విమర్శలు ఉన్నాయి.


అరవై ఏళ్ళకు పైబడిన రచయిత వృత్తిలో నారాయణ్ కు అనేక పురస్కారాలు మరియు గౌరవాలు అందాయి. రాయల్ సొసైటీ అఫ్ లిటరేచర్ నుండి AC బెన్సన్ మెడల్ మరియు భారత దేశపు రెండవ అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ని నారాయణ్ అందుకున్నారు. ఆయన భారత శాసనసభ యొక్క పై సభ అయిన రాజ్యసభ కు ప్రతిపాదించబడ్డారు.


అర్.కే. నారాయణ్ మెడ్రాస్  (ప్రస్తుతం చెన్నై అని పిలబడుతున్నది), మెడ్రాస్ ప్రెసిడెన్సి, బ్రిటిష్ ఇండియా లో జన్మించారు. అయిన తండ్రి ఒక పాఠశాలలో ప్రధానపోధ్యాయుడు. నారాయణ్ తన విద్యాజీవితములో కొంత కాలం తండ్రి పాఠశాలలో గడిపారు. ఉద్యోగ రీత్యా అయిన తండ్రి తరచు బదిలీ అవుతూ ఉండడంతో, నారాయణ్ తన బాల్యములో కొంత బాగాన్ని అమ్మమ్మ పార్వతి రక్షణలో పెరిగారు. ఈ సమయములో, ఒక నెమలి మరియు అల్లరిదైన ఒక కోతి ఆయినకు ఆప్తమిత్రులుగాను నెస్తగాళ్లుగాను ఉండేవి.


అయిన అమ్మమ్మ ఆయినకి కుంజప్ప అని ముద్దుపేరు ఇచ్చారు. అయిన కుటుంబీకుల మధ్య ఈ పేరు నిలబడి పోయింది. ఆమె నారాయణ్ కు గణితం, పురాణాలు, భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు సంస్కృతం నేర్పించారు. అయిన తమ్ముడు అర్.కే. లక్ష్మణ్  ప్రకారం, కుటుంబీకులు అందరు సహజంగా ఆంగ్లంలోనే సంభాషించేవారు. నారాయణ్ మరియు అయిన తోబుట్టువులు ఏదైనా వ్యాకరణ తప్పులు చేస్తే, కుటుంబీకులు సహించే వారు కాదు. అమ్మమ్మతో ఉన్నప్పుడు, నారాయణ్ వరుసుగా అనేక పాఠశాలలో చదివారు. వాటిలో కొన్ని పురసవాకం లోని లుతేరన్ మిషన్ స్కూల్, సి.ఆర్.సి. హై స్కూల్ మరియు క్రిస్టియన్ కాలేజీ హై స్కూల్. నారాయణ్ ఒక పుస్తాకాల పురుగు. ఆరంభ దశలో అయిన డికెన్స్, వోడ్ హౌస్, ఆర్థర్ కోనన్ డోయల్, థామస్ హర్డి వ్రాసిన పుస్తాకాలని చదివేవారు. వయస్సు పెన్నెండు ఉన్నప్పుడు, నారాయణ్ ఒక స్వాతంత్ర పోరాట సభలో పాల్గొన్నారు. దాని కొరకు అయిన మావయ్య చే మందలించబడ్డారు; వారి కుటుంబం రాజకీయానికి అతీతంగా ఉండి, అన్ని ప్రభుత్వాలు చెడ్డవి అని భావించేది.


నారాయణన్ తండ్రి మహారాజ యొక్క కళాశాల ప్రాంగణంలో ఉన్న ఉన్నత పాఠశాలకు బదలీ కావటంతో ఆయన కుటుంబసమేతంగా మైసూరుకు  మారారు. పాఠశాల అందున్న మంచి పుస్తకాలు కలిగిన గ్రంథాలయం మరియు తన తండ్రిగారి యొక్క గ్రంథాలయం అందుబాటులో ఉండటంతో, పుస్తకాలు చదవటంలో ఆయనకు ఆసక్తి ఏర్పడి,స్వయంగా తానే వ్రాయటం కూడా అలవాటు చేసుకున్నారు. ఉన్నత పాఠశాల ముగించినాక, నారాయణన్ విశ్వవిద్యాలయమునకు ప్రవేశ పరీక్ష వ్రాసి సఫలీకృతుడు కాలేక, ఇంటిలోనే చదువుకుంటూ, వ్రాసుకుంటూ ఒక సంవత్సరం గడిపి, పిమ్మట 1926 సంవత్సరములో పరీక్షలో సఫలీక్రుతుడయినాక మైసూరు మహారాజ కళాశాలలో చేరారు. బేచలర్ పట్టా పొందడానికి నారాయణ్ నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు. ఇది మామూలుకంటే ఒక సంవత్సరము ఎక్కువ. మాస్టర్ డిగ్రీ (M.A.) చదవడం వల్ల సాహిత్యంలో ఉన్న అయిన ఆసక్తి తగ్గిపోతుందని ఒక మిత్రుడు చెప్పడంతో, కొంత కాలం అయిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేసారు; అయితే, ప్రధాన ఉపాధ్యాయుడు ఆయినని వ్యాయమ ఉపాధ్యాయుడు స్థానములో పని చేయడమని చెప్పినప్పుడు, అయిన ఆ ఉద్యోగాన్ని మానేశారు. తనకు తగిన వృత్తి రచయిత వృత్తి అని ఈ అనుభవం వల్ల నేర్చుకొని, అయిన ఇంట్లోనే ఉండి నవలలు వ్రాయడం ప్రారంబించారు. మొట్ట మొదటిగా ప్రచురించబడిన అయిన రాత, డెవెలప్మెంట్ అఫ్ మారిటైం లాస్ అఫ్ 17థ్-సెంచురీ ఇంగ్లాండ్ అనే పుస్తకము యొక్క గ్రంథ పరిచయం. తదుపరి, అయిన   ఆంగ్ల భాష వార్తాపత్రికలు, సంచికలకు స్థానిక కథలు అప్పుడప్పుడు వ్రాయడం ప్రారంబించారు. రాయడం ద్వారా సంపాదన ఎక్కువ రానప్పడికి, (మొదటి సంవత్సరం అయిన సంపాదన తొమ్మిది రూపాయిలు మరియు పన్నెండు అణాలు), ఆయినకి ఒక స్థిరమైన జీవితం ఏర్పడింది. ఆయినకు అవసరాలు బాగా తక్కువగా ఉండేవి. అసాధరణమైన వృత్తిని అయిన ఎన్నుకున్నందుకు అయిన కుటుంబము, మిత్రులు ఆయినకు సహకరించి గౌరవించారు. 1930లో నారాయణ్ తన మొదటి నవల స్వామి అండ్ ఫ్రెండ్స్ ని వ్రాసారు. అయితే, అయిన మావయ్య దానిని ఎగతాళి చేసారు.అనేక ప్రచురణకర్తలు ఆ నవలని తిరస్కరించారు. ఈ పుస్తకములోనే నారాయణ్, దేశము యొక్క సామాజిక వాతావరణాన్ని చూపించే మాల్గుడి అనే ఒక పట్టణాన్ని సృష్టించారు; ఇది కలోనియల్ పాలన యొక్క పరిమితులని విస్మరించింది. అదే సమయములో బ్రిటిష్ వారి సమయములో మరియు స్వాతంత్రం తరువాత ఏర్పడిన అనేక సామాజిక-రాజకీయ మార్పులని బట్టి ఈ పట్టణం కూడా మారుతూ వచ్చింది.


1933లో  కోయంబతూర్  లో తన సోదరి ఇంట్లో విశ్రాంతి తీస్కుంటున్న కాలములో, నారాయణ్ ప్రక్కనే నివసిస్తున్న ఒక 15 వయస్సుగల అమ్మాయిని కలిశి ఆమెతో ప్రేమలో పడ్డారు. అనేక జ్యోతిష మరియు ఆర్ధిక పరమైన అడ్డంకులు ఏర్పడినా, నారాయణ్ ఆ అమ్మాయి తండ్రి యొక్క ఆమోదం పొంది, ఆమెని వివాహం చేసుకున్నారు. వివాహం పిమ్మట, నారాయణ్ ది జుస్టిస్ అనే ఒక మదరాస్ పత్రికకు విలేకరి అయారు. అది బ్రామిన్-కాని వారి ప్రయోజనాలు మీద శ్రద్ధ చూపిస్తున్న ఒక పత్రిక. వారి పక్షాన ఒక బ్రాహ్మిణ్ అయ్యార్ ఉండడం ప్రచురణకర్తలకు ఉత్సాహం కలిగించింది. ఈ ఉద్యోగం ద్వారా అయిన అనేక రకమైన జనాలు, సమస్యలతో పరిచయం ఏర్పడింది. అంతకు మునుపు, నారాయణ్ స్వామి అండ్ ఫ్రెండ్స్ నవల యొక్క వ్రాతప్రతి ని ఆక్స్ ఫోర్డ్ లోని ఒక మితుడుకు పంపించి ఉన్నారు. ఆ మిత్రుడు ఆ ప్రతిని గ్రహం గ్రీన్ కు చూపించారు. గ్రీన్ ఆ పుస్తకముని తన ప్రచురణకర్తకు సిఫార్సు చేస్తే, ఆ పుస్తకము చివరిగా 1935లో ప్రచురించబడింది. ఆంగ్లం మాట్లాడే ప్రేక్షకలకు సులువుగా ఉండే విధముగా పేరుని క్లుప్తం చేసుకోమని నారాయణ్ కు గ్రీన్ సలహా ఇచ్చారు. ఆ పుస్తకము అర్ధ-స్వయచరిత్ర లాగ ఉండి, అయిన బాల్యమునుంది అనేక సంఘటనలు ఆధారంగా వ్రాయబడింది. పుస్తకము గురించి మంచి విమర్శలు వచ్చినప్పటికీ, అమ్మకాలు మాత్రం తక్కువగానే ఉంది. నారాయణ్ యొక్క మరుసటి నవల ది బేచలర్ అఫ్ ఆర్ట్స్ (1937), కొంత వరకు అయిన కళాశాల అనుబవం స్పూర్తి తో వ్రాయబడింది. ఒక తిరగబడే బాలుడు ఒక సర్దుకోకలిగిన ఎదిగిన వ్యక్తిగా గా మార్పు చెందే పరిస్థితిని గురించి ఈ పుస్తకము వివరిస్తుంది;ఈ నవల కూడా గ్రీన్ సిఫార్సు మేరకు మరొక ప్రచురణకర్త చే ప్రచురించబడింది. అయిన వ్రాసిన మూడో నవల ది డార్క్ రూం (1938), లో గృహ, సంసార అపశ్రుతులు గురించి, వివాహ సంబంధంలో మగవాడిని హింసకుడు గాను స్త్రీని బాధితురాలుగాను చిత్రీకరించబడింది. 1937లో నారాయణ్ తండ్రి చనిపోయారు. తరువాత ఆదాయం లేకపోయే సరికి, నారాయణ్ మైసూర్ ప్రభుత్వం నుండి ఒక కమిషన్ ని ఒప్పుకోవలసి వచ్చింది.


తన మొదటి మూడు పుస్తకాలలో, సమాజములో ఆమోదించబడిన కొన్ని ఆచారాల కు సంబందించిన సమస్యల గురించి నారాయణ్ వ్రాసారు. మొదటి పుస్తకములో, నారాయణ్ విద్యార్థుల దురవస్థ గురించి, తరగతి గదులలో కొట్టడం గురించి, వాటి వల్ల పిల్లలలకు అనుబవించే అవమానాల గురించి వ్రాసారు. రెండవ పుస్తకములో, హిందూ వివాహాలలో, జాతకాలు చూడడం గురించి, దాని వల్ల పెళ్ళికూతురు, పెళ్లికోడుకలకు ఏర్పడే మాన్సీక క్షోబ గురించి నారాయణ్ వ్రాసారు. మూడవ పుస్తకములో, భర్త యొక్క చేష్టలు, మనోభావాలతో భార్య పడే కష్టాల గురించి నారాయణ్ వ్రాసారు.


1939లో టైఫాయిడ్  వల్ల రాజం చనిపోయింది. ఆమె మరణం నారాయణ్ ని లోతుగా బాదించడంతో, చాల కాలం అయిన దుఃఖంలో ఉన్నారు; మూడేళ్ళే నిండిన హేమలత అనే తమ కూతురు గురించి ఆయినకు చింతగా ఉండేది. ఈ మరణం అయిన జీవితములో గణనీయమైన మార్పు తెచ్చింది. ఇదే అయిన మరుసటి నవల అయిన  ది ఇంగ్లీష్ టీచర్ కు స్పూర్తి గా నిలిచింది. ఈ పుస్తకము, అయిన మొదటి రెండు పుస్తకాల లాగే స్వయచరిత్ర లాగ ఉంది. మరియు, అనుకోకుండానే, స్వామి అండ్ ఫ్రెండ్స్ , ది బేచలర్ అఫ్ ఆర్ట్స్ తరువాత ఈ పుస్తకము మూడు పుస్తకాల సేకరణ ని పూర్తి చేసింది. తర్వాతి బేటీలలో ది ఇంగ్లీష్ టీచర్ దాదాపు పూర్తిగా ఒక స్వయచారిత్ర అని అంగీకరించారు. అయితే, పాత్రలకు వేరే పేర్లు పెట్టబడ్డాయి మరియు మాల్గుడి యొక్క పరిసరాలు మార్చబడ్డాయి; నవలలో వివరించబడిన భావాలు రాజం మరణ సమయములో తన యొక్క భావాలే అని కూడా ఆయినా వివరించారు.


కొంత మేరకు విజయం సాదించడంతో నారాయణ్ 1940లో ఇండియన్ తాట్ అనే ఒక పత్రిక ప్రారంబించారు. కార్ సేల్స్ మాన్ అయిన తన మావయ్య సహాయంతో, మద్రాస్ నగరములో మాత్రం ఒక వేయికు పైగా చందాదరులని నారాయణ్ సంపాదించకలిగారు. అయితే, నారాయణ్ దీనిని నడపలేకపోవడంతో, ఈ ప్రయత్నం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఒక సంవత్సరము లోపలే ఈ పత్రిక మూతపడింది. మాల్గుడి డేస్ అనే అయిన మొదటి చిరుకథల సేకరణ నవంబర్ 1942లో ప్రచురించబడింది. తరువాత, 1945లో ది ఇంగ్లీష్ టీచర్  ప్రచురించబడింది. ఈ మధ్యలో యుద్ధం కారణంగా ఇంగ్లాండ్ తో సంబందాలు తెగిపోవడంతో, నారాయణ్ తన సొంత ప్రచురణ సంస్థ ని ప్రారంబించారు. దీనికి మళ్ళి ఇండియన్ తాట్ పుబ్లికేషన్స్ అనే పేరు పెట్టారు; ఈ ప్రచురణ సంస్థ విజయవంతమై, ఈ నాటికి అయిన మనవరాలు చే నడపబడుతూ ఉంది. శీగ్రంలోనే, న్యు యార్క్ నుండి మాస్కో వరకు పాటకులు పెరిగే సరికి, నారాయణ్ నవలలు బాగా అమ్మడం మొదలయింది. 1948లో అయిన మైసూర్ శివార్లలో సొంత ఇల్లు కట్టడం ప్రారంబించారు ; ఆ ఇల్లు 1953లో పూర్తీ అయింది.


ది ఇంగ్లీష్ టీచర్ తరువాత నారాయణ్ వ్రాత శైలిలో మార్పు వచ్చి, అయిన మునుపటి నవలలలో కనిపించిన సగం-స్వయచరిత్ర లాగ కాకుండా ఎక్కువ కల్పనాశక్తితో కూడిన భావ్యముగా మారింది. అయిన మరుసటి నవలైన Mr. సంపత్ ఈ మారిన శైలిలో వ్రాసిన మొదటి నవల. అయితే, ఇది కూడా కొంత మేరకు ఆయిన సొంత అనుభవాల మీద ఆధార పది ఉంది. ముఖ్యంగా, సొంత పత్రిక ప్రారంబించిన అయిన అనుబవాలు; జీవితచరిత్రలోని సంఘటనలని కలపటం ద్వారా అయిన తన అధివరకటి నవలలకంటే బిన్నమైన శైలిని ప్రదర్శించారు. అతి తోరలోనే, అయిన యొక్క మాస్టర్ పీస్ అని భావించబడే ది ఫైనాన్షియల్ ఎక్స్పెర్ట్ అనే నవలని ప్రచురించారు. ఈ నవల 1951 సంవత్సరపు అత్యుత్తమ అసైలన పుస్తకముగా కొనియాడబడింది. ఆర్ధిక విషయాలలో ఒక మేధావి అయిన మార్గయ్య అనే ఆయినకు సోదరడు ద్వారా చుట్టమైన వ్యక్తి యొక్క యధార్థ కథ ఆధారంగా ఈ నవల రాయబడింది. అయిన మరుసటి నవలైన వెయిటింగ్ ఫర్ ది మహాత్మా మాల్గుడి కు మాహాత్మ గాంధి వస్తున్నట్లు ఒక కల్పిత సంగటన మీద ఆధారపడి వ్రాయబడింది. కథానాయకుడు మహాత్మా యొక్క ప్రసంగాలని వినడానికి వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ గురించి అతనికి కలిగే ప్రేమ భావాలు గురించినదే ఈ కథ. భార్తి అనే పేరుగల ఆ స్త్రీ, భారత దేశము యొక్క మనవీకరణ అయిన  భారతి యొక్క వ్యంగానుకరణ. భారత స్వాతంత్ర ఉద్యమం గురించిన కొన్ని ముఖ్య సంఘటనలు ఈ నవలలో ఉన్నప్పటికీ, ఈ కథ ముఖ్యంగా ఒక సామాన్య వ్యక్తి యొక్క జీవితం గురించినది. నారాయణ్ యొక్క తనదైన వ్యంగామైన శైలిలో రాయబడింది.


1953లో అయిన నవలలు మొదటి సారిగా యునైటెడ్ స్టేట్స్ లో ప్రచురించబడ్డాయి. మికిగన్ స్టేట్ యునివెర్సిటీ ప్రెస్ వీటిని ప్రచురించారు. తరువాత 1958లో వారు ప్రచురణ హక్కులని వైకింగ్ ప్రెస్ కు అమ్మేశారు. నారాయణ్ యొక్క రచనలు ఎక్కువగా సామాజిక వ్యవస్థలు, అభిప్రాయాలలో ఉన్న వ్యతిరిక్తములని వెలుగులోకి తేసే విధముగా ఉన్న, ఆయినా ఒక సామ్ప్రదాయవాదినే; ఫెబ్రవరి 1956లో, నారాయణ్ తన కూతురు వివాహాన్ని పూర్తీ సాంప్రదాయ బద్దంగా అన్నిహైందవ ఆచరాలని పాటించి జరిపారు.కూతురు వివాహం తరువాత, నారాయణ్ అప్పుడప్పుడు ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా, రోజుకు కనీసం 1500 పదాలైన రాయడం కొనసాహించారు. ది గైడ్ అనే నవల, అయిన 1956లో రాక్ఫెల్లెర్ ఫెలోవ్శిప్ మీద యునైటెడ్ స్టేట్స్ ను సందర్చినప్పుడు రాయబడింది. యు.ఎస్.లో ఉన్నప్పుడు, నారాయణ్ తన రోజు దిన చెర్యలుని ఒక డైరీలో రాసేవారు. అదే అయిన వ్రాసిన మై డేట్ లెస్ డైరీ అనే పుస్తకానికి ఆధారమయింది.దాదాపు ఈ సమయములో, ఇంగ్లాండ్ సందర్శించిన నారాయణ్, మొదటి సారిగా తను మిత్రుడు, గురువైన గ్రహం గ్రీన్ ని కలిశారు. భారత దేశానికి తరిగి వచ్చిన తరువాత, ది గైడ్ ప్రచురించబదింది; ఈ పుస్తకమే నారాయణ్ యొక్క రాత శైలికి అద్దం పట్టేలా ఉంది. సందిగ్ద పదాలు వ్యక్తీకరణాలు మరియు ఒక విడికథ లాంటి ముగింపు వంటి అంశాలని ఆ నవల కలిగి ఉంది. ఈ పుస్తకం మూలాన ఆయినకు 1958లో సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.


అప్పుడప్పుడు, నారాయణ్ తన ఆలోచనలాను వ్యాసాల రూపంలో వేలుబరిచారు. వీటిలో కొన్ని వార్తాపత్రికలలో, సంచికలలో ప్రచురంయ్యాయి. మిగిలినవి ప్రచురించ బడలేవు. నెక్స్ట్ సండే (1960) అయిన రాసిన ఇటువంటి వ్యసాలయోక్క సేకరణ మొదటి సారిగా ఒక పుస్తకములాగా ప్రచురించబడింది. ఆ తరువాత కొంత కాలములోనే, అయిన 1956 యునైటెడ్ స్టేట్స్ సందర్శన అనుభవాలను వివరించే మై డేట్ లెస్ డైరీ  ప్రచ్రించబడింది. ది గైడ్ వ్రాసిన అనుబవం గురించి ఒక వ్యాసం కూడా ఈ సేకరణ లో ఉంది.


నారాయణన్ యొక్క తదుపరి నవల థ మాన్-ఈటర్ అఫ్ మాల్గుడి 1961 సంవత్సరములో ప్రచురించబడింది. సామ్ప్రదాయాక్ హాస్య కళారూపం కలిగి ఉండి, సున్నితమైన నియంత్రణ కలిగి ఉన్న శైలి అని ఈ పుస్తమ విమర్శకులు విమర్శించారు.ఈ పుస్తక విడుదల అనంతరం, నిమ్మశము లేకుండా ఉన్న నారాయణ్ మళ్ళి పయనించడం ప్రారంబించి, యు.ఎస్. మరియు ఆస్ట్రేలియాను సందర్శించారు. అయిన అడిలైడ్, సిడ్నీ, మెల్బోర్న్ లలో భారతీయ సాహిత్యం గురించి ఉపన్యాసాలు ఇస్తూ మూడు వారాలు గడిపారు. ఈ పర్యటనకు ఆస్ట్రేలియన్ రైటర్స్ గ్రూప్ నిధులు ఇచ్చింది. ఈ సమయానికల్లా, నారాయణ్, సాహిత్య పరంగానూ, ఆర్ధిక పరంగానూ గణనీయమైన వియ్యం సాదించారు. అయిన మైసూర్ లో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఎనిమిది కిటికీలకు తగ్గకుండా ఉన్న గదిలో రాసే వారు; వివాహం తరువాత కోయంబతూర్ లో స్తిరపడ్డ తన కూతురుని కలవడానికి, అప్పట్లో భారాత దేశములో విలాస వస్తువైన కొత్త మెర్సిడెస్-బెంజ్కారులో వెళ్ళేవారు. భారత దేశములోను, విదేశాలలోనూ విజయం సాదించిన తరువాత, నారాయణ్ ది హిండు , ది అట్లాంటిక్ వంటి పత్రికలకు, వార్తాపత్రికలకు రాయడం మొదలుపెట్టారు.


1964లో నారాయణ్ తన మొదటి పౌరాణిక పుస్తకమైన గాడ్స్, డేమన్స్ అండ్ అతేర్స్ ని ప్రచ్రించారు. ఇది హిందూ పురాణాలనుండి అనువాదించబడిన మరియు మళ్ళి వ్రాయబడిన చిన్న చిన్న కథలు కలిగిన ఒక సేకరణ. అయిన ఇతర పుస్తకాల లాగే, ఈ పుస్తకానికి కూడా, అయిన తమ్ముడైన అర. కే. లక్ష్మణ్ బొమ్మలు గీచారు. కొన్ని ఎన్నుకోబడిన కథలని మాత్రమె ఈ పుస్తకములో చేర్చారు. శక్తివంతమైన ప్రధాన పాత్రధారులు ఉన్న కథలని మాత్రమె అయిన ఎన్నుకున్నారు. అప్పుడే, పాటకులకు సందర్భం తెలియక పోయినా, కథ యొక్క ప్రభావం స్థిరంగా ఉంటుంది.పుస్తకము ప్రచురణ తరువాత మళ్ళి నారాయణ్ విదేశీ పర్యటనకు వెళ్ళారు. ఒక మునుపటి వ్యాసములో అమెరికన్ లు అయిన దగ్గిరనుండి ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవాలని ఎదురుచూసేవారని రాశారు. ఈ పర్యటన సమయములో, స్వీడన్-అమెరికా కు చెందిన నటి గ్రేట గార్బో ఇదే విషయాన్ని అడిగేవారు, అయిన తనకు ఆ విషయాలు ఏమి తెలియవని చెప్పినా కూడా.


నారాయణ్ యొక్క తదుపరి నవల, 1967లొ ప్రచిరించబడిన ది వెండార్ అఫ్ స్వీట్స్ . ఈ నవల రాయడంలో కొంత మేరకు అయిన యొక్క అమెరికా పర్యటనలు ఆయినకు స్పూర్తిగా ఉండి. ఈ నవలలో భారత దేశానికి మరియి అమెరికా కు చెందిన అతిగా ప్రవర్తించే పాత్రలు, వారి మధ్య ఉన్న అనేక సాంసృతిక విబెదాలతో ఉన్నారు. ఈ పుస్తకము అయిన బాణి అయిన హాస్యం మరియు కథ చెప్పే విధానం ఉన్నప్పటికీ, లోతు లేని పుస్తకమని విమర్శించబడింది.ఆ సంవత్సరం, నారాయణ్ ఇంగ్లాండ్ కు వెళ్ళారు. అక్కడ మొదటి సారిగా యునివెర్సిటీ అఫ్ లీడ్స్ నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు.తదుపరి కొన్ని సంవత్సరాలు అయిన స్థిమితంగా ఉన్నారు. 1970లో అయిన తన తదుపరి పుస్తకమైన ఎ హార్స్ అండ్ టూ గొట్స్ అనే చిరు కథల సేకరణ ని ప్రచురించారు. ఈ మధ్య, నారాయణ్ కు 1938లో మరణిస్తున్న తన మావయ్యకు చేసిన ఒక వాక్ధానం గురించి గుర్తు వచ్చి, అయిన కంబ రామాయణం ని ఆంగ్లంలో అనువాదం చేయడం మొదలు పెట్టారు. ఇదు సంవత్సరాల పని తరువాత ది రామాయణ 1973లో ప్రచురించబడింది.ది రామాయణ ప్రచురించిన వెనువెంటనే, నారాయణ్ మహాభారత అనే సంస్కృత కావ్యము యొక్క సంఘటిత అనువాదం చేసే పఅనిని ప్రారంబించారు. ఈ కావ్యాన్ని రాస్తూ ఉండగానే, అయిన ది పెయింటర్ అఫ్ సైన్స్ (1977) అనే మరొక పుస్తకాన్ని ప్రచురించారు. ది పెయింటర్ అఫ్ సైన్స్ ఒక నవల కంటే కొద్దిగా పొడుగుగా ఉండి, నారాయణ్ యొక్క ఇతర పుస్తకాల కంటే విబిన్నంగా ఉండి. ఈ పుస్తకములో, అదివరకు ఎప్పుడు లేని విధముగా అయిన శృంగారం వంటి కొన్ని సంగతులని ప్రస్తావించారు. ఐతే, ప్రధాన పాత్రదారి యొక్క పాత్ర మాత్రం, అయిన యొక్క ఇదువరకటి పాత్రలలాగే ఉంది. ది మహాభారత 1978లో ప్రచురించబడింది.


కర్నాటక ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక రంగ ప్రచారము కొరకు ఒక పుస్తకము రాసేపనిని నారాయణ్ కు అప్పగించింది. నారాయణ్ రాసినవాటిని, ఒక పెద్ద ప్రభుత్వ ప్రచురణలో బాగంగా ప్రభుత్వం 1970ల ఆఖరిలో ప్రచురించింది. ఐతే నారాయణ్ దానితో తృప్తి చెందక, ది ఎమేరాల్డ్ రూట్ (ఇండియన్ థాట్ పబ్లికేషన్స్, 1980) అనే పేరుతొ దానిని పునఃప్రచురణ చేసారు. స్థానిక చరిత్ర, పారంపర్యం మీద ఆయినకు ఉన్న వ్యక్తిగత అబిబ్రాయాలు ఈ పుస్తకములో ఉన్నాయి. అయితే, పాత్రలు, సృష్టిలు లేకుండ ఉన్నందున, ఈ పుస్తకము అంట ఆసక్తికరంగా లేదు.అదే సంవత్సరం, అయిన అమెరికన్ అకాడెమి అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ యొక్క గౌరవ సభ్యుడుగా ఎంపికయ్యారు. రాయల్ సొసైటీ అఫ్ లిటేరేచర్ వారి AC బెన్సన్ మెడల్ ని గెలుచుకున్నారు.దాదాపు ఇదే సమయములో, నారాయణ్ నవలలు మొదటి సారిగా  చైనీస్ భాషలో అనువాదిన్చాబడ్డాయి.


1983లో నారాయణ్ తన తదుపరి నవలైన  టైగర్ ఫర్ మాల్గుడి ని ప్రచ్రించారు. ఇది ఒక పులి మరియు మనుషులతో దానికి ఉన్న సంబందాలు గురించిన కథ. 1986లో ప్రచురించబడిన అయిన తదుపరి నవల టాకటివ్ మాన్ , మాల్గుడి కు చెందిన పాత్రికేయుడు కావాలని ఆకాంక్షిస్తున్న ఒక వ్యక్తీ గురించిన కథ. ఈ సమయములో, అయిన రెండు చిరు కథల సేకరణలను ప్రచురించారు: ఆసలు పుస్తకము తో మరి కొన్ని కథలుతో కూడిన ఒక సవరించిన ప్రచురణ అయినమాల్గుడి డేస్ (1982) మరియు అండర్ ది బన్యాన్ ట్రీ అండ్ ఆథర్ స్టోరీస్ , అనే ఒక కొత్త సేకరణ. 1987లో అయిన  ఎ రైటర్స్ నైట్మెర్ అనే ఒక పుస్తకము పూర్తీ చేసారు. దీంట్లో కుల వ్యవస్థ, నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రేమ, కోతులు గురించిన వివిధ అంశాల మీద వ్యాసాల ఉన్నాయి. 1958 నుండి అయిన వార్తాపత్రికలలో మరియు సంచికలలో రాసిన వ్యాసాలు ఈ సేకరణలో ఉన్నాయి.


మైసూర్ లో ఒంటరిగా ఉన్నప్పుడు, అయినకు వ్యవసాయం మీద ఆసక్తి పెరిగింది. ఒక ఎకరా పంటపొలం కొని, అయిన వ్యవసాయం చేసారు. ప్రతి రోజు మధ్యానం అయిన మార్కట్ కు నడచి వెళ్ళేవారు. ఏదైనా కొనటానికంటే కూడా జనాలతో కలిసి ఉండటానికోసమే అయిన అలాగా వెళ్ళేవారు. అలాంటి మధ్యాన నడక సమయములో, అడుగడుకుకి ఆగి కోట్ల యజామ్నులతో మరియు ఇతరాలతో మాట్లాడేవారు. బహుశా, తన తదుపరి పుస్తకాలకు విషయాలు సేకరిస్తూ ఉండేవారేమో.


1980లో నారాయణ్, సాహిత్యములో అయిన సాదనలకోసం భారత దేశపు శాశన సభ యొక్క పై సభ అయిన రాజ్య సభ కు ప్రతిపాదించబడ్డారు. తన మొత్త ఆరు-సంవత్సరాల పదవికాలములో అయిన ఒకే ఒక సమస్య మీద – పాఠశాల పిల్లల దురవస్థ, ముఖ్యంగా పుస్తకాల యొక్క అధిక బరువు మరియు పిల్లల సృజనాత్మకత మీద విద్యా వ్యవస్థ యొక్క దుష్ప్రభావం – తన పూర్తీ శ్రద్ధ చూపించారు. ఈ సమస్యనే అయిన తన మొదటి నవలైన స్వామి అండ్ ఫ్రెండ్స్ లో ముఖ్యంగా వ్రాసారు. అయిన చేసిన తొలి ప్రసంగంలో ఈ ప్రత్యేక సమస్య గురించి ప్రస్తావించారు. దాని మూలంగా, పాఠశాల విద్యావ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రొఫ్. యష్ పాల్ నేతృత్వంలో ఒక కమిటి ఏర్పాటు చేయబడింది.


1990లో అయిన తన మరుసటి నవలైన ది వరల్డ్ అఫ్ నాగరాజ్ ని ప్రసురించారు. ఇది కూడా మాల్గుడిలో జరిగే కథ. ఈ నవలలో నారాయణ్ యొక్క పెరుగుతున్న వయస్సు కనిపిస్తుంది. చాలావరకు కథ వివరాలని వదిలిశారు. అదే ముందైతే వివరాలన్నీ వ్రాసేవారు. ఈ నవల రాయడం పూర్తీ అయిన తరువాత, నారాయణ్ ఆరోగ్యం క్షీణించి, అయిన తన నివాసాన్ని, కూతురు కుటుంబానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మదరాస్ కు మార్చారు. మదరాస్ కు మారిన కొన్ని సంవత్సరాల తరువాత, 1994లో అయిన కూతురు కాన్సర్ వ్యాధి సోకి మరణించగా, అయిన మనవరాలు బువనేష్వారి (మిన్నీ) ఆయినని చూసుకోవడం ప్రారంబించింది. అలాగే, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్ ని కూడా తనే నిర్వహించింది. తరువాత నారాయణ్ తన ఆఖరి పుస్తకమైన గ్రాండ్మతర్స్ టెల్ ని ప్రచురించారు. ఈ పుస్తకము ఒక స్వయచరిత్ర నవల. ఇది అయిన ముత్తవ్వ గురించిన కథ. తన భర్త వివాహం అయిన వెంటనే పారిపోవడంతో, ఆమె ఆయినని వెతకటానికి సుదూర ప్రాంతాలకు పయనం చేసింది. అయిన బాలుడుగా ఉన్నప్పుడు అయిన అమ్మమ్మ ఆయినకు ఈ కథని వివరించింది.


తన ఆఖరి సంవత్సరాలలో, సంభాషణ అంటే ఎప్పుడు ఇష్టపడే నారాయణ్, దాదాపు ప్రతిరోజూ సాయంత్రం, ది హిండు ప్రచురణకర్త అయిన ఎం. రామ్ తో గడిపేవారు. కాఫీ త్రాగుతూ, రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటూ, అర్ధరాత్రి దాటే వరకు గడిపేవారు. జనాలని కలవడం మరియు వారితో మాట్లాడటమంటే ఎంతో ఇష్టపడే అయిన, భేటీలు ఇవ్వడం మానేశారు. బెతీల మీద ఆయినకు ఉదాసీనత రావడానికి కారణము, అయిన టైం కు ఇచ్చిన భేటీనే. ఆ భేటి తరువాత అయిన కొన్ని రోజులు ఆసుపత్రిలో గడపవలసి వచ్చింది. ఎందుకంటే అయిన ఫోటోలు తీయదానికోసం అయిననని ఊరంతా తిప్పారు. ఆ ఫోటోలని చివరికి ఆ వ్యాసములో అసలు వాడలేదు కూడా.


2001 మే లో నారాయణ్ ఆసుపత్రిలో చేరారు. ఆయినని వెంటిలేటర్ లో పెట్టడానికి కొన్ని గంటలు ముందు, అయిన ఒక తాత గురించిన కొత్త కథ, తన మరుసటి నవల రాయడం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అయిన ఎప్పుడు నోట్ పుస్తకాలని ఎన్నుకోవడం గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు కాబట్టి, తనకు ఒక పుస్తకం తెచ్చి పెట్టమని ఎన్. రామ్ ని అయిన కోరారు. అయితే, నారాయణ్ ఆరోగ్యం నయం కాలేదు. తన నవలని అయిన అసలు ప్రారంబించనే లేదు. అయిన చెన్నైలో తన 94వ వయస్సులో మే 13, 2001 నాడు మరణించారు.


నారాయణ్ యొక్క రచనా శైలి సరళంగాను నటన లేకుండాను, సహజంగానే హాస్యస్పోరకంగా ఉండేది.ఆయిన రచన సామాన్య జనాల మీద కేంద్రీకరించి, పాటకులకు వారి పొరుగింటి వారు, కసిన్ లు వంటి వారిని తలిపిస్తుంది. అందువల్ల పాటకులు పుస్తక విషయాల తో ఎకోబవించడానికి ఎక్కువ అవకాసం ఉంటుంది. తన దేశములోని సమకాలపువారి లాగ నవల రచనలో అప్పుడు ఉన్న బాణికి అనుకూలంగా తమ రచనా శైలిని మార్చుకోకుండా అయిన భారత సమాజములోని చిక్కులని తనదైన సరళమైన శైలిలో వ్రాయగాలిగారు. అయిన మెళుకువతో కూడిన సంభాషణ శైలిని వాడారు. పాత్రల స్వబావాలకు అనుగుణంగా అయిన సున్నితమైన తమిళ్ భాష చాయలతో కూడిన సంభాషణలు అయిన రచనలో ఉండేవి.విమర్శకలు నారాయణ్ ని భారత చెకోవ్ అని పరిగణించారు. వాళ్ల ఇద్దరి రచనలోని సరళత్వం మరియు దుఃఖరమైన సందర్పాలలో చూపించే సున్నితమైన అందం మరియు హాస్యం వంటి అంశాల వల్ల ఇద్దరిని పోల్చేవారు. ఇతర ఏ భారతీయ రచయితలకంటే నారాయణ్ కు చెకోవ్ తో ఎక్కువ పోలికలు ఉన్నట్లు గ్రీన్ భావించారు. ది న్యూ యోర్కేర్ కు చెందిన ఆంటనీ వెస్ట్ ప్రకారం నారాయణ్ రచన నికోలాయి గోగోల్ యొక్క వాస్తవికత రచన లాగా ఉందని భావించారు.


నారాయణ్ వ్రాసిన చిరుకథలు అయిన వ్రాసిన నవలలు లాగే అంతే మనోహరంగా ఉన్నాయని, చాలా చిరుకథలు పది పేజీలకంటే తక్కువే ఉన్నాయని, చదవటానికి కూడా అంతే సమయం తీసుకుంటుందని పులిట్జేర్ ప్రైజ్ గ్రహీత ఝంపా లహిరి భావించారు. నవల రచయితలు వందలాది పేజీలలో ఇవ్వడానికి ప్రయాశాపడే దానిని, శీర్షిక వాక్యానికి ముగింపుకు మధ్య నారాయణ్ పాటకులుకు ఇస్తున్నారు: పాత్రల యొక్క జీవితాల గురించి పూర్తి అవగాహన. నారాయణ్ యొక్క ఈ గుణగణాలు, సామర్ధ్యాలు వల్ల లాహిరి ఆయిన్ని ఓ. హెన్రీ, ఫ్రాంక్ ఓ’కానర్, ఫ్లన్నేరి ఓ’కానర్ వంటి చిరుకథల పితామహులుతో పాటు జత కట్టారు. లాహిరి ఆయిన్ని గుయ్ డే మపస్సంట్ తో కూడా పోల్చారు. కథని పోగొట్టకుండా ఉపాఖ్యానాన్ని తగ్గించే సామర్థ్యం ఇద్దరికీ ఉంది. ఇద్దరూ ఒక రకమైన మధ్య తరగతి జీవితం గురించి, ఎక్కడ వదలకుండా, జాలి చూపకుండా రాసారు.


నారాయణ్ రచనలు ఎక్కువ వర్ణనాత్మకంగా ఉండి, తక్కువ విశ్లేషనాత్మకంగా ఉందని విమర్శకలు మాట; విడిగా ఉండి చూసే ఆచరణ కలిగిన ఈ వస్తుగత దోరణి వల్ల నిజమైన మరియు యదార్థము తో కూడిన కథలు అయిన చెప్పకలిగారు.అయిన వైకరి మరియు జీవితం మీద ఆయినకు ఉన్న మనోభావం వల్ల అయిన తనదైన బాణిలో పాత్రలని వారి చేర్యలని కలప కలిగింది. సామాన్యంగా జరిగే సంఘటనలని కూడా పాటకుల మదిలో ఒక సంభందం ఏర్పరిచేలా చేసింది.]అయిన రచనా శైలికి ముఖ్యంగా దోహదం చేసింది అయిన సృష్టించిన, గుడ్డి నమ్మకాలు, సాంప్రదాయాలు పాటిస్తున్న మాల్గుడి అనే ఒక చిన్న సామాన్య పట్టణం.


నారాయణ్ యొక్క రచనా శైలి తరచూ విల్లియం ఫాక్నర్ తో పోల్చబడుతుంది. ఇద్దరి రచనలు సామాన్య జీవితములో హాస్యం మరియు శక్తిని వేలుగులోగి తెచ్చింది. అదే సమయములో దయకలిగిన మానవత్వాన్ని కూడా చూపించినది.ఇద్దరి మధ్య పోలికలు ఇంకా కూడా ఉన్నాయి. ఇద్దరి రచనలు సమాజం యొక్క అవసరాలని వ్యక్తిగత చిక్కులతో ముడిపెట్టే సామర్థ్యం కలిగి ఉన్నాయి.కతాంశాలని అభిగవించే విధానము ఇద్దరిది ఒకటేనైనా, వారి మార్గాలు విబిన్నంగా ఉండేవి; ఫాక్నర్ రచన అలంకారయుక్తంగా ఉండి, అపరితమైన వచనాలు కలిగి ఉండేది. నారాయణ్ రచన చాలా సాదాగా మరియు యదార్ధంగా ఉండి అదే సమయములో అన్ని కదాంశాలని కలిగి ఉండేది.


మాల్గుడి, నారాయణ్ సృష్టించిన ఒక కల్పిక, అర్ధ-నగర వాతావరణం కలిగి ఉన్న దక్షిణ భారత పట్టణం. అయన ఈ పట్టణాన్ని సెప్టెంబర్ 1930న విజయదశమి నాడు సృష్టించారు. ఆ రోజు కొత్త యత్నాలు మదలుపెట్టడానికి మంగళప్రథమైన రోజు. ఆ రోజుని అయిన కొరకు అయిన అమ్మమ్మ ఎన్నుకున్నారు. అయిన తరువాత భేటిలలో అయిన జీవితచరిత్ర వ్రాసిన సూసన్ మరియు ఎన్.రామ లతో చీప్పినట్లు ముందు అయిన మదిలో ఒక రైల్వే స్టేషను కనిపించిందని, తరువాత నెమ్మదిగా మాల్గుడి అనే పేరు అయిన మదిలో వచ్చినట్లు అయిన చెప్పారు. రామాయణా రోజుల నుండి ఉన్న నిష్కళంకమైన చరిత్ర కలిగి ఉన్న ఒక పట్టణముగా మాల్గుడి సృష్టించబడింది. లార్డ్ రామ ఈ పాత్తనం మీదుగా వెళ్లారని రాయబడింది; బుద్ధా కూడా పయనమధ్యలో ఈ పట్టణాన్ని సందర్శించినట్లు రాయబడింది. నారాయణ్ ఈ పట్టణానికి కచ్చితమైన బౌగోళిక హద్దులు ఎప్పుడు పెట్టలేదు. కథలో వచ్చే సంగాతనలకు అనుగుణంగా వూరి యొక్క రూపురేఖలను మార్చి, బవిష్యత్తు కథలకు రంగం సిద్దం చేసేవారు. నారాయణ్ రచనకు సంబందించిన పండితుడైన డా జేమ్స్ ఎం. ఫెన్నేలీ, నారాయణ్ వ్రాసిన అనేక పుస్తకాలు, కథలనుండి మాల్గుడి యొక్క రేఖాచిత్రాన్ని రూపొందించారు.


భారాతదేశములో మారుతున్న రాజకీయ పరిణామాల బట్టి మాల్గుడి కూడా మారుతూ వచ్చింది. 1980లలో, భారత దేశములో దేశీయవాదం గట్టిగా పెరుగుతున్న తరుణములో, పట్టణాలకు, ప్రాంతానాలు బ్రిటిష్ పేర్లని మార్చేయడం మరియు బ్రిటిష్ కు సంబందించిన స్తాలాలని తొలగించడం వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఆ సమయములో మాల్గుడి మేయోర్ మరియు నగరసభ, చాలా కాలముగా ఉన్న ఫ్రెడరిక్ లాలీ యొక్క విగ్రహముని తీసి వేశారు. ఫ్రెడరిక్ లాలీ మాల్గుడిలో స్థిరపడ్డ ప్రర్రంభ నివాసులలో ఒకరు. అయితే, భారత స్వాతంత్ర ఉద్యమాన్ని లాలి గట్టిగా సమర్ధించేవారని హిస్టారికల్ సొసైటీస్ ఆధారాలు చూపినప్పుడు, ముందు వారు చేసిన చేర్యాలని నగరాసభ ఉపసంహరించుకోవలసి వచ్చింది. మాల్గుడిని బట్టేర్సీ, ఈస్టన్ రోడ్” లకంటే ఎక్కువ ప్రాబల్యం చెందినదని గ్రీన్ వర్ణించారు. మాల్గుడి ని ఫాక్నర్ యొక్క యోక్నపటాఫ కౌంటీ తో పోల్చవచ్చు. మరియు, ఫాక్నర్ మాదిరిగానే, నారాయణ్ రచనలని చూసినప్పుడు, అనేక కథలు, నవలల ద్వారా పట్టణానికి మరింత నిర్వచనం లబిస్తుంది.


నారాయణ్ ముందు బయట పడింది, గ్రహం గ్రీన్ సహాయం తోన్. గ్రీన్, స్వామినాథన్ అండ్ టేట్ ని చదవగానే తనంతట తనే ఆ పుస్తకానికి నారాయణ్ యొక్క అజేంట్ లాగ వ్యవహరించారు. అంతే కాక, ఆయినే ఈ నవల పేరుని తగిన విధముగా స్వామి అండ్ ఫ్రెండ్స్ గా మార్చడంలో ముఖ్య పాత్ర పోషించారు. అంతే కాక, నారాయణ్ యొక్క మరుసటి కొన్ని పుస్తకాలకు ప్రచురణకర్తలని ఒప్పించడంలో కూడా ముఖ్య పాత్ర పోచించారు. నారాయణ్ యొక్క మొదటి నవలలు వాణిజ్యంగా గొప్ప విజయం సాదించకపోయినా, ఆ కాలపు ఇతర రచయితలు దృష్టికి అయిన వచ్చారు. సోమేర్సేట్ మామ్ 1938లో మైసూర్ కు వచ్చినప్పుడు నారాయణ్ ని చూడాలని కోరారు. కాని నారాయణ్ ని చాలా మందికి తెలియకపోవడంతో, ఆయిన్ని కలవలేక పోయారు. తరువాత మామ్ నారాయణ్ వ్రాసిన ది డార్క్ రూం చదివి అబినందనలు తెలియచేస్తూ నారాయణ్ కు లేఖ వ్రాసారు. నారాయణ్ రచన మీద ఆసక్తి చూపించిన మరొక సమకాలపు రచయిత ఇ. ఎం. ఫోర్స్తర్,. అయిన కూడా నారయణ్ మాదిరిగానే నిస్సారమైన హాస్యస్ఫోరకంగా రాస్తారు. అందువల్ల దక్షిణ భారతీయ ఇ. ఎం. ఫోర్స్తర్ అని నారాయణ్ పిలవబడుతారు. పాటకులు, ఇతర రచయితల మధ్య నారాయణ్ ప్రసిద్ధి చెందినా, అయిన స్థాయికి తగిన విధముగా అయిన రచనలు విస్లేషించబడలేదు.


కొంత కాలం తరువాత నారాయణ్ కు యునైటడ్ స్టేట్స్ లో విజయం లభించింది. మికిగన్ స్టేట్ యూనివర్సిటీ ప్రెస్ అయిన పుస్తకాలని ప్రచురించడం ప్రారంబించింది. అయిన మొట్టమొదటి సారి ఆ దేశానికి రాక్ ఫెల్లెర్ ఫౌండేషన్ వారి ఫెలోషిప్ మీద వెళ్ళారు. అక్కడ మికిగన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ అఫ్ కలిఫోర్నియా, బెర్క్లీ వంటి అనేక విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు ఇచ్చారు. ఈ తరుణములో జాన్ అప్డైక్ అయిన రచనను గమనించి, నారాయణ్ ని  చార్లెస్ డికెన్స్ తో పోల్చారు. ది న్యూ యోర్కేర్ లో ప్రచురించబడిన నారాయణ్ రచన మీద విశ్లేషణలో అప్డైక్ ఆయిన్ని నశించిపోతున్న రచయితల జాతికు చెందిన రచయిత గా వర్ణించారు- ఒక పౌరుడు అయిన రచయిత; తన పాత్రలతో పూర్తిగా అనుసంధానమైన రచయిత, మానవత్వ విలువల మీద పూర్తీ విశ్వాసం ఉన్న రచయిత.


అనేక నవలలు, వ్యాసాలు, చిరుకథలు వ్రాసిన నారాయణ్, భారత రచనని ప్రపంచానికి చాటి చీప్పిన వ్యక్తిగా పేరొందారు. ఇరవయ్యవ శతాబ్దముకు చెందిన అత్యుత్తమ రచయితలో ఒకరిగా అయినన బావించబడుతున్నారు. అయిన రచనని రమణీయామని, హానిలేనదని, హితమైనదని విమర్శకులు వర్ణించారు. పిమ్మట వచ్చిన రచయితలు, ముఖ్యంగా భారతీయ రచయితలు, నారాయణ్ రచనని ఒక సాదాసీదా రచన అని, తక్కువ పతజాలం కలిగిందని, సంకుచిత దృష్టి కలిగిందని విమర్శించారు. శశి తరూర్ అభిప్రాయం ప్రకారం, నారయాణ్ కథలో పాత్రలు, జెన్ ఆస్టిన్ కథలలో మాదిరిగానే ఉన్నారని, ఇద్దరు సమాజములో ఒక చిన్న విభాగం గురించే వ్రాసేవారని విమర్శించారు. ఐతే, ఆస్టన్ యొక్క వచనము ఈ పాత్రలని సాధారణమైన పరిస్థితికి వెలుపల తీసుకువేళ్ళింది. కాని నారాయణ్ రచన అలాగ చేయలేదు. శశి దేష్పాండే కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. అయిన నారాయణ్ రచన సాదాసీదాగా మరియు బోళాగా ఉందని అభిప్రాయపడ్డారు. భాష మరియు పదవినియోగంలో సాదాతనం, పాత్రల ప్రవర్తన మరియు భావము లో చిక్కులు లేని విధంగా ఉంది అని చెప్పారు.


నారాయణ్ మీద ఉన్న సామాన్య అభిప్రాయం ఏమంటే, అయిన తనను గాని తన రచనలను గాని భారతదేశము యొక్క సమశ్యలు, రాజాకీయాల్లలో కలుపుకోలేదు. ఇదే అభిప్రాయాన్నే వి. ఎస్. నైపాల్ కూడా రాసారు. అయితే, నారాయణ్ రచన సాదాగా ఉండి, రాహకీయాలలో ఆసక్తి లేకుండా ఉన్నప్పటికీ, అయిన కథని కళాత్మకంగాను అటువంటి అంశాలని పూర్తిగా తప్పించకుండా చాకచక్యంగా రాసేవారని, పదాలు పాటకుల మదిలో ఆడే లాగ ఉండేదని ది న్యూ యోర్కేర్ కు చెందిన వ్యాట్ మాసన్ అభిప్రాయపడ్డారు. నారాయణ్ తన పాత్రలకు సంబందించిన వరకు మాత్రమె రాజకీయ అంశాలని రాసేవారని అదే ముల్క్ రాజ్ ఆనంద్ ఆ తరుణములో నెలకొన్న రాజకీయ పరిణామాలు, సమశ్యలు గురించి వివరంగా రాసేవారని ఆంధ్ర యూనివర్సిటీ యొక్క పూర్వ ఉప కులపతి శ్రీనివాస అయ్యంగార్ చెపుతున్నారు. నారాయణ్ బ్రిటిష్ పాలనని పూర్తిగా వదిలేసి, తన పాత్రల యొక్క వ్యక్తిగత జీవితాల మీదనే కేంద్రీకరించడం కూడా ఒక రాజకీయ స్పందనే, అనగా, బ్రిటిష్ పాలన యొక్క ప్రభావమునుంది పూర్తి స్వేచ్చ, అని పాల్ బ్రియన్స్, మాడేరన్ సౌత్ ఏషియన్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్ అనే తన పుస్తకములో వ్రాసారు.


ప్రాశ్చాత్య దేశాలలో నారాయణ్ రచనలోని సరత్వం బాగా కొనియాడబడింది. నారాయణ్ రచన హాస్యరసప్రధానమైనదని మరియు మానవ చేర్యలయోక్క బ్రమ మరియు అస్థిరత్వం తో కూడిన దృశ్యం కలిగి ఉంటదని అయిన జీవితచరిత్ర రచయితలలో ఒకరైన విల్లియం వాల్ష్ వ్రాసారు. పలుమార్లు బూకర్ ప్రతిబాతితురైన అనితా దేశాయ్ నారాయణ్ రచనని దయలేక పోవడం, కొంటితనాలే అతి పెద్ద పాపాలుగా ఉండి “దయతో కూడిన యధార్ధమని” వర్ణించారు. వ్యాట్ మసన్ అభిప్రాయం ప్రకారం, నారుయన్ రచనలో వ్యక్తి ఒక్క ప్రైవేట్ తత్త్వం కాదు కాని ఒక్క బహిరంగ తత్త్వం అనే భావం వ్యక్తమవుతుంది. ఈ భావం నూతనమైనదని అందువల్ల ఇది అయిన సొంత భావమని చెప్పొచ్చు. అయిన రచన భారత దేశపు ఆంగ్ల భాష నవల రచనలలో అతి విసేశామైనవాతిలో ఒకటి. ఈ నూతన భావముతో, అయిన ప్రాచీన హైందవ కోణంతో కూడిన ఆంగ్ల రచనలని ప్రాశ్చాత్య పాటకలకు పరిచయం చేసారు. “అయిన సంఘటనలు గురించి సంపాదకీయాలు రాయరు కాని తన సొంత భావాలని వివరిస్తారు” అని వాల్ట్ విట్మాన్ ని ఉద్దేశించి ఎడ్మండ్ విల్సన్ చెప్పిన అభిభ్రాయం నారాయణ్ కు కూడా వర్తిస్తుందని మాసన్ అభిప్రాయం.


తన సాహిత్య జీవితములో అనేక బిరుదులని నారాయణ్ గెలుచుకున్నారు. ఆయినకు లబించిన మొదటి పెద్ద బిరుదు, ది గైడ్ కొరకు 1958లో బహుకరించబడిన సాహిత్య అకాడెమీ అవార్డు ఆరు సంవత్సరాలు తరువాత, గుణతంత్ర దినం సందర్పుముగా ఆయినకు పద్మ భూషణ్ బిరుదు ఇవ్వబడింది. 1980లో ఆయినకు రాయల్ సొసైటీ అఫ్ లిటరేచర్ వారు AC బెన్సన్ మెడల్ బహుకరించారు. అయిన ఆ సొసైటి లో ఒక సభ్యుడు. 1982లో ఆయినని అమెరికన్ అకాడెమి అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ వారు గౌవరవ సబ్యుడుగా ఎన్నుకున్నారు.పలుమార్లు అయిన సాహిత్యానికి నోబెల్ బహుమతి కు ప్రతిపాతించబడ్డారు కాని ఆ బిరుదుని ఎప్ప్దుడు గెలవేలేదు.


యూనివెర్సిటీ అఫ్ లీడ్స్ (1967), యూనివెర్సిటీ అఫ్ మైసూరు (1976) మరియు ఢిల్లీ యూనివెర్సిటీ (1973) ఆయినకి గౌరవ డాక్టరేట్ లు ఇచ్చి గౌరవించాయి. అయిన సాహిత్ర జీవిత చివరిలో, అయిన భారత సాహిత్యానికి చేసిన సేవకు గాను నారాయణ్ భారత పార్లిమెంట్ యొక్క రాజ్య సభకు ఆరు సంవత్సరాల కాలానికు నియమితలయ్యారు. అయిన మరణించడానికి ఒక సంవత్సరము ముందు, 2000లో ఆయినకు భారత దేశపు రెండవ అతి గొప్ప పౌరుల బిరుదైన పద్మ విభూషణ్ బహుకరించబడింది.


తన సాహిత్యం ద్వారా భారత దేశాన్ని బయిట ప్రపంచానికి తెలియబరచిందే నారాయణ్ యొక్క అతి గొప్ప సాధన. ఆంగ్ల భాషలో భారత సాహిత్యరంగానికి చెందిన ముగ్గురు గొప్ప రచయితలలో ఆయినా ఒకరు.ముల్క్ రాజ్ ఆనంద్ మరియు  రాజా రావు మిగిలిన ఇద్దరు. మాల్గుడి మరియు ఆ పట్టణ నివసులలతో తన పాటకులు ఆసక్తిగా ఎదురుచూసే అంశాలని అయిన అందించారు. భారత దేశములోనే అత్యుత్తమ నవల రచయితలలో ఒకరిగా భావించబడుతున్నారు. ఒక చిన్న పాటి భారత పట్టనముని నమ్మసఖ్యే విడములోను పరీక్షాత్ములోను తన పాటకుల ముందు తెచ్చారు. మాల్గుడి కేవలం ఒక్క కల్పితా పట్టణం మాత్రమె కాదు. అనేక పాత్రలతో, వారి యొక్క విచిత్ర ప్రవర్తనలతో నిండి ఉన్న ఒక పట్టణం. జరుగుతున్న కథ తమ ఇంటి ఇరుగు పొరుగులో జరుగుతున్నట్లే పాటకులుకు ఉండేది.

-

నవలలు

స్వామి అండ్ ఫ్రెండ్స్ (1935, హమిష్ హమిల్టన్)

ది బేచలర్ అఫ్ ఆర్ట్స్ (1937, థామస్ నెల్సన్)

ది డార్క్ రూం (1938, ఏయర్)

ది ఇంగ్లీష్ టీచర్ (1945, ఏయర్)

Mr. సంపత్ (1948, ఏయర్)

ది ఫినాన్శియల్ ఎక్స్పెర్ట్ (1952, మెత్యున్)

వెయిటింగ్ ఫర్ ది మహాత్మా (1955, మేత్యున్)

ది గైడ్ (1958, మేత్యున్)

ది మాన్-ఈటర్ అఫ్ మాల్గుడి (1961, వైకింగ్)

ది వెండార్ అఫ్ స్వీట్స్ (1967, ది బోడ్లీ హెడ్)

ది పాయింటర్ అఫ్ సైన్స్ (1977, హీనేమన్)

ఎ టైగర్ ఫర్ మాల్గుడి (1983, హీనేమన్)

టాకటివ్ మాన్ (1986, హీనేమన్)

ది వరల్డ్ అఫ్ నాగరాజ్ (1990, హీనేమన్)

గ్రండ్మోతర్స్ టెల్ (1992, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్

కల్పన-కానిది

నెక్స్ట్ సండే (1960, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్)

మై డేట్లెస్ డైరీ (1960, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్)

మై డేస్ (1974, వైకింగ్)

రిలక్టన్ట్ గురు (1974, ఓరియంట్ పేపర్బాక్స్)

ది ఎమేరాల్డ్ రూట్ (1980, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్)

A రైటర్స్ నైట్మెర్ (1988, పెన్గుయిన్ బుక్స్)


పౌరాణికాలు

గాడ్స్, డేమన్స్ అండ్ అతర్స్ (1964, వైకింగ్)

ది రామాయణ (1973, చాట్టో & విన్డస్)

ది మహాభారత (1978, హీనేమన్)

చిరుకథల సేకరణలు

మాల్గుడి డేస్ (1942, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్)

యాన్ అస్ట్రాలజర్స్ డే అండ్ అతర్ స్టోరీస్ (1947, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్)

లాలీ రోడ్ అండ్ అతేర్ స్టోరీస్ (1956, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్)

ఎ హార్స్ అండ్ టూ గొట్స్ (1970)

అండర్ ది బన్యన్ ట్రీ అండ్ అతర్ స్టోరీస్ (1985)

ది గ్రండ్మోతర్స్ టెల్ అండ్ సేలేక్టేడ్ స్టోరీస్ (1994, వైకింగ్)


అనుసరణలు

నారయంబ్ రచించిన ది గైడ్ అనే పుస్తకము గైడ్ అనే పేరుతొ విజయ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఒక హిందీ చిత్రముగా తీయబడింది. ఆంగ్ల భాషలోనూ ఐది విడుదల అయింది. అయితే, చిత్రం తీయబడిన విధము మరియు పుస్తకములో రాసినాట్లు కాకుండా కథని మార్చడం నారాయణ్ కు నచ్చలేదు; అయిన లైఫ్ పత్రిక లో “ది మిస్ గైడెడ్ గైడ్” అనే పేరుతొ చిత్రాన్ని విమర్శిస్తూ ఒక వ్యాసం రాసారు. ఈ పుస్తకము ఒక బ్రాడ్వే నాటిక లాగ హర్వే బ్రెట్ మరియు పట్రిషియ రైన్హార్ట్చే తీయబడింది. ఈ నాటికను 1968లో జియా మొహ్యిద్దిన్ ప్రధాన పోత్ర్ పోషిస్తూ, రవి శంకర్ సంగీతం అందిస్తూ హడ్సన్ థియేటర్ లో ప్రదర్శించబడింది.


Mr. సంపత్ అనే అయిన నవల మిస్ మాలిని అనే పేరుతొ, పుష్పవల్లి మరియు కొత్తమంగళం సుబ్బు నటులుగా తమిళ చిత్రముగా తీయబడింది. పద్మిని, మోతిలాల్ నటులుగా జెమిని స్టూడియోస్ హిందీ లోను ఈ చిత్రాన్ని తీసారు.మరొక నవలైన ది ఫైనాన్షియల్ ఎక్సేర్ట్ బ్యాంకర్ మర్గయ్య అనే పేరుతొ కన్నడములో చిత్రముగా తీయబడింది. స్వామి అండ్ ఫ్రెండ్స్ , ది వెండార్ అఫ్ స్వీట్స్ మరియు నారాయణ్ రచించిన ఇతర కొన్ని చిరు కథలని నటుడు-దర్శుకుడైన శంకర్ నాగ, మాల్గుడి డేస్ అనే పేరుతొ టెలివిషన్ సిరీస్ గా తీసారు. వీటితో నారాయణ్ సంతృప్తి చెంది, పుస్తకాలలో వ్రాసినట్లే కథలని ఉంచడం గురించి నిర్మాతలని నారాయణ్ మెచ్చుకున్నారు.


— ( వికీపీడియా సౌజన్యంతో )


ఆర్.కె.నారాయణ్  తెలుగు అనువాద కథలు – నవలలు చదవాలనుకునేవాళ్ళు దిగువున ఇస్తున్న లంకెలను నొక్కగలరు


1.కథ పేరు – వర్షం – స్రవంతి సాహిత్య పత్రికలో ప్రచురణ


2.కథ పేరు – బెడిసికొట్టిన ప్రేమ – స్రవంతి సాహిత్య పత్రికలో ప్రచురణ


3.కథ పేరు – గుడ్డి కుక్క – స్రవంతి సాహిత్య పత్రికలో ప్రచురణ


4.కథ పేరు – లీలాస్నేహితుడు – స్రవంతి సాహిత్య పత్రికలో ప్రచురణ


5.కథ పేరు – అర్ధ రూపాయి విలువ (గమనిక:ఒక పేజి లేదు ఇందులో) – స్రవంతి సాహిత్య పత్రికలో ప్రచురణ


6.కథ పేరు – నిజం (గమనిక:ఆఖరి పేజి లేదు ఇందులో) – ప్రగతి వార పత్రిక లో ప్రచురణ 


7.నవల పేరు – స్వామి మిత్రులు ( తెలుగు అనువాదం స్వామి అండ్ ఫ్రెండ్స్ ) – వాసిరెడ్డి సీతాదేవి అనువాదం


8.నవల పేరు – మాటకారి ( తెలుగు అనువాదం ) – చతుర లో మే 2011 ప్రచురణ


9.కథ – మెరుపు మనిషి

----

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!