Skip to main content
అంత్యప్రాసం...ఆరుద్ర.
అంత్యప్రాసం...ఆరుద్ర.
.
గజపతులు, నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ నినదించెను గౌతమి హోరు
.
కొట్టుకొనిపోయెనొక కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు
.
మహానుభావుడు ఆరుద్ర రాజమహేంద్రపురం గురించి వర్ణిస్తూ వ్రాసిన పాట .
"ఊరు" కి ఎన్నో ప్రాసపదాలు వాడటం మనం చూశాం,
"పేరు", "ఏరు", "నీరు" వంటివి రివాజు.
కానీ, ఆరుద్ర ఎంతో ఆలోచించి "నినదించెను" వంటి చక్కని పదాలను అక్కునచేర్చుకుని "గౌతమి హోరు" అని ఎంత చక్కని అంత్యప్రాస కలిపారు?
.
కొట్టుకొనిపోయెనొక కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు
అలాగే, "కొట్టుకొని పోయెనొక కోటిలింగాలు" ,
"వీరేశలింగం పంతులు మిగిలాడు మాకు,
అది చాలు", అని అన్నారు..x
Comments
Post a Comment