పోతన - శ్రీమద్భాగవతం ..పద్యం.


పోతన - శ్రీమద్భాగవతం ..పద్యం.
.
బహుకుటుంబి యగుచు బహు ధనాపేక్షచే
నెండమావుల గని యేగు మృగము
కరణి బ్రేమ జేసి పరువులు వాఱుచు
నొక్కచోట నిలువకుందురెపుడు
.
ఈ మనుషులు తమతమ కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటారు
.డబ్బు మీద వ్యామోహం పెంచుకుంటారు.
లేళ్లు ఎండమావుల వెంట పరుగులు తీసే విధంగా కోరికలను
నెరవేర్చుకోవాలనే అత్యాశతో మానవులు
ఎక్కడా నిలకడగా ఉండక
నిరంతరం పరుగులు పెడుతుంటారు.
.
అంతగొందఱల్ల నన్యోన్య విత్తాది
వినిమయమున గడుబ్రవృద్ధమైన
వైరములను బొంది పోరాట వొందుదు
రాత్మ చింతలేక యనుదినంబు
.
కొందరు డబ్బుకి సంబంధించిన లేదా ద్రవ్యానికి సంబంధించిన
లావాదేవీల కారణంగా ఒకరితో ఒకరికి శత్రుత్వం ఏర్పడుతుంది.
అంతేకాక ఆ శత్రుత్వం రోజురోజుకీ పెరుగుతుంది.
ఇలా నిరంతరం పోరాడే స్వభావంతో ఒకరిమీద

ఒకరికి ప్రేమ, అభిమానం లేకుండా పోతాయి.








Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!