Posts

Showing posts from September, 2018

ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు. (పోతనామాత్యుడు.)

Image
ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు. (పోతనామాత్యుడు.) 🏵️ 👉చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్ ! చదువగ వలయును జనులకు చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ ! - భావము హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ అంటున్నాడు- “బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు. మరి చదివితే ఏమవుతుంది? మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!” అని. 🏵️🏵️🏵️🏵️ 👉చదివితి ధర్మార్ధ ముఖ్య శస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ !! - భావము: “నాన్నగారు! నన్ను గురువులు చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మున్నగు ముఖ్య శాస్త్రములు అన్నీ చదివి, అన్ని చదువులలోని సారమూ, రహస్యమూ సంపూర్ణంగా గ్రహించాను. మరల చదువు చెప్పటానికి చండామార్కులు ప్రహ్లాదుని తీసుకెళ్ళారు. ఇప్పుడు మీ అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు అని చూపటానికి ఆ రాక్షస

వహీదా రెహమాన్‌!

Image
వహీదా రెహమాన్‌! - వహీదా రెహమాన్‌ తెలుగమ్మాయి అంటారు కానీ ఒరిజినల్‌గా తమిళనాడు ముస్లిము. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఆంధ్రలో చాలాకాలం గడిపారు. ''రోజులు మారాయి'', ''జయసింహ'' సినిమాల నాటికి ఆయన విజయవాడలో మునిసిపల్‌ కమీషనర్‌గా పనిచేస్తున్నారు. తెలుగు ప్రాంతాల్లో పెరగడం వలన వహీదాకు తెలుగు బాగా వచ్చు. ''రోజులు మారాయి'' సినిమాలో 'ఏరువాక సాగారోయ్‌' పాటలో నర్తించింది. ఎన్టీయార్‌ ఆమెకు ''జయసింహ''లో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర యిచ్చి నటింపజేశారు. ''మిస్సమ్మ'' సినిమాను హిందీలో తీయడానికి వీలుపడుతుందేమో చూద్దామని హైదరాబాద్‌ వచ్చిన గురుదత్‌ వహీదాను మెచ్చారు. ప్రత్యక్షంగా కలిసి తన సినిమా ''సి ఐ డి''లో హీరోయిన్‌గా వేయడానికి హిందీ రంగానికి ఆహ్వానించారు. ఇది 1955లో జరిగింది. ''బాజ్‌'' తర్వాత గురుదత్‌ స్వంతంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ''ఆర్‌ పార్‌'' (1954), ''మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55''(1955) సినిమాలు హిట్‌ కావడంతో ''సి.ఐ.డి'

క్షీర సాగర మధన మర్మం.--కూర్మావతారం.🌹

Image
క్షీర సాగర మధన మర్మం.--కూర్మావతారం.🌹 🙏 🙏సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు🙏.🙏 🏵️ "చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే... పొందగోరినదందలేని నిరాశలో అణగారి పోతే.... బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక.... ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది... క్షీర సాగర మధన మర్మం.! - కూర్మావతారం ద్వారా మనిషి నేర్చు కోవలసిన ముఖ్యమైన లక్షణాలు పట్టుదల, ఓర్పు , సహనం అని సీతారామ శాస్త్రి గారు వివరించిన విధానం నిజంగా అమొఘం.. మనం ఏమైనా గొప్ప గొప్ప ఘనకార్యాలు తలపెట్టేటప్పుడు ఆ పని భారం మంధర పర్వతం లాగ చాలా బరువుగా అనిపించి ఒకొక్కసారి వొదిలెయ్యాలనిపిస్తుంది.. దానికి తోడు తనను తాడు లాగా ఉపయోగిస్తున్న వాసుకి సర్పం బుసలు కొట్టే విషపూరితమైన అసహనపు నిట్టూర్పు సెగలు పరిస్థితులను ఇంకా తీవ్రతరం చేసినా కానీ పొందవలసినదందలేదని నిరాశ నిస్పృహలతో నీరశించకుండా ఓర్పుతోను, పట్టుదలతోను నొప్పిని సహిస్తూ అడుగు ముందుకెస్తే ఓటమిని కూడా ఓడించగలిగే అవకాశం ఉంటుందని, విజయం వరించడం ఖాయమని కూర్మావతారమర్మం అంటూఅయిదు వాక్యాలతో అద్భుతంగా తెలియజేసారు

ఒక చిన్న కథ!

Image
ఒక చిన్న కథ! ఒక పర్యాయం విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు దూరమైనారు. ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉండగా చూచి విక్రమాదిత్యుడు 'సాధు మహరాజ్, ఇటువైపుగా ఎవరైనా ఇంతకు ముందు వెళ్ళారా!' అని అడిగాడు. ఆ అంధ సాధువు ఇలా అన్నాడు:  *'మహారాజా! అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనా నాయకుడొకడు వెళ్ళాడు. సేనానాయకుని తరువాత మీ మంత్రి కూడా ఇంతకుముందే వెళ్ళాడు'* అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో, ఆసక్తితో మహాత్మా! మీకు నేత్రాలు కనిపించవు కదా! నా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇక్కడి నుండి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు? నేను రాజునైనట్లు కూడా ఎలా కనుగొన్నారు?' అంధుడైన సాధువు ఇలా చెప్పాడు: “మహారాజా! నేనా ముగ్గురినీ, మిమ్ములను మీ మాటలు విని కనిపెట్టాను. అందరికంటే ముందు సేవకుడు వచ్చి నాతో, "ఏమిరా, గుడ్డివాడా! ఇటు ఎవరైనా వచ్చారా?" అని అడిగాడు. కొంతసేపటికి సేనానా

ఎంత సమస్యైనా హడావిడి పడితే పరిష్కరించలేం. !

Image
ఎంత సమస్యైనా హడావిడి పడితే పరిష్కరించలేం. ! - తాతగారి గోడ గడియారం స్టోర్ రూమ్ లో ఎక్కడో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. మనవళ్లందరినీ పిలిచి, ఎవరు గడియారం వెతికిపెడితే  వాళ్లకు పది రూపాయలు అని ప్రకటించాడు. పిల్లలందరూ గోలగోలగా రోజు రోజంతా వెతికారు.  గడియారం దొరకలేదు. అంతా వెళ్లిపోయిన తరువాత ఒక మనవడు తిరిగి వచ్చాడు. "నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు తాతా... నేను వెతుకుతాను." అన్నాడు. గదిలోకి వెళ్లాడు. తలుపులు మూసుకున్నాడు.  ఒక పది నిమిషాల తరువాత "ఇదిగో తాతా గడియారం" అంటూ బయటకు వచ్చాడు. "ఎలా దొరికిందిరా?" అని అడిగాడు తాత. "తాతా ఇందాక అందరూ మాట్లాడుకుంటూ, కేకలు వేసుకుంటూ వెతికాం. గడియారం దొరకలేదు. ఈ సారి గదితలుపు వేసి నిశ్శబ్దంగా కాస్సేపు నిలుచున్నాను. "టిక్ టిక్" మంటూ గడియారం శబ్దం వినిపించింది. కాస్త చెవులు రిక్కించి, ఇంకాస్త మౌనంగా ఉండిపోయాను. ఆ శబ్దం ఎటు వైపు నుంచి వస్తుందో అర్థమైంది. ఆ వైపు వెళ్లి వెతికాను. ఇదిగో దొరికింది." "నిజమే... ఎంత సమస్యైనా హడావిడి పడితే పరిష్కరించలేం." ప్రశాంతంగా ఆల

ఆ అందమైన అమ్మాయి పేరు గిరిక..! -

Image
ఆ అందమైన అమ్మాయి పేరు గిరిక..! - మ. సతి యూరుద్యుతి జెందఁబూని నిజదుశ్చర్మాపనోద క్రియా రతి పాథోలవ పూరితోదరములై రంభేభ హస్తంబులు న్నంతఱిన్, వీడె మరుద్విభూతిఁ గదళిన్ త్వగ్దోషమాచంచలో ద్ధతశుండాతతి బాయదయ్యె నదెపో తద్వైరమూలంబిలన్.! (వసుచరిత్రము అనే ప్రభంధం లోనిపద్యం ) - కవి రామరాజభూషణుడు. ఈయనకు భట్టుమూర్తి అనే పేరు కూడా ఉంది. - . ఆ అమ్మాయి గారి తొడలు కరిశుండానికన్నా,  రంభాస్తంభాలకన్నా అందమైనవి.  తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ రెండూ సతి ఊరుద్యుతిని పొందలేవు. దుశ్చర్మాన్ని పోగొట్టుకుంటే అరటి స్థంభాన్ని కొంచెం పోల్చవచ్చునేమో కానీ, ఏనుగు తొండానికి మాత్రం ఆ అవకాశమూ లేదు. అమ్మాయి ఊరువుల కాంతిని తెలిపేందుకు ఈ పోలికలు, కల్పన చేశాడు కవి. . రంభ (అరటి), ఇభహస్తములు (ఏనుగు తొండాలు), సతి ఊరుద్యుతి జెందబూని, పాథోలవ పూరిత ఉదరములై, నిజ దుశ్చర్మ అపనోద క్రియారతిని ఉన్న తరిన్, మరుద్విభూతి త్వగ్దోషము వీడె కదళిన్, ఆ చంచలోద్ధత శుండాతతి పాయదయ్యె, అదెపో తద్వైర మూలంబు, ఇలన్ — , ఏనుగు తొండాన్ని వర్ణిస్తూ మత్తేభ వృత్తంలో వ్రాయడం బాగున్నది - (వడ్డాది వారి చిత్రం.)

ఆహా ఓహో.. అటుకుల ఉప్మా..

Image
ఆహా ఓహో.. అటుకుల ఉప్మా..  దీని సాటి రాదు ఏ రవ్వ ఉప్మా..  చింత చారు వేస్తే కాదా పులిహోర..  చింత లేకుండా మరి తినరా నోరారా..  కన్నడిగుల ఇంట ఇది కవ్వించునంటా.. కలిమిలేములు మరిచి అందరూ భుజించునంటా..  మా అమ్మ చేస్తే మైమరిచిపోతుంటా..  మళ్ళీ మళ్ళీ కొసరి వడ్డించమని తింటా.. 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ అటుకుల ఉప్మా- చేయు విధానం . కావలిసిన పదార్థాలు 1. అటుకులు పావుకేజీ 2. పచ్చిమిర్చి 3 3. అల్లం చిన్న ముక్క 4. టొమాటోలు 2 5. ఉల్లిపాయలు 2 6. కరివేపాకు 7. కొత్తిమీర 8. కేరట్ 1 9. జీడిపప్పు పోపుదినుసులు పల్లీలు 2 స్పూన్స్ , సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ , ఎండుమిరపకాయలు , ఆయిల్ 4 స్పూన్స్ , పసుపు , ఉప్పు రుచికి సరిపడా తయారీ విధానం ముందుగా పచ్చిమిర్చిని చీలికలుగా ను , అల్లము ఉల్లిపాయలను టొమాటోలను సన్నని ముక్కలుగాను తరుగుకోవాలి .కొత్తిమీరను , కేరట్ లను సన్నగా తురుముకోవాలి . స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి పల్లీలను వేసి అవి దోరగా వేగాక, జీడిపప్పు కూడా వేసి , వ

శ్రీ శ్రీ అక్షర ఆయుధాలు!

Image
 శ్రీ శ్రీ అక్షర ఆయుధాలు! 🙏🙏🙏🙏 మహాకవి శ్రీ శ్రీ  గారి గురించి  తెలియని వాళ్ళు ఉండరు . ఆయన రచనలు చదివి స్ఫూర్తి పొందని వారు ఉండరు. ఆ మహా రచయిత కలము నుండి జాలువారిన ఈ స్ఫూర్తిదాయక రచన .... మనలో ఉత్తేజాన్ని , ఉత్సాహాన్నీ నింపు తుంది . 🙏🙏🙏🙏 *కుదిరితే పరిగెత్తు*.. , *లేకపోతే నడువు*... *అదీ చేతకాకపోతే*... *పాకుతూ పో*.... , *అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు*...  *ఉద్యోగం రాలేదని*, *వ్యాపారం దెబ్బతినిందని*, *స్నేహితుడొకడు మోసం చేశాడని*, *ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని*... *అలాగే ఉండిపోతే ఎలా*? *దేహానికి తప్ప*, *దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే*...   *తలుచుకుంటే*... *నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా*... *నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది*, *అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా*? *సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు*..., *పారే నది*.., *వీచే గాలి*..., *ఊగే చెట్టు*..., *ఉదయించే సూర్యుడు*.... *అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా*....,, *ఏ

పద్మనాభ' యుద్ధం

Image
పద్మనాభ' యుద్ధం! - ఎక్కడో జరిగిన తళ్ళికోట యుద్ధం గురించి తెలుగువాళ్ళందరికీ తెలుసు. మరి మన గడ్డమీద జరిగిన  'పద్మనాభం' యుద్ధం గురించి తెలుసుకుందాం. మన దేశం లో బ్రిటిష్ పాలన మొదలయ్యే టప్పటికి  విజయనగరం గంజాం,విశాఖపట్టణం, శ్రీకాకుళం  ప్రాంతాలు 20 మంది జమీందారుల అధీనం లో వుండేవి.వి విధ కారణాలవల్ల ఈ జమీందారులు ఆగ్లేయులకు  వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆంగ్లేయులకేమో సాధ్యమైనంత తీరప్రాంతం తమ గుప్పిట్లో వుండాలన్న పట్టుదల.ఆ ప్రయత్నాల్లోనే విజయనగరం జమీన్దారీని ఆక్రమించు కోవాలనుకున్నారు. ఇంతలో విజయనగరం అధిపతి ఆనందగజపతిరాజు  మరణించడం తో దానికి అవకాశం వచ్చింది. అప్పటికి ఆయన కొడుకు చిన విజయరామరాజుది చిన్న వయసు.అందుకని ఆనందగాజపతిరాజు సవతి సోదరుడైన  సీతారామరాజును దివానుగా నియమించారు. విజయరామరాజు రాజు కాగానే సీతారామరాజును దివాన్  పదవి నుండి తొలగించారు,దాంతో సీతారామరాజు ఆంగ్లేయులతో  జట్టు కట్టాడు. అవకాశం చూసుకొని  ఆంగ్లేయులు తమకు చెల్లించాల్సిన ఎనిమిదిన్నర  లక్షల పేష్కస్ చెల్లించాలని లేకపోతే జమీన్దారీని  ముట్టడిస్తామని విజయరామరాజును హెచ్చరించారు.

చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి !

Image
చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి ! - చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి, చచ్చిరి రాజులెల్ల రీ- కచ్చకు మూలకందమగు కర్ణుడు మామయు చచ్చిరీ గతిన్ పచ్చని కొంప మాపితివి బాపురే? కౌరవనాథ! నీ సగం బిచ్చెద జీవితేచ్ఛ కలదేని బయల్పడుమయ్య గ్రక్కునన్ ఆ..ఆ..ఆ.. - పద్దెనిమిది రోజుల యుద్ధం తరువాత, దుర్యోధనుడు ద్వైపాయనహ్రదంలో దాగి ఉన్నాడని బోయల ద్వారా తెలుసుకున్న తర్వాత ధర్మరాజు తమ్ములతో, బంధువర్గంతో, శ్రీకృష్ణసమేతంగా వివిధ వాద్యాల ధ్వనులు అన్ని దిక్కులూ వ్యాపిస్తూ వుండగా, ఆ సరోవరాన్ని సమీపించాడు.  దుర్యోధనా! నీళ్లలో ఎందుకు మునిగి దాగి ఉన్నావు? అంతమాత్రాన చావు నీకు తప్పుతుందా? లోకంలో ఇట్టి నీచస్థితి నీకు తగునా? శూరుడవేనా? నీ అభిమానం ఎక్కడికి పోయింది? నీ కీర్తిని, గొప్పతనాన్ని వదలి శత్రుసమూహం నవ్వేటట్లు ఈ విధంగా చేయతగునా? రాజు ధర్మం వదిలితే ఇహపరాలుంటాయా? యుద్ధంలో కుమారులు, తమ్ములు భయంకరంగా చనిపోగా, చూచినా, నీ బుద్ధి, నీ శరీరాన్ని కాపాడుకొనటం కొరకు ఎట్లా ఒప్పుకున్నావు? రారాజు, పాండురాజకుమారుల భుజబల విజ్రుంభణానికి తట్టుకొనలేక మడుగులో దాగినాడట! అని ప్రజలు ఛీ కొట్టరా? చచ్చేటప్పుడు భుజబలదర్ప

----------------స్త్రీ స్వేచ్చ ----------------------- ... ..చలం (మైదానం)..........విశ్వనాధ(చెలియలికట్ట)..

Image
----------------స్త్రీ స్వేచ్చ ----------------------- ... ..చలం (మైదానం)..........విశ్వనాధ(చెలియలికట్ట).. - స్త్రీల సామాజిక దుస్థితి గురించి,వారి స్వేచ్చా స్వాతంత్ర్యాలని గురించి తన ఆందోళనని జీవితాంతమూ కొనసాగించిన రచయిత గుడిపాటి వెంకటాచలం.(చలం అనే పేరు తో ప్రాచుర్యం). చలం సాహిత్య ప్రభావం బలమైనది. తెలుగు సాహిత్యం లో చలం అంతటి వివాదాస్పద రచయిత మరొకరు లేరు.స్త్రీ పురుష సంబందాల మధ్య ఏ అంశాలనయితే ముట్టుకోడానికి కూడా మిగతా రచయితలు వేల ఏళ్ళుగా సాహసించ లేదో,ఆ సాహసాన్ని స్త్రీ కోసం మనసారా చేసిన తొలి రచయిత  చలం.పురుషుల నిరంకుశ ధోరణి కింద స్త్రీలు అనుభవించే హింస తాలూకు బహు ముఖాలనీ తన సాహిత్యంలో నిజాయితీగా బొమ్మ కట్టి మరీ చూపినవాడు చలం. పురుషాధిక్య సమాజపు వికృత నీతిని తన రచనల్లో ఏ ముసుగులూ వెయ్యకుండా భాషించ గలిగిన వాడు చలం. సాహిత్యం లో శశిరేఖ,అరుణ,వంటి వ్యక్తిత్వం ఉన్న స్త్రీలను చిరస్థాయిగా ఉంచిన వాడు చలం. అయితే చలం రచనల్లో ఎక్కువ సంచలనాన్ని సృష్టించిన నవల మాత్రం "మైదానం". ఈ మైదానం నవలని చలం 1925 లో రాశారు.మైదానం నవల చాలా చర్చలను రేపింది.ప్రతికూల విమర్శల నెదు

సుబ్బయ్యగారి హోటల్ !

Image
సుబ్బయ్యగారి హోటల్ ! - శ్రీ కృష్ణా విలాస్ అంటే తెలీకపోవచ్చు గాని సుబ్బయ్యగారి హోటలంటే ఎవర్నడిగినా చెప్తారు కాకినాడలో అని..  ఏదైనా పనుండి కాకినాడొచ్చినోళ్ళు ఎవరైనా సరే ఓ సారి సుబ్బయ్య హొటేలుకెళ్ళి భోజనం చేయాలనుకుంటారు.. మనం ఒద్దు ఒద్దంటున్నా వినకుండా బలవంతం చేసి మరీ ఆకునిండా మొత్తం ఇరవై అయిదు రకాల ఐటెంసేసి పెట్టే సుబ్బయ్య హొటేలు భోజనం అంటే అంత ఫేమస్సు మరి.. ఎన్టీ రామారావుగారైతే అప్పట్లో తూగోజీ ఎప్పుడొచ్చినా ఇక్కడ భోజనం చెయ్యకుండా వెళ్ళీవోరు కాదని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు..   1940 లో కట్టిన పాతకాలం బిల్డింగులోకి అడుగెట్టగానే ఎక్కడికక్కడ కిటకిటలాడిపోయే జనాన్ని చూసి అది హోటలో లేక సత్రమో అర్ధంగాదు మనకి చాలాసేపు.. జనాన్ని చూసి కంగారు పడకండి.. రష్ ఎంతుంటాదో వడ్డింపు అంత స్పీడుగా ఉంటాది.. వడ్డన కుర్రోళ్ళు పిచ్చెక్కిస్తారు. ఎంట్రన్సులో ఉన్న కౌంటర్లో టేబుల్ మీదెట్టిన నేతిబూరెలు, పాకంగారెలు, పులిహోరపొట్లాలు చూడగానే నోట్లో నీళ్లూరతాయ్..  ధైర్యం తెచ్చుకుని డైనింగ్ సెక్షనులోకి అడుగెడతాం...  ఎళ్ళగానే పెద్ద సర్వరెదురొచ్చి చుట్టానికి మర్యాద చేసినట్టు చేసి, కూర్చోబెట్టి ఆకే

ఎవరీ..రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ? 🤲🤲🤲🤲🤲🤲🤲🤲

Image
ఎవరీ..రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ? 🤲🤲🤲🤲🤲🤲🤲🤲 బెంగుళూరు లోని ఓ ఇంటి ముందు తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి  శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు..కారులోంచి దిగారు.  లోపలికి వెళ్ళి చూస్తే..అంతా నిశ్శబ్దం.  మంచం మీద ఓ వృద్ధుడు నిస్తేజంగా  పడుకుని ఉన్నారు. చుట్టూ ఎవరెవరో వున్నారు.  ప్రసాద్ తాను వచ్చిన పని గురించి చెప్పారు.  అందులో ఓ వ్యక్తి ఆసక్తిగా ముందుకు వచ్చి.. నాన్నగారు వారం నుంచి కోమాలో వున్నారు, అంటూ ప్రసాద్ గారిని మంచం దగ్గరకు తీసుకుపోయి..ఆ వృద్ధుని చెవిలో  "నాన్నగారూ..నాన్నగారూ" అంటూ పిలిచాడు.  సమాధానం లేదు. ఈ సారి చెవి దగ్గరగా.. "మీ కోసం తిరుమల నుండి ప్రసాదం వచ్చింది" అన్నాడు. అప్పుడు తెరుచుకున్నాయి..  ఆ వృద్ధుని కళ్ళు. అర్ధ నిమీలిత నేత్రాలతో  ఆయన ప్రసాద్ వంక, ఆయన చేతిలోని ప్రసాదం  వంక చూస్తున్నాడు. ప్రసాద్ వెళ్లి ఆయన మెడలో  శ్రీవారి డాలర్ హారం అలంకరించి, శాలువా కప్పి,  శ్రీవారి ప్రసాదాన్ని ఆయన చేతిలో ఉంచారు.. "మిమ్ము స్వామి వారి ఆస్థాన విద్వాంసునిగా  నియమిస్తున్నాము" అని నియామక పత్రాన్ని  ఆయ

అతడు ఆమెను డొక్కలో తన్నాడు

Image
అతడు ఆమెను డొక్కలో తన్నాడు  ఆమె నవ్వుతోంది  . మళ్ళీ తన్నాడు  మళ్ళీ నవ్వుతోంది  . మళ్ళీ మళ్ళీ తన్నుతున్నాడు  ఆమె మళ్ళీ మళ్ళీ నవ్వుతూ డొక్క తడుము కుంటోంది  తన్నుతూ ఉంటె నవ్వుతోంది  . . . ఎందుకో ఆమె నవ్వుతూనే ఉంది . . . ఆమె ఆరాటం వాడిని ఎప్పుడు చేతుల్లో ఎత్తుకుంటానా అని  . . అలా ఆనందంగా తన్నించుకునే ఆమె  . . . . . . . . “అమ్మ” .

పురిటి నెప్పులు పెళ్లయ్యే వరకూ కాస్త ఆపుకో తల్లి !

Image
పురిటి నెప్పులు పెళ్లయ్యే వరకూ కాస్త ఆపుకో తల్లి ! (బాపు గారి కార్టూన్ .)

విశ్వనాథ ‘ఉద్విగ్నహృదయిని’ కిన్నెరసాని🌹

Image
విశ్వనాథ ‘ఉద్విగ్నహృదయిని’ కిన్నెరసాని🌹 🏵️ తెలుగు సాహితీ కవితా ప్రపం చంలో విశ్వనాథవారి అపూర్వ అమృత వృష్ఠి ‘కిన్నెరసాని’. ఆధునిక సాహితీ వృక్షపు శాఖ అయిన ‘భావకవిత్వం’ ఆంధ్ర సాహితీ సీమను తీర్చిదిద్దిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పపనిలేదు.  భావకవిత్వంలో గల ఉప శాఖైలెన ప్రణయకవిత్వం, దేశభక్తికవిత్వం, ప్రకృతికవిత్వం, సంఘసంస్కరణ కవిత్వం, భక్తి కవిత్వం, స్మృతి కవిత్వాలలోని ప్రకృతి ఆరాధన - ప్రణయభావనల సమ్మేళనంగా సాగిందే ఈ ‘కిన్నెరసాని’ భారతీయ సంస్కృతికి దర్పణం పట్టే ఈ పాటల కావ్యం విశ్వనాథకే గాక యావత్ తెలుగు సాహిత్యానికే కలికితురాయిగా నిలిచింది. 1921లో మనదేశమంతటా ప్రజ్వరిల్లిన సహాయ నిరాకరణోద్యమ పవనాలకు ప్రభావితుైడెన విశ్వనాథ సత్యనారాయణ కళాశాలలో చదువుతున్న బి.ఎ తరగతికి సలాంకొట్టి ఉద్యమదారి పట్టారు. ఆ సంవత్సరమే ఉద్యమ నేపథ్యంతో ‘అంతరాత్మ’ అనే నవలా రచనకు శ్రీకారం చుట్టారు. ఉపాధి కోసం అదే ఏడాది బందరు ఆంధ్రజాతీయ కళాశాలలో అధ్యాపక వృత్తి చేపట్టి 1926 వరకు కొనసాగారు. ఆ సమయంలోనే ‘కిన్నెరసాని పాటలు’ రాశారు. అవి 1969కి గాని పుస్తక రూపానికి చేరలేదు.  కేవలం యాబై ఐదు పేజీలు గల ఈ మధురగేయ కా

కవిసమ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు!

Image
కవిసమ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు! (నా సేకరణ -10 గంటల వికీపీడియా శోధన) - శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు 10-09-1895 న కృష్ణాజిల్లా లోని నందమూరు అనే గ్రామంలో శ్రీ శోభనాద్రి,పార్వతమ్మ దంపతులకు జన్మించారు. వారి ప్రాధమిక విద్యాభ్యాసం అంతా నందమూరు,ఇందుపల్లి,పెదపాడు గ్రామాలలో జరిగింది. ఉన్నత విద్య అంతా బందరులో జరిగింది.వారి అదృష్టం కొద్దీ బందరులో వారికి తెలుగు ఉపాధ్యాయుడిగా శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు ఉండేవారు.ఆ రోజుల్లో వీరిపై పింగళి లక్ష్మీకాంతం,కాటూరి వెంకటేశ్వరరావు,కోట వెంకటాచలం గార్ల వంటి ప్రఖ్యాత కవుల ప్రభావం ఉండేది. పదునాలుగు ఏండ్ల ప్రాయం నుండే రచనలు ప్రారంభించారు.కానీ అవి తరువాతి కాలంలో ప్రచురించపడ్డాయి. B.A. పూర్తి చేసిన తరువాత కొంత కాలం బందరులోనే ఉపాధ్యాయవృత్తిలోకొనసాగారు.ఉపాధ్యాయ వృత్తి కొనసాగిస్తూనే private గా మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో M.A పట్టాను పొందారు. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మహాత్మా గాంధీ గారి ప్రేరణతో సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు.ఆ తరువాత మళ్ళీ వివిధ కళాశాలల్లో ఉపన్యాసకుడిగా పనిచేసారు.బందరులోని ఆంద్ర జాతీయ కళాశాల,గుంట

విశ్వనాథ -కావ్యానందం !

Image
విశ్వనాథ -కావ్యానందం ! 🏵️ విజయవాడ,ఏలూరు రోడ్డు,SRR కాలేజీ,. ఆంజనేయస్వామి గుడి,కోకాకోలఫాక్టరి, (ఇప్పుడులేదు),ఇటు చుట్టుగుంట అటుగుణదల మేరీమాతగుడి. జ్ఞానపీఠ్ బహుమతి గ్రహీత ఆకాలేజీకే పేరుతెచ్చారు . 🏵️ విశ్వనాధ మ్రోయుతుమ్మెద నవల కరీంనగరంలో ఉన్నప్పుడు రాశారట! అక్కడ ఎస్సారార్ కాలేజిలో ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు  మానేరు నది ప్రాంతానికి వాహ్యాళికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఒకసారి అక్కడి ప్రకృతి,ఏకాంతత,పక్షుల సంగీతం అన్నీ కలిసి ఆయనలో మెరిసిన మెరుపు మ్రోయుతుమ్మెద అయిందిట! 🏵️ అప్పటికి మానెయ్ర డామ్ లేదు. కరీంనగరంలో నారాయణరావుగారని ఒక దేవీ ఉపాసకుడితో ఈయన మంచి స్నేహంగా ఉండేవారట. కావ్యానందం వ్రాసినప్పుడు ఆఖరున స్వయంభువు అని ఒక ఛాప్టరులో ఒక వేదాంతితో ఆయన వాదం గురించి వ్రాశారు.  బహుశ ఆ వేదాంతి ఆయనే కావచ్చు.  వాదన విషయం జీవునిలో మరణం సంభవించే క్రమం. (ఛాందోగ్యం ప్రకారం వాక్కు మనసును,మనసు ప్రాణమునందును,ప్రాణము తేజస్సునందును,తేజస్సు పరదేవతయందును పొందును)ఐతే ఈ క్రమం సామాన్యుడికీ,విద్వాంసుడికీ సమానమా కాదా అని చర్చ! 🏵️ కావ్యానందం సరాసరి జీవుడ్ణికదా చేరేది మీరు చ

భర్తృహరి ! - విక్రమార్కుడి కథలు......5

Image
భర్తృహరి ! - విక్రమార్కుడి కథలు......5 చాందోగ్యరుషి ఇచ్చిన దివ్య ఫలం భర్తృహరి తన పట్టపురాణి మోహనాంగికి ఇచ్చాడని చెప్పుకున్నాము కదా....... తరువాత ఏమయిందో తెలుసుకుందామా? తాను అమితంగా ప్రేమిస్తున్న మోహనాంగి అసలు గుణము రాజుకు తెలియదు.  ఆమె అతను అనుకున్నంత ఉత్తమురాలు కాదు. ఆమెకు సాహిణి అనే రధ సారధితో రహస్య సంబంధం ఉంటుంది. మరునాటి ఉదయం మోహనాంగి, రహస్యంగా సాహిణికి ఆ పండునిచ్చి అతనిని తినమంటుంది. తన అవసరాలకు రాణిని వాడుకుంటున్న ఈ రధసారధి సాహిణికి రాజ ప్రసాదంలో రాజాంతఃపురాన్ని శుభ్రం చేసే పరిచారికతో రహస్య సంబంధం ఉంటుంది. సాహిణి పరిచారికకి పండునిచ్చి, దాని ప్రత్యేకతని చెప్తాడు. ఆ పరిచారిక "సరే! ఇంటికెళ్ళి స్నానం చేశాక, ఈ పండు తింటాను" అని పండును తీసుకుంటుంది. పేడ గంప మీద పెట్టుకొని, గంప నెత్తిన పెట్టుకుని, ఇంటికి బయలు దేరిన ఆమె రాజవీధిలో నడిచి పోతుండగా రాజ ప్రాసాదపు మీద చల్లగాలిని ఆస్వాదిస్తూ, పచార్లు చేస్తూ ఉన్న భర్తృహరి పరిచారిక నెత్తి మీది గంపలో పేడ మీద దివ్యఫలం చూస్తాడు. మరుక్షణమే దాన్ని అతడు గుర్తు పడతాడు. అతడికి చాలా ఆశ్చర్యం కలిగింది. తా

అమర గాయని ఎం. ఎస్. సుబ్బలక్ష్మి 🌹 🤲 ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం-

Image
అమర గాయని ఎం. ఎస్. సుబ్బలక్ష్మి 🌹 🤲 ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం- సుబ్బలక్ష్మి పాడుతుంటే -స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు -భావించేవారు.  🤲🤲 నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర,  నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభ్యాంగ్స్, దేశభక్తి గేయాలు కూడా పాడారు.  ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా

పలికే వీణ నవమోహన రాగం ప్రణయ మధురిమల రస ఝంకారం!

Image
పలికే వీణ నవమోహన రాగం ప్రణయ మధురిమల రస ఝంకారం! - రాగాలు తెలియకపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు.  నా మిత్రులలో సంగీతం గురించి ఏమీ తెలియకపోయినా చక్కగా విని  ఆనందించే వాళ్ళు ఉన్నారు.  ఇంకాకొంతమంది రాగాలు తెలియకుండానే బాగా పాడే వాళ్ళు కూడా ఉన్నారు.  ఇక్కడ వ్రాయబోయే విషయాలు, రాగాల గురించి తెలుసుకుందా మనకునే వారికోసం నేను సరదాగా చేస్తున్న ప్రయత్నం మాత్రమే! మోహన రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు, పద్యాలు 1. లాహిరి లాహిరి లాహిరిలో… (మాయాబజార్‌) 2. చెంగు చెంగునా గంతులు వేయండి… (నమ్మిన బంటు) 3. ఎచటనుండి వీచెనో… (అప్పుచేసి పప్పుకూడు) 4. మనసు పరిమళించెను… (శ్రీ కృష్ణార్జున యుద్ధం) 5. అయినదేమో అయినది ప్రియ… (జగదేకవీరుని కధ) 6. మోహన రాగమహా మూర్తిమంత మాయే… (మహా మంత్రి తిమ్మరసు) 7. వే వేలా గొపెమ్మలా మువ్వా గోపాలుడే… (సాగర సంగమం) 8. పాడవేల రాధికా… (ఇద్దరు మిత్రులు) 9. వినిపించని రాగాలే కనిపించని… (ఆరాధన) 10. నను పాలింపగ నడచి వచ్చితివా… (బుద్ధిమంతుడు) 11. ఘనా ఘన సుందరా… (చక్రధారి) 12. సిరిమల్లే నీవె విరిజల్లు కావే… (పంతులమ్మ) 13. మదిలో వీణలు మ్రోగె… (ఆత్మీ

రాగలహరి: కల్యాణి!

Image
రాగలహరి: కల్యాణి! (చిత్రం -శ్రీ వడ్డాది పాపయ్య .) _ కర్ణాటక సంగీతంలో మరొక ముఖ్యమైన రాగం కల్యాణి. కల్యాణి రాగం శుభప్రదమైనది. కల్యాణ ప్రదమైనది. ఎంతమంది విద్వాంసులు ఈ రాగాన్ని పాడినా, పాడినవారికి, విన్నవారికి ఎప్పటికప్పుడే నిత్య నూతనంగా ఉంటుంది. ఈ రాగం ఆధారంగా జనించిన జన్యరాగాలు అనేకం ఉన్నాయి. హమీర్‌కల్యాణి, బేహాగ్‌, అమృతవర్షిణి, హంసనాదం మొదలైనవి ముఖ్యమైనవి. కర్ణాటక సంగీతంలోని ఐదు ముఖ్యమైన రాగాలైన కల్యాణి, తోడి, శంకరాభరణం, భైరవి, కాంభోజి రాగాల్లో కనీసం ఒక్క రాగమైనా లేకుండా ఒక చిన్న కచేరీ కూడా ఉండదు. అలాంటి ఈ ఐదు రాగాల్లో కూడా ముఖ్యమైన రాగం కల్యాణి. కల్యాణి రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు 1. జగమే మారినది మధురముగా ఈ వేళ… (దేశద్రోహులు) 2. తలనిండ పూదండ దాల్చిన రాణి… (ఘంటసాల ప్రైవేటు రికార్డ్‌) 3. మనసున మల్లెల మాలలూగెనే… (మల్లీశ్వరి) 4. మది శారదాదేవి మందిరమే… (జయభేరి) 5. పెనుచీకటాయే లోకం… (మాంగల్య బలం) 6.జోరుమీదున్నావు తుమ్మెదా … (శివరంజని) 7. పాడనావాణి కల్యాణిగా… (మేఘ సందేశం) 8. చల్లని వెన్నెలలో… (సంతానం) 9. మనసులోని కోరికా తెలుసు నీకు ప్రేమికా…