Posts

Showing posts from February, 2020

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం!!

Image
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం!! VINJAMURI VENKATA APPARAO·MONDAY, 24 FEBRUARY 2020· సుప్రభాతకర్త- అణ్ణన్ స్వామి. సుప్రభాత స్తోత్రాన్ని ప్రతివాద భయంకర అణ్ణన్ స్వామి రచించారు. ఇతడు క్రీ.శ.1361 వ సంవత్సరంలో అనంతాచార్యులు మరియు ఆండాళ్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించారు. ఈయన శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన 'ముడుంబ నంబి' వంశానికి చెందినవారు. ఇతని గురువు మణవాళ మహాముని.శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము.  "సు-ప్రభాతము" అనగా "మంచి ఉదయం" (Good Morning) అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు (షోడశోపచారములు) నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ.  ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే "సుప్రభాతం" అని అంటారు.  తిరుమల శయనమంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భ

"💦🍂ఓం నమః శివాయ",!🍂💦

Image
🚩మహాశివరాత్రి 🙏🏿 "💦🍂ఓం నమః శివాయ",!🍂💦 (వింజమూరి వెంకట అప్పారావు సమర్పణ .) 🌹మహాశివరాత్రి ఒక హిందువుల పండుగ. దేవుడు శివుడుని భక్తితో కొలుస్తూ జరుపుకుంటారు. ఇది శివ, దేవేరి పార్వతి వివాహం జరిగిన రోజు. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. మహా శివరాత్రి పండుగను 'శివరాత్రి' అని కూడా ప్రముఖంగా పిలుస్తారు. మరికొందరు 'శివుడి యొక్క మహారాత్రి', అని లేదా శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుంది అని అంటారు మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తరువాత, భక్తులు మరియు ఆచారాలు పాటించేవారు మరియు పార్వతి దేవి కృతజ్ఞతలుతో ఆయన సంతోష పెట్టేందుకు శివుడును కోరారు. అందుకు శివుడు జవాబుగా, అమావాస్య 14 రాత్రి, ఫాల్గున నెలలో కృష్ణ పక్షంలో, తన అభిమాన రోజు అని బదులిచ్చాడు. పార్వతి, ఆమె స్నేహితులకు ఈ పదాలు పునరావృతం చేసింది. వీరి

వాలి వధ !

Image
🚩రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీకొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు. అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య తార వారింప ప్రయత్నించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి రావడానికి అయోధ్యా రాకుమారుల అండయే కారణం కావచ్చు అని హితం పలికింది. కాని వాలి వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక ఆ ధర్మపరులు తనకు హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు. అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరా

🚩విజయనగరం.🌹

Image
🚩విజయనగరం.🌹 💦🤘🏾👌🏿💦🤘🏾👌🏿💦🤘🏾👌🏿💦🤘🏾👌🏿💦🤘🏾👌🏿💦 విజయనగరం పట్టణం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. ఇది విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యాన ఉంది. కన్య శుల్కం పుట్టిన వూరు..! విజయనగరం పట్టణం చారిత్రక ప్రశస్తి కలిగినది. ప్రపంచప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకంలోని ప్రధాన వేదిక విజయనగరమే! పట్టణంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలు - అయ్యకోనేరు, బొంకులదిబ్బ మొదలైన వాటి ప్రస్తావన ఈ నాటకంలో ఉంది. ఆ నాటక రచయిత గురజాడ అప్పారావు విజయనగరం రాజావారి ఆస్థానంలో ఉద్యోగస్తుడే. పైడితల్లి అమ్మవారి ఆలయం.! ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు విజయనగరం పట్టణంలో 300 ఏళ్లుగా జరుగుతున్నాయి. బొబ్బిలియుద్ధం సమయంలో విజయనగర రాజుల ఆడపడుచైన పైడితల్లి ఆత్మాహుతికి పాల్పడి ఇలవేల్పుగా అవతరించినట్లు భావిస్తారు. అప్పటినుంచి ఆమెను భక్తితో పూజిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులు దీనికి హాజరవుతారు. విజయనగరం ప

🚩🌺🌹ద్వారం వెంకట స్వామి నాయుడు.🌹🌺🚩

Image
🚩🌺🌹ద్వారం వెంకట స్వామి నాయుడు.🌹🌺🚩 - రచన : శ్రీ తనికెళ్ళ భరణి గారు. 💦👌🏿అది 1893 వ సంవత్సరం! అది దీపావళి!! అది దీపాల వేళ..కర్ణాటక దేశంలో.. ఓ పసిపాప ఏడున్నొక రాగంలో ఏడ్చాడు..ఆ ఏడుపులో ఓ గమకం ఒలికింది.. కర్ణాటక సంగీత జగత్తులో ఓ కొత్తద్వారం తెరుచుకుంది... ద్వారం వెంకట స్వామి నాయుడు గారు అలా ఆవిర్భవించారు. పదేళ్ళొచ్చాయ్! నాయుడు ఆరో క్లాసు చదువుతున్నాడు. ఉన్నట్టుండి కళ్ళు మసకేసినట్లయిపోయాయ్! నల్లబల్లమీద అక్షరాలు అలుక్కు పోయినట్టున్నాయ్! రేయ్..నాయుడూ.. రాసుకోకుండా దిక్కులు చూస్తున్నావేంట్రా బడుద్ధాయ్.. అన్నాడు మాస్తారు.. నాకేమీ కనబడట్లేదండీ.. వొణుకుతూ లేచి నించున్నాడు నాయుడు. కనపడట్లేదురా గుడ్డిపీనుగా.. అయితే గుడ్డి వెధవకి చదువెందుకూ..బళ్ళోంచి వెళ్ళిపో.. కసురుకున్నాడు..గుడ్డి మేస్టారు. కళ్ళలో చూపులేకపోయినా నీళ్ళు నింపుకుని ఇంటికెళ్ళిపోయారు. ఉత్తరోత్తరా ఈ కుర్రాడే ‘సంగీత కళానిధి’ అవుతాడని ఆ మేష్టారికేం తెలుసు... పైగా మాస్టారి తిట్లే దీవెనలయ్యాయి. ఆయనే కనుక స్కూల్లోంచి పొమ్మనకపోతే... మన నాయుడు గారు కూడా ఏ సె

💦🌺🌹తెలిసిన సంగతులే!🌹🌺💦

Image
💦🌺🌹తెలిసిన సంగతులే!🌹🌺💦 🚩👌🏿 తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' 1931 సెప్టెంబర్ 15 న విడుదలయ్యింది. అప్పటి నుండి ఇప్పటివరకు కొన్ని వేల సినిమాలు తెలుగులో వచ్చాయి. ఆ సినిమాల్లో కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాఫులు. కానీ ఆ సినిమాల్లో మనకు తెలిసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. అలాంటి తెలిసిన సంగతులు కొన్ని. ..🚩👌🏿 * 'ఆంధ్రా దిలీప్' అని నటుడు చలం ను పిలుస్తారు. అలా మొదట పిలిచినవారెవరో తెలుసా? హిందీ నటుడు 'పృధ్వీరాజ్ కపూర్' (రాజ్ కపూర్ తండ్రి). 🚩👌🏿 * హాస్యనటుడు రాజబాబు అసలుపేరు 'పుణ్యమూర్తుల అప్పల్రాజు'. మరి మురళీ మోహన్ అసలు పేరేంటో తెలుసా? 'రాజబాబు'. 🚩👌🏿 * తెలుగులో ఎక్కువమంది హీరోయిన్ లతో హీరోగా చేసిన నటుడు 'చంద్రమోహన్'. ఆయనతో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత కాలంలో సూపర్ స్టార్ లు అయిన వారిలో 'శ్రీదేవి, జయసుధ, జయప్రద, వాణిశ్రీ, విజయశాంతి, రాధ, సుహాసిని'లు కొందరు. 🚩👌🏿 * ఎస్వీ కృష్ణారెడ్డి అనగానే మనకు చక్కటి హాస్య చిత్రాలను అందించిన దర్శకుడిగా తెలుసు. ఆయన హీరోగా 'ఉగాది, అభిషేకం' చిత్రాల్లో