Posts

Showing posts from February, 2017

కనుపర్తి అబ్బయామాత్యుడు!

Image
కనుపర్తి అబ్బయామాత్యుడు! . కనుపర్తి అబ్బయామాత్యుడు 18వ శతాబ్దపు ప్రబంధకవి. ఇతడు గుంటూరు జిల్లా కనుపర్రు గ్రామంలో నివసించాడు. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. కౌండిన్య గోత్రుడు. ఇతని తండ్రి రాయన మంత్రి. తల్లి నరసమాంబ. ఇతని తాత ముత్తాతలు కొండవీటి ప్రభువుల వద్ద మంత్రులుగా పనిచేశారు. కానీ ఇతని కాలం వచ్చేసరికి కొండవీటి సామ్రాజ్యాన్ని తురుష్కులు ఆక్రమించుకున్నారు. ఇతనికి మంగళగిరి నరసింహస్వామి ఇష్టదైవము. ఇతడు రచించిన రెండు ప్రబంధాలను మంగళగిరి నృసింహస్వామికే అంకితమిచ్చాడు. ఈ కవికి సాహిత్యంలోనే కాక సంగీతము, జ్యోతిషము, సాముద్రికము, వైద్యములలో ప్రావీణ్యం వుంది . తడు వ్రాసిన రెండు ప్రబంధాలు మాత్రం లభిస్తున్నాయి. మొదటిది అనిరుద్ధ చరిత్రము. దీనిని బాల్యంలో వ్రాశాడు. రెండవ కావ్యము కవిరాజ మనోరంజనము[. దీనికే పురూరవశ్చరిత్రము అనే మరొక పేరు ఉంది. మొదటి కావ్యంతో పోల్చితే కవిరాజమనోరంజనము ప్రౌఢంగా, భావగర్భితంగా, అలంకార సహితంగా, ధారాశుద్ధి కలిగి ఉంది. ఇతని రచనలలో వీర, శృంగార రసాలను వర్ణించాడు. ఇతని శైలి మృదుపదగుంఫితమై, మిగుల ధారాళమై అలరారిస్తుంది. ఇతడు తన ప్రబంధాలలో జాతీయాలను విరివిగా వాడాడు. ఇతర ప్రబం

"విరాజ మనోరంజనము".! (కనుపర్తి అబ్బయామాత్యుడు.)

Image
"విరాజ మనోరంజనము".! (కనుపర్తి అబ్బయామాత్యుడు.) . ఈ ప్రబంధములో శృంగారము స్థాయి రసము. తనకు వీలైన ప్రతిసందర్భములో కవి శృంగారాన్ని చొప్పించాడు. ఈ శృంగారము మొదట తారావిధుల సందర్భములోను, పిమ్మట పార్వతీశంకరుల విషయములోను, తదుపరి ఇలాకన్య బుధుల విషయములోను, అనంతరం ఊర్వశీ మిత్రావరణుల ఘట్టములోను, చివరగా నాయికా నాయకులైన ఊర్వశీ పురూరవుల సందర్భములోను పరిపూర్ణత నొందింది. కవికి శృంగారం అంటే నల్లేరు మీద బండి నడక ఐనా కవి మితం ఎరుగక పచ్చి శృంగారాన్ని వర్ణించాడు. కవి ప్రథమ సమాగమాన్ని వర్ణించడంతో తనివి తీరక గర్భధారణాన్ని, గర్భవతిని, గర్భవతి సంగమాన్ని, బాలింతరాలితనమును, 'ప్రసవానంతర ద్వితీయ మాస సంగమాధిక సుఖము' ను కూడా వర్ణిస్తాడు. ఈ వర్ణనలు కొంత ఏవగింపును కలిగిస్తాయి. మిగిలిన రసములు అక్కడక్కడ కనిపిస్తాయి.. . ఈ కావ్యములో అబ్బనామాత్యుని శైలి మృదుపద గుంఫితమై, మిగుల ధారాళమై అలరారుతున్నది. ఈ గ్రంథంలో జాతీయాలను, లోకోక్తులను విరివిగా వాడాడు. . కలుగదు కదా వివేకంబు కాముకులకు", " . వ్రతము చెడిన సుఖము దక్కగలదె", . "భార్యా రూపవతీ శతృః", " . ఉష్ణం ఉష్ణేన శీతలం" మొదలైన

ఊర్వశీ, పురూరవులు కధ!

Image
     (పురూరవువిడిచి ఊర్వశీఇంద్రలోకానికిఏగుట ..రవి వర్మ చిత్రం ) . ఊర్వశీ, పురూరవులు కధ! . కవిరాజ మనోరంజనము అనే ప్రబంధాన్ని కనుపర్తి అబ్బయామాత్యుడు క్రీ.శ.1750 ప్రాంతాలలో రచించాడు. దీనికే పురూరవశ్చరిత్రము అనే మరొక పేరు ఉంది. . కథాసంగ్రహం[మార్చు] పురూరవుని సభామందిరానికి నారదుడు విచ్చేసి కొంత వేదాంతాన్ని, రాజనీతిని బోధించి అమరావతికి వెడతాడు. అక్కడ ఇంద్రునితో భూలోక విశేషాలు తెలుపుతూ ప్రసంగవశాత్తూ పురూరవుని వృత్తాంతం కొంత ముచ్చటిస్తాడు. ఇంద్రుడు పురూరవుని పూర్వవృత్తాంతం కొంచెం వివరంగా చెప్పమని నారదుని వేడుకోగా అతడు ఈ విధంగా చెప్పసాగాడు. తారాచంద్రులకు బుధుడు జన్మిస్తాడు. బుధుడికి ఇలాకన్య యందు పురూరవుడు జన్మిస్తాడు. పురూరవుడు వశిష్ఠుడిచే విద్యాభ్యాసం గావించి యుక్తవయసు రాగానే పట్టాభిషిక్తుడౌతాడు. పిమ్మట దిగ్విజయయాత్ర గావిస్తాడు. నారదుడు పురూరవుని దిగ్విజయ యాత్రను వర్ణించి చెప్పినప్పుడు అది విన్న ఊర్వశికి పురూరవునిపై వాంఛ కలుగుతుంది. మిత్రావరుణులు చేస్తున్న తపస్సును భగ్నం చేయడానికి ఊర్వశిని ఇంద్రుడు భూలోకానికి పంపుతాడు. మిత్రావరుణల చేత శాపగ్రస్త అయి ఊర్వశి పురూరవుని కలుస్తుంది

కథ: ఉరి రచన: విశ్వనాథ సత్యనారాయణ..కాలం: 1950:

Image
కథ: ఉరి రచన: విశ్వనాథ సత్యనారాయణ..కాలం: 1950: (కధ నచ్చిన కారణం.. వైదేహి శశిధర్) కొంతమంది రచయితలని ఎంత విస్తృతంగా చదివినా, వారి రచనా శైలిని, సిగ్నేచర్ స్టైల్ని పట్టుకున్నామనుకునే లోపు ఏదో ఒక వినూత్న కోణంతో మనలను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.  విశ్వనాధ అటువంటి రచయితలలో ఒకరు. వేయిపడగలు, పురాణవైరిగ్రంధమాల, హాహాహూహూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు వంటి రచనలు చదివిన తర్వాత సహజంగా విశ్వనాధ రచనా సరళి/ శైలి తాలూకు రూపు గురించి ఒక అంచనా ఏర్పడుతుంది.  అయితే 1950వ సంవత్సరంలో ఆనందవాణి పత్రికలో మొదటిసారిగా ప్రచురితమైన ఉరి అనే వారి చిన్నకధను చదివినపుడు, ఆయనమీద పకడ్బందీగా ఏర్పరుచుకున్న అభిప్రాయాలన్నీ అసంపూర్ణమైన అంచనాలుగా అనిపిస్తాయి. రచయితలలో ఈ రకమైన వస్తువైవిధ్యత, అంతకన్నా కూడా శైలీరూప వైవిధ్యతతో ఒక రచనకు మరొక రచనకు మధ్య ఇంతటి వినూత్నతతో పాఠకులని అబ్బురపరచే లక్షణం అరుదు అనే చెప్పాలి. ఉరి చాలా చిన్నకధ. ఎంత చిన్నదో అంత బలీయమైన కధ. చదువుతుంటే కళ్ళు చెమర్చి, గొంతు పెగలని అనుభవం కలిగించే ఇటువంటి కధలు అంత తరచుగా చూడం. ఈ కధంతా కధకుడు, ప్రధానపాత్ర అయిన ఒక ముద్దాయి స్వరంలో సాగుతుంది. ప్రధానపాత్ర స్వగతంగా

"ఏది సత్యం, ఏదసత్యం, !

Image
"ఏది సత్యం, ఏదసత్యం,  ఏది పుణ్యం, ఏది పాపం, ఓ మహాత్మా, ఓ మహర్షీ".  ఏది చీకటి ఏది వెలుగు ఏది జీవితమేది మృత్యువు ఏది పుణ్యం ఏది పాపం ఏది నరకం ఏది స్వర్గం ఏది సత్యం ఏదసత్యం ఏదనిత్యం ఏది నిత్యం ఏది ఏకం ఏదనేకం ఏది కారణమేది కార్యం ఏది తెలుపు ఏది నలుపు ఏది గానం ఏది మౌనం ఏది నాది ఏది నీది ఏది నీతి ఏది నేతి నిన్న స్వప్నం నేటి సత్యం నేటి ఖేదం రేపు రాగం ఒకే కాంతి ఒకే శాంతి ఓ మహాత్మా..ఓ మహర్షీ  . శ్రీ శ్రీ వ్రాసిన ఈ కవిత వెనుక నేపధ్యం ఇది:  1948 జనవరి 30 న అట, మహాకవి పోనగల్ పార్క్ లో  కూర్చొని వేరుశనక్కాయలు తింటుంటే రేడియో లో అనౌన్స్ మెంట్ వచ్చిందట మహాత్ముడు ఇక లేడు అని.  ఆ వేరుశనక్కాయలు కట్టిన పేపర్ మీద మహాకవి  ఈ కవిత వ్రాశారు(ట).  ఎప్పుడో, ఎక్కడో చదివిన జ్ఞాపకం.!

అయ్యప్ప జననం!

Image
అయ్యప్ప జననం! . మొదట ప్రపంచాన్ని దహిచేంతటి “హాలాహలం” వచ్చింది. దాన్ని శివుడు తన కంఠంలో దాచి అందరిని కాపాడతాడు. ఆ పిమ్మట దేవదానవులు మరల చిలుకుతుండగా సంపన్నమైన అనేక వస్తువులు, ఇంకా వరాలు తీర్చే కామధేనువు వస్తుంది. చివరికు "ధన్వంతరి" (విష్ణువు అంశ, దేవతల వైద్యుడు, ఆయుర్వేద దేవుడు) అమృతకలశాన్ని చేతబట్టుకొని అవతరిస్తాడు. విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెడతాడు. విష్ణుమూర్తి మోహిని రూపంలో శివుని వద్దకు వచ్చి తను ఇచ్చిన మాటను పూర్తిచేశాను అని చెప్తాడు. శివుడు మోహిని యొక్క అందానికి ఆకర్షితుడై మోహినిని కవ్విస్తాడు. లోకకళ్యాణం కోసమే హరి-హర కలయిక. ఆ (హరిహరాద్వైత)కలయిక ఫలమే మన "అయ్యప్ప". హరిహరసుతనే శరణమయ్యప్ప !!! హరిహరసుతనే శరణమయ్యప్ప !!! హరిహరసుతనే శరణమయ్యప్ప !!!

విజయ విలాసము (చేమకూర వేంకటకవి): (విశ్లేషణ.. శ్రీ Satyanarayana Piska గారు .)

Image
విజయ విలాసము (చేమకూర వేంకటకవి): (విశ్లేషణ.. శ్రీ Satyanarayana Piska గారు .) . కపటయతి రూపములో ద్వారకకు వచ్చిన తమ మేనత్తకుమారుడైన అర్జునునితో చెల్లెలు సుభద్ర వివాహమును జరిపించినాడు శ్రీకృష్ణుడు. అయితే, అగ్రజుడు బలరామునికి ఈ విషయం తెలియనీయకుండా జాగ్రత్త పడినాడు. నవ వధూవరులను ఇంద్రప్రస్థపురమునకు సాగనంపినాడు. రాజభటుల వలన తమ్ముని నిర్వాకం తెలుసుకున్న అన్నగారు హలాయుధుడు ఆగ్రహోదగ్రుడైనాడు. ఆయనను శాంతింపజేయుటకు శౌరి ప్రయత్నిస్తున్న సందర్భములోని ఒక పద్యం. "ఆ పురమర్దనుం డయిన నాతని కడ్డము దాకి నిల్వగా నోపడు, మత్స్యయంత్రము మహోద్ధతి నేసి స్వయంవరంబునన్ ద్రౌపదిఁ గైకొనన్ జెనకు రాజకుమారుల పా టెఱుంగమే? మూపులు మూడగున్ రిపు చమూపులఁ గన్నపు డా కిరీటికిన్!" అర్థములు: పురమర్దనుడు = త్రిపురములను దహించివేసిన పరమేశ్వరుడు; అడ్డము దాకి = ఎదిరించి; నిల్వగానోపడు = నిలబడలేడు; మహోద్ధతిన్ = మిక్కిలి పరాక్రమముతో; ఏసి = ఛేదించి; గైకొనన్ = చేపట్టినపుడు; చెనకు = ఎదిరించిన; పాటు = గతి; మూపులు = భుజములు; రిపుచమూపులన్ = శత్రుసేనాసమూహములను; కన్నపుడు = చూసినప్పుడు; కిరీటికిన్ = విజయునికి. భావము:

మోహిని అందం - భస్మాసుర అంతం! .

Image
మోహిని అందం - భస్మాసుర అంతం! . పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతలతో ప్రతి యుద్దంలోను ఓటమి లేని వాడిగా, మరియు దేవతలను నాశనం చేయాలన్న దుర్బుద్ధితో శివుని కోసం కఠోర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై “ఏమి వరం కావాలో కోరుకో” అంటే ప్రకృతికి విరుద్ధమైన కోరిక "అమరత్వం (మరణం లేకపోవటం)" ప్రసాదించమని కోరతాడు. దానికి శివుడు నిరాకరించగా భస్మాసురుడు - "నేను ఎవరి తలపై నా చేయి పెడతానో వాళ్ళు భస్మమైపోవాలి" అని వరం కోరతాడు. దానికి శివుడు అంగీకరిస్తాడు. భస్మాసురుడు ఆ వరమును పరీక్షించేందనని శివుని తలపైన తన చేయి వేయ ప్రయత్నించగా, శివుడు పారిపోవలసి వచ్చింది. భస్మాసురుడు వెంబడించాడు. శివున్ని కాపాడుటకై విష్ణుమూర్తి "మోహిని" అవతారం దాలుస్తాడు. విష్ణుమూర్తి, మోహిని అవతారంలో, భస్మాసురుని ఎదుట నిలుస్తాడు. మోహిని యొక్క అందమును చూసి భస్మాసురుడు వ్యామొహంలో పడిపోతాడు. భస్మాసురుడు మోహినితో “నిన్ను పెళ్ళి చేసుకుంటాను” అనగా అప్పుడు మోహిని "నాకు నాట్యం అంటే చాలా ఇష్టం కావున నాలాగ నాట్యం చేసిన వారినే పెళ్ళాడుతాను" అని అంటుంది. భస్మాసు

"శ్రీ కాళహస్తీశ్వర దండకం"

Image
"శ్రీ కాళహస్తీశ్వర దండకం"  (చిత్రం:కాళహస్తి మహాత్మ్యం)(1954) . జయ జయ మహాదేవ శంభో హరా శంకరా! సత్య శివ సుందరా! నిత్య గంగాధరా!  బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంత వాడన్, దయాసాగరా!  భీకరారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి,  పశుపక్షి సంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్, దివ్య జప హోమ తప మంత్ర కృషిలేని జ్వాలాంధుడన్,  దేవుడే లేడులేడంచు దూషించు దుష్టాత్ముడన్,  . విశ్వరూపా! మహామేరుచాపా!  జగత్సృష్టి సంరక్ష సంహార కార్యత్కలాపా! మహిన్ పంచభూతాత్మవీవే కదా, దేవదేవా! శివా!  పృధ్వి జల వాయు రాకాశ తేజో విలాసా! మహేశా! ప్రభో!  . రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా! . నీలి మేఘాల కేళీ వినోదాలలో దేలు శ్రీశైల మల్లేశ్వరా! . కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసియించు శ్రీరామలింగేశ్వరా! . నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరా! . దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చితానంద  భూలోక కైలాస శైలాన వసియించు శ్రీకాళహస్తీశ్వరా దేవదేవా నమస

అమ్మాయిని చూస్తే !

Image
అమ్మాయిని చూస్తే ! . ఆ అమ్మాయి కళ్ళకి కాటుక లేదు, పెదాలకు లిప్ స్టిక్ వేసుకోలేదు, బొట్టుబిళ్ళలు ఏమి ఉపయొగించకుండా చక్కగా కుంకుమబొట్టు పెట్టుకుని  ఎరుపు ,ఆకుపచ్చ గల పంజాబి డ్రెస్ లో ఉంది ఆ అమ్మాయి.. అమ్మాయిలకి నిజమైన అందం ఈ అలంకరణల వల్ల ఏదీ రాదనుకుంట....!!! . ఏ బుద్ధిలేనివాడు చెప్పాడు దేవకన్యలు కేవలం స్వర్గంలోనే ఉంటారని?  వాడేవడో ఈ అమ్మాయిని చూస్తే ఖచ్చితంగా ఆ అభిప్రాయం మార్చేసుకుంటాడు అని అనిపించింది. ఎందుకో అమ్మాయిని చూస్తే " శ్రీహర్ష నైషదం " లోని దమయంతి  మళ్ళీ ఈ అమ్మాయి రూపంలో భూమి మీదకి అవతరించేసిందా? అని అనుమానం కలిగింది. .

ఆది శంకరాచార్య భజగోవిందం - (140217) శ్లోకం - 4

Image
ఆది శంకరాచార్య భజగోవిందం - (140217) శ్లోకం - 4 . నలినీదళగత జలమతి తరళం  తద్వజ్జీవితమతిశయచపలం | విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం || . శ్లోకం అర్ధం : తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి,  జీవితమెంతో చంచలమైనది. జనులందరును రోగములతో బాధపడుతు, దేహాభిమానమును విడువక దుఃఖములో  చిక్కుకొని యుందురు. మనుష్యునకు సుఖమే లేదని  తెలుసుకొనుము.  తాత్పర్యము : నావి అని భావించు ఈ బాహ్య వస్తువులే కాదు,  ఈ శరీరము కూడా మన సొంతము కాదు. ఒక్క క్షణములో అవి మనలను వదిలి పోవును.  తామరాకుపై నీటి జలము ఎంత అస్థిరమో, మన బ్రతుకు కూడా అంత చంచలము, అస్థిరము. ఏ క్షణమునైనా అది జారిపోవును, నీటి బుడగలా రాలి పోవును.  కనుక ఈ బాహ్య వస్తువులను నమ్ముకొని వాని వెనుక పడుట, ఎండమావుల వెనుక పడి దాహము తీర్చుకొన ప్రయత్నించిన దానితో సమానము.  అందుకే పామరులు బాహ్య వస్తు సముదాయముపై మోహము పెంచుకొని, వానిపై అనుబంధమును ఏర్పరుచుకొని, అవి ఉన్నంత వరకు సంతోషము, అవి దూరమైనప్పుడు అత్యంత శోకము అనుభవిస్తున్నారు. కావున, వస్తు సముదాయములు శాశ్వతమైన సంతోషమునందింప జాలవు. నిత్యమైన ఆనందము కావలెనన్న దేహాభిమానము

ఆది శంకరాచార్య భజగోవిందం - (130217)

Image
ఆది శంకరాచార్య భజగోవిందం - (130217) . శ్లోకం - 3 నారీస్తనభర నాభీదేశం  దృష్ట్వా మాగామోహావేశం | ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం || . శ్లోకం అర్ధం : స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము.  అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల  వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము. తాత్పర్యము : స్త్రీల అందమైన సుందర భాగాలను గని మందమతివై భ్రమించకుము.  అందాలు అనుకొనే ఆ శరీర భాగాలు రక్తము, మాంసము, కొవ్వు మొదలగు జుగుప్సాకరమైన పదార్థ నిర్మితములే.  వయసు మళ్ళగా, వృధ్యాపము దాపరించగా, ఆ శరీరపు పొంగుల వన్నెలు తగ్గి, ఎముకల గూటిపై చర్మముగా మారును.  ఈ శరీరము పుడమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూత నిర్మితమై, జడమైన రక్త, మాంస, రస దుర్గంధ భూయిష్టమై, కేవలము చర్మముతో కప్పబడిన తోలు తిత్తి.  దానిని ఆ పంచభూతములే కాక, రోగము, వృధ్యాపము కూడా నాశనము చేయగలవు. కనుక ఆ శరీరపు అందములు చూచి మోసపోయి, వానిని బడయవలననే ఆశా మోహముల నొందకుము.  సప్త వ్యసనాలలో ప్రధమమైనది, మహా భయానకమైనది స్త్రీ మోహం.  దానివల్ల మానవ జాతికి ఎన్నో కష్టనష్టాలు జెరి

తులసి ఆకు.!

Image
తులసి ఆకు.! .  ఆకుల మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదన మొదలైంది.  "నేను అన్నిటికన్నా శుభప్రదం. మoగళానికి నేనే చిహ్నం. మిగతా ఆకులన్నీ అమoగళం" అంది మామిడాకు. అప్పట్నుంచీ మామిడాకులు తలకిందులుగా వేలాడుతున్నాయి.  .  "నేను సువాసనలకు, పరిమళాలకూ మారుపేరు. మీకు వాసనలేదు. మీరెందుకూ పనికిరారు" అంది కరివేపాకు. కరివేపాకులు కూరలో తప్పనిసరి. కానీ వంట పూర్తయ్యాక పక్కన తీసి పారేస్తారు. అప్పట్నుంచీ అవి కూరలో కరివేపాకులయ్యాయి. "అన్నం తినేందుకు నేనే పనికొస్తాను. మీరంతా వేస్టు" అంటూ నీలిగింది అరిటాకు.  అప్పట్నుంచీ అరటాకు అన్నం తినేశాక చెత్తకుండీలోకి చేరింది. చెత్తకుండీలో దుర్భరమైన కంపు మధ్య బతకాల్సి వచ్చింది. .  "అసలు గొప్పంతా నాదే. అన్నం తిన్నాక ముఖశుద్ధికోసం అంతా నన్నే తింటారు" అని హొయలు పోయింది తమలపాకు. అప్పట్నుంచీ మొత్తం నమిలేశాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయడం మొదలుపెట్టాడు. .  పాపం... తులసి ఆకు.... ఏమీ అనలేదు. తన గొప్ప చెప్పుకోలేదు.  అందుకే దాన్ని పూజిస్తారు. తులసమ్మ అని పిలుస్తారు . గోవర్ధనమంత పర్వతాన్ని ఎత్తిన వాడిని తులాభారంలో త

ఆది శంకరాచార్య భజగోవిందం - (120217)

Image
ఆది శంకరాచార్య భజగోవిందం - (120217) శ్లోకం - 2 మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం | యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం || . శ్లోకం అర్ధం :  ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము.  నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో  దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము. తాత్పర్యము :  హృదయమున తృప్తిలేని వారికి ఎంతయున్నను సుఖము, సంతోషము రావు. ధన సంపాదనలో చిక్కిన జీవికి ఆశ వదలదు, ఆశ వదలనిచో తృప్తి చేకూరదు, తృప్తి లేనిచో ఎంత గడించినా సంతోషము రాదు.  కనుక ఆశ ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకమగును. కోట్లు గడించినా కాటికి చిల్లి గవ్వరాదు కదా, ఆ సంపాదనకు చేసిన క్రూర కర్మలవల్ల పాపపు మాటలు పెరిగి, అవి మాత్రము మనతో వచ్చును.  కనుక ఉన్న దానితో తృప్తి పడుచు, బ్రతుకుటకు మాత్రము ఎంత గావలెనో అంత మాత్రమే సంపాదించుచూ, మనసు భగవధ్యానము పై మళ్లించిన వాడే నిజమైన ధన్యజీవి. లక్షలు గడించిన మాత్రమున నీ ప్రభావము అధికము కాదు, నీ కీర్తి చిరస్థాయిగా మిగులదు.  ఎందరో రాజులు, ప్రభువులు, కోటీశ్వరులు, లక్షాధ

శాస్త్రీయ గీతాల వసంతం.... ఎమ్‌.ఎల్‌.వసంతకుమారి.

Image
శాస్త్రీయ గీతాల వసంతం.... ఎమ్‌.ఎల్‌.వసంతకుమారి. ఎమ్‌.ఎల్‌.వసంతకుమారి అనే గాయని ఒకరు ఉన్నారని చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆమె తెలుగు సినిమాల్లో పాడిన పాటలు చాలా తక్కువ. పాడిన కొద్ది పాటలు కూడా ఎప్పుడో 1950లలో, అది కూడా పూర్తిగా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఉంటాయి. అందుకే ఈమెని గుర్తుపెట్టుకునేవారు బహు తక్కువ. ఆమె పూర్తిపేరు మద్రాసు లలితాంగి వసంత కుమారి. కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మికి ఉన్నంత పేరుంది. ఎమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్‌ ఆమెకు సమకాలీనులు. ప్రముఖ నటి శ్రీవిద్య వసంతకుమారి కూతురు.  ఎమ్‌.ఎల్‌.వసంతకుమారి తన గాత్రంతో శ్రోతలను ఆకాశ వీధుల్లో విహరింపజేయగలరు. అదే ఆలాపనలతో కంటనీరు పెట్టించగలరు.  వసంత కుమారి ఇంటి పేరు ఎమ్‌.ఎల్‌గా సిర్థపడటం వెనుక ఒక తమాషా అయిన కథ ఉంది. సాధారణంగా పిల్లలకు తండ్రి ఇంటిపేరు వస్తుంది. తమిళులకి ఇంటి పేరు వుండదు కాబట్టి తండ్రి పేరునే ఇంటిపేరుగా పెట్టుకుంటారు. వసంత కుమారి తండ్రి అయ్యస్వామి అయ్యర్‌, మద్రాసు లలితాంగి అనే ఒక దేవదాసీ కుటుంబంలోని యువతిని పెళ్ళాడారు.  ఒకసారి మద్రాసు లలితాంగి సంగీత కచేరీ చేయాల్సిన సమయంలో ఉబ్బసంతో

ఆది శంకరాచార్య భజగోవిందం ! (11o207)

Image
ఆది శంకరాచార్య భజగోవిందం ! (11o207) . శ్లోకం - 1 భజగోవిన్దం భజగోవిన్దం  గోవిన్దం భజమూఢమతే| సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే|| . శ్లోకం అర్ధం : గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు. ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు. . తాత్పర్యము : పరమాత్మ స్వరూపా! ఓ బుద్ధిమతీ! ప్రాపంచిక విషయ వాసనా జాలములో పడి భగవంతుని విస్మరించకుము. మనకున్న ధన, ధాన్యాది సంపదలు, పదవులు, భౌతిక విద్యలు, నైపుణ్యాలు, అంత్య కాలములో, మనలను రక్షింపలేవు, అవసాన దశలో మనలను ఆదుకొనేది, శ్రీహరి ధ్యానము ఒక్కటే. కనుక శ్రీహరిని స్మరింపుము,  ఏ మాత్రము ఆలస్యము చేయకుము. చివరి క్షణముల వరకు వేచిన, ఆ చివరి దశలో మనకు హరి నామకీర్తన అవకాశము దొరకునో లేదో తెలియదు. పొట్టకూటికి పనికి వచ్చే ఈ విద్య లేవియు, చివరి దశలో మనకు అక్కరకు రావు, మనలను రక్షింపలేవు. కనుక తక్షణమే హరి నామస్మరణ ప్రారంభించుము.  హరి నామస్మరణకు ఒక సమయము, పధ్ధతి, నియమాలేవియు లేవు. సర్వకాల, సర్వావస్థలయందు భజింప దగినది హరి నామం.  ప్రతి క్షణము, ఏ పనిలో ఉన్నను శ్రీహరి స్మరణను మరువకు

*కలుపుకుంటే కలదు సుఖం* ✊

Image
*కలుపుకుంటే కలదు సుఖం* ✊ . """""""""""""""""""""""""""""""" *లంకాధిపతి రావణబ్రహ్మ* *యుద్ద భూమిలో..* *మృత్యు శయ్యపై* *అవసాన దశలో* *శ్రీరాముడితో ఇలా అన్నాడు..* *"రామా !!* *నీ కంటే నేను* *అన్నింటిలో గొప్పవాన్ని.* *నేను బ్రాహ్మణ జాతి లో పుట్టాను* *నీది క్షత్రియ జాతి.* *నేను నీ కంటే వయసులో పెద్ద.* *నా కుటుంబం...* *మీ కుటుంబం కన్నా పెద్ద.* *నా వైభవం..* *నీ వైభవం కన్నా అధికం.* *మీ అంత:పురమే స్వర్ణం..* *నా లంకానగరమే స్వర్ణమయం* *నేను బలపరాక్రమాలలో ...* *నీకంటే శ్రేష్ఠుడిని.* *నా రాజ్యము,* *నీ రాజ్యము కంటే పెద్దది.* *జ్ఞానంలో, తపస్సులో* *నీ కంటే శ్రేష్ఠుడిని".* *"ఇన్ని శ్రేష్ఠమైన విషయాలు కలిగి వున్నా ..* *యుద్ధంలో నేను* *నీ ముందు ఓడిపోయాను.* *దీనికి కారణం ఒకటే...* *నీ తమ్ముడు నీ దగ్గర వున్నాడు..* *నా తమ్ముడు నన్ను వదలి వెళ్ళిపోయాడు".* ==== *నీతి* ====

అగస్త్య మహర్షి!

Image
అగస్త్య మహర్షి! . అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు. అగస్త్యుడు నర్మద నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు. వింధ్యుని గర్వ మణచుట! మేరు పర్వతం అన్నింటికన్నా ఎత్తైన పర్వతం. దాని ఎత్తును చూసి భరించలేక ఈర్ష్యతో వింధ్య పర్వతం కూడా దానికంటే ఎత్తుగా ఎదిగి సూర్యుని గమనాన్ని కూడా అడ్డగించసాగింది. దీంతో రాత్రింబవళ్ళూ సక్రమంగా రాక వేద విధులకు ఆటంకం కలగసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్యమునిని ఏదో ఒకటి చేయమని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం వద్దకు వచ్చాడు. తాము దక్షిణ దిశగా వెళుతున్నామనీ, అంత పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగలేమనీ దాని ఎత్తుని తగ్గించుకోమన్నారు. మహర్షులంటే భక్తి ప్రపత్తులు గల వింధ్యుడు తక్షణమే తన ఎత్తుని ఉపసంహరించుకుని వెంటనే వారు నడచి వెళ్ళడానికి వీలుగా దారి ఇచ్చాడు. తర్వాత అగస్త్యుడు తాము మరలా తిరిగి ఉత్తర దిశగా తిరిగి వస్తామని అప్పటిదాకా అలాగే ఉండమని చెప్పాడు. కానీ మళ్ళీ తిరిగి రానేలేదు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆ పర్వత

లేపాక్షి!

Image
లేపాక్షి! . ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉంది లేపాక్షి.  ఇక్కడ ఉన్న స్తంభాలు మిస్టరీగా మిగిలాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో నిర్మించారు. విజయానగర్ స్టైల్లో ఈ రాతి కట్టడ నిర్మాణం జరిగింది. ఇక్కడ స్తంభం కింద క్లాత్ ని ఈజీగా పట్టించవచ్చు. అంటే.. స్తంభానికి, కింద ఫ్లోర్ కి గ్యాప్ ఉంటుంది. అంటే స్తంభం కింద ఫ్లోర్ సపోర్ట్ లేకుండానే ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం గ్రౌండ్ కి తాకకుండా.. ఆలయాన్ని అంతా ఎలా సపోర్ట్ చేస్తుందో.. ఎవరికీ అర్థంకాని రహస్యం. . శ్రీ వీరభద్రస్వామి దేవాలయము - లేపాక్షి రావణుని తో పోరాడిన జటాయువుని చూసి రాముడు "లే పక్షి" అన్నాడని అదే కాలక్రమేణా లేపాక్షి అయ్యింది అని అంటారు. ఈ నాగలింగమునకు అభిముఖముగా కనబడే బసవేశ్వరుని విగ్రహం అత్యంత పెద్దది, మనోహరముగా ఉంటుంది. సుమారు 14 అడుగుల ఎత్తుతో ఉండే ఈ నందీశ్వరుడిని చూడటానికి కళ్ళు సరిపోవనిపిస్తుంది. అత్యంత మనోహరముగా కనబడి ఇంజనీర్లను సైతం ఆశ్చర్యములో ముంచెత్తే వ్రేలాడే స్తంభం. ఒక స్తంభమునకు 11 స్తంభముల ఆధారముతో డిజైన్ చేబడిన కళాకృతి. విజయనగర రాజుల నిర్మాణములోని వైభవం ఇక్కడ అనేక శిలలపై కనబడుతుంది. శ

‘ఎగతాళి’!

Image
‘ఎగతాళి’! . గొప్పవారు గొప్ప,గొప్ప విశేషాలు చెప్పినా అల్పులకు  అవితెలియక ‘ఎగతాళి’చేస్తారు.!  .  తన ‘భీమేశ్వర పురాణ’ కావ్యంలో కుకవి నింద చేస్తూ  “ అడరి కాకులు చేరి బిట్టరచునపుడు,  ఉదధి రాయంచ యూరక యుంట లెస్స, సైప లేకున్న యెందేని చనుట యొప్పు” అని దూషిస్తాడు.  .  చెడ్డవారి మధ్య ఓ మంచి వాడు ఉన్నపుడు వారి ఎగతాళి మాటలకి  మౌనంగా ఉండటమే మంచిది. లేదా అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఉత్తమం. . గొప్పవారిని చూసి మనం ఎప్పుడు ఎగతాళి చేయకూడదు’.  అని సుభాషిత రూపంలో ఉన్న ఈ చాటు పద్యం వివరిస్తుంది. .  గొప్పవారు గొప్ప,గొప్ప విశేషాలు చెప్పినా అల్పులకు అవితెలియక ‘ఎగతాళి’చేస్తారు.! . ఎవ్వడ వీవు కాళ్ళు మొగ మెర్రన ? హంసమ! ఎందునుందువో?  దవ్వుల మానసంబునను! దాన విశేషము లేమి చెప్పుమా?  మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు! నత్తలో?  అవ్వి యెరుంగ మన్న ‘నహహా’ యని నవ్వె బకంబులన్నియున్! . హంసలు హిమాలయంలో ఉన్న మానస సరోవరంలో విహరిస్తాయి. ఆ సరస్సులో బంగారు వర్ణంతో మెరిసే పద్మాలు, మేలిమి ముత్యాలు ఉంటాయి. నత్తగుల్లలు కప్పలు వంటివి ఉండవు. మామూలు చెరువులలో వుంటూ నత్తలు, చేపలు తిని బ

డొక్కా సీతమ్మ !

Image
డొక్కా సీతమ్మ !  విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి . తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి  డొక్కా సీతమ్మ.  గోదావరి మధ్యస్థంగా కల డెల్టా ప్రాంతములోని డెల్టాగన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన  ఈమె ఆ ప్రాంతములలో తరచు వచ్చే వరద కారణంగానూ అతివృష్టి, అనావృష్టి ల కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకొంటూ, వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానము జరిపిన మహాఇల్లాలు.  'అన్నమో రామచంద్రా' అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు.  ఈమె చదువుసంధ్యలు లేని సాధారణ స్త్రీ.  ఆమె తాను అన్నదానంచేసి, విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి . భారతీయ సాంప్రదాయంలో 'అన్నం పరబ్రహ్మ స్వరూపమ్ ' అని పేర్కొనడం మనం వింటున్నాం. అన్నదానానికి మించిన దానంలేదని విశ్వసించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా 'అతిథి దేవోభవ' అన్నపదానికి ఉదాహరణగా నిలిచినవ్యక్తి ఆమె .

ఛీ, ఇదేం జాతి!

Image
ఛీ, ఇదేం జాతి! "కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో! కైటభదైత్యమర్దనుని గాదిలికోడల ఓ మదంబ ఓ హాటకగర్భురాణి నినునాకటికై గొనిపోయి యల్ల క ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ, నమ్ము భారతీ!" . ఇప్పుడు కర్ణాటకిరాట కీచకులు లేరు.  అసలు రాచరికమే లేదు. ఆకలికోసం  "బాలరసాలసాల నవపల్లవ కోమలమైన" కావ్యకన్యకని  మనుజేశ్వరాధములకిచ్చే అవస్థ తప్పిపోయింది. . అయినా ఆ తల్లి కాటుకకంటినుండి కన్నీరింకా ధారగా ప్రవహిస్తూనే ఉంది. ఎందుకమ్మా అలా ఏడుస్తావని మనసార ఓదార్చే, మనసావాచాకర్మణా నీకు కష్టం కలిగించనమ్మా  అని భరోసా ఇచ్చే పోతనలాంటి బిడ్డలు ఆమెకిప్పుడు కఱవయ్యారు. ఈర్ష్య, అసూయ, స్వార్థం,ద్వేషాలతో తమలోతాము కాట్లాడుకుంటూ ఆమె బతుకుని కుక్కలు చింపిన విస్తరి చేసే బిడ్డలు పుట్టుకొచ్చారు. ఛీ, ఇదేం జాతి!

" చల్ల గాలిలో ..ఓ ...... .యమునా తటిపై శ్యామసుందరుని మురళి"

Image
" చల్ల గాలిలో ..ఓ ...... .యమునా తటిపై శ్యామసుందరుని మురళి" . " చల్ల గాలిలో ..ఓ ...... .యమునా తటిపై శ్యామసుందరుని మురళి" పాట విందాము.  శ్రీ సాలూరు గారికి ఎంతో ఇష్టమైన రాగాలు : యమునాకళ్యాణి. మోహన, భీంప్లాస్, శుద్ధసావేరి, మాల్కోస్, హిందుస్తానీ భైరవి.  ఈయన దాదాపు 150 చిత్రాలకు సంగీత దర్సకత్వం వహించారు.  సాలూరు గారికి అభిమాన సంగీత దర్శకులు :  శ్రీ నౌషద్ అలీ ( హిందీలో), తెలుగు లో పెండ్యాల,  తమిళంలో M S విశ్వనాథన్.  అభిమాన గాయకులు: ఘంటసాల, సైగల్, పంకజ్ మల్లిక్ , సుశీల. అపస్వరం తెలియని రాజేశ్వర రావు గారు, సుమధుర సుస్వరాలతో తెలుగు సినిమా పాటకు పట్టాభిషేకం చేసారు . ఆయన పాటలు నిత్య నూతనంగా నేటికీ సజీవమై అలరారుతోంది.  https://www.youtube.com/watch?v=tNgvnvlLJTM

గోదావరిపై ఎద కృష్ణమ్మ నీ వాల్జడ.! (వేటూరి వారి కలం)

Image
గోదావరిపై ఎద కృష్ణమ్మ నీ వాల్జడ.! (వేటూరి వారి కలం) . గోదావరిపై ఎద కృష్ణమ్మ నీ వాల్జడ నిండారి తెలుగింటి అందాలే వెలిగించే  నండూరి వారెంకిలా ఓ... గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల  కిన్నెరసాని పాటలా ఓ...॥ సిగ్గల్లే పండెనులే సాయంత్రము బుగ్గల్లో పండాలి తాంబూలము॥ ఎన్నెల్లె కోరుకునే ఏకాంతము నన్నల్లుకోమంది వయ్యారము కౌగిలిలో మేలుకొనే కానుకవో మేనకవో  నా స్వప్న లోకాలలో గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం మువ్వమ్మ మురిసేటి మురళీపురం కవ్వాలే కడవల్లో కదిలే క్షణం కడలల్లే పొంగింది నా మానసం పొన్నలలో పొగడలలో తుంటరివో తుమ్మెదవో  నా బాహు బంధాలలో

పరిషం !

Image
పరిషం ! ఎవరో అన్నారు... బ్రాహ్మణులు కచ్చితంగా పరిషం పట్టాలి  (కంచం చుట్టూ చేయి తిప్పి, నీళ్లు చిలకరించే వ్యవహారం). సదాచారాలు పాటించాల్సిందే. కానీ అలవి కాని చోట, వీలు కాని వేళ తప్పదు, అత్యవసరం అంటే ఎలా సాధ్యం? అసలు పరిషం పట్టే వ్యవహారం ఎందుకు వచ్చింది. అలికిన నేలపై కూర్చుని తినేటపుడు సూక్ష్మ జీవులు విస్తరిలోకి పాకకుండా వుండేదుకు. అలాగే వీలయితే పక్కనో మద్ద,..  వాటికి కాస్త ఆహారంగా.  ఇప్పుడు అలికిన నేలలు లేవు, విస్తర్ల భోజనాలూ అరుదు. పాటించగలిగిన వేళ, కుదిరే చోట ఫరవాలేదు.  కుదరని చోట సర్దుకోవాలి.  వాస్తు అయినా, ఆచారం అయినా.  కుంకుమ, తిలకంగా, తిలకం స్టిక్కరుగా మారలా? మనకు ఇష్టమైనవి మార్చుకుని, ఇష్టం కానివి సంప్రదాయాలు అంటూ వుంటే ఏలా?

ఉడుతా భక్తిగా!

Image
ఉడుతా భక్తిగా! తన శక్తి మేరకు సాయం/దానం చేయాలని ఈ సామెతకు అర్థం. రామాయణంలో వున్నట్టు చెప్పబడే ఒక కథ ఈ సామెతకు ఆధారం. కథ: శ్రీరామ చంద్రుడు లంకను చేరడానికి సముద్రం మీద వారధి కడుతున్నాడు. ఆ కార్య క్రమంలో ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక ఉడుత తాను కూడ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని తలచి...... సముద్రంలో మునిగి నీటితో తడిసిన తన శరీరంతో పొడి ఇసుకలో పొర్లి....  తన శరీరానికి అంటిన ఇసుకను కడుతున్న వారధి పైన విధిలించేదట....... ఆ విధంగా అల్ప జీవి అయిన ఉడుత కూడ ఆ పవిత్ర కార్యంలో తన వంతు సాయం చేసిందట. . ఊ మీదకొన్ని సామెతలు.! . 1 ఉంచుకున్నవాడు మొగుడూ కాదు - పెంచుకున్నవాడు కొడుకూ కాదు 2 ఉంటే ఉగాది - లేకుంటే శివరాత్రి 3 ఉంటే ఊరు - పోతే పాడు 4 ఉంటే లిక్కి - పోతే కొడవలి 5 ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితే వింటారు 6 ఉంటే అమీరు - లేకుంటే పకీరు 7 ఉండ ఇల్లు లేదు - పండ మంచం లేదు 8 ఉండవే పెద్దమ్మా అంటే కుండ పుచ్చుకు నీళ్ళు తెస్తానందట 9 ఉండమనలేక వూదర, పొమ్మనలేక పొగ పెత్తినట్లు 10 ఉండి చూడు వూరి అందం - నానాటికీ చూడు నా అందం అన్నట్లు 11 ఉండి చూడు వూరి అం

చిలుక రక్తి!

Image
చిలుక రక్తి! చూచాయగా చిలుకలకు తెలిసింది రామచంద్రమూర్తి కష్టపడుతున్నాడనీ దుఃఖపడుతున్నాడనీ! వానరులు వారధి కడుతూనే ఉన్నారు! ఊరుకోక ఉడుతలూ పనిజేస్తూనే ఉన్నాయి! ఐనా రామచంద్రమూర్తి కష్టపడుతూనే ఉన్నాడు! దుఃఖపడుతూనే ఉన్నాడు! వారధి కట్టటం లంకకు చేరటం సీతను తేవటం ఎప్పుడో! ఆలస్యాని కాగలేక పోతున్నాడు రామచంద్రమూర్తి! కాలపురుషుడు రామచంద్రమూర్తి కాలయాపనానికి ఆగలేక పోతున్నాడు! చూచాయగా తెలుసుకున్నవి ఇదంతా చిలుకలు, వాటి గుండెలు కళక్కుమన్నవి! చళక్కున లేచినవి రామచంద్రమూర్తికి సాయం చేయటానికి. ఎగిరి లంకలో వాలినవి చిలుకలు! చూసుకో ఏంచేస్తామో! ఏంతెస్తామో! అని పోతూ అన్నవి చిలుకలు రామచంద్రమూర్తితో! లంకకైపోతూ దార్లో వానరులను చూచి నవ్వుకున్నవి. ఉడుతలను చూచి నవ్వుకున్నవి. నవ్వుతూనే పోయి సీత ముందర వాలి పక్కున నవ్వినవి! ఎత్తుకెళ్తాము సీతా మా అందరి రెక్కల మీద ఎత్తుకెళ్తాము కూర్చో! రామచంద్రమూర్తి వారధి కడుతున్నాడు గాని ఎంత కష్టపడుతున్నాడే! సీతా నీకోసం ఎంత ఆరాటమే! సీతా నీకోసం ఎంత పంతమే! అంత ఎందుకే సీతా మా రెక్కల మీద కూర్చోరాదూ గడియలో పోదాము అన్నవి! మూణ్ణాళ్ళ ముచ్చటయ్యెనేమే నీకాపురము సీతా అన్నవి చిలుకలు