Posts

Showing posts from October, 2013

దాశరథీ శతకము..

Image
దాశరథీ శతకము.. రాముఁడు ఘోరపాతక విరాముఁడు,సద్గుణ కల్పవల్లికా రాముఁడు,షడ్వికారజయు రాముఁడు,సాదుజనావనవ్రతో ద్దాముఁడు రాముఁడే పరమదైవము మాకని మీయడుంగుఁగెం దామరలే భజించెదను,దాశరథీ!కరుణాపయోనిధీ! రామా!దయాసముద్రా!రాముఁడు మహాపాపవిరాముఁడు,సద్గుణ కల్పవల్లికా రాముఁడు,కామాది మనోవికారముల నాఱింటిని గెలుచటచే మనోహరుఁడు, సజ్జన రక్షణమనెడి వ్రతముచే నుద్దాముఁడు, మాకు రాముఁడే పరమదైవమని మీ పాదపద్మములనే భుజింతును.

ఓదార్పు కు మంచి మనసు..

Image
ఓదార్పు కు మంచి మనసు..

జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః

Image
జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః ఫెళ్ళుమనె విల్లు, గంటలు ఘల్లు మనె, గు భిల్లుమనె గుండె నృపులకు, ఝల్లు మనియె జానకీదేహ మొక నిమేషమ్మునందె నయము జయమును భయము విస్మయము గదుర! నయము, జయము, భయము, విస్మయము - రెప్పపాటు కాలంలోనే అన్ని రకాల భావాలు ఒకేసారి విజృంభించాయట! శివధనుర్భంగమైన ఆ క్షణంలోనే రామయ్య శ్రీరాముడయ్యాడు. జానకీరమణుడయ్యాడు. సీతారాముల విషయంలో విశ్వనాథవారి నిశ్చయం యిది: ఆయమ పుట్టె పాల్కడలి నంగనగా దనవంతు తీసికోన్, ఈయమ ధాత్రిలోన జనియించెను విల్లునువంప బెండ్లమై, ఈయమ మున్ను వేదముల యింపగు తత్త్వము, తానె యామయై ఆయమ కంటి యాన బడి యాచరణం బఖిలంబు చేయుచున్ ఈ పద్యంలో "ఆయమ" అంటే లక్ష్మీదేవి. "ఈయమ" అంటే సీతాదేవి. ఆమె యేమో క్షీరసాగర మధన సందర్భంగా, విష్ణువు తన వంతుగా స్వీకరించడంకోసం పాలకడలిలో పుట్టుంది. ఆమె శ్రీవారి మాటలని అనుసరించేది. కాని యీమె? ఈమె భూమిజాత. అయాచితంగా లభించినది కాదు. శివధనుస్సు

ఆంధ్రుల దాస్యవిముక్తి.

Image
కామేశ్వర రావు భైరవభట్ల  గారి బ్లాగ్ నుండి. ఆంధ్రుల దాస్యవిముక్తి కాలము మారె; మ్రోడయిన కట్టెను కెంజిగురాకులొత్తే; జం బాలమునందు రక్తదళ పద్మిని మోసిడి పూలు పూచె; నం ధాలయమందు స్వర్ణ కిరణాంకురముల్ జనియించి భావ భూ తాలను బారదోలి చిర దాస్యతమస్సు నడంచె నాంధ్రుడా! ఇది దువ్వూరి రామిరెడ్డి పద్యం. ఈ పద్యాన్ని చదవగానే, ఎందుకో ఠక్కున మరో పద్యం గుర్తుకువచ్చింది. అది దాశరథి మహాంధ్రోదయంలోని పద్యం: వెలుతురుబాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి గుం డెలు జిలుజిల్లనన్ రుధిర నిర్ఝరిపారె, దిగంగనా ముఖ మ్ముల నవకుంకుమప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు, త ల్పులు తెరువుండు రండు పిలువుండు శయించినవారినెల్లరన్! దువ్వూరి, దాశరథి వారి యీ రెండు పద్యాలలో నాకు చాలా సామ్యము కనిపిస్తోంది. రెండు పద్యాలూ ఆంధ్రుల దాస్యవిముక్తి గూర్చినవి. రెంటిలోనూ దానిని ఒక నవోదయంతో పోల్చడమే కాక, ఆ ఉదయ వర్ణన కూడా చాలా దగ్గరగా ఉంది. ఇద్దరూ సూర్య కిరణాలనీ, తామర మొగ్గలనీ కొత్త ఆశలకు, ఆలోచనలకు ప్రతీకగా చేసుకున్నారు. "రుధిర నిర్ఝరిపారె" అని దాశరథి అంటే, "రక్త దళ పద్మిని మోసిడి పూలు పూచె" అని

తాజ్ మహల్ చూసేవుంటారు.

Image
పద్మ: సరేలెండి వదినగారు...ఢిల్లీ వెళ్ళానన్నారు కదా..ఆగ్రా కూడా వెళ్ళారా? తాజ్ మహల్ చూసేవుంటారు. శారద: ఆగ్రా వెళ్ళానొదినా! అక్కడ తాజ్ మహల్ కు వెళ్ళేదారిలో అప్పడాలు,పూరీలు వత్తడానికి పాలరాతి పీటలు .. యెంత బాగున్నాయో..మనవాళ్ళకి వుపయోగమని రెండు డజన్లు పుచ్చుకున్నాను...అమాన్ దస్తాలు పాలరాతివి... బుజ్జిముండలు... యెంత ముద్దొస్తున్నాయో... కావాలంటే అదికూడా ఒకటి యిస్తాలే...యింకా కొందును వొదినా... లగేజీ యెక్కువయిపోతోందంటూ మీ అన్నయ్యగారు ఒకటే గొడవ. పద్మ: మరి ప్రపంచ వింత తాజ్ మహల్ చూడలేదా? శారద:ఏదీ? మేము యింకా షాపింగు చేస్తుండగానే టూరిస్టు బస్సు వాడు"టైమయిపోయిం" దంటూ విజిల్ వేసేసాడు వదినా..ఇంకేం చూస్తాం తాజ్ మహల్...అసలు షాపింగే పూర్తవలేదు...అయినా తాజ్ మహల్ చూడాలంటే ఆగ్రాయే వెళ్ళాలావదినా...మన పిచ్చిగాని...మన వంటింటిలో టీ ప్యాకెట్టు మీద రోజూ చూస్తూనే వుంటాంగా "తాజ్ మహల్ " పద్మ:ఆఁ!...అవును స్మీ! ! ! ౦౦౦~~~౦౦౦ .

ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని ........ కర్ణరంధ్రంబుల కలిమి యేల?

Image
ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని  ........ కర్ణరంధ్రంబుల కలిమి యేల?  పురుషరత్నమ! నీవు భోగింపగాలేని  ........ తనులత వలని సౌందర్యమేల?  భువనమోహన! నిన్ను బొడగానగాలేని  ........ చక్షురింద్రియముల సత్త్వమేల?  దయిత! నీ యధరామృతం బానగాలేని  ........ జిహ్వకు ఫలరస సిద్ధి యేల?  నీరజాతనయన! నీ వనమాలికా  గంధ మబ్బలేని ఘ్రాణమేల?  ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని  జన్మమేల యెన్ని జన్మములకు?!   రుక్మిణి పంపిన ప్రణయసందేశములోని చివరి పద్యం ఇది.      "శ్రీకృష్ణా! మనోజ్ఞమైన నీ మాటలు వినలేని చెవులు, నీవు అనుభవించడానికి అక్కరకురాని ఈ దేహసౌందర్యము, నిన్ను చూడడానికి నోచుకోని కన్నులు, నీ అధరామృతాన్ని గ్రోలలేని నాలుక, నీ వనమాలికా పరిమళమును ఆఘ్రాణించలేని నాసిక, నీకు సేవ చేయలేని ఈ మానవజన్మ నిష్ప్రయోజనం కదా!" అంటున్నది రుక్మిణీరమణి.          మానవ శరీరం పంచేంద్రియముల సంపుటి. చెవులున్నాయి వినడానికి. చేతులున్నాయి తాకడానికి. కళ్ళున్నాయి చూడడానికి. జిహ్వ ఉన్నది రుచులను ఆనడానికి. నాసిక ఉంది వాసన చూడడానికి. ఇవి సర్వప్రాణులకు సహజమైన లక్షణాలు.          ఐతే, రుక్మిణి దృష్టిలో పాంచభ

అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో పంకజనాభ!

Image
అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో  పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా  వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే  యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్. Satyanarayana Piska గారి వివరణ.     ఈ పద్యములో శ్రీకృష్ణుడు తనను చేపట్టవలసిన విధానాన్ని రుక్మిణి విన్నవిస్తున్నది.   పంకజనాభుడవూ, పురుషశ్రేష్ఠుడవూ అయిన ఓ కృష్ణా! నీవు అడ్డు చెప్పేందుకు కారణమేమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగబలములతో నీవు విచ్చేసి, శిశుపాల జరాసంధులను జయించి, నా వద్దకు వచ్చి, క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించి తీసికొని వెళ్ళు. నేను నీ వెంట వస్తాను. ఇదీ ఈ పద్య భావము.          (మగధ చక్రవర్తియైన జరాసంధుడు తన కూతుళ్ళు ఇద్దరిని కంసునికి ఇచ్చి వివాహం చేశాడు. తన అల్లుడు కంసుని హతమార్చిన శ్రీకృష్ణునిపై పగతో ఉన్నాడు. ఇతడు శిశుపాలునికి, రుక్మి కి మిత్రుడు.)          విష్ణుమూర్తి పద్మనాభుడు. ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్తయైన బ్రహ్మదేవుని యొక్క జన్మస్థానము విష్ణుమూర్తి బొడ్డులో నుండి మొలిచిన కమలము. నాభి నుండి ఆరంభమైన ఆలోచన, సంకల్పము స్థిరమైనవ

శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ!

Image
శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో  మాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ  ధ్యాయినియైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెదనంచు నున్నవా  డా యధమాధముం డెఱుగ డద్భుతమైన భవత్ప్రతాపముల్. Satyanarayana Piska గారి వివరణ:- రుక్మిణి వీరభోగ్యమైన సొత్తును అధముడు అంటరాదని ప్రకటిస్తున్నది.  శ్రీకృష్ణుణ్ణి పదేపదే శ్రీపతిగా సంబోధించనిదే రుక్మిణికి తృప్తి లేదు. "శ్రీయుతమూర్తి" అంటూ పద్యాన్ని ప్రారంభిస్తున్నది. అనగా, "లక్ష్మీదేవితో కూడియుండేవాడా!" అని అర్థం. తనకు తెలియకుండానే తానే లక్ష్మిననే అభిప్రాయం ఆమె వాదనలో తొంగిచూస్తున్నది.  రెండవ సంబోధనగా "పురుషసింహమా!" అన్నది. అంటే, "పురుషులలో శ్రేష్ఠుడు". పురుషులు ఎందరున్నా పురుషోత్తముడు ఒక్కడే! అతడే శ్రీమన్నారాయణుడు. తాను అతని సొత్తు. తన జీవితధ్యేయం హరి చరణకమల ధ్యానం. అటువంటి తనను తీసుకుపోవాలని అనుకుంటున్నాడు శిశుపాలుడు! "గోమాయువు" అంటే నక్క. మృగరాజుకు అర్పించిన నైవేద్యాన్ని గుంటనక్క కాజేయాలని ప్రయత్నించిన విధంగా, పరంధామునికి అంకితమైన తనను ఆ చేదిరాజు వాంఛిస్తున్నాడని తన ఆవ

కన్యా వరయతే రూపం....

Image
" కన్యా వరయతే రూపం, మాతా విత్తం, పితా శ్రుతం  బాంధవాః కులమిచ్ఛంతి, మృష్టాన్న మితరే జనాః" .... అని శాస్త్రవచనం. అనగా వరునిలో ఒక్కొక్కరు ఒక్కొక్క గుణం ఉండాలని కోరుకుంటారట! పెళ్ళీకూతురు తనకు కాబోయే భర్త మంచి అవయవసౌష్ఠవం కలిగిన అందగాడు కావాలని ఆశిస్తుంది. వధువు తల్లి అతడు భాగ్యవంతుడై ఉండాలనీ, తండ్రి విద్యాకీర్తులు కలవాడై ఉండాలనీ, చుట్టపక్కాలు మంచి వంశములో జన్మించినవాడై ఉండాలనీ, ఇతర జనమంతా షడ్రసోపేతమైన భోజనం పెట్టగలిగేవాడై ఉండాలనీ కోరుతారట! మరి, కేవలం ఈ గుణాలే కాక, ఆ పురుషుడు సర్వసద్గుణ సంపన్నుడు ఐనప్పుడు అతణ్ణి వరించని కన్యలు ఉంటారా?!

దేవరకొండ బాల గంగాధర తిలక్ కవిత్వం...

Image
దేవరకొండ బాల గంగాధర తిలక్ కవిత్వం నా కవిత్వం (1941) నా కవిత్వం, కాదొక తత్వం మరి కాదు మీరనే మనస్తత్వం కాదు ధనిక వాదం, సామ్య వాదం కాదయ్యా అయోమయం, జరామయం గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ జాజి పువ్వుల అత్తరు దీపాలూ మంత్ర లోకపు మణి స్తంభాలూ నా కవితా చందన శాలా సుందర చిత్ర విచిత్రాలు అగాధ బాధా పాతః పతంగాలూ ధర్మ వీరుల కృత రక్త నాళాలూ త్యాగశక్తి ప్రేమ రక్తి శాంతి సూక్తి నా కళా కరవాల ధగధ్ధగ రవాలు నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తు లావహించే ఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు. నా కవిత్వంలొ నేను దొరుకుతాను (ఇది అసంపూర్ణం) ప్రబంధాలూ తద్గత వర్ణనలూ చదువుకుంటూ అల్లాంటివే రాస్తూ కూడా యేదో తృప్తి ఆనందమూ పొందలేక, ఇంకా యేదో నాకు తెలీనిదేదో వుందనుకునే బాల్యంలో ఒక్క మునిమాపు వేళ మా వూళ్ళో ఒక కదంబ వృక్ష ఛాయలో మొదటి సారిగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు  తమ ఊర్వశీ ప్రవాసం లోంచి వివరాలీ విభావరీ విలాసాల నీ మసలు చరణ మంజీరము గుసగుసలో అన్న గేయం విన్నప్పుడు చటుక్కున ప్రబంధాల బలవంతపు వర్ణనలూ బి

నా కవిత్వం కాదొక తత్వం ....దేవరకొండ బాల గంగాధర తిలక్.

Image
దేవరకొండ బాల గంగాధర తిలక్. నా కవిత్వం కాదొక తత్వం  మరికాదు మీరనే మనస్తత్వం  కాదు ధనికవాదం, సామ్యవాదం  కాదయ్యా అయోమయం, జరామయం. గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ  జాజిపువ్వుల అత్తరు దీపాలూ  మంత్ర లోకపు మణి స్తంభాలూ  నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు. అగాధ బాధా పాథః పతంగాలూ  ధర్మవీరుల కృత రక్తనాళాలూ  త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి  నా కళా కరవాల ధగద్ధగ రవాలు నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు  నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు  నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

పోతనామాత్యుడు..

Image
భారత వర్ష జంతువుల భగ్యమదేమని చెప్ప వచ్చు నీ భారత వర్షమందు హరి పల్మరు బుట్టుచు జీవ కోటికిన్ ధీరత తోడ తత్వ ముపదేశము జేయుచు చెల్మి సేయుచున్  ఆరయ బాంధవాకృతి కృతార్ధుల జేయుచు నుండు నెంతయున్ !! పోతనామాత్యుడు..

ఘనుడా భూసురుడేగెనో ....

Image
ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో  విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేయునో ఈశ్వరుం డనుకూలింప దలంచునో దలపడో ఆర్యా మహా దేవియున్ నను రక్షింప నెరుంగునో యెరుగదో నా భాగ్య మెట్లున్నదో !! రుక్మిణి కళ్యాణం......పోతనామాత్యుడు. 

నిన్ నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ, యీశ్వరీ! పోతనామాత్యుడు.

Image
. .రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్ముణీదేవి ఈశ్వరిని ప్రార్ధించే పద్యం.  సంశయాకులయైన పడతి అమ్మవారిని శరణు జొచ్చి ఎలా బ్రతిమాలుతున్నదో చూడవచ్చును. . నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్ మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటిపె ద్దమ్మ, దయాంబురాశివి గదమ్మ, హరిం బతి జేయుమమ్మ, నిన్ నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ, యీశ్వరీ .! (పోతనామాత్యుడు.)

బెజవాడ రాజారత్నం.

Image
బెజవాడ రాజారత్నం తెలుగు సినిమా నటి మరియు తొలి నేపథ్యగాయని . బెజవాడ రాజారత్నం 1921 సంవత్సరంలో తెనాలి పట్టణంలో జన్మించారు. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి మరియు జొన్నవిత్తుల శేషగిరిరావు గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత లంకా కామేశ్వరరావుతో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. రుక్మిణీ కల్యాణం, పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. అప్పట్లో రాజరత్నం పేరుతో ఇద్దరు నటీమణులుండేవారు. ఎవరెవరని గందరగోళం రాకుండా, వాళ్లిద్దరూ వాళ్ల వూరి పేర్లు తగిలించుకున్నారు. ఒకరు బెజవాడ రాజరత్నం. ఇంకొకరు కాకినాడ రాజరత్నం. వీరిలో కాకినాడ రాజరత్నం ప్రౌఢ పాత్రలు వేస్తే, బెజవాడ రాజరత్నం యువతి పాత్రలు ధరించేవారు. బెజవాడ రాజారత్నం గాయని, కాకినాడ రాజారత్నం గాయని కాదు. మొదట్నుంచీ బెజవాడ రాజరత్నం గాయని. సంగీతం నేర్చుకున్నారు. శాస్త్రీయంగానూ, లలితంగానూ గీతాలు పాడడంలో నిపుణురాలు. ఆ రోజుల్లో రూపురేఖలు ఎలా వున్నా, పాట పాడగలిగే వాళ్లే నటీనటులు. అలా రాజరత్నం ముందు రంగస్థలం మీద నటిస్తూ పాటల

ఇతర చాటువులు

Image
 ఇతర చాటువులు  చేకొని రాయని బాచడు కాకాలు గుణించు పిన్న కాలము నాడే లాకేత్వ మియ్య నేరడు దాకును కొమ్మియ్యడిట్టి ధన్యులు గలరే !! వాసన లేని పువ్వు బుధ వర్గము లేని పురంబు నిత్య వి శ్వాసము లేని భార్య గుణవంతుడు కాని కుమారుడున్ సద భ్యాసము లేని విద్య పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ గ్రాసము లేని కొల్వు కొర గానివి పెమ్మయ సింగ ధీమణీ !! చేతనగు వాడు కార్యము కై తగ్గును వంగు గాక యల్పుండగునా ? ఏతము వంగిన వంగును పాతాళము నీరు తెచ్చి బయలన్ జల్లున్ !! ఆడిన మాటలు తప్పిన  గాడిద కొడుకంచు తిట్టగా విని "అయ్యో! వీడా నాకొక కొడుక" ని గాడిద ఏద్చెంగదన్న ఘన సంపన్నా! (పాఠాంతరం ...) ఆడిన మాటలు తప్పిన  గాడిద కొడుకంచు తిట్టగా విని యేడ్చెన్ "వీడా నాకొక కొడుక" ని గాడిదయును కుందవరపు కవి చౌడప్పా! ఒక తుంటరి అబ్బాయి ఈ క్రింది పద్యంలో "ఒసే! దరిద్రపు దానా! కొంచం సున్నం తెచ్చి పెట్టవే!" ... అంటే పర్వత శ్రేష్ఠ పుత్రికా పతివిరోధి యన్న పెండ్లాము అత్తను గన్న తల్లి(/తండ్రి) పేర్మి మీరిన ముద్దుల పెద్దబిడ్డ సున్న మించుక తేగదే సుందరాంగి(/

ఇంతకు ఎవరు నీవు ..

Image
Viswanath Goud పట్టు పరికిణి వోణీ వేసుకున్న అచ్చ తెలుగు జానవా అందాల అంతఃపుర కోటకు రాణివా సుస్వరాల సరిగమలు పలికే వీణవా సుమదుర భావాల గానానివా సరస శృంగార పాటల బాణీవా మన్మధుడి ప్రేమ పూల భాణానివా నా భవిష్యత్ చెప్పే భవిష్య వాణివా ఇంతకు ఎవరు నీవు  నా భావాలకు రూపానివైనావు....

మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము

మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము శ్రీఖండ శీతనగ మ ధ్యాఖండక్షోణిమండ లాఖండల వి ద్యాఖేలనభోజ సుధీ లేఖద్రుమ కృష్ణరాయ లీలామదనా అవధరింపుము జైమిని మునీంద్రునకుం ప్రజ్ఞాసాంద్రంబులగు పక్షీంద్రంబు లవ్వలికథ ఇట్లని చెప్పందొడంగె అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌ కటకచరత్‌ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌ కాంచి అంతరంగంబునం తరంగితంబగు హర్షోత్కర్షంబున నరనారాయణ చరణాం బురుహ ద్వయ భద్రచిహ్నముద్రిత బదరీ తరు షండమండలాంతర సరణిన్‌ ధరణిసురుండు సన చన నెదుటన్‌ ఉల్లల దలకా జలకణ పల్లవిత కదంబ ముకుళ పరిమళ లహరీ హల్లోహల మద బంభర మల్లధ్వనులెసగ విసరె మరుదంకురముల్‌ తొండముల్‌ సాచి యందుగు చిగుళ్ళకు నిక్కు కరుల దంతచ్ఛాయ కడలుకొనగ నెలవుల వనదంశములుమూగి నెరెవెట్ట కోల్పులుల్‌ పొదరిండ్ల గురకలిడగ సెలయేటి యిసుకలంకల వరాహంబులు మొత్తంబులై త్రవ్వి ముస్తెలెత్త అడ్డంబు నిడువు నాబడ్డలగతి మను బిళ్ళు డొంకలనుండి క్రేళ్ళుదాట ప్రబల భల్లుక నఖ భల్ల భయద మథన శిథిల మధుకోశ విసర వికీర్ణ మక్

అల్లసాని పెద్దనామాత్య ప్రణీత మనుచరిత్ర:ప్రథమాశ్వాసము

అల్లసాని పెద్దనామాత్య ప్రణీత మనుచరిత్ర:ప్రథమాశ్వాసము (తొలితెలుగు ప్రబంధం మనుచరిత్ర. నీతినీ ధర్మాన్నీ భక్తినీ బోధించటం అంతకుముందు వచ్చిన తెలుగు రచనల గమ్యం (శ్రీనాథుడి శృంగారనైషథం విషయంలో తప్ప) ఐతే పెద్దన తన మనుచరిత్రతో తెలుగు సాహిత్యాన్నంతటినీ ఓ మలుపు తిప్పాడు. ఈ రచన ఉచ్ఛస్థితిలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల వల్ల ప్రజల్లో కలిగే పట్టరాని ఆనందానికి, జీవితమ్మీద భవిష్యత్తుమీద కలిగే అకుంఠితమైన ఆశాభావానికి అద్భుతరూపం. కృష్ణరాయల విజయాల్ని అతిచేరువగా చూస్తూ, వాటివల్ల ఆ సమాజంలో పెరుగుతోన్న ఆత్మస్థైర్యాన్ని, కనీవినీ ఎరుగని సౌభాగ్యాన్ని అనుక్షణం అవలోకిస్తూ, ఆనందించిన ఒక మహామనీషి హృదయంలోంచి మహోల్లాసం పెల్లుబికి ఈ కావ్యంగా బయటకు వచ్చింది. వాల్మీకి శోకం శ్లోకం ఐతే పెద్దన ఆనందం ప్రబంధమైంది. సామాజికస్థితిగతులు అసంతృప్తికరంగా ఉన్నప్పుడు, జీవితం దుఃఖభాజనంగా కనిపించినప్పుడు “సాహిత్యప్రయోజనం సమాజశ్రేయస్సే” అన్న దృష్టి సాహితీకారులకు కలగటం చూశాం, ఇప్పుడూ చూస్తున్నాం. సుఖసంతోషాల్తో సౌభాగ్యంతో ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ఉన్న సమాజపు జీవనదృష్టిని ప్రతిబింబించేవి తొలితరం ప్రబంధాలు. వాటిలో తొలిదీ

Tun Tun/Umadevi

Image
I thought Tun Tun/Umadevi  was only fit for mocking and being laughed at  BUT I am wrong what a gifted voice and I feel sad that she has not been projected widely  and openly as a gifted singer, also sad she might not have been even paid well those days. Her TOOFANMAIL song one alone will do which she deserves a GOLD MEDAL! http://www.youtube.com/watch?v=KZBO9UzeYR4

Parvirash a very big hit in our days...

Image
Parvirash a very big hit in our days.... Mehmood is 2nd hero... http://www.youtube.com/watch?v=ZaVF788j2X4

If Sadhna calls...any body used to come... Even Shammikapoor or Rajkumar...

Image
If Sadhna calls...any body used to come... Even Shammikapoor or Rajkumar... http://www.youtube.com/watch?v=mfn4ro7tz1I

చంద్రదర్శనం చేసే జాబిల్లి (అట్ల)తదియ నాటి చందమామను చూసే నా వెలుగులవల్లి..

Image
చంద్రదర్శనం చేసే జాబిల్లి  (అట్ల)తదియ నాటి చందమామను చూసే నా వెలుగులవల్లి...

శ్రీకాళహస్తీశ్వర శతకము........ధూర్జటీ..

Image
నీతో యుద్దము చేయనోప,గవితా / నిర్మాణశక్తి న్నిన్నుం బ్రీతుం చేయగలేను,నీకొరకు తం / డ్రిన్ చంపగాజాల నా చేతన్ రోకట నిన్ను మొత్తవెరుతం / చీకాకు నా భక్తి యే రీతి న్నాకిక నిన్ను చూడగనగున్ / శ్రీకాళాహస్తీశ్వరా! శ్రీకాళహస్తీశ్వర శతకము........ధూర్జటీ శ్రీకాళాహస్తీశ్వరా!అర్జునునివలె నీతో యుద్దము చేయుటకు శక్తిలేనివాడు నీపై కవిత్వములల్లి నిన్ను ప్రసున్నునిగా చేసుకొనవలెను.నీకోసమై తండ్రిని చంపుకొనలేను.మూఢ భక్తునివలె నాచేతిలో యున్న రోకటితో నిన్ను కొట్టనూ లేను.నీయందు నాకు గల భక్తియే నను బాదలపాలు చేయుచున్నది.మరే విధముగా నాకు నిన్ను చూడగల అవకాదము కల్గునో భోదపడక యున్నది.కావున వెంటనే నాకు కన్పింపుము.

అట్లతద్ది నోము

Image
అట్లతద్ది నోము  కథ పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి 'చంద్రోదయ ఉమావ్రతం' అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ

రాష్ట్ర ప్రభుత్వం నీకేమిచ్చిందని కాదు…

Image
 రాష్ట్ర ప్రభుత్వం నీకేమిచ్చిందని కాదు… రాష్ట్ర ప్రభుత్వానికి (‘మందు’ తాగడం ద్వారా) నువ్వెంత ఇస్తున్నావన్నది ప్రధానం. - ప్రభవ మహాకవంతటి మామూలు కవి చీర్స్‌ చెబుతూ… ”నాకు గ్లాసులున్నాయ్‌… నాకు డోసులున్నాయ్‌! ఎవరని ఎంతురోనన్ను… యేననంత మోదభీకర మదిర లోకైకపతిని... ”బీరు పొంగిన మత్తుగడ్డ బ్రాంది పారిన తూలుసీమ రాలునిచ్చట బొట్టుబొట్టు తాగిచావర తమ్ముడా! బెల్టుషాపులు పెరిగెనిచ్చట రంగుసారా పొంగెనిచ్చట కాపురములే కూలెనిచ్చట దుఃఖ భూమిది చెల్లెలా! విపిినబంధుర మద్యవాటిక ఉప’నిషా’న్మధువొలికెనిచ్చట, సారా తత్త్వము విస్తరించిన సారా మిద్దెరా తమ్ముడా” ”నేను సైతం బొక్కసానికి బాటిలొక్కటి హారతిస్తాను! నేను సైతం మద్య వృష్టికి జీతమంతా ధారపోస్తాను! నేను సైతం పుస్తెలమ్మి పస్తులుండి తాగిచస్తాను!” అంటూ, ఒక్క దమ్ములాగి, మళ్ళీ గళం విప్పాడు కవి… ”పదండి తూలుతు పదండి పొర్లుతు పదండి పోదాం పై’పైకి’! మరో బెల్ట్‌ షాప్‌ మరో బ్రాంది షాప్‌ మరో దుకాణం పిలిచింది!” అంటూ ఆపి, తన తరవాతి కవి చెప్పేదానికోసం చెవి రిక్కించాడు. ”బాటిలును ప్రేమించుమన్నా బీరు అన్నద

బహుముఖ ప్రజ్ఞావంతురాలు-శ్రీమతి భానుమతిరామకృష్ణ

Image
బహుముఖ ప్రజ్ఞావంతురాలు-శ్రీమతి భానుమతిరామకృష్ణ - టీవీయస్. శాస్త్రి smt. bhanumati ramakrishna biography డాక్టర్ పద్మభూషణ్ శ్రీమతి పాలువాయి భానుమతి (07-09-1925 to 24-12-2005) బహుముఖ ప్రజ్ఞావంతురాలు. ఆమె నిర్మాత, దర్శకురాలు, గాయని, సంగీత దర్శకురాలు, రచయిత్రి , స్టూడియో నిర్వాహకురాలు. తెలుగు, తమిళ భాషలలో అగ్రశ్రేణి హీరోలతో ఆమె పోటిపడి నటించింది. ఆమె బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, సరస్వతమ్మ దంపతులకు దొడ్డవరం(ప్రకాశం జిల్లా)లో జన్మించింది. ఆమె తండ్రి గారు స్వతహాగా నటులు మరియు శాస్త్రీయ సంగీత ప్రియులు. అందుచేత, బాల్యంలోనే ఆమె తండ్రి గారి వద్ద సంగీత విద్యను అభ్యసించింది. ఆమె 1935లో చిత్రసీమలో ప్రవేశించి దాదాపుగా 200 లకు పైగా తెలుగు, తమిళ చిత్రాలలో నటించి విశిష్ట నటిగా పేరు తెచ్చుకుంది. చిత్రసీమలో ఆమెను అష్టావధాని , అభినయ సరస్వతి అని పిలిచే వారు. కొన్ని సినిమాలకు ఎడిటర్ గాను పనిచేసింది. అందరికి తెలియని మరియొక విషయము ఏమిటంటే, ఆమెకు జ్యోతిష్యములో కూడా ప్రవేశం ఉంది. వేదాంత ధోరణి కూడా ఎక్కువే! 1939 లో సి. పుల్లయ్య గారి దర్శకత్వములో నిర్మించిన 'వరవిక్రయం' అనే సినిమాలో కాళింది అనే పాత