Posts

Showing posts from July, 2017

ముక్కు తిమ్మనగారి ముద్దు పలుకులు !

Image
ముక్కు తిమ్మనగారి ముద్దు పలుకులు ! . రాయలనాట విజయ నగరంలో పెద్దన తరువాత స్థానం తిమ్మనదే! ఆయన అరణపుకవి. చిన్నాదేవివెంట విజయనగరానికి వచ్చాడట. తెనాలి వారు భువన విజయంలో వారిని పరిచయం చేసికొన్న సందర్భంలో చెప్పిన పద్యం తిమ్మన గారి ప్రసిధ్ధికి నిదర్శనం! . కం: మాకొలది జానపదులకు  నీకవితా ఠీవి యబ్బునే? కూపనట ద్భే  కములకు నాకధునీ  శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా! . తిమ్మనగారి కవిత్వం చల్లని కవిత్వమట!యెంతచల్లనిది? ఆకాశగంగాప్రవాహమందలి నీటితుంపురలను బోలిన చల్లదనమది. సురగంగ చల్లదనం కిందికురికి తిమ్మనగారి కవితలో ప్రవేసించినదట! పొగడ్తకు ఆకాశమే హద్దుగదా! . తిమ్మనగారు పారిజాతాపహరెణ మనే ప్రబంధం వ్రాశారు. రాయలవారికి- చిన్నాదేవికి నడుమ నేర్పడిన వియోగమును తప్పించుటకే ఈప్రంధమును తిమ్మన రచించెనని ప్రవాదము. యేదియేమైనను యిది రసవత్తరమైన ప్రబంధమే!  . శ్రీకృష్ణుని యంతవాని శిరమును సత్యచే తన్నించి , ప్రణంలో యిది తప్పుకాదు పొమ్మన్నాడు. పారిజాతపుష్పాన్ని రుక్మిణి కిచ్చినది విని యలిగిన సత్యాదేవి మానసిక, శారీరక ,పరిస్థితులను వర్ణించుచు తిమ్మన గారు ఒకపద్యం చెప్పారు. కవితా కళకు కాణాచియైన ఆప

విష్ణువు ఆగమనము! (గజేంద్ర మోక్షం - పోతానా మాత్యుడు)

Image
విష్ణువు ఆగమనము! (గజేంద్ర మోక్షం - పోతానా మాత్యుడు) -ఆ. "విశ్వమయత లేమి వినియు నూరక యుండి రంబుజాసనాదు లడ్డపడక విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డపడఁ దలంచె! భావము: ఆ సమయంలో బ్రహ్మదేవుడు మొదలగు వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేకపోవుటచేత గజరాజు మొర వినబడినా వారు అడ్డుపడకుండ ఊరికే ఉండిపోయారు. విశ్వమంతా వ్యాపించే వాడు, ప్రభువు, విజయశీలి ఐన విష్ణువు భక్తుడైన గజరాజును రక్షించాలని నిశ్చయించుకొన్నాడు. . -మ. "అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై ! భావము: ఆపదలలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక పక్కన ఉండే మేడకు సమీపంలో ఒక అమృత సరస్సుంది. దానికి దగ్గరలో చంద్రకాంతశిలల అరుగుమీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. అప్పుడు భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు కాపాడమని పెట్టే మొర విన్నాడు. గజరాజుని కాపాడడానికి వేగిరపడ్డాడు. . -మ.

చదువుల తల్లి సరస్వతీ !

Image
శుభోదయం! . పోతన భాగవత ప్రారంభంలో సరస్వతీ మాత దయాబిక్ష కోరుతూ కొన్ని పద్యాలు అమోఘంగా రచించాడు .  అందులో ” తల్లీ ,నిన్ను దలంచి ” , “క్షోణితలంబునన్ ” , శారద నీరదేందు ” , కాటుక కంటి నీరు ” లాంటి పద్యాలు విద్యార్థులకు ప్రేమతో నేర్పించేవారు గురువులు — మొన్న మొన్నటి వరకూ .  ప్రస్తుతం అవి కనుమరుగవుతున్నాయి . మాతృమూర్తి కరుణించినవారి రచనలు కలకాలం నిలిచాయి . పోతనే అందుకు ఉదాహరణ . చదువులు నిజంగా వంటి కబ్బాలంటే , చదువుల తల్లి కరుణ కావాలి . బిడ్డలందరికీ ఈ పద్యాలు నేర్పించి , వల్లె వేయించి సరస్వతీ మాత దయకు పాత్రులను చేయడం మన ధర్మం. . ఈ క్రింది పద్య సరస్వతీ మాత అనుగ్రహం కోరి పోతన రచించిన పద్యం .  రమ్యం గా ఉంటుంది మరి చదవండి -పిల్లలతో చదివించండి . పుణ్యమూ , పురుషార్థమూ , చదువుల తల్లి అనుగ్రహమూ లభిస్తాయి . . పుట్టం బుట్ట శరంబునన్ మొలవ , నంభోయానపాత్రంబునన్ నెట్టం గల్గను , గాళి గొల్వను , బురాణింపన్ దొరంకొంటి మీ దెట్టే వెంట జరింతు దత్సరణి నా కీవమ్మ ! యో యమ్మ ! మేల్ పట్టున్ నాకగుమమ్మ ! నమ్మితి జుమీ బ్రహ్మీ ! దయాంభోనిధీ! . తలపై పుట్ట పెరిగింది వాల్మీకికి . ఆ వాల్మీకిగా నేను

సిట్ ఇంటర్వ్యూ (రవితేజ) :

Image
సిట్ ఇంటర్వ్యూ (రవితేజ) : (ఒక గెస్ -నెట్ నుండి) . డ్రగ్స్ వాడితే ఏమొస్తుంది? కిక్ - పదే పదే ఎందుకు వాడతారు? కిక్ (2) డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తారు? దుబాయి శీను, డాన్ శీను ఎవరితోకలిసి డ్రగ్స్ తీసుకునేవారు? వెంకీ,చంటి, భద్ర, భగీరధ,కృష్ణ,ఆంజనేయులు,వీరా మీరు డ్రగ్స్ తో పాటు ఏమి తీసుకుంటారు? మిరపకాయ్ మీకు డ్రగ్స్ ఎవరు అలవాటు చేశారు? ఇడియట్ మీరు డ్రగ్స్ తీసుకుంటారని తెల్సి మీ వాళ్లు ఎలా ఫీలయ్యారు? షాక్ ఈ ఫోటోలో ఉన్నవాడు ఎవడు? విక్రమార్కుడు ఇతను ఏం చేస్తుంటాడు? దొంగోడు మీ తమ్ముళ్లను చెడగొట్టింది? వీడే మీరు డ్రగ్స్ బదులు ఏమి ఇచ్చేవారు రూపాయలా డాలర్లా? నా ఆటోగ్రాఫ్ పూరి, చార్మి లకు అలవాటు ఉందా? అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మీరు మొట్టమొదట డ్రగ్స్ తీసుకున్నది ఎక్కడ? బలాదూర్ నగర్లో అక్కడ ఇంకా ఎవరుండేవారు? అమ్మ.నాన్న ఓ తమిళమ్మాయి. మరి ఈ సెల్ఫీలో వాళ్లెవరు? ఒకరాజు ఒకరాణి మీరు ఇంకేమన్నా చెప్పదలచారా? నేనింతే ఇంటికెళ్లాక ఏంచేస్తారు? శంభో శివశంభో ... 😛😛

ఋతుసంహారం -కాళిదాసు!

Image
ఋతుసంహారం -కాళిదాసు! . చెట్లు పువ్వుల్తోనూ, సరస్సుల్లో నీళ్ళు తామరపువ్వుల్తోనూ నిండి ఉన్నాయి. స్త్రీలు కోర్కెలతో నిండి ఉన్నారు. గాలిలో సుగంధం నిండి ఉంది. సుఖవంతమైన సాయంత్రాలూ, రమ్యమైన పగళ్ళూ.. ఓ ప్రియా! వసంతం చాలా అందంగా ఉంది. . . మదవతుల కళ్ళల్లో చంచలతగా, బుగ్గల్లో తెల్లదనంగా, పాలిండ్లలో గట్టితనంగా, నడుములో సన్నదనంగా, పిరుదుల్లో పెరుగుదలగా .. ఇలా స్త్రీలలో రకరకాల రూపాల్లో మన్మధుడు వచ్చికూర్చున్నాడు ఇలాంటి పరిసరాల్లో కాళిదాసు వెన్నెల్లో మేడలు కట్టాడు, మామిడిచెట్లు వేసాడు, దిగుడుబావి తవ్వించాడు, తన పరివారాన్ని తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళకి అలంకరణలు చేసాడు. పుష్కలంగా మదిర సరఫరా చేసాడు. . (ఇంటి సందుల్లో) కొద్దిగా మిగిలిపోయిన మంచువల్ల ఇళ్ళల్లో ఇంకా చలిగా ఉంది. అందుకే బయట దిగుడు బావుల్లోకి దిగారు కొందరు. జలక్రీడలాడుతున్నారు. ఆడవాళ్ళ తలనిండా ఘుమఘుమలాడే సంపెంగపూలూ, స్తనాలమీద మనోహరమైన పూలహారాలు, నడుముకు మణుల్తోచేసిన వడ్డాణాలు ..అందరూ మొలలోతునీళ్ళల్లో ఉన్నారు.. అందువల్ల ఆతర్వాత ఇంకేమీ కనిపించటల్లేదు కాళిదాసుకి. నీళ్ళమీద తేల్తూ మామిడి పువ్వులు, గట్టుమీద విరబూసిన చెట్లు మాత్ర

Rk laxman గారి సామాన్యుడు !

Image
Rk laxman గారి సామాన్యుడు ! . అనగనగా కధలు ఆ కాశి మజిళీలు, గజిబిజిగా గదులు ఈ జీవిత మజిళీలు! నడకే రానివాడు నట్టేట్లో ఈదుతాడు, ఉట్టే అందనోడు స్వర్గాన్నే కోరతాడు! . మబ్బుల్లో నీళ్ళకని ఉన్న ముంతనే ఒంపేస్తాడు! . తోక గుప్పెడు గొర్రె గంపెడు, ఆస్తి మూరెడు ఆశ బారెడు!

కృష్ణుడు (రాధికా గీతము-బసవరాజు అప్పారావు గీతాలు!

Image
బసవరాజు అప్పారావు గీతాలు! . కృష్ణుడు (రాధికా గీతము) నల్లవాడే గొల్ల పిల్లవాడే చెలియ కల్లగాదే వాని వల్లో జిక్కితినే! నల్ల... . వచ్చినాడే తోట జొచ్చినాడే సకియ చొచ్చి నాదౌ మనసు ముచ్చిలించాడే! నల్ల... . ఆగినాడే పొదల దాగినాడే మనసు రాగబంధమువేసి లాగుకొన్నాడే! నల్ల... . చూచినాడే మోము దాచినాడే నాదు దాచుకొన్నా వలపు దోచుకున్నాడే! నల్ల... . చేరినాడే చెంత చీరినాడే చేర కోరి చేరా బోవ పారిపోయాడే! నల్ల... . పాడినాడే చనుచు ఆడినాడే మదిని చేడె! అతనిపాట వీడకున్నాడే! నల్ల... . ఊదినాడే మురళి చేదినాడే వలపు నాదుమది తనరూపు పాదుకొలిపాడే! నల్ల... . చూడలేనే మమత వీడలేనే వాని జోడుకూడని ఉసురు వీడిపోనీవే! నల్ల...

పెండ్యాల నాగేశ్వరరావుగారు !

Image
పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమాసంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూపాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్‌ పెండ్యాల నాగేశ్వరరావు. పెండ్యాల గారు సినీ జీవితం ప్రారంభించినకొత్తల్లో తల్లిప్రేమ (1941), సతీ సుమతి (1942) చిత్రాలకు హార్మోనిస్టుగా, సహాయ సంగీతదర్శకుడిగా పని చేశారు. స్వతంత్ర్య సంగీత దర్శకుడిగా పని చేయగల ప్రతిభ, పేరు ఉండి కూడా కొత్తపొకడలు నేర్చుకోవచ్చునన్న ఆశతోసాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర సహాయకులుగా చేరారు. సాలూరు రాజేశ్వరరావు గారు విదేశీయ సంగీతాన్నీ, హిందుస్తానీ పోకడల్నీ తీసుకుని మన రాగాలతో మిళితం చేసి, ‘తెలుగుపాట’లా చేసి వినిపించగల సమర్థుడనిపెండ్యాల పేర్కొనేవారు. పెండ్యాల గారు సంగీతాన్ని అందించిన సినిమాలు దొంగరాముడు , ముద్దుబిడ్డ , భాగ్యరేఖ , జయభేరి , మహామంత్రి తిమ్మరుసు , శ్రీకృష్ణార్జున యుద్ధం , రాముడు భీముడు , శ్రీ కృష్ణ తులాభారం కొన్ని చాలు – వందకుపైగా సంగీతం కూర్చిన ఆ స్వరచక్రవర్తి సంగీతం గురించి చెప్పుకోవడానికి. అద్భుతమైన పాటలే కాదు, పద

రుక్మిణీదేవిగౌరీపూజ!

Image
రుక్మిణీదేవిగౌరీపూజ! . "నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్ మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!" . “తల్లుల కెల్ల పెద్దమ్మ! పార్వతీదేవి! ఆదిదంపతులు పురాణదంపతులు  . ఐన ఉమామహేశ్వరులను మిమ్మల్ని మనస్పూర్తిగా నమ్మి భక్తిగా . పూజిస్తున్నా కదమ్మ. ఎంతో దయామయివి కదమ్మా. నిన్ను నమ్మినవారికి . ఎప్పటికి హాని కలుగదు కదమ్మ. నాకు ఈ వాసుదేవుణ్ణి భర్తని చెయ్యి తల్లీ!”  . అంటు గౌరీపూజచేసిన రుక్మిణీదేవి ప్రార్థించుకుంటోంది.

సాంబుడు శ్రీకృష్ణుడు మరియు జాంబవతి కుమారుడు.

Image
సాంబుడు ! . సాంబుడు శ్రీకృష్ణుడు మరియు జాంబవతి కుమారుడు. శ్రీకృషుడు పుత్రులను కోరుకుని మునుల సలహా మీద ఏకాంతజీవనం స్వీకరించి శరీరమంతా భస్మధారణ చేసి చెట్లబెరడును వస్త్రాలుగా చేసుకుని సంవత్సరాల తరబడి పరమశివుని కొరకు తపసుచేసి శివుని మెప్పించి శివపార్వతులను ప్రత్యక్షం చేసుకున్నాడు. తరువాత శ్రీకృష్ణుడు శివపార్వతులను తనకు శివుని వంటి కుమారుడు కావాలని కోరాడు. శివుడు శ్రీకృష్ణుని కోరికను నెరవేర్చి శ్రీకృష్ణ జంబతులకు పుత్రుని ప్రసాదించాడు. వారా పుత్రునికి సాంబుడు అని నామకరణం చేసారు. శివుని వంటి కుమారుని కోరుకున్నాడు కనుక సాంబుడు శివుడు లయకారకుడు కనుక శివునిలా యదువంశం సమూలంగా నాశనం కావడానికి సాంబుడు కారణంఅయ్యాడు. సాంబుడు అందగాడు అందరికీ అభిమానపాత్రుడు. సాంబుడు సహించరాని పనులు అనేకం చేసాడు. శ్రీ కృష్ణుని పోలిన సాంబుడు కృషుని వేశంలో తన పిన న తల్లులను మోసం చేసిన కారణం వలన కృష్ణుడు కోపించి కుష్టు రోగమును శాపముగా ఇచ్చడు . సాంబుడు క్రియల ఫలితంగా యాదవవంశం అంతా నిర్మూలం అయింది. . శ్రీకృషుడు జన్మించిన యదువంశాన్ని వేరెవరు వధించలేరు కనుక మానవులకు మరణం తథ్యం కనుక యుగానంతంలో ఇలా సంభవించాలని

శ్రీ త్యాగరాజస్వామి!!

Image
శ్రీ త్యాగరాజస్వామి!! . సంగీతాన్ని ప్రేమించి . సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు నాకు తండ్రి ..ఆయన పాదాలదగ్గర 'బంటురీతి కొలువు' చాలు అంటూ శ్రీ రాముడి కుటుంబం నా కుటుంబం అని చెప్పిన మహా వాగ్గేయకారుడు ..శ్రీరామచంద్రమూర్తికి పరమ భక్తుడు కాకర్ల త్యాగరాజస్వామి.. శ్రీ త్యాగరాజ స్వామి నాదోపాసనలో ముక్తి పొంది భక్తుల కందరికి దారి చూపిన మాహా వాగ్గేయకారుడు. పురందరదాసు, కబీరు తులసీదాసు, రామదాసు వంటి వారు కూడా భక్తిలో నాద యోగస్ధితిని పొంది మోక్షం పొందిన వారే. త్యాగరాజు కారణజన్ముడు. . తంజావూరు రాజు శరభోజి ఆస్థానంలో ఉండే కాకర్ల రామబ్రహ్మానికి జన్మించాడు త్యాగరాజు. తల్లి పేరు సీతమ్మ. త్యాగరాజు తాతగారు వీణాకాళహస్తయ్య ఈయన ప్రసిద్ధి కెక్కిన సంగీత విద్వాంసుడు. సంస్కృత, తెలుగు భాషల్లో పాండిత్యం గడించిన త్యాగరాజు శొంఠి వెంకట రమణయ్యగారి వద్ద చేరి సంగీతం అభ్యసించారు. రామకృష్ణానంద స్వామి అనే సన్యాసి ‘నారదోపాస్తి’ మంత్రాన్ని త్యాగరాజుకు ఉపదేశించారు. నారదుడు యతి రూపంలో వచ్చి ‘స్వరార్ణవం’ అనే సంగీత గ్రంధాన్ని అనుగ్రహించారు. త్యాగరాజు తన కృతులలో అనేక విధాలుగా వారిని స్తుతి చేశారు. త్యాగయ్యకు పద్దె

భక్తి కవితా చతురానన బమ్మెర పోతన - డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు.

Image
భక్తి కవితా చతురానన బమ్మెర పోతన - డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు. "పలికెడిది భాగవతమఁట పలికించు విభుండు రామభద్రుండఁట; నేఁ పలికిన భవహర మగునట; పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?" నాలుగు పలుకులను ప్రాసస్థానంలో చిలికి తన పులకలు వెలార్చుకొన్నాడు. అయితే భాగవతరచన అంతంత మాత్రాన జరిగేదికాదు. ఈ "సహజ పాండిత్యు"నికి అది తెలియదా? అదీ విన్నవించుకొన్నాడు. "భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు శూలికైనఁ దమ్మి చూలికైన విబుధజనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపఱుతు." భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలుపుకోవడం చిత్రమట! నిజమే, రామాయణం అలలా సాగిపోయే మనిషి కథ. భారతం భిన్న లౌకిక ప్రవృత్తుల సంఘర్షణ వ్యథ. భాగవతం స్థూలదృష్టికి కృష్ణలీలాపేటిక, విష్ణుభక్తుల కథావాటిక. సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్యమధ్య ఎన్నెన్నో విప్పలేని వేదాంతగ్రంథులున్న మహాగ్రంథం. ఆ ముడులు విప్పడం హరునికీ, విరించికీ దుష్కరమే! మరి ఆ భాగవత రహస్యం ఆ భగవంతునికే తెలియాలి. భారం అతనిపై వేసి వ్యాసభాగవతవ్యాఖ్యాత అయిన శ్రీధరుణ్ణి ఆలంబనం చేసుకుని తెలియవచ్చినంత తేటపరచినాడు ఈ వినయశీలుడు. ఈ తేటపరచటం ఏ తెలుగు

మంచి గురువు.... (ఉత్తమ)వెర్రి బాగుల శిష్యుడు!

Image
మంచి గురువు.... (ఉత్తమ)వెర్రి బాగుల శిష్యుడు! . మంచి గురువు.... వెర్రి బాగుల శిష్యుడు.. లోనే వక్ర భాష్యము ఉన్నది. ద్రోణుడు మంచి గురువా? ఎవరికి? అర్జునునికా? ఏకలవ్యునికా?  ద్రోణుడి విలువిద్యా ప్రావీణ్యత గురించి ఎవరికీ అనుమానంలేదు.  అర్జునునికి విలువిద్య నేర్పడమే కాక అతనిని మించినవాడు ఉండడని మాట ఇచ్చాడు.  ఏకలవ్యుడు ద్రోణునే గురువుగా ఆరాధించి స్వయంకృషితో విలు విద్య నేర్చుకుని, తన విద్యను తాను ఆరాధించిన ద్రోణునికి ప్రదర్శించాడు.  అంటే ఏకలవ్యుడు ఉత్తమ శిష్యుడు.  ద్రోణుడు అతనికి మంచిగురువు కాలేక పోయాడు. అర్జునుని మించిన విలుకాడు తన యెదుటనే ఉన్నాడు. ఇది సహించలేక ద్రోణుడు నీచమైన అధర్మము చేశాడు. గురుదక్షిణగా అతని విద్యనే పరోక్షంగా కోరాడు. ఇంద్రుడు కర్ణునివద్ద కవచ కుండలములు దానం కోరినట్లే.  ఇక్కడ కులాల ప్రసక్తి లేదు. శ్రీకృష్ణుని కథలో ఆయన అనేకులకు అనుగ్రహం చూపాడు. వారిలో బ్రాహ్మణుల సంఖ్య అతి తక్కువ. నాదృష్టిలో ఆకాలపు బ్రాహ్మణులు శ్రీకృష్ణావతారము వలన ప్రయోజనం పొందలేదు. ఏకలవ్యుడు, శంబూకుడు, బలి చక్రవర్తి మొదలైన కథలను ఆధునికులు చర్చించ వలసినదే. ఏకలవ్యుని వృత్తాంతములో ద్రోణ

కనిపించే పెద్ద గీత –– సీత -దాని వెనుక మరుగైన చిన్నగీత – ఊర్మిళ !

Image
కనిపించే పెద్ద గీత –– సీత -దాని వెనుక మరుగైన చిన్నగీత – ఊర్మిళ ! . లక్ష్మణుడికి త్యాగం పేరు చెప్పగానే ఊర్మిళ గుర్తొచ్చింది. తన మాటని జవదాటకుండా అంతఃపురానికే అంకితమయ్యింది. ఒకరకంగా ఊర్మిళని వదిలి రావడం భర్తగా తను చేసింది తప్పే –  కాని అన్నగారి మీద ప్రేమ, భక్తి ఈనాటివి కాదు. అభిమానాలు, ప్రేమలు న్యాయ ధర్మాల తర్కానికి అందవు. తను అన్నగారిననుసరించి త్యాగం చేసాననుకుంటున్నారు వీళ్ళందరూ !  తన త్యాగం వెనుక మరొక మూర్తి త్యాగం కూడా వుంది. ఊర్మిళే కనక తనని అడవులకు వెళ్ళ వద్దని నిర్బందిస్తే ?  ఒకరకంగా తనకు పరీక్షే – తను వద్దనగానే మరోమాట మాట్లాడకుండా మౌనంగా అంగీకరించింది. . ఒక్కసారి ఊర్మిళ మీద ప్రేమ అభిమానం పొంగుకొచ్చాయి లక్ష్మణుడికి. రాజ పరివారమంతా బయల్దేరివచ్చినా ఊర్మిళ మాత్రం రాలేదు – ఎందుకు రాలేదు ? భర్తని చూడాలని అనిపించలేదా ? ఏదో కారణం ఉండే ఉంటుంది. . తల్లి సుమిత్ర నడిగితే తెలుస్తుంది. లక్ష్మణుడు గుడారం లోపలకి ప్రవేశించగానే చెలికత్తెలు పక్కకు తప్పుకున్నారు. తల్లి సుమిత్రకి, పెదతల్లి కౌసల్యకి ప్రణామాలు చేసి, ఈ అడవిలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారేమో చూసి రమ్మని అ

పోతన పద్య మధురిమలు ముద్దులుగార-కరుణశ్రీ! .

Image
పోతన పద్య మధురిమలు ముద్దులుగార-కరుణశ్రీ! . ఉ. ముద్దులుగార భాగవతమున్రచియించుచు పంచదారలో అద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీసిన తాటియాకులో పద్దెములందు ఈ మధురభావములెచ్చటనుండి వచ్చురా! . పోతన కవిత్వం పంచదార పాకానికిప్రసిద్ధి. పోతనగారు ముద్దులొలికేలా అంత మథురాతి మధురంగా ఎలా రాయగలిగాడు అనిసందేహం వచ్చిందిట. ఆయనంటే కష్టపడితాటియాకులపై గంటంతో రాసారు. మహాకవి కదా, రవి గాంచని చోటే కాదు కాలం కాంచనిది కూడకనగలడు. తరువాతి తరాలలో సులువుగా కలం సిరాలో ముంచి రాసేవాళ్ళం కదా. పంచదార వాడిమధుర పదార్థాలు చేసేవాళ్ళం కదా. అవన్నీ తెలిసిన వాడు కనుకపంచదారలో గంటం అద్ది తాటాకుల మీదచెమటలు కాదు ముద్దులు కారేలా రాసారు. అలాకాకుండా వట్టి గంటంతో తాటాకులమీద అక్షరాలుగీకేస్తే పద్యాలకి ఇంత మాధుర్యం రాదు కదా.అన్నారు మన కరుణశ్రీ. ఆ రోజుల్లో పంచదార ఎక్కడది అని అడక్కండి.

గోదావరి స్నానాల వింతలు !

Image
గోదావరి స్నానాల వింతలు ! . కొత్తనీటి కుదుపులకు... కోడెగాళ్ల అదుపులకు... కొప్పులోని కొత్తసవరం... కొట్టుకుపోయే దొడ్డమ్మా.. .

ఉషా పరిణయం!

Image
ఉషా పరిణయం! పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి వేయి బాహువులు. బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. ఆ నూర్గురు కుమారులలో పెద్దవాడు బాణాసురుడు.  బాణాసురుడు ఒకరోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. . ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి అయిదువందల వాద్య పరికరములను తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. “వేయి చేతులతో అయిదువందల వాద్య పరికరములను ఎంతో గొప్పగా వాయించావు” అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. అతను పరుగుపరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు “నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను” అన్నాడు. అతడు ఎంత చిత్రమయిన కోరిక కోరాడో చూడండి. “ఈశ్వరా! నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకొక ఉపకారం చేసిపెట్టాలి. పార్వతీ దేవితో కలిసిన వాడివై, నేను కోటలోపల ఉంటె నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోర్కెలు తీర్చడంలో వశుడవయిపోయే వాడివి కదా! అందుకని నాకీ కోరిక తీరుస్తావా” అని అడిగాడు. . ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బ

తండ్రి తానే కుమారుడై పుట్టి తన ప్రకాంశంతో వెలుగొందుతాడు !

Image
తండ్రి తానే కుమారుడై పుట్టి తన ప్రకాంశంతో వెలుగొందుతాడు ! . భర్త భార్యయందు ప్రవేశించి, గర్భంలో నవమాసాలు ఉండి పుత్రుడై పుడతాడు.  కాబట్టి ‘ అంగాత్ అంగాత్ సంభవసి ’ ( శరీరం ను్డి పుడుతున్నావు) అని వేదం చెబుతోంది. దాని వలన తండ్రి కొడుకులకు భేదం లేదు.  గార్హపత్యం అనబడే అగ్ని ఏ విధంగా ఆహవనీయంలో ప్రజ్వలింపబడి వెలుగుతుందో, అలాగే, తండ్రి తానే కుమారుడై తన ప్రకాంశంతో వెలుగొందుతాడు. మగవాడు తన నీడను నీళ్ళలో ఎలా స్పష్టంగా చూసుకో గలుగుతాడో, అలాగే తండ్రి కొడుకుని చూసి మహదానందాన్ని పొందుతాడు. ‘ పున్నామ్నో నరకాత్రాయత ఇతి పుత్ర ’ అని వేద వచనం. కనుక ఉత్తమ శీలం కల పుత్రుడు తలిదండ్రుల ఉభయ వంశాల వారినీ ఉద్ధరిస్తాడు. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్టుగా నీ పుణ్య శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు.  నీ కుమారుని కౌగలించుకో. ఆ సుఖాన్ని అనుభవించు. ముత్యాల హారాలూ, దట్టంగా పులుముకున్న పచ్చ కర్పూరపు పొడి, మంచి గంధం, వెన్నెల .... ఇవేవీ కూడ కుమారుని కౌగిలించు కోవడం వల్ల మనసుకి కలిగేటటు వంటి సుఖాన్నీ, చల్లదనాన్నీ ఇవ్వ లేవు !

జ్వలిత కౌసల్య .కావ్య ఖండిక!

Image
జ్వలిత కౌసల్య .కావ్య ఖండిక! (రచన -అనుమాండ్ల భామయ్య గారు ) ఈ పద్య కావ్యంలో భర్త నిరాదరణ , బహు భార్యత్వం , సపత్నుల పోరు , అసంతృప్తుల నుంచి సంసార జీవనం , మాతృ వాత్సల్యం , పితృవాక్య పరిపాలన , ఏక పత్నీ వ్రతం వైపు ప్రస్థానం సాగింది. భర్త నిరాదారణ : “పుట్టినింట ఆనాడు నేపొందిన సుఖ మేము కాని , మీ తండ్రి ఇంట నేను కాలు మోపిన పిదప సుఖము నెరుంగ నిన్ను గన్నాను బ్రతుకు కన్నీరు తుడిచె “(పుట – 1 7 ) మీ తండ్రి ఇంటిలో అడుగు పెట్టిన నుంచి సుఖాల మాట ఎలాగున్నా , కనీసం గౌరవ మర్యాదలన్నా దక్కుతాయనుకుంటే నువ్వు అడవులకు వెళ్ళిపోతున్నావని కౌసల్య విలపించింది . “నాణ్యమౌ ఏడువారాల నగలు కలవు నను గొలువ దాసదాసీ జనమ్ము కలదు ఎన్ని ఉండి వీని నను భావింపలేని భాగ్యహీనను పతి ప్రేమ బయడలేక “ (పుట – 22 ) ఏడువారాల నగలున్నాయి . దాసదాసీజనం ఉంది . ఎన్ని ఉండి వీనినను భావింప లేని భాగ్య హీనను , పతి ఆదరణ లేకపోవటం వలెనే కదా ఈ వ్యధ అని ప్రశ్నించింది . పేరుకి పట్టా మహిషినే గాని మీ నాన్నగారి నిర్వాకంలో నా బతుకు దాసీకన్నా కనా కష్టం అయిపొయింది . నీవు రాజువైతే నన్నా సుఖ పడదామని అనుకున్నాను . అది కూడా అడియాసే అయ్య

ఈ పాట తెలియని వారు లేరు కానీ ఈ మాట చాలామందికి తెలియదు!

Image
ఈ పాట తెలియని వారు లేరు కానీ ఈ మాట చాలామందికి తెలియదు! . కవి రాసింది వేరు ..ఘంటసాల గారు పాడింది వేరు. కూడి (కలసి )ఎడం (విడి పోవడం ..సెపెరేషన్) అని రాసేరు . సంగీత దర్శకుడు కుడి ఎడమ అని రికార్డు చేసారు. అలాగా కూడి ఎడము..కుడి ఎడం ఐయింది . తరువాత కవి సముద్రాల వారు ,త్రాగుబోతుఎలా పాడిన  పర్వాలేదు అని వదిలేసారు.

భీష్ముడిని అంగుళం మాత్రం చోటులేకుండా అన్ని బాణములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు?

Image
భీష్ముడిని  అంగుళం మాత్రం చోటులేకుండా అన్ని బాణములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు?  . ధర్మం తెలిసిన భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు. దుర్యోధనుని పక్షంలో ఉండిపోయారు. అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? నిజంగా భీష్ముడే కానీ ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నానని అన్నాడనుకోండి అపుడు అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు. దుర్యోధనుడు భీష్ముడిని, కర్ణుని ఈ ఇద్దరిని చూసుకుని యుద్ధమునకు దిగాడు.   భీష్ముడిని ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటులేకుండా అన్ని బాణములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? భీష్మం చ ద్రోణం చ జయద్రథం చ” అని పరమాత్మ వాళ్ళందరినీ తానే సంహరిస్తున్నానని గీతలో చెప్పాడు. భీష్ముడిని అన్ని బాణములతో ఎందుకు కొట్టాడు? ఈ రెండూ భీష్మాచార్యుల వారి జీవితమునకు సంబంధించి చాలా గహనమయిన ప్రశ్నలు.  అలా కొట్టడానికి ఒక కారణం ఉంది. ప్రపంచములో దేనికయినా ఆలంబనము ధర్మమే!  భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు. అదికూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మరాజుకి, శకునికి మధ్య ద్యూతక్రీడ జరుగుతోంది. అలా

ఖాండవ దహనం-శ్రీ మహాభారతంలో కథలు!

Image
ఖాండవ దహనం-శ్రీ మహాభారతంలో కథలు! (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.) చాలా ఏళ్ళ క్రితం శ్వేతకి అనే రాజుగారు దుర్వాసమహర్షి పర్యవేక్షణలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు. వందేళ్ళపాటూ సాగి దిగ్విజయంగా ముగిసిన ఆ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు. కాని నిత్యం హోమగుండంలో ఆజ్యం పోయడం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసింది. మొహం పాలిపోయింది. సన్నబడ్డాడు. ఆహారం పట్ల విముఖత ఏర్పడింది. ఇక లాభం లేదనుకుని అగ్ని బ్రహ్మను అర్చించి తన వ్యాధి గురించి వివరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. " ఖాండవ వనంలో అనేక దివ్య ఓషధులు ఉన్నాయి. దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులు ఉన్నాయి. నీ ప్రతాపంతో అ వనాన్ని దహించి ఆ ఓషధుల్ని స్వాహాచేసి జంతువుల్ని భక్షించు. నీ ఆరోగ్యమూ కుదుటపడుతుంది. శత్రు సంహారమూ జరుగుతుంది" అని అగ్నికి సలహ ఇచ్చాడు. సరేనని అగ్ని ఖాండవ వనానికి వెళ్ళాడు. ఆ వనంలో ఇంద్రుడి స్నేహితుడు తక్షకుడు భార్యాబిడ్డలతో వుంటున్నాడు. ఖాండవ వనాన్ని దహించడానికి అగ్ని వచ్చాడని తెలుసుకుని తన స్నేహితుడ్ని ఎలాగైనా సరే రక్షించాలనుకున్నాడు ఇంద్రుడు. అగ్ని వనదహనం ప్రారంభించగానే ఇంద్రుడు కుండపోతగా వర్ష

శకుంతల దుష్యంతునితో చెప్పిన నీతి వ్యాక్యాలు !

Image
సభలో భరతుుడుగా అంగీకరించనని పలికినప్పుడు శకుంతల దుష్యంతునితో చెప్పిన నీతి వ్యాక్యాలు . శకుంతల దుష్యంతునితో పలికినది: వివేకంతో బాగా ఆలోచిస్తే, పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కారభావంతో చూసే వాడికి ఇహపరాలు రెండూ ఉండవు. అనుకూలవతి అయిన భార్య కలవాడు కర్మలు చక్కగా ఆచరించ గలుగుతాడు. ఇంద్రియాలను నిగ్రహించ గలుగుతాడు. పుత్ర సంతానాన్ని పొంద గలుగుతాడు. గృహస్థ ధర్మాన్ని ఆచరించడం వల్ల కలిగిగే ఫలాన్ని పొందుతాడు. అంతే కాక, భార్య అంటే ఎవరనుకున్నావు? ధర్మార్ధ కామాలనే పురుషార్ధాలను సాధించడానికి అనువైన సాధనం. గృహనీతి అనే విద్యకు నెలవైనది. శీలాన్ని ప్రబోధించే గురువు. వంశం నిలవడానికి ఆధారం. ఉత్తమ గతులు పొందడానికి ఊత కర్రలా ఉపయోగ పడుతుంది. మన్ననకు ముఖ్య హేతువు. ఆదర్శ ప్రాయాలు, కలకాలం నిలిచేవీ అయని రత్నాల లాంటి గుణాలకు నెలవైనది. హృదయానందాన్ని భర్తకు కలిగించేది భార్యయే సుమా ! మగనికి ఇల్లాలి కంటె ఇంపైనది వేరొకటి లేదు. భార్యా పిల్లలను ఆప్యాయంగా చూసుకునే వారికి ఎక్కడయినా, ఎలాంటి పరిస్థితిలోనయినా, ఎలాంటి ఆపదలోనయినా, ఏ తీరాలలోనయినా చుట్టుముట్టినా ఆపదలన్నీ తొలిగి పోతాయి. అంతే కా

గజేంద్ర మోక్షం..... (పోతన).

Image
గజేంద్ర మోక్షం..... (పోతన). . గజేంద్రమోక్షం సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం.  “గజ” అనే అక్షరములను కొంచెం అటూ ఇటూ మారిస్తే “జగ” అవుతుంది. “జ” అంటే “జాయతే”. “గ” అంటే “గచ్ఛతే”. “జాయతే” అంటే వెళ్ళిపోవడం. “గచ్ఛతే” అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉన్నదో దానిని “జగము” అంటారు. శాశ్వతంగా ఉండిపోయేది ఉండదు. అలా ఏదయినా ఉండిపోయేది ఉన్నట్లయితే దానిని ఈశ్వరుడు అని పిలుస్తాము. ఈ జగము కథ ఇప్పుడు గజముగా చెప్పాలి. అదే గజేంద్రమోక్షంలో ఉన్న రహస్యం. గజేంద్రుని ప్రార్ధన ! . పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యముల వల్ల ఈనాడు స్మృతిలోకి వచ్చిన జ్ఞానము నొకదానిని ఏనుగు ప్రకటన చేస్తోంది.  . "ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై; యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్!! ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితి కార్తో, ఎవరు ప్రళయ కర్తో, లోకములన్నిటిని ఎవరు సృష్టించారో, ఎవరు యందు లోకములు ఉన్నాయో. లోకములు ఎవరియందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయము అయిపోతున్నాయో. ఎవరు అంతటా న

పోతన వినయం!

Image
పోతన వినయం! [సౌజన్యం .శ్రీ పైడి నాగ సుబ్బయ్య గారు] "భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు! శూలికైన దమ్మిచూలికైన! విబుధజనుల వలన విన్నంత కన్నంత, దెలియవచ్చినంత తేటపరతు!! . ఎంతవినయంగా చెప్పుకున్నారో చూడండి! భాగవతము ఎవరు చెప్పగలరు? భాగవతమును చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేరు. జ్ఞానమునకు ఆలవాలమయిన పరమశివుడు చెప్పలేడు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తూ వుంటుంది. కానీ “మహాపండితులయిన వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏది ఉన్నదో దానిని నాకు అర్థమయిన దానిని, నాకు శారదాదేవి ఏది కృపచేసిందో దానిని నేను చెప్పుకుంటున్నాను” అన్నారు. ఆయన అంటారు –  . "అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను బో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!! . విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సద్యఃఫలితాన్ని ఇచ్చేస్తాయి.

బాలల గేయాలు! రైలు -- కాకి బావ!

Image
బాలల గేయాలు!  రైలు -- కాకి బావ! . రైలు స్టేషను చెంత రావి చెట్టుంది రావి పై నొక కాకి బావ కూర్చుంది వచ్చి పొయ్యే రైలు వంక చూసింది గమనించి మురిసి రెక్కలు కొట్టుకొంది బలగమ్ము నొక నాడు పిలువనంపింది కొట్ట కొస కొమ్మ పై కొలువు తీర్చింది రైలు నే రమ్మంటె రావాలనంది పొమ్మంటె తుర్రున పోవాలనంది గమ్మత్తు లెమ్మంది కాకి బలగమ్ము గమ్మత్తు కాదంటు కాకి బావపుదు రైలు సిగ్నలు చెక్క వంగినది ఎరిగి రావోయి రావోయి రైలు బావంది గుప్పు గుప్పున రైలు కూస్తు వచ్చింది (ఎక్కే వాళ్ళు ఎక్కారు దిగే వాళ్ళు దిగారు) ఇంతలో గార్డు విజిలేయడమ్మెరిగి పోవోయి పోవోయి పొగ రాయడాంది రైలు గుబ గుబ లాడిబైలు దేరింది కాకి బలగము పొగడ లేక చచ్చింది విన లేక చచ్చెరా మన కాకి బావ

తెలుగువారి మనస్సు!

Image
తెలుగువారి మనస్సు! ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది. తేట తేట తెనుగులా.... మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది. పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది ఏలాఅంటే ======= అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది. క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం త థ ద ధ న……నాలుక కొస భాగం ప ఫ బ భ మ……..పెదవులకు య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది. సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది. తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి. మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను

నా బాలమురళ కృష్ణ గారి జ్ఞాపకాలు !

Image
నా బాలమురళ కృష్ణ గారి జ్ఞాపకాలు ! . 1954 లో వారింటికి ఎదురుగా వుండే వాళ్ళం బెజవాడ సత్యనారాయణ పురం లో  వారు నన్ను ఏరా "వింజమూరి"అని పిలిచే వాళ్ళు.నాకు అప్పుడు 12ఏళ్ళు. వారు కొన్ని నచ్చిన సినిమా పాటలు పాడుకునేవారూ ,A .M .రాజా చూడు మదే చెలియాతరచు పాడే వారు . వారింట్లో కచేరి కి అల్ ఇండియా రేడియో పున్నమ తోటకి నన్ను పంపే వారు archestraకోసం. వారు మా బంధువులు .

చకారకుక్షి!

Image
చకారకుక్షి! , కాళిదాసు వ్యాసుని చకార కుక్షి అనేవాడట. దానిపరిణామక్రమం తెలిసికుందాం! భారతం చాలా పెద్ద గ్రంధం. అందులో లక్షకు మించిన శ్లోకాలున్నాయి. అంతపెద్దగాధని వివరించేటప్పుడు ఆశ్లోకాలలో పాదపూరణకు చకారం యెక్కువగా వాడారట! అదీ కాళిదాసు ఆయన్ని చకార కుక్షి యంటానికి కారణం. . కాళిదాసు విశ్వనాథుని దర్శంచేందుకు ఒకపర్యాయం కాశీ వెళ్ళాడు. అక్కడ ఒకపరిచాయకుడు ఆయనకు ఆలయప్రాంగణంలోని వ్యాసుని విగ్రహం వద్దకు తీసికెళ్ళి " వీరు వ్యాసులవారు" అనిపరిచయం చేస్తూ విగ్రహం చూపారట. . కాళిదాసు" ఓహో వీరా ఆచకారకుక్షి " అంటూ విగ్రహం బొడ్డులోనికి తన వేలు దూర్చారట. అంతే ఆవేలు యిరుక్కుపోయింది. కాళిదాసు ఆశ్చర్య పడుచుండగా ఆవిగ్రహంనుండి " మనవడా! నాపొట్టలో చకార లెక్కువ ఉన్నాయని నన్నాక్షేపిస్తున్నావుగదా! ద్రౌపది పాండవులు వారి బంధుత్వాలను గురించి చకారం లేకుండా ఒక్క శ్లోకంచెప్పు,? చెప్పావో నీవేలూడుతుంది. అన్నాడట. . కాళిదాసు వినయంగా తలవంచి" తాతగారూ! నాకుమీరంటే చాలాఅభిమానం.ఊరక యేదోవేళాకోళానికల్లా అన్నాను గానీ మరేదీ గాదు. మీవలెశ్లోకం వ్రాయటం నాచేతనౌతుందా? అయినా ప్రయత్నిస్తా

భగవద్గీత !

Image
భగవద్గీత ! . కొందరు అనుకున్నట్టుగా, భగవద్గీత ఎట్టిపరిస్థితుల్లో మతగ్రంథం కానే కాదు. కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత. అందరూ చచ్చిపోతారనే బాధ. ఈ రెండింటి గురించి మథనపడే అర్జునుడికి- శ్రీకృష్ణుడు విడమరిచి చెప్పిన సారాంశమే భగవద్గీత. . బేసిగ్గా ఒక సినిమా పాట-మూడు నెలలకు పాతదైపోతుంది. ఒక కథ-ఆర్నెల్లకు పాచిపోతుంది. ఒక నవల-ఏడాది తర్వాత కనుమరుగైపోతుంది. కానీ వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం - ఇగిరిపోని గంధం- భగవద్గీత. ఇదేదో మతోద్బోధ అనుకునే వాళ్ల మైండ్ సెట్ మార్చలేం. . ఆధ్యాత్మిక ప్రవచనమైనా, వ్యాపార సూక్తులైనా, మేనేజ్మెంట్ కోర్సులైనా, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులైనా, ఆటలో గెలవాలన్నా, పరీక్షలో పాస్ కావాలన్నా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో గీతను కోట్ చేస్తాం. గీత గురించి చర్చిస్తాం. ఆది శంకరాచార్య దగ్గర్నుంచి స్వామీ వివేకానంద, మాక్స్ ముల్లర్ దాకా భగవద్గీత గొప్పదనాన్ని వేనోళ్లా చాటినవారే. వందల శ్లోకాలు ఔపోసన పట్టాల్స

నాకు నచ్చిన పద్యం: చిత్తము పల్లవింప జేసే తిక్కన కవిత్వం!

Image
నాకు నచ్చిన పద్యం: చిత్తము పల్లవింప జేసే తిక్కన కవిత్వం! రచన: భైరవభట్ల కామేశ్వరరావుగారు. ఉ.  శ్రీయన గౌరినా బరగు చెల్వకు జిత్తము పల్లవింప భ ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూ పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్త్వము గొల్చెద నిష్టసిద్ధికిన్ . తిక్కన ‘కొలిచినది’ ఎవరిని? పరతత్త్వాన్నా? హరిహర రూపాన్నా? పరతత్త్వాన్ని ‘కొలవడ’మేమిటి? హరిహర రూపాన్నే అయితే, ‘పరతత్త్వము గొల్చెద’ అని ఎందుకన్నాడు? ‘శ్రీయన గౌరినా బరగు చెల్వ’ – ఇక్కడ, ఒకే మూర్తి శ్రీ గౌరులనే రెండు రూపాలుగా గుర్తింపబడిందా, లేక శ్రీ గౌరులిద్దరు ఒక రూపంగా ఏర్పడ్డారా? ఒకరు ఇద్దరయ్యారా, ఇద్దరు ఒకరయ్యారా? ‘హరిహరంబగు రూపము దాల్చి’ – హరిహరంబగు రూపమంటే, హరి, హరుడు అనే రెండు రూపాలా? హరిహరనాథుని ఏక రూపమా? హరి, హరుడు అనే యిద్దరు హరిహరంబగు రూపాన్ని దాల్చారా? లేక ఒకే తత్త్వమైన హరిహరనాథుడు హరి హరులనే రెండు రూపాలను ధరించారా? మళ్ళీ అదే ప్రశ్న. ఒకరు ఇద్దరయ్యారా, ఇద్దరు ఒకరయ్యారా? ‘చెల్వ’ అనే పదాన్నే ఎందుకు ప్రయోగించాడు? ‘భక్త జనాని’కీ, ‘వైదికధ్యాయిత’కూ మధ్య లంకె ఏమిటి? పద్యాన్ని జాగ్

మహానటి సావిత్రి గురించి,ఆమె తండ్రి గురించి ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చిన ఆర్టికల్!

Image
నిర్మాతలకు హెచ్చరిక.. ( మహానటి సావిత్రి గురించి,ఆమె తండ్రి గురించి ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చిన ఆర్టికల్) నిన్న మొన్నటివరకూ నెలకు మూడు వందలు తీసుకుని నటించే సావిత్రి ఈనాడు చిత్రానికి 20 వేలు డిమాండ్ చేస్తోందిట. ఇరవై వేలు తీసుకునే అర్హత సావిత్రికి ఉందా లేదా అన్న విషయం అప్రస్తుతం. 'కళ' కి విలువలేదుగా.సావిత్రి విలువ అమూల్యం కావచ్చు.అసమాన్యం కావచ్చు. కాని నిర్మాతలింకా స్టార్ వ్యాల్యూ మోజు మీద సావిత్రం వంటి తారలను ఇరవై లేక నలభై వేలు ఇచ్చి బుక్ చేసుకోవటం ప్రస్తుత ఆర్దిక ప్రతిష్టంభన దృష్టిలో అది పరిశ్రమకు క్షేమం కాదు. విడుదలైన అనేక చిత్రాలు దెబ్బ తిన్నాయి. అనేకమంది నిర్మాతలు నిలువునా కూలిపోయారు. మార్కెట్ లో ధనం లేకా, ఉన్నది కదలలేకా, నిర్మాణంలో ఉన్న చిత్రాలు మీన మేషాలు లెక్కపెడుతున్నాయి. ఇటుపైని మొత్తం చిత్రం లక్షా లేదా లక్షన్నర రూపాయల్లో ముగించుకున్నవాడే ధన్యుడు. రంగంలో అనేకమంది మామూలు తారలు అసంఖ్యాకంగా ఉన్నారు. సావిత్రం కూడా నిన్నటి వరకూ మామూలు తారే. స్టారు వేల్యూ మోజు మీద నిర్మాతలు ఆమె కోరినంత ధనమిచ్చి బుక్ చేసుకునేటంత ఆగత్యమైన పరిస్దితులు ఏమీ కనపడటం లేదు. ఇంతవరకూ