Posts

Showing posts from June, 2015

కారణజన్మురాలు ద్రౌపది (Kaaranajanmuralu Draupadi) ...By.."Padyala Vaidyudu" Late Sri Dr. C.M. Krishnamurthy Garu

Image
కారణజన్మురాలు ద్రౌపది (Kaaranajanmuralu Draupadi) అయోనిజ, కారణజన్మురాలు, పాండవుల పత్ని. "అతి రూపవతి భార్యాశ తు్రః " అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. సాటి స్త్రీలే అసూయపడేటంత లావణ్యవతి ద్రౌపది. రాజసూయ మహాధ్వర సమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని ఈర్ష్యకు కారణభూతమైనది. ద్రౌపది అయోనిజ. కారణజన్మురాలు. కోకిలాదేవి- పాంచాల ప్రభువు ద్రుపదులకు అగ్నిగుండంలో జన్మించిన పుత్రిక. సహోదరుడే దృష్టద్యుమ్నుడు. త||     "కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణయు            త్పలసుగంధి, లసన్మహోత్పలపత్రనేత్ర యరాళకుం            తల విభాసిని, దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి             తజ్జ్వలన కుండము నందు బుట్టెప్రసన్నమూర్తి ముదంబుతోన్" వంశాన్ని పావనం చేసేది, నల్లకలువ వంటి శరీర వర్ణం కలది, కలువగంధం వంటి సుగంధం గలది, కళకళలాడే పెద్ద కలువరేకుల వంటి కన్నులు గలది, వంకరలు తిరిగిన వెంట్రుకలతో వెలిగేది, దివ్యతేజస్సును ధరించేది, మనోహరమైన ఆకారం గలది అయిన ఒక

సైంధవుడు .!

Image
. సైంధవుడు .! సింధుదేశాధిపతి, దుర్యోధనునకు బావమరిది, నూరుమంది సోదరులకు ఒక్కగానొక్క చెల్లెలైన దుస్సల భర్త. స్త్రీలోలుడైన వీడు ద్రౌపదిని బలాత్కారంగా ఎత్తికొనిపోగా, పాండవులు వీనిని పరాభవించి, తేజో వధకావించి వదిలారు. దీనికి ప్రతీకారంగా వాడు గంగానదీ తీరాన బొటనవ్రేలు మాత్రమే భూమిపై నిలిపి పార్వతీపతిని మెప్పించి పార్థుడు లేనప్పుడు మిగిలిన పాండవులను ఒకనాటి యుద్ధంలో నిలువరించే వరాన్ని పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుని వధకు కారణభూతుడయ్యాడు. ముగియవలసిన పనిని ముందుకు సాగనీయకుండ గట్టిగ అడ్డుకొను వ్యక్తిని సైంధవుడని నేటికీ పిలుస్తారు. పూర్తికావలసిన పనిని ముందుకు సాగనీయకుండ గట్టిగ అడ్డుకొను వ్యక్తిని లోకము సైంధవుడని పిలుస్తున్నది. ఈ అడ్డుపడు స్వభావం వీనిలో ఎలా కలిగింది? దీని పర్యవసానం ఏమిటో, మనం కవిత్రయ విరచితమహాభారతం చదివితే గగుర్పాటు కలిగించే ఉత్కంఠభరిత సన్నివేశాలను దర్శించగలం. . సప్తవ్యసనాలలోని, వెలది (స్త్రీ వ్యామోహం) వలన, వావివరుసలు తెలియక ప్రవర్తించిన దుర్మార్గుడు వీడు. ఆనాడు పద్మవ్యూహమున సైంధవుడొక్కడే సవ్యసాచిని తప్ప తక్కిన పాండవులను, సాత్యకిని, ద్రుష్టద్యు

పరోపకారం... భగవంతుని చేరే మార్గం.!

Image
. పరోపకారం... భగవంతుని చేరే మార్గం.! భగవంతుడిని పొందడానికి ఎన్నో మార్గాలు వున్నాయి. వాటన్నిటిలో ‘సర్వభూత హితాభిలాష’ కూడా ఒకటి. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు కొలువై వుంటాడు. అందువల్ల సమస్త ప్రాణులకు హితాన్ని, సుఖాన్ని చేకూరుస్తూ వుంటే భగవంతుడిని సేవించినట్టే అవుతుంది. ఎవరి హృదయం అయితే పరుల హితాన్ని కోరుకుంటూ వుంటుందో వారికి లోకంలో దుర్లభమైనది ఏదీ వుండదని భక్త తులసీదాసు కూడా చెప్పాడు. స్కాంద పురాణంలో ఒకచోట ఇలా పేర్కొనబడింది. పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతామ్ నశ్యంతి విపదేస్తేషాం సంపదః స్యుః పదే పదే తీర్థస్నానైర్న సా శుద్ధిర్బహుదానైర్న తత్ఫలమ్ తపోభిరుగ్రైస్తన్నాప్య ముపకృత్యా యదాప్యతే ఏ సుజనుల హృదయంలో పరోపకార భావన జాగరూకమై వుంటుందో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి. సంపదలెన్నో వారికి ప్రాప్తిస్తాయి. పరోపకారం వల్ల ప్రాప్తించే పవిత్రత అనేక పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించినా ప్రాప్తించదు. అందువల్ల కలిగే పుణ్యఫలితం అధిక దానాలు చేసినా, తీవ్ర తపస్సు చేసినా కలుగదు. నిష్కామ భావనతో పరోపకారం చేయడం కోసం పాటుపడేవారికి భగవత్ప్రాప్తి కూడా కలుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణ భగవానుడ

అమృత వర్షిణి.!

Image
అమృత వర్షిణి.! అద్వైతాన్ని అమరత్వాన్ని అనంత జీవన ప్రవాహాన్ని ఆద్యంత రహితమైన కాలాన్ని నా పేరే అమృత వర్షిణి బంధాన్ని ప్రణయ ప్రబంధాన్ని ప్రాయపు సరసులో అరవిరిసిన అరవిందాన్ని నా పేరే అమృత వర్షిణి రాగాన్ని సరస సరాగాన్ని నీ హృదయం ఆసాంతం నిండి ఉన్న అనురాగాన్ని నా పేరే అమృత వర్షిణి వేదాన్ని ప్రణవ నాదాన్ని ప్రకృతి వైవిధ్యాలుగా వ్యక్తమౌతున్న ఏకత్వాన్ని నా పేరే అమృత వర్షిణి నీ కవిత్వాన్ని నీ జీవన సమస్తాన్ని నీ మధుర భావాలలో సదా వ్యక్తమౌతున్న సత్యాన్ని నా పేరే అమృత వర్షిణి స్వరాన్ని దైవ దత్తమైన వరాన్ని శృతి సుమ పరిమళాల్ని వెదజల్లు మలయ సమీరాన్ని నా పేరే అమృత వర్షిణి కావ్యాన్ని కవి హృదయాన్ని ఆ హృదయం పై ఎన్నటికి మానని గాయాన్ని నా పేరే అమృత వర్షిణి.! . (శ్రీ సునీల్ కుమార్ గారి..అమృత వర్షిని నుండి.)

కోతికొమ్మచ్చి... ఆడితే అప్పచ్చి..!!

Image
.                                                             కోతికొమ్మచ్చి... ఆడితే అప్పచ్చి..!! "పొద్దున్నే ఈ వెధవ ట్యూషన్ కనిపెట్టినవాడిని చంపెయ్యాలి!", అని ఏడ్చుకుంటూ, కాళ్ళీడ్చుకుంటూ బయల్దేరాను. అప్పుడు నా వయస్సు ఆరేడేళ్ళు వుంటాయ్ అనుకుంటా. ఇంటి పక్కనే, మా స్కూలు పంతులమ్మ ఒకావిడ పాఠాలు చెప్పేవారు. చాలా మంచావిడ. కాకపొతే కొంచెం ఆలస్యం ఐనా, మార్కులు తక్కువ వచ్చినా చంపేస్తారు. పొద్దున్నే అమ్మ ఎలాగో తన్ని నిద్ర లేపి పంపిస్తుంది, మళ్ళీ తన్నులు తినాలి అంటేనే కొంచెం బాధ. అది కూడా అమ్మాయిల ముందు! ఛీ.. ఛీ.. పరువు పోతుంది. 'ఏదో చిన్నపిల్లోడు, ఇంత పొద్దున్నే ఎలా వస్తాడు?', అని వదిలెయ్యొచ్చుగా! బాగా తంతారు, దానికి తోడు మిగతా పిల్ల రాక్షసులు పొద్దున్నే తగలెడతారు. వాళ్ళతో పోలిక ఒకటి. బతుకు నరకం అయిపోయింది. తొందరగా పెద్దోళ్ళం అయిపోతే ఈ బాధ నుంచి విముక్తి దొరుకుతుంది. 'ఇలా వారం అంతా గడిచిపోతుంది. పొద్దున్నే లేవటం, ట్యూషన్ కి వెళ్ళటం! అక్కడినుండి రాగానే స్కూలు! ఛీ! వెధవ బ్రతుకు ఎన్నాళ్ళు చదవాలో ఏంటో!', అనుకుంటుంటే వారాంతం వచ్చేది. వుండేది ఒక్క రోజు

_శ్రీ కృష్ణ శతకం.!........( 30 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

Image
_శ్రీ కృష్ణ శతకం.!........( 30 /6/15)... (శ్రీ నరసింహ కవి.) . జయమును విజయున కియ్యవె హయముల ములుకోల మోపి యదలించి మహా రయమున రొప్పవె తేరున భయమున రిపుసేన విఱిగి పాఱగ కృష్ణా! . ఓ కృష్ణా! కౌరవసేన, నీ సారథ్యమును చూసి భయపడి పారిపోయేటట్లు నీవు అర్జునునికి రథసారథివై అత్యంత వేగముతో రథమును తోలి విజయము సిద్ధించునట్లు సాయపడితివిగదా! .. దుర్జనౌలగు నృపసంఘము నిర్జింపcగదలcచి నూవు నిఖిలాధారా దుర్జనులను వధియింపను నర్జునునకు నీవు సారధైతివి కృష్ణా! . సమస్త లోకములకు ఆధారభూతుడవైన ఓ కృష్ణా! దుర్జనులైన దుర్మార్గ రాజ సమూహములను నిర్మూలించుటకై, సన్మార్గుడైన అర్జునునకు సారధివైనావు. . శక్రసుతు గాచుకొఱకై చక్రము చేపట్టి భీష్మ జంపఁగ జను నీ విక్రమ మేమని పొగడుదు శక్రగ్రహ సర్వలోకనాయక కృష్ణా! . ఓ కృష్ణా! కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుని ధాటికి ఆగలేక, అర్జునుడు భీతిల్లు సమయములో నీవు చక్రమును చేత ధరించి "భీష్ముని చంపుదు, నిన్నుగాదు విడువుమర్జునా" అని నీవు చూపిన పరాక్రమమును వర్ణించ, మేము ఎంతటి వారము? . దివిజేంద్రసుతుని జంపియు రవిసుతు రక్షించినావు రఘు

ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు - ఆరుద్ర

Image
    ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు - ఆరుద్ర ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో  ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు? ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గార

చందమామ కధ......వెర్రి వెంగళమ్మలు.!

Image
చందమామ కధ......వెర్రి వెంగళమ్మలు.! . అనగనగా ఒక ఊళ్ళో పశువుల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతని భార్య వెంగమ్మ నిజంగానే ఒట్టి వెర్రి వెంగళమ్మ. ఒక రోజున వ్యాపారి ప్రక్క ఊరి సంతకు ప్రయాణం అయ్యాడు. వెళ్తూ వెళ్తూ అతను భార్యతో చెప్పి వెళ్ళాడు- "నేను రెండు రోజుల వరకూ తిరిగి రాను వెంగమ్మా! అయితే రేపు మన దగ్గరున్న మూడు ఆవుల్నీ కొనేందుకు బేరగాళ్ళు వస్తారు. ఒక్కో ఆవూ వంద నాణాల లెక్కన, మూడు ఆవులనూ మూడు వందల నాణాలకి అమ్ము. సరేనా?! వాళ్ళు అంతకంటే తక్కువకి బేరం అడిగితే మటుకు ఏమాత్రం ఒప్పుకోకు. అర్థం అయిందా, నేను చెప్పేది?!” అని. “మీరేం కంగారు పడకండి, ప్రశాంతంగా వెళ్ళి రండి. అదంతా నేను చూసుకుంటాగా!" అంది వెంగమ్మ. “ఏంటోనే, నువ్వు ఎప్పుడూ అలాగే చెప్తావు; కానీ ఏదో రకంగా పిచ్చి పనులు చేసి మోసపోతావు! ఈ విషయంలో ఏమీ తప్పులు జరగకుండా ఉండాలనే ఇంత చెప్తున్నాను- మూడు వందలు ఇస్తేనే ఆవుల్ని ఇవ్వు. అర్థమైందా, ఏమి?! నేను చెప్పేది వింటున్నావా?!” అన్నాడు. “ఆఁ విన్నా, విన్నా!" అన్నదామె, తల ఊపుతూ. వ్యాపారి ప్రయాణమై వెళ్ళిపోయాడు. తర్వాతి రోజున అనుకున్నట్లుగానే బేరగాడు వచ్చాడు. ఆవులను

బాపు ..రమణల కోతికొమ్మచ్చి చదివాక .

Image
బాపు ..రమణల కోతికొమ్మచ్చి చదివాక ..... నా మనసుకు గుబులొచ్చి ... కొమ్మకు రెమ్మొచ్చి ,రెమ్మకు పువ్వొచ్చి .... నాకేదో అనిపించి ...... రాయాలన్న తపన హెచ్చి ... టావుల కొద్ది పేపర్లు చించి .. తెగ రాసి విసుగొచ్చి ... బజ్జొన్న ...నిదరొచ్చి ....!!!!!! మాధవి అన్నాప్రగడ

మగవారూ - ఆడవేషాలూ .!

Image
మగవారూ - ఆడవేషాలూ .! . ఒకసారి 'ద్రౌపది వస్త్రాపహరణం' నాటకానికి వెళ్లాను. దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఒలిచే దృశ్యం. చీరలు ఎంత మట్టుకు లాగాలో దుశ్శాసనుడికి తెలియదు. ఎంతవరకూ లాగించుకోవాలో ద్రౌపదికీ తెలియదు. ఇద్దరూ కూడా చెడ తాగి ఉన్నారు. ద్రౌపది వేషం స్త్రీ వేసి ఉంటే జాగ్రత్త పడి వుండేది. కాని వేషం కట్టినది పురుషుడు కదా! 'వద్దు వద్దు' అని తెరచాటు నుండి కేకలు వేసినా దుశ్శాసనుడు ఆగలేదు - ద్రౌపది ఆపలేదు. చివరికి ద్రౌపది వేషధారికి పైన 'రైక', క్రింద గావంచా మిగిలింది. నెత్తిపైన బోర్లించి న బుట్టలా సవరం ఒకటి! సృష్టికంతకు ఒక్కటే దిష్టిపిడతలా ద్రౌపది మిగిలింది. పుట్టు గుడ్డి వేషం వేస్తున్న ధృతరాష్ట్రుడు కూడా ఆ దృశ్యం చూడలేక ఎవరి సహాయం లేకుండానే తెరచాటుకి పారిపోయాడు. తెర దించబోతే పడలేదు. ద్రౌపదికి నాటకం కాంట్రాక్టరుకి భయం వేసింది కాబోలు కిందకు ఉరికాడు. ద్రౌపది వేషధారి తను ఆడో, మగో మర్చిపోయి పురుషుల వైపుకు పరిగెట్టాలో, స్త్రీల వైపుకు పరిగెట్టాలో అర్థం కాక చివరికి స్త్రీల వైపు పరిగెట్టి వాళ్ల మధ్యన కూచున్నాడు. ఆడవాళ్లంతా తటాలున లేచిపోయి పాక కాలినంత హడావుడి చ

మగవారూ - ఆడవేషాలూ

Image
మగవారూ - ఆడవేషాలూ -కవి శేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావు ఒక మహిళా సంఘంలో ఉపన్యాసం ఇవ్వడానికి ఒకామె రాసుకున్న ప్రసంగ వ్యాసం సాక్షి సంఘానికి చేరింది. మగవాడు మొదటి నుండి మన అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని తెలిసి కూడా అతని పాపాన అతడే పోతాడని ఊరుకున్నాం చాలా కాలం. ఇప్పుడు వాళ్ళకెదురు తిరిగి అన్ని రంగాలలో పైకి వస్తున్నాము కాబట్టి అసూయతో కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు.వారికి సమానం కావాలనే దురాశతో మనం వారిని అనుకరిస్తున్నామని వెక్కిస్తున్నాడు. మనకు అవసరమైనది మనం చేస్తున్నాము కాని తనను అనుకరించే ఉద్దేశ్యం ఎంత మాత్రం లేదని అతనికి ఎందుకు తెలియదు.? తాను మాత్రం ఎవరిని ఇమిటేట్ చేసి యిన్ని వేషాలు తెచ్చుకున్నాడు. తను మనసు కాఫీ కొట్టవచ్చా ? కానీ మనం మాత్రం అతన్ని కాఫీ కొట్టకూడదా ? నాటకాలలో స్త్రీ పాత్రలు మగవాళ్ళు ఎందుకు వెయ్యాలి ?సొగసుగా ఉంటుందని మనం, ముంగురులు ఆ చెంపా ఈ చెంపా..ఒక్కొక్క అంగుళం వెడల్పున కత్తిరించుకుంటే ఎంత అల్లరి పెట్టాడు.అలాంటిది తను మీసాలు పూర్తిగా గొరిగించుకుని నాటకం స్టేజి మీద పోతు పేరంటాలులా నిలబడినప్పుడు మనం చెంపలు వాయిస్తే తప్పేముంది?. రైకకు బొత్తాలు

_శ్రీ కృష్ణ శతకం.!........( 29 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

Image
. _శ్రీ కృష్ణ శతకం.!........( 29 /6/15)... (శ్రీ నరసింహ కవి.) . హా వసుదేవ కుమారక కావుము నా మాన మనుచు కామిని వేడన్ ఆ వనజాక్షికి నిచ్చితి శ్రీ వర! యక్షయ మంటంచు చీరలు కృష్ణా! . దీనజనోద్ధారకా! కృష్ణా! వసుదేవకుమారా! 'నా మానమును కాపాడుము' అని ప్రార్ధించిన ద్రౌపదికి తరిగిపోని చీరలిచ్చి, అభయమిచ్చి కాపాడిన కారుణ్యమూర్తీ, నీకిదే నా నమస్కారములు.

హళేబీడు బేలూర్ .!

Image
హళేబీడు బేలూర్ .! హళేబీడు బేలూర్ రెండుకూడా ఒకదానికొకటి 15 కి. మీ. దూరంలో ఉన్నాయి. ఇక వీటి విషయానికొస్తే.. హళేబీడు అంటే " ప్రాచీన నగరం " అని అర్ధం చెప్పవచ్చు. ఒకప్పుడు హొయసల రాజులు తమ రాచరిక హంగులను ఈ ప్రదేశంలో ప్రదర్శించారు. పురాతనకాలంలో దానిని " ద్వారసముద్రం " అంటే సముద్రానికి ప్రవేశం అనే అర్ధంలో పిలిచేవారు. హళేబీడు కర్నాటక రాజధాని బెంగుళూరుకు 184 కి.మీ. దూరంలో హాసన్ జిల్లాలో ఉంది. సాంస్కృతిక రాజధాని మైసూరు పట్టణానికి 118 కి.మీ. ల దూరంలో ఉంది. హళేబీడు, బేలూరుల మధ్య దూరంలో సు మారు ఇరవెై నిమిషాలు వుంటుంది. కన్నడ భాషలో ‘హళె' అంటే పాత అని అర్థం. బీడు అంటే పట్టణం. హళేబీడు అంటే పాత పట్టణం. ఈ రెండు ప్రదేశాలు హొయసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధ ఉదాహరణలు - తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకే సారి దర్శిస్తూ ఉంటారు. ఈ రెండు ప్రాంతాలని కలిపి " దక్షిణ వారణాసి " గా అభివర్ణిస్తారు చెన్నకేశవ ఆలయం, బేలూర్ బేలూర్ లోని అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం తప్పక సందర్శించదగినడి. ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు.

ప్రతిష్ఠాత్మకంగా గోదావరి పుష్కరాలు..! (కృతజ్ఞతలు ..శ్రీమతిస్వేతావాసుకి.)

Image
. ప్రతిష్ఠాత్మకంగా గోదావరి పుష్కరాలు..! ........... (కృతజ్ఞతలు ..శ్రీమతిస్వేతావాసుకి.) ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రభుత్వాలు గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి. 2015 జూలై 14నుంచి 25వరకు పుష్కరాలు నిర్వహిస్తున్నారు. పుష్కరం అంటే ఏమిటి, పుష్కర సమయంలో దానాలు, పూజలు పుష్కరం అంటే ఏమిటి, స్నానం ఎలా చెయ్యాలి..... స్నానం చేయటం వలన ఫలితమేమిటి వంటి వివరాలు పుష్కర సమయంలో పుష్కర నది నీటిలో అనిర్వచనీయమైన దైవశక్తి నిఘూడమై ఉంటుంది. పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలలో స్నానం చేయటం వలన మనిషికి ఎన్నో ఆయుష్మిక ప్రయోజనాలు లభిస్తాయి. పుష్కర స్నానం చేసేముందు గంగాస్తుతి చదువుకుంటూ, “గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ.. నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు" దోసిళ్ళతో నీళ్ళు తీసుకొని, తలపై మూడుసార్లు పోసుకొని అప్పుడు స్నానం చెయ్యాలి. స్నానం చేయటం వలన ఫలితం ఏమిటంటే - ఒక పుష్కర దినంలో (గోదావరి) స్నానంచేస్తే ప్రతిరోజు ప్రాతఃకాలంలో గంగానదిలో స్నానం చేసిన ఫలాన్ని ఇస్తుంది. గంగ, యమున నదుల సంగమంలో సంవత్సరం పాటు స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. నర్మదా నది ఒడ

బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి .! (వానవల్లప్పలువానవల్లప్పలు.)

Image
బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి .! (వానవల్లప్పలువానవల్లప్పలు.) {(వల్లప్పా! వల్లప్పా! వాన కురుస్తున్న దంటుంది చెల్లెలు. బయటకుపోక చెల్లెలును వాకిట్లోనే ఆడుకోమంటాడు వల్లప్ప. వానలో తిరిగితే కొండమీదినుండి (ఆకాశం నుండి) గుండురాళ్లు (వడగళ్లు) పడి కొక్కిరాయి (అల్లరి పిల్లవాడు) కాలు విరిగింది - కాబట్టి వానలోకి పోవద్దని వల్లప్ప అంటే, కాలు విరిగితే మందు ఏమిటని చెల్లెలు అడుగుతుంది.)} (వేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ నూనెలో మడ్డి - ఇవన్నీ కలిపి, నూటొక్క సారిపిండి (ఆవర్తితతైలము) ఆ తైలమును పూట కొకసారి విరిగిన కాలుకు రాస్తే, కూడు కొంటుందంటాడు వల్లప్ప.) ...... వానా వానా వల్లప్ప! వాకిలి తిరుగూ చెల్లప్ప! కొండమీది గుండురాయి కొక్కిరాయి కాలువిరిగె దానికేమి మందు? వేపాకు పసుపూ, వెల్లుల్లిపాయ, నూనె లోమడ్డి (నూనెమ్మ బొట్టు,) నూటొక్కసారి, పూయవోయి నూరి, పూటకొక్కతూరి.

బంగారిమామ పాటలు [కొనకళ్ల వెంకటరత్నం]

Image
బంగారిమామ పాటలు [కొనకళ్ల వెంకటరత్నం] ............................................ మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినై తబ్బిబ్బయ్యెను నా మనసు తళుక్కుమన్నది నీ సొగసు ఉరుములురిమి నను తరిమికొట్టితే మెరుపుతీగ కొరడా జళిపిస్తే మందవీడిన తువ్వాయికిమల్లే మన సూరక బెంబేలైపోతది మబ్బులు... కొండలోయలో చిక్కని నీడలు గుంపులు గుంపులు నడుస్తవుంటే, గుండెలోతులో నల్లనివరవడి గుట్టుచప్పుడుగ రాశేదెవరో? మబ్బులు... చిటపటమంటా ఎండుటాకులో చినుకొక్కటి వడి చిటిలిరాలితే, కోరికలే గుదిగుచ్చుకొన్న ఒక హారమె తెగినట్లదురు పుడతాది మబ్బులు...

_శ్రీ కృష్ణ శతకం.!........( 27 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

Image
_శ్రీ కృష్ణ శతకం.!........( 27 /6/15)... (శ్రీ నరసింహ కవి.) . అంగన పనుపున ధోవతి కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా సంగతి విని దయనొసఁగితివి రంగుగ సంపదలు లోకరక్షక కృష్ణా! . ఓ కృష్ణా! తన భార్య పంపగా, నీ ప్రియసఖుడు కుచేలుడు నీ దర్శనార్థమై వచ్చి, నీకు ఏ కానుక ఇవ్వలేక, కొంగున ఉన్న అటుకులను ఇవ్వడానికి సిగ్గు పడుతుండగా, నీవు ఆ అటుకులను ఆరగించి, అతని మనస్సును తెలుసుకొని, సంపదలు ఇచ్చి కాపాడితివి. నీ విశాల దృష్టిని ఏమని పొగడగలను కృష్ణా!

చందమామకధ.... డబ్బుకు లోకం దాసోహం.!

Image
...చందమామకధ.... డబ్బుకు లోకం దాసోహం.! సిరిపురంలో రాజా, రంగాలవి పక్కపక్క ఇళ్లు. పక్కపక్క పొలాలూనూ. వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు. ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు. ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు. మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు, నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు. అది ప్రమాదకరమైన జ ంతువులు లేని చిన్న అడవే. అయినా చేతి కర్రలతో అప్రమత్తంగానే ఉన్నారు. ఇంతలో మార్గ మధ్యంలో తళతళ మెరుస్తూ ఒక వజ్రపుటుంగరం రాజా కళ్ల బడింది. ఆశ్చర్యానందాలతో దానిని తీసుకున్నాడు రాజా. మిత్రులిద్దరూ తిరిగి నడవసాగారు. కానీ ఈసారి వారి మధ్య మౌనం రాజ్యమేల సాగింది. ఆ వజ్రం విలువ ఎన్ని లక్షలు ఉంటుందో దానితో తాను ఏ స్థిరాస్తులు సమకూర్చుకోగలడో ఆలోచించసాగాడు రాజా. ఆకస్మికంగా మిత్రుడికి పట్టిన అదృష్టానికి మనసులోనే ఈర్ష్య చెందసాగాడు రంగా. ఆ ఉంగరం తనకు దొరికితే ఎంత బాగుండేదో అని వూహించుకోసాగాడు. మొత్తా

_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(26 /6/15.).

Image
_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(26 /6/15.). . తనువెందాక ధరిత్రినుండు నను నందాకన్మహారోగ దీ పన దు:ఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి, యా వెనుక న్నీ పదపద్మముల్దలంచుచున్విశ్వ ప్రపంచంబుఁ బా సిన చిత్తంబున నుండచేయ గదవే, శ్రీ కాళహస్తీశ్వరా! . ఈశ్వరా! ఈ శరీరం ఎంత వరకు భూమిమీద ఉంటుందో అంతవరకూ రోగాది బాధలు లేకుండా రక్షించి, ఆ పైన వైరాగ్యంతో ఈ ప్రపంచంనే తృణప్రాయంగా భావించు స్థితిలో ఉండేట్లు చేసి నన్ను ఉద్ధరింపుము.

_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(26 /6/15.).

Image
_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(26 /6/15.). . తనువెందాక ధరిత్రినుండు నను నందాకన్మహారోగ దీ పన దు:ఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి, యా వెనుక న్నీ పదపద్మముల్దలంచుచున్విశ్వ ప్రపంచంబుఁ బా సిన చిత్తంబున నుండచేయ గదవే, శ్రీ కాళహస్తీశ్వరా! . ఈశ్వరా! ఈ శరీరం ఎంత వరకు భూమిమీద ఉంటుందో అంతవరకూ రోగాది బాధలు లేకుండా రక్షించి, ఆ పైన వైరాగ్యంతో ఈ ప్రపంచంనే తృణప్రాయంగా భావించు స్థితిలో ఉండేట్లు చేసి నన్ను ఉద్ధరింపుము.

_శ్రీ కృష్ణ శతకం.!........( 26 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

Image
_శ్రీ కృష్ణ శతకం.!........( 26 /6/15)... (శ్రీ నరసింహ కవి.) అష్టమి రోహిణి ప్రొద్దున నష్టమగర్భమున బుట్టి యా దేవకికిన్ దుష్టుని కంసు వధింపవె సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా! . వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం . ఓ పరంథామా! శ్రీకృష్ణా! దేవకీదేవికి ఎనిమిదవ గర్భమున, రోహిణీ నక్షత్రమున, అష్టమి దినమందు జన్మించి, పాపాత్ముడైన నీ మేనమామ కంసుని సంహరించి లోకోద్ధరణ చేయటానికే పుట్టావు కదా! . వాసుదేవుని కొడుకైన, తల్లియైన దేవకీ దేవికి మిక్కిలి ఆనందమును కలిగించిన, కంసుడు, చాణూరుడు వంటి దుష్టులను మట్టుబెట్టినట్టి, జగత్గురువైనట్టి శ్రీకృష్ణుని నమస్కరింతును.

చందమామ కధ...అన్న..గోపాలా .!

Image
                                             చందమామ కధ...అన్న..గోపాలా .! . ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో వుండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. అన్నెం పున్నెం యెరుగని బాలుడు. ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. వూరికి దూరంగా వున్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు. సాయంత్రం చింతతోపు లోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయ పడేవాడు. వేరే పిల్లలంతా తల్లి-తండ్రులతోనో, బళ్ళల్లోనో వచ్చేవారు. ఒక రోజు గోపీ తన తల్లితో అన్నాడు, అమ్మా నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు, నేనేమీ పంచభక్ష్య పరమాన్నాలు అడగటం లేదు. కానీ రోజు చింతతోపు లోంచి రావాలంటే చాలా భయమేస్తుందమ్మా! నువ్వు రోజూ నాకు తోడు రాలేవా?” నాయనా! నీ పేరే గోపీ, గోపాల క్రిష్ణుడి పేరు పెట్టుకున్నాను. ఆయనే నీకు దిక్కు. భగవంతుడే మనకు రక్ష! భయం కలిగినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకో, ఆయనే చూసుకుంటాడు అంతా.” అని ధైర్యం చెప్పింది. ఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపీ. సాయంత్రాలు భయమేసినప్పుడల్లా, అన్నా! గోపాలా!” అని తలుచుకునే