Posts

Showing posts from November, 2016

గోపయ్య నల్లనా.. ఎందువలనా?

Image
                            గోపయ్య నల్లనా.. ఎందువలనా? గోపయ్య నల్లనా.. ఎందువలనా? . "అమ్మా.."  "ఏం కన్నయ్యా!" అని అడిగింది యశోదమ్మ కృష్ణుడిని.  "నాకు కోపమొచ్చింది" "కోపం అంటే ఏంటి, కన్నయ్యా?" "ఏమో! వచ్చింది. అంతే!"  "సరే, వచ్చింది లే!" "ఉహూ, ఎందుకూ? అని అడుగు" "హ్మ్" "హ్మ్మ్ కాదు, "ఎందుకు కన్నయ్యా?" అని అడగాలి" "అడిగాను లే , చెప్పు" "నన్ను నల్ల వాడని అన్న నవ్వాడు." "పోన్లే, అన్నేగా!" "వల్లభుడు కూడా నవ్వాడు. నీలమణీ నవ్వాడు." "నవ్వనీలే నాన్నా. వాళ్ళని తెల్లవాళ్ళని నువ్వూ నవ్వు." "మరి నువ్వూ తెల్లగా ఉంటావూ!" "అయితే!" "అందరూ తెల్లగానే ఉంటారు. నా అంత నల్లగా ఎవరూ ఉండరు."  "నీ అంతవాడివి నువ్వే కన్నా!" "అంటే?" "గొప్పవాడివనీ.." "గొప్ప కాదు నల్లవాడినట." "అయితే ఏం? నీ కళ్ళంత అందమైన కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? నీ జుత్తు చూడు ఎంత నల

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!!

Image
ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!!  ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!!  అని ప్రమాణాలు చేసుకొని ఒకటి అవుతున్నారు… మరి చిన్న చిన్న కారణాలకి ఎందుకు విడాకుల వరకు వెళుతున్నారు…!  నాలుగు గోడల మధ్య ఉండవలసిన భార్యా భర్తల తగాదాలను సర్ది చెప్పే  పెద్దవారితో కాకుండా, అహంకారం కోసం ఆదిపత్యం కోసం ఆజ్యం పోసే వారితో పంచుకొని, వారి సలహలు స్వీకరించి తమ జీవితాలను చేజేతుల నాశనం చేసుకోవడంతో పాటు, మనతోపాటే జీవితం అనుకున్న వారిని దుఖః సాగరంలో ముంచుతున్నారు…  .  ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒకే సమయాన్ని చూపించవు,  అలాగే 100% ఒకే అభిప్రాయాలున్న మనుషులు ఎవరు ఉండరు కాబట్టి ఇద్దరి మద్య బేధాలు సహజం..  .  కాని వాటిని సర్దుకొని పోవడంలోను, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోను, అభిప్రాయాలను, భావాలను మరొకరు గౌరవించుకోవడంలోనే ఆనందంకరమైన  జీవితం ఉంది.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు…  .  కాబట్టి ఒకరు మూర్ఖంగానో కోపంగానో ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండగలిగితే చాలు భార్యా భర్తల జీలితం సజావుగా సాగుతుంది…….

అందుకో జాలని ఆనందమే నీవు... ఎందుకో చేరువై.....దూరమవుతావూ..

Image
అందుకో జాలని ఆనందమే నీవు... ఎందుకో చేరువై.....దూరమవుతావూ..

మొన్నటి దాక అందానికి అందం ....

Image
మొన్నటి దాక అందానికి అందం ....

ఈ బంగారు పాప ఇప్పుడు ఎక్కడుందో ?

Image
ఈ బంగారు పాప ఇప్పుడు ఎక్కడుందో ?

శుభవేళ ... కలవరం.

Image
                                         శుభవేళ ... కలవరం.

అప్పుడు ..... ఇప్పుడు.

Image
అప్పుడు ..... ఇప్పుడు. . పౌరాణికజానపదసామాజిక చిత్రాల్లోనటించిన నర్తకి ఎల్ విజయలక్ష్మి. చాలా చిత్ర్హాల్లో ఎన్టీఆర్ ఎఎన్ఆర్ లసరసన నటించి మెప్పించిన అరుదైననటి. నర్తనశాల ఒక మచ్చుతునక

కాంచన!

Image
కాంచన! కాంచన (వసుంధర)చాలా అందమైన అమ్మాయి .  కాలప్రవాహములో రూపురేఖలు మారిపోయాయి .  అందరమూ అంతే. కొన్నాళ్ళకు రూపమే లేకుండా పోతాము .  నామ రూపాలు లేకుండా  ఏది అయితే మిగులుతుందో అదే నీవు .  అదే ఆత్మ . అదే పరమాత్మ. అంతా భగవంతుని లీల .

తెలుగులో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత?

Image
తెలుగులో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత? . ‘నేను, చెట్టు, కన్ను, మొదలు, మన్ను, అమ్మ, చదువు, నేల, ఆకు’, ఇవి అచ్చమైన, కల్తీలేని తెలుగు పదాలు. ఇక్కడ నాకు ఆనందం కల్గించిన విషయం ఏమిటంటే, ‘అమ్మ’, ఈ పదం సంపూర్ణంగా మనది, మన తెలుగు పదం. కనీసం ‘అమ్మ’పైన ఎవరి ప్రభావం లేదు. కాకపోతే కాలానుగుణంగా ఆ పదం కూడా కల్తీ అయి ‘మమ్మీ’ అయిందన్న బాధ లేకపోలేదు. . ఇక్కడ "అచ్చ తెలుగంటే" ఏమిటి అన్న సందేహం కలుగకపోదు.  సంస్కృత సమానం కాని పదాలను, భాషను అచ్చ తెలుగు అంటారు. ఉదాహరణకు, ‘రాజు’ ఈ పదానికి అచ్చ తెలుగు పదాలు ఏలిక, ఎకిమీడు, దొర, పుడమిఱేడు. అలాగే ‘మేఘం’ – నీరుతాలుపు, మబ్బు, మొగిలు.  మనం రోజువారి తెలుగు అనుకొని ఉపయోగించే అనేక పదాలు సంస్కృత పదాలే.  ఉదాహరణకు, సుఖదుఃఖాలు, కంఠం, రథం, ఆజ్ఞ, శ్రీవారి బ్రహ్మోత్సవాలు. చివరికి తెలుగు డిక్షనరీ, క్షమించాలి, నిఘంటువు లేక పదకోశం ఇవేవి తెలుగు పదాలు కావు, సంస్కృతం.. . అనుకరణ వల్ల కావచ్చు, చమత్కారం కోసం కావచ్చు, ఉచ్చరణా సౌకర్యం కోసం కావచ్చు, వ్యావహారిక అనుకూలత, సద్దుబాటు వల్ల కావచ్చు, అన్యభాషా పదాలు తెలుగు పదాల్లాగే మన భాషలో చెలామణీ అయిపోతు

అంత:సౌందర్యాము !

Image
 అంత:సౌందర్యాము ! అనగనగా ఒక యువరాజు. ఆ రాజు ఎంతసేపూ తన అందాన్ని చూచుకొని మురిసి పోతుండేవాడు; మైమరచి పోతుండేవాడు. ఎవరైనా బాటసారులు రాజభవనానికి వస్తే "మీరెప్పుడైనా నా అంత సౌందర్యవంతుణ్ణి చూశారా?" అని వాళ్ళనడిగేవాడు. అందరూ 'లేదు'అనే చెప్పేవారు. ఒకరోజు దర్శనాని కొచ్చిన ఓ బాట సారైతే "దేవుడు కూడా మీ అంత అందంగా వుంటాడని నేననుకోను...!" అంటూ అతిగా పొగిడాడు. దాంతో పొంగిపోయిన యువరాజు "దేవతల కంటే కూడ నేనే సౌందర్య వంతుడినట.." అంటూ మరింత గొప్పగా చెప్పుకునేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు దేవదూతలమని చెప్పుకునేవాళ్ళు ఇద్దరు అతని దర్శనానికి వచ్చారు. "మీరు చెప్పుకుంటున్నంత సౌందర్యవంతులో..కాదో.. చూద్దామని వచ్చాం" వివరించారు. "ఏమని తేల్చుకున్నారు? నేను అత్యంత సౌందర్యవంతుడినా, కాదా!?" ఉత్సాహంగా అడిగాడు యువరాజు. "మిమ్మల్ని ఈ రోజు ఉదయం నిద్రిస్తుండగా చూశాం. అప్పుడు ఇంకా అందంగా వున్నారు..." ఒక దేవ దూత చెప్పాడు. "నా సౌందర్యం కొన్ని గంటల్లోనే ఎలా తగ్గిపోయింది?" అంటూ సేవకుల్ని పిలిచి "నేను ఉదయం ఇప్పటి క

---శుభోదయం -సూక్తులు------

Image
---శుభోదయం -సూక్తులు------ భక్తి పత్రమొ పుష్పమో ఫలమో తోయ  మో యొసంగక వేలుపు లోసగ రెందు బొంగి పొరలెడి ప్రేమ నొసంగు; వలయు  నన్ని సుఖములు తనుదానె కన్నతల్లి ! పత్రము,పుష్పము, ఫలము,నీరు భక్తితో సమర్పిస్తేనే దేవుడు వరాలిస్తాడట. (అదీ అనుమానమే) ప్రతిఫల మాసింపక మనకు అన్ని సుఖములు,ప్రేమ,వాత్సల్యము యిచ్చేది కన్నతల్లి ఒక్కతే . పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం నృణాం  ధర్మే స్వయ మనుస్టానం కస్య చిత్తు మహాత్మనామ్  . అర్థము:-- పరులకు ఉపదేశము చేయడములో అందరూ మహా పండితులే కానీ స్వయముగా తాము  ధర్మము పాటించడము మాత్రం ఎవరో మహాను భావులు మాత్రమే చేయగలరు. ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే పయః పానం భుజంగానాం కేవలం విష వర్ధనం  తా:-నీచులకు ఉపకారము చేసినా వాళ్ళు మనకు అపకారమే చేస్తారు.ఎలాగయితే పాముకు పాలు పోయడం వలన దానికి విషము వృద్ధి యై మనల్ని కాటువేస్తుందో అలాగ. మాతా పిత్రో ర్నిత్యం ప్రియం కుర్యాత్  ఆచార్యస్య చ సర్వదా  తేషు హి త్రిషు తృప్తేషు  తపస్సర్వ సమాప్యతే  . అర్థము:-- తల్లి తండ్రులతో, గురువులతో ఎప్పుడూ ప్రియముగా మాట్లాడ వలయును. వారు చెప్పినట్టు నడుచుకొని వారికి సంతోష
Image
అంతు చిక్కని ప్రశ్న ! . నిన్నటి రాత్రి నేటి రాత్రి ఒక్కటి కాదు నిన్నటి వెన్నెల ఇవాళ్టి వెన్నెల వేరు వేరు మధ్యలో నలిగే ఈ కాలం గొడవేమిటి ???????????? గుండ్రని భూమికి ధిశలేందుకు మారుతున్నాయి ?????? ఎటు వెళ్ళినా నేను వెనక్కే ఎందుకు వెళుతున్నాను ?????? జీవితాన్ని ఇటు నుంచి అటూ, అటు నుంచి ఇటూ జీవిస్తున్నా కూడా,  తేడా లేదెందుకు ???????????

" కన్యాశుల్కం".!

Image
" కన్యాశుల్కం".! హాస్యభరిత శైలిలో సాంఘిక దురాచారాలను దునుమాడిన నాటకం" కన్యాశుల్కం". . ఆధునిక గద్య రచనకీ ప్రారంభకుడూ, ప్రవక్తా గురజాడ అప్పారావు. ఎన్నెన్నో సాహిత్య రంగాలలో ఆయన కొత్త మార్గాలు తెరచి కొత్త ప్రక్రియలు అవలంబించారు. ప్రత్యేకంగా వచన రచనలో ఆయన వాడుక భాషను స్వీకరించి దానిని మహోన్నతమైన సాహిత్య స్థాయికి తీసుకు వెళ్ళాడు. గురజాడ చేపట్టక పూర్వం,  ఆయన మాటల్లోనే... "గ్రామ్య భాష దిక్కుమాలిన స్త్రీ... ఆమెను పండితులు నిష్కారణంగా దూషించి అవమానించగా కనికరించి ఫీజు లేకుండా వకాల్తా పట్టితిని"... అన్నాడు గురజాడ. . ఈనాడు వాడుక భాష దిక్కుమాలినది కాదు. గుడిసెల్లో పుట్టి పెరిగి, స్వయంప్రతిభతో కళాశిఖరాలందుకున్న నటీమణీతోనో, స్వల్ప ప్రారంభాల నుంచి బైటపడి, స్వయంకృషితో చదువులన్నీ నేర్చి, పార్లమెంటు భవనాల నలంకరించే విదుషీమణితోనో నేటి వ్యావహారిక భాషను సరిపోల్చవలసి ఉంటుంది. వాడుక భాషకు ఏ ఒక్కరైనా ఇంత గౌరవం సాధించారంటే అతడు గురజాడ అప్పారావనే చెప్పాలి. . మన దేశభాషలన్నింటిలోనూ, పూర్తిగా వచనంతో, అందులోకి పాత్రోచితమైన వ్యావహారిక శైలిలో మొట్టమొదటి నాటకం రాసిం

అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.'

Image
అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.' శ్రీ Ranga Rao Peyyeti గారు.! . అమ్మకాల ఆసామీ పిలుపుగంట నొక్కేసరికి పేరిందేవి తలుపు తీసింది. ' అమ్మా! ఇది చాలా మంచి నిఘంటువు. ఏ తెలుగు పదానికి ఆంగ్లపదం కావాలన్నా ఇందులో దొరుకుతుంది. మీకు ప్రత్యేకమైన తగ్గింపు ధరలో ఇస్తాను. తీసుకోండమ్మా.' పేరిందేవి విసుగ్గా అంది, ' మా ఇంట్లో నిఘంటువు వుందయ్యా. అదుగో, ఆ బల్ల మీద వుంది చూడు.' ' అమ్మా! అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.' పేరిందేవి ఆశ్చర్యంగా అడిగింది, ' ఇంత దూరం నించి అది ఏ పుస్తకమో కనబడదుగా! అది భగవద్గీత అని నీకెల్లా తెలిసింది?' ' చాలా దుమ్ము కొట్టుకుని వుండిపోయింది కదమ్మా? ఎప్పుడు తెరవకుండా వున్నారంటే అది భగవద్గీతే అనుకున్నానమ్మా.' ( నేను చిన్నప్పుడు ఆకాశవాణిలో ఒక పాట విన్నాను. ' పుట్టినావీ భరతఖండాన, చేత పట్టావ నువు గీత ఎపుడైన?')

పూలమ్మి పాట.

Image
శుభోదయం ! (పూలమ్మి పాట.) బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో.. నీ బిడ్డ పేరేమీ ఉయ్యాలో నీ బిడ్డ నీళ్ల గౌరి ఉయ్యాలో.. నీ బిడ్డ నీళ్లు పోసే ఉయ్యాలో నిత్యం నీళ్లు పోసి ఉయ్యాలో.. నిత్యమల్లె చెట్టేసే ఉయ్యాలో నిత్యమల్లె చెట్టూకు ఉయ్యాలో.. ఏడే మొగ్గలు ఉయ్యాలో ఏడు మొగ్గలకు ఉయ్యాలో.. ఏడు విత్తుల పత్తి ఉయ్యాలో ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో.. సాలోనికిస్తే ఉయ్యాలో సాలోడు నేసేనే ఉయ్యాలో.. నెలకొక్కపోగు ఉయ్యాలో దిగెనే ఆ చీర ఉయ్యాలో.. దివిటీల ఆ చీర ఉయ్యాలో...

Kanyasulkam songs - Aanandham Arunavamaithe - Savitri,Susheela

Image
అద్వైతం.! (మహా కవి శ్రీ శ్రీ) (కన్యాశుల్కం సినిమాలో .. మహానటి సావిత్రి అద్బుత నాట్యం.) . ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు తంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం. . నీ కంకణ నిక్వాణం_లో, నా జీవన నిర్వాణం_లో నీ మదిలో డోలలు తూగీ, నా హృదిలో జ్వాలలు రేగీ నీ తలపున రేకులు పూస్తే, నా వలపున బాకులు దూస్తే మరణానికి ప్రాణం పోస్తాం, స్వర్గానికి నిచ్చెన వేస్తాం . హసనానికి రాణివి నీవై వ్యసనానికి బానిస నేనై విషమించిన మదీయ ఖేదం కుసుమించిన త్వదీయ మోదం విషవాయువులై ప్రసరిస్తే, విరితేనియలై ప్రవహిస్తే ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం . వాసంత సమీరం నీవై, హేమంత తుషారం నేనై నీ ఎగిరిన జీవవిహంగం నా పగిలిన మరణమృదంగం చిగురించిన తోటలలోనో, చితులించిన చోటులలోనో వలయములై చలించినపుడే, విలయములై జ్వలించినపుడే కాలానికి కళ్ళెం వేస్తాం, ప్రేమానికి గొళ్ళెం తీస్తాం. . నీ మోవికి కావిని నేనై, నా భావికి దేవివి నీవై నీ కంకణ నిక్వాణం_లో నా జీవన నిర్వాణం_లో ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం . (A.C.Swinburne తన రచనలలో, ముఖ్యంగా A Match అనే  గీతంలో చూపిన మార్గానికి

Emani Pogadudume

Image
చెలి చక్కదనము ! ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము యీమేటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె అరచంద్రుడుఁ జకోరాలద్దాలు సంపెగయు ధర శింగిణులు శ్రీలు తలిరులును అరుదుగాఁ దుమ్మిదలు నందముగా గూడగాను మరుతల్లి యలమేలుమంగమోమై నిలిచె బిసములు శంఖమును పెనుచక్రవాకములా కసము నీలపుఁజేరు కరికుంభాలు పొసగ వివెల్లా నొక పోడిమై నిలువగాను మసలక అలమేలుమంగ మేనై నిలిచె అనటులంపపొదులు నబ్జములు ముత్తేలు వొనరి వరుసఁ గూడి వుండగాను ఘనుడైన శ్రీవేంకటేశునురముమీద పనుపడలలమేల్మంగ పాదములై నిలిచె

చందమామ రావే - జాబిల్లి రావే!

Image
చందమామ రావే - జాబిల్లి రావే! చందమామ రావే - జాబిల్లి రావే!  కొండెక్కి రావే - గోగు పూలు తేవే!  బండిమీద రావే - బంతి పూలు తేవే!  పల్లకిలో రావే - పంచదార తేవే!  సైకిలేక్కి రావే - చాక్లెట్లు తేవే!  పడవమీద రావే - పట్టుతేనే తేవే!  పెందలాడే రావే - పాలు పెరుగుతేవే!  మంచి మనసుతో రావే - ముద్దులిచ్చిపోవే!  అన్నియునుతేవే - మా అబ్బాయికీయవే

అన్నమాచార్య కీర్తన!

Image
అన్నమాచార్య కీర్తనలు ఈ పాదమే కదా యిల యెల్ల( గొలిచినది యీ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది !!పల్లవి!! ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది యీ పాదమే కదా యీ గగన గంగ పుట్టినది యీ పాదమే కదా యెలమి( బెంపొందినది యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది !!ఈ పా!! యీ పాదమే కదా యిభరాజు దల(చినది యీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది యీ పాదమే కదా బ్రహ్మ కడిగినది యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది !!ఈ పా!! యీ పాదమే కదా యిహపరము లొసగెడిది యీ పాదమే కదా యిల నహల్యకు( గోరికైనది యీ పాదమే కదా యీక్షింప దుర్లభము యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది !!ఈ పా!! బ్రహ్మ కడిగిన –పాదము బ్రహ్మము దానె నీ పాదము !!పల్లవి!! 1.చెలగి వసుధ గొలి చిన నీ పాదము బలితలమోపిన పాదము తల(కక గగనము దన్నిన పాదము బలరిపు(గాచిన పాదము !! బ్రహ్మ!! 2.కామిని పాపము గడిగిన పాదము పాము తలనిడిన పాదము ప్రేమపు శ్రీపతి పిసికెడి పాదము పామిడి తురగపు( బాదము !!బ్రహ్మ!! 3.పరమ యోగులకు( బరిపరి విధముల పరమొస(గెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము

. కృష్ణా!

Image
క. అల్ల జగన్నాథుకు వ్రే పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్ గొల్లసతి యా యశోదయు దల్లియునై చన్నుగుడిపె( దనరగ కృష్ణా.! . తా. కృష్ణా!  జగన్నాథుడవైన నీకు వ్రేపల్లె ఆటస్థలమయ్యెను.  గొల్లసతియగు యశోద తల్లియై పాలిచ్చెను. వ్రేపల్లె ధన్యమయ్యెను. యశోద ధన్యురాలయ్యెను.

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ

Image
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ  .  సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు .  శేష సాయికి మ్రొక్కు శిరము శిరము .  విష్ణునాకర్ణించు వీనులు వీనులు .  దేవదేవుని చింతించు దినము దినము .  మధువైరి దవిలిన మనము మనము .  భగవంతు వలగొను పదములు పదములు .  పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి ”

పిల్లగాలికి ఎంత గర్వమో !

Image
పిల్లగాలికి ఎంత గర్వమో !  చెలి కురులను తాకుతోందని ll .  (ఈ ఫోటోలో పిల్లగాలి తగిలిన గర్వం ఎవరికంటే  రెండు కళ్ళూ నెమలికళ్ళను చేసుకు చూస్తున్న ఓయదు ఓయరు.)

“జంతూనాం నరజన్మ దుర్లభం“

Image
“జంతూనాం నరజన్మ దుర్లభం“  అని… అంటే జీవరాసులలోఅన్నిటికంటే మనిషిగా జన్మించడం దుర్లభమని పెద్దలు చెప్తూంటారు

Balamuralikrishna-sthiratha-nahi-nahi-re-Amruthavarshini

Image
నా మనసు లో మా ట శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో చక్కగా వివరించారు బాల మురళీకృష్ణ గారు . . స్థిరతా నహి నహి రే , మానస —స్థిరతా నహి నహి రే || . తాపత్రయ సాగర మగ్నానాం —దర్పాహన్కార విలగ్నానాం || . –విషయ పాశ వేష్టిత చిత్తానాం –విపరీత జ్ఞాన విమత్తానాం || . –పరమ హంస యోగ విరుద్దానాం —బహు చంచలతర సుఖ సిద్ధానాం || . భావం ——ఈ కీర్తన లో మనసుకు స్థిరత్వం అనేది లేదు అని రూధిగా తెలియ జేశారు .ఎవరికి లేదు ?అని విచారించారు . ”మనసా !తాపత్ర్యాలలో మునిగిన వారికి ,అహంకార దర్పాన్ని పట్టుకొని వ్రేలాడే వారికి ,విషయ వాంచలు అనే తాళ్ళతో బద్ధులైన మనసు కల వారికి ,చంచల మైన సుఖాల కోసం అర్రులు చాచే వారికి ఎన్నడు మనశ్శాంతి లభించదు ”అని నిర్ద్వందంగా చెప్పారు .

జీవితమే సఫలము (అనార్కలి)

Image
జీవితమే సఫలము (అనార్కలి) ఈ జీవితమే సఫలము రాగ సుధా భరితమూ ప్రేమ కధా మధురము జీవితమే సఫలము హాయిగా తీయగా ఆలపించు పాటలా అనారు పూల తోటలా ఆశ దెలుపు ఆటలా జీవితమే సఫలము వసంత మధుర సీమలా ప్రశాంత సంజ వేళలా అంతులేని వింతలా అనంతప్రేమ ప్రేమ లీలగా పరించు భాగ్యశీలలా తరించు ప్రేమ జీవులా జీవితమే సఫలము

ప్రాభాతి.!............(కరుణశ్రీ.)

Image
ప్రాభాతి.!............(కరుణశ్రీ.) . రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్ ప్రోగులు వోయగా నిదురపోవు దయామయి! నా యెడందలో ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెతో దాగుడు మూత లాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా!

మంచి వేదాంతం..

Image
మంచి వేదాంతం.....మన దాకా వచ్చేదాకా తెలియదు! . ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఓ...ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అగ్నిపరీక్షకే నిల్చిన సాథ్విని అనుమానించుట న్యాయమా?? అల్పుని మాటయే జనవాక్యమ్మని అల్పుని మాటయే జనవాక్యమ్మని అనుసరించుటే ధర్మమా?? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు... ఎవరూహించెదరు

తమ్ముళ్ళు అందరు లక్ష్మనులే ... ఉర్మిలలుఉరు కున్నత వరకే...

Image
           తమ్ముళ్ళు అందరు లక్ష్మనులే ...ఉర్మిలలుఉరు కున్నత వరకే.!

*ధర్మం చేయండి బాబు*

Image
*ధర్మం చేయండి బాబు* ------------------------------ ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువుకొనేందుకు అవసరమైన డబ్బులు కూడా ఉండేవి కావు వాడి దగ్గర. అందుకని వాడు ఇల్లిల్లూ తిరిగి, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులను అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో చదువుకొనేవాడు. ఒకరోజున, అలా అమ్మకానికి పోయినప్పుడు, అతనికి బాగా ఆకలి వేసింది. ఎండ విపరీతంగా ఉన్నది; నీరసంగా ఉంది; ఇక తిరగలేని పరిస్థితి. చేతిలో ఒక్క రూపాయి మాత్రమే ఉంది. ఏంచేయాలి? 'అక్కడున్న ఇంటి తలుపుతట్టి, కొంచెం అన్నం పెట్టమని అడుగుదాం' అనుకున్నాడు అతను. వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు- అయితే ఓ చక్కని యువతి ఇంటి తలుపు తెరిచేసరికి, వాడికి ఇక ఏమి అడగాలో తోచలేదు- "ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా?" అని మాత్రం అడగ గల్గాడు.అయితే, పిల్లవాడి ముఖం‌ చూస్తే, 'వాడికి ఆకలిగా ఉంది' అని ఎవరైనా కనుక్కోగలరు. అందుకని ఆమె మంచినీళ్లకు బదులు, వాడికి ఒక పెద్ద గ్లాసెడు పాలు తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లవాడికి ప్రాణం లేచివచ్చినట్లైంది. సంతోషంగా గ్లాసెడు పాలూ త్రాగేశాడు- త్రాగేశాక మళ్ళీ గుర్తుకొచ్చింది- 

నేమి సేతును గురుడా ?

Image
కొల్లగ రూకలు గైకొని చల్లగ చీకట్ల దాచ చాతుర్యముతో, " నల్ల " యని నవ్వి మోదీ చెల్లక తాఁ జేసె ! నేమి సేతును గురుడా ? 😹 (ఒక అజ్ఞాత మహా కవి మనకు పంపిన పద్యం.)

ఇంకా చావని మానవత్వం.!

Image
Raghavanand Mudumba గారి ఇంకా చావని మానవత్వం.! . ఇంటికి వెడుతున్నా నడుచుకుంటూ  . దారిలో ఒక కరంటు స్థంభానికి ఒక కాగితం కట్టి ఉంది .  . "దయచేసి చదవండి " అని రాసి ఉంది . ఖాళీ గానే ఉన్నాను కదా అని దగ్గరకు వెళ్లి చూశాను .  . . " ఈ రోడ్డులో నేను నిన్న ఒక 50 రూపాయల నోటు పారేసుకున్నాను . నాకు కళ్ళు సరిగా కనబడవు . మీకు దొరికితే దయచేసి ఈ ఎడ్రెస్ దగ్గరకు తెఛ్చి ఇవ్వగలరు, దయచేసి ఈ సహాయం చెయ్యండి " అని రాసి ఉంది . . . నాకు ఎందుకో ఆ ఎడ్రెస్ ఉన్న చోటుకు వెళ్ళాలి అనిపించింది . అడ్రెస్ గుర్తుపెట్టుకున్నాను . . అది ఆ వీధి చివరన ఉన్న ఒక పూరి పాక . దగ్గరకు వెళ్లి పిలిస్తే పాక లో నుండి ఒక వృధ్ధురాలు వచ్చింది . ఆమె కు కళ్ళు సరిగా కనబడటం లేదు .ఆ పాకలో ఆమె ఒక్కర్తే ఉంటోంది అని అర్ధం అయ్యింది . చేతి కర్ర సహాయం తో తడుము కుంటూ బయటకు వచ్చింది  . . "ఏమీ లేదమ్మా ! నువ్వు పోగొట్టుకున్న 50 రూపాయల నోటు నాకు కనబడింది . అది ఇఛ్చి పోదామని వచ్చాను " అన్నాను  . . . ఆమె ఏడుస్తోంది .  . "బాబూ ! ఇప్పటికి ఇలా దాదాపు 50-60 మంది వఛ్చి ఒక్కొక

పెళ్లి అయిన కొత్తలో..

Image
పెళ్లి అయిన కొత్తలో..మీ పిన్ని (అంటే నా శ్రీమతి.) . మా పెళ్లి అయిన కొత్తలో ఒక రోజు మా అత్తగారు నన్ను ప్రక్కకి పిలిచి ఒక కాగితం ఇచ్చారు. అందులో ఈ గేయం ఉంది.  . పాపాయి కన్నులు కలువ రేకుల్లు పాపాయి జుంపాలు పట్టు కుచ్చులు పాపాయి దంతాలు మంచి ముత్యాలు . నాకు ఏమి అర్ధం కాలేదు. మీ ఆవిడ ఏడుపు మొదలు పెడితే ఒక పట్టాన ఆపదు. చిన్నప్పుడు ఏడుపు మొదలు పెట్టగానే నేను ఇది పాడేదాన్ని. అంతే ఏడుపు మానేసింది అని చెప్పారు. మీ పిన్ని కాపరానికి వచ్చిన వారం రోజులకి వాళ్ళ అమ్మ మీద బెంగ పడింది. నాకేమో సెలవు లేదు.ఆ మాట అన్నాను అని ఏడ్చేసింది.నాకు చాలా ఖంగారుగా అనిపించింది.ఏం చేయాలో అర్ధం కాక వెంటనే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన కాగితం తీసుకుని ఉండుండు ఏడవకు అని గబా గబా ఆ గేయం చదివేసాను. ఇక మీ పిన్ని అటు సంతోషం, ఇటు ఆశ్చర్యం ,మళ్లి అంతలోనే దిగులు.. కాసేపటికి మామూలు మనిషి అయ్యింది." మా అమ్మలా పాడలేదు మీరు ఊరికే పాఠం అప్పచెప్పినట్టు చెప్పారు "అని పోట్లాట మొదలు పెట్టింది. సరే మీ పిన్ని బాధ కన్నా పోట్లాట మంచిది అనిపించి నేను కూడా "పోనిలే అని పాడితే వంకలు పెడతావ ?"అని అన్నాన

ఉన్నదొక్కటే. .

Image
ఉన్నదొక్కటే. . (శ్రీ ములుకుట్ల సుబ్ర్హమన్య శర్మ గారు.) ఉన్నది ఒక్కటే, లేనేలేదు రెండవది  నీలోనా, నాలోనా మన అందరిలోనా ఉన్నదొక్కటే  నీటిలో,నింగిలో,గాలిలో,అగ్గిలో,భూమిలో  అంతటా వ్యాపించి ఉన్నదొక్కటే "నేను, నేనని" నీవనుచున్నావు, అదే నేనూ అనుచున్నాను  అందరిలోనా వున్న ఈ నేనెవరన్నదే వేదాంతం  ఈ దేహేంద్రియములు, ప్రాణముకూడా కాదు "నేను"  గుండెగుహలో చిరుజ్యోతిగా వెలిగెడి ఆత్మయే "నేను" ఆజ్యోతివెలుగులో వెలుగొందు నీజగము  కనుమూసినంతనే కరగునీ జగము  కట్టకడపటి వరకూరకుండెడివేల  కదలిరా! తెలుసుకో! నీయాత్మ జ్ఞానంబిదే. మాయలో కప్పబడినారు మానవులందరు  ఆ మాయ యను చీకటిని పారద్రోలెడి ప్రజ్ఞ  కలవాడీ ప్రాణికోటిలో నీమానవుడొక్కడే  ఉదయింపచేయు మాజ్ఞానభాస్కరు నీజన్మలోనే జనన మరణ చక్ర భ్రమణ మాగదీజగంబున  ఆప శక్యంబు కాదీ యవనిలో నెవరికీ  మరుజన్మమేమొచ్చొ మనచేతిలో లేదు  సాధించు జన్మరాహిత్య మీజన్మలోనే.

‘మనసా రా’

Image
నేను మనసారా దుకాణాలకి వెళ్ళి ‘మనసా రా’ అని కవ్వించే సారా తెచ్చుకోను, మనీ కోల్పోను. . ఏదో ఇలా ఎదుటవాడు మన పర్సు కత్తిరించక పోస్తుంటే నోరెళ్ళబెట్టుకోవడమే. :అది కూడా ఎందుకూ? మంచినీళ్ళో, ఆ రేంజ్ ని దాటి ఆరెంజ్ జూసో అందుకుంటే పోలా? నాకు కొందరు సినీ హీరో హీరోయిన్ల మీద తెగ జాలి. కొందరు  ఏదో సరదాగా మిత్రుల బలవంతం వల్ల అలవాటు చేసుకునీ, మరికొందరు అణచుకున్న  అవమాన భారం నుంచి తేలిక కావాలనుకునీ ఆ ద్రవం ఉపద్రవం చేసేంతవరకూ  రోజుల తరబడి క్షార గరళం మింగుతూ నిక్షేపం లాంటి నట జీవితాన్ని  వృధా చేసుకున్నారు,కుంటారు. మామూలు మనుషుల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఇదిగో ఇలా కాస్తో కూస్తో నటనలోనూ, ఇతర ప్రజా ర్రంగాల్లోనూ పేరు సంపాయించుకునేవారు అలా బలి కావడం న్యాయమా?

తెలుగు నాటకాలలో హాస్యం !

Image
తెలుగు నాటకాలలో హాస్యం ! . 1880కు పూర్వం మన ఆంధ్రదేశంలో రంగస్థల ప్రదర్శనలు లేవు. అప్పట్లో ధార్వాడ్ వారు వచ్చి, తాత్కాలిక నాటక శాలలు కట్టి, అందులో హిందీ, మరాఠీ నాటకాలు ఆడేవారు. ఒకసారి రాజమహేంద్రవరలో వాళ్ళు నాటక ప్రదర్శనలు ఇచ్చి వెళ్ళిపోయాక వాళ్ళు వదిలిన పాకలలో "కందుకూరి వీరేశలింగంపంతులు" గారు వారు రచించిన" చమత్కార రత్నావళి "అనే నాటికను ప్రదర్శించారు. ఇదే తెలుగు నాట ఆడబడిన తొలి నాటిక. ఇది హాస్య నాటిక కావడం గమనార్హం. ఇది షేక్స్పియరు "కామెడీ ఆఫ్ ఎర్రర్స"కు అనుసరణ. ఈ ప్రదర్శనకు చాలామంది ప్రేక్షక్కులు వచ్చి, చూచి ఆనందించారు. బ్రహ్మవివాహ విషయంలో కామయ్య తన రెండేళ్ళ వయస్సు కుమార్తెను ముసలి వాడికి పన్నెండువందల రూపాయల కన్యాశుల్కం పుచ్చుకొని పెళ్ళి చేస్తాడు. అయితే పెళ్ళికి ముందుగా వూరి పెద్దలను తను ఇలా కన్యాశుల్కం పుచ్చుకోవడం తప్పా అని అడిగితే ఒక శాస్త్రులు గారు ఏవేవో శ్లొకాలు కల్పించి, ఉదాహరణగా చెప్పి కన్యా కన్నా రెండింతలెత్తు ధనం పుచ్చుకొని పెళ్ళి చేస్తే కోటి యోగాల ఫలితం దక్కుతుందని సమర్ధిస్తారు. కోర్టులో జరిగే అన్యాయాలను బహిర్గతం చెయ్యడమే వ్యవహార బో

శివ ధ్యాన శ్లోకాలు !....(11) .

Image
శివ ధ్యాన శ్లోకాలు !....(11) . .:రూపయౌవనసంపన్నా మూర్తేవ వనదేవతా పుష్పితాశోకపున్నాగ సహకారశిశూపమః || పంచవింశతి నక్షత్రో మయూరకృతశేఖరః అకలజ్ఞ్కశరచ్చంద్రపూర్ణబింబసమాననః || ప్రాన్తే బద్ధకపర్దాన్తో వసానశ్చర్మ కోమలమ్ సవ్యాపసవ్య విధృతకృతమాల విభూషితః || ధారాకదంబపుంజేన నాభిదేశప్రలంబినా అజజ్ఞ్ఘప్రేక్షణీయేన ప్రేక్షణీయో2పి శత్రుభిః || భార్యాస్య చారుసర్వాంగీ వన్యాలంకారభూషితా ఆదర్శ మూర్తిశ్శోభానాం వన్యానామివ నిర్మలా || . తస్యా హస్తే ధనుర్దత్వా శరమేకం చ నిర్మలమ్ ద్వితీయమంసమాలామ్బ్యశిష్టం వామేన బాహునా || . సుగన్ధి పుష్పస్తబకమాఘ్రాయాఘ్రాయ పాణినా వీజ్యమానో మన్దమన్దం నవపల్లవశాఖయా || . సమావృతో బాలకైశ్చ శ్వభిశ్చాపి మనోహరైః గచ్చద్బిరగ్రతో దృప్తైర్ధ్యాతవ్యో జగతాం గురుః || . . ఏవంభూతో మహాతేజాః కిరాతవపురీశ్వరః . ఆకారము వహించిన రూపయౌవన సంపన్నమగు వనదేవతయో అనదగినవాడును, పుష్పితములగు అశోకపున్నాగసహకారముల గున్నలవలే నున్నవాడును, ఇరువదిఏండ్లవయస్సుకలవాడును, నెమలిపింఛం శిరము నందు దాల్చినవాడును, కలంకములేని శరత్కాలచంద్రుని నిండుబింబము పోలు బింబము గలవాడు, ఒకపక్కకు ముడవబడి

శివ ధ్యాన శ్లోకాలు !....(12)

Image
శివ ధ్యాన శ్లోకాలు !....(12) .  భస్మోద్భాసితసర్వాంగం జటామండలమండితమ్ ధ్యాయేత్త్ర్యక్షం వృషారూఢం గణేశ్వరయుతం హరమ్" .  విభూతిచే ప్రకాశించునట్టి యెల్లావయవములు గలవాడును,  జటాసమూహముచే అలంకరింపబడినవాడును, మూడుకన్నులు కలవాడును, గణనాథునితో కూడిన వాడును, వృషభమును ఆరోహించినవాడు అగు హరుని ధ్యానించుచున్నాను.

సీత గడియ! (:ఆచార్య వెల్చేరు నారాయణరావుగారు.)

Image
సీత గడియ! (:ఆచార్య వెల్చేరు నారాయణరావుగారు.) . "శ్రీరామ. భూసతికి చేడెయై పుట్టీ కూర్మితో జనకునీ కూతురై పెరిగీ" . ఈ పాట పేరు సీత గడియ అని ఉండడం ఒక విశేషం. నిజానికిది రాముడు పెట్టిన గడియ. అంచేత రాము(డి) గడియ అవాలి. కాని సీత గడియ అని ఈ పాటకి పేరు పెట్టడంలో ఒక చమత్కారం ఉంది. గడియ పెట్టినవాడు రాముడైతే కావచ్చు గానీ అది తీయించింది సీత. ఆ గడియ తీయించడంలో సీత చూపించిన నేర్పు ఈ పాటలో ప్రధాన విషయం. అందుకని ఇది సీత తీయించిన గడియ. ఆ ప్రకారంగా ఇది సీత గడియ. తేలిగ్గా కనిపించే ఈ పాటలో బలమైన నిర్మాణదక్షత ఉంది; ప్రతిభావంతమైన భావనాశక్తి ఉంది. మాటని జాగ్రత్తగా, పొదుపుగా వాడే ప్రత్యేకత ఉంది. అంతకు మించి తన నైపుణ్యంతో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ, సమిష్టి కుటుంబంలో నిబ్బరంగా మెలగగల స్త్రీ ప్రత్యేకతని సున్నితంగా చిత్రించిన నేర్పు ఉంది. జాజులు తలదాల్చి జవ్వాది యలది వేచియు తానుండి వేడుకను విభుడు అప్పుడు మొగవాళ్లు తలలో పువ్వులు పెట్టుకునే వాళ్ళు. అయినా ఇక్కడ ఆ సంగతి ప్రత్యేకించి చెప్పినప్పుడు రాముణ్ణి ప్రబంధనాయిక అయిన వాసకసజ్జికకి మొగ రూపంగా కవయిత్రి ఊహించిందని ఒక్క క్షణం ఆ

శివ ధ్యాన శ్లోకాలు !....(10)

Image
శివ ధ్యాన శ్లోకాలు !....(10) .  "ముక్తాలంకృతసర్వాంగమిన్దుగంగాధరం హరమ్, ధ్యాయేత్కల్పతరోన్మూలే సమాసీనం సహోమయా". .  ముత్యములచే అలంకరింపబడిన సర్వావయములనుకలవాడు,  చంద్రుని గంగను ధరించినవాడును, ఉమతోకూడ కల్పవృక్షము క్రింద కూర్చుండినవాడును అగు హరుని ధ్యానించుచున్నాను. . దేవత: రుద్రుడు .  ఋషి: మండూకుడు

గయోపాఖ్యానం!

Image
గయోపాఖ్యానంలో అర్జుడు పెట్టిన ఒట్టు పద్యం జనాలకి చిర పరిచితమే ..  నదిలో అర్ఘ్య ప్రదానం చేస్తున్న శ్రీకృష్ణుని చేతిలో గయుని నిష్ఠీవనం  ( ఉమ్మి ) పడింది! కృష్ణుడు ఆగ్రహంతో ఊగి పోయి, గయుని వధిస్తానని శపధం చేసాడు. గయుడు పరువెత్తి పోయ అర్జునుని శరణు వేడాడు.  అప్పుడు అర్జునుడు ఒట్టు పెట్టి మరీ అతనికి అభయ మిచ్చాడు. "నిటలాక్షుండిపు డెత్తి వచ్చినను రానీ !యన్నదమ్ముల్నను న్విటతాటంబున బాసి పోయినను పోనీ ! కృష్ణఁడే వ చ్చి, ‘వ ద్దిటు పార్ధా ! ’యననీ !మఱేమయిన గానీ, లోకముల్బెగిలం బటు దర్పంబున నిల్చి యీ గయుని ప్రాణంబేను రక్షించెదన్ ! ‘ . అర్ధం.. . ‘ ఆశివుడే నామీద దండెత్తి రానీ ! అన్నదమ్ములు నా మీద కినుకతో నన్ను విడిచి పోతే పోనీ ! సాక్షాత్తు శ్రీకృష్ణడే వచ్చి, ‘‘అర్జునా ! వద్దు గయుని కాపాడ వద్దు ’ ’ అననీ !ఇంకేమయినా కానీ, లోకాలు అదిరిపోయేలాగున నిలబడతాను. ఈ గయుని కాపాడుతాను ! ’’

పోతన - శ్రీమద్భాగవతం !

Image
పోతన - శ్రీమద్భాగవతం ! . భూషణములు వాణికి నఘ పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ త్తోషణములు గల్యాణవి శేషణములు హరిగుణోపచితభాషణముల్! . పదవిభాగం:  భూషణములు, వాణికిని, అఘ, పేషణములు, మృత్యు, చిత్త, భీషణములు, హృత్తోషణములు, కల్యాణ, విశేషణములు, హరిగుణోపచిత, భాషణముల్. . భావం: విష్ణుమూర్తిని వర్ణిస్తూ, ఆయనలో ఉన్న సుగుణాలను కీర్తిస్తూ పలికే పలుకులు  సరస్వతీదేవికి అలంకారం అవుతాయి. అంతేకాదు సకల పాపాలను పోగొడతాయి. మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మృత్యువును నివారిస్తాయి. శుభాలు కలుగచేస్తాయి.

"కార్యేషు దాసీ కరణేషు మంత్రీ !

Image
"కార్యేషు దాసీ కరణేషు మంత్రీ ! .  "కార్యేషు దాసీ కరణేషు మంత్రీ...భోజ్యేషు మాతా శయనేషు రంభా. .అపురూపమైనదమ్మ ఆడజన్మ.... ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా..." అని ఓ పక్కన రాస్తూనే ఉంటారు...ఇంకో పక్కన ఇల్లాళ్ళు అగచాట్లు పడుతూనే ఉంటారు. . ఏమైనా ఎదురు ప్రశ్నిస్తే.... "నీ సాధింపు తట్టుకోలేకపోతున్నా" అంటూ తాగి వస్తారు. "తాగేప్పుడు మీకు ఇల్లాలు జ్ఞాపకం ఉండదా" ??? అంటూ ప్రశ్నిస్తుందా అమాయక ఇల్లాలు.. "నిజం చెప్పమంటావా ? తాగినప్పుడు నేను ప్రతి బాధనూ మరిచిపోతాను" అంటాడు భర్త. పెళ్ళికి ముందు "నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం" అన్న వ్యక్తి పెళ్ళైన తరువాత ఇలా ఎలా మాట్లాడేస్తాడు ? అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.  ఇదేదో బలవంతపు పెళ్ళో లేక పెద్దలు కుదిర్చి చేసిన సాంప్రదాయాల పెళ్ళిళ్ళ విషయంలోనోనే కాదు జరుగుతున్నది... "నీకు నేనూ, నాకు నువ్వూ...ఒకరికొకరం నువ్వూ నేనూ..." అనుకొంటూ పెద్దలను, సమాజాన్ని సైతం ఎదిరించి పెళ్ళి చేసుకొన్న ప్రేమైక జీవుల వ్యధ కూడా.... "ఎందుకిలా ?" అని అడగడం కూడా అనవసరమే... దానికి సమాధానం ప్రతి ఒక్కరిక

దంపతులు..:-

Image
దంపతులు..:- నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు.  . నేనేం మాట్లాడుతున్నానో నీకు బోధపడడం లేదు. . అయినా కొన్ని దశాబ్దాలుగా మాట్లాడుకొంటూనే ఉన్నాం "  ఎదుటివారి గురించి పట్టించుకోవాలంటే ముందు మనమేమిటో మనకి తెలియాలిగా?  . "ఏ వ్యక్తీ జీవిత భాగస్వామిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. అందుకే అర్థం చేసుకొనే విషయం లో ఆరాటాలొద్దు. మనం చేయవలసిందల్లా ఒక్కటే... తక్కువగా అర్థం చేసుకోవడం. ఎక్కువగా ప్రేమించడం" మనకన్నీ పున్నములే.... వెన్నెల పూల పున్నాగలే... అందుకే ప్రేమిద్దాం...  . ప్రేమ కోసం జీవిద్దాం... జీవితాన్ని ఆద్యంతం ఆస్వాదిద్దాం....

‘నా పాట నీ నోట పలకాల సిలకా’

Image
‘నా పాట నీ నోట పలకాల సిలకా’ పాటలో  ‘నా నీడ సూసి నువు కిలకిలా నవ్వాల’ అంటూ నవ్వు గురించి రాసి;  . ఆచార్య ఆత్రేయ మరో మూడు పాటలను మాత్రం కన్నీటితో తడిపారు. ఈ మూడు పాటల్లోని భావాలూ, వ్యాఖ్యానాలూ సినిమా పాత్రల పరిమిత పరిధిని దాటిపోయాయి. అందరికీ అన్వయించే స్థాయిలో తెలుగులో స్థిరపడిపోయాయి. సందర్భానుసారం కోట్ చేసే పంక్తులుగా మారాయి. ‘ముద్దబంతి పూవులో మూగకళ్ళ వూసులో ’ పాటలో - నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా మనసును పైపైన కాకుండా లోతుగా అర్థం చేసుకోవాలనే సూచన.. ‘మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను’ పాటలో- కలలు కనే కళ్ళున్నాయి, అవి కలతపడితె నీళ్ళున్నాయి కలల కనటం , అనుకున్నది జరగకపోతే కన్నీళ్ళు రావటం ఎవరికైనా సామాన్యమే అనే వాస్తవానికి అద్దం పట్టటం. ఇక ‘పాడుతా తీయగా సల్లగా...’ పాటలో - గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న వుండవమ్మ శాన్నాళ్ళు ఏడిస్తే బాధ తగ్గిపోయి ఊరట కలుగుతుందనేది కవితాత్మకంగా చెప్పటం. ఆ బాధ ఎంతటిదయినా కాలం గడిస్తే దాని తీవ్రత తగ్గిపోతుందని కూడా చెప్పటం .

‘పళ్ళు - పదారు’ ‘మూగమనసులు !

Image
‘పళ్ళు - పదారు’ ‘మూగమనసులు ! . మూగమనసులు సినిమాలో కొసరాజు - ‘ గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ’ పాట రాశారు.  . ‘సగం దేహమై నేనుంటే , అది పెళ్ళామంటే సెల్లదులే పళ్ళు పదారు రాలునులే పళ్ళు పదారు రాలునులే’ పళ్ళు ఎవరికైనా ముప్పై రెండు కదా?  పదారు (పదహారు) అని ఎందుకు రాశారు?  ‘పళ్ళు - పదారు’ అనే ప్రాస కోసమేనా? కొసరాజు అలా అర్థమేమీ లేకుండా రాస్తారా?! మరి దీనిలో అంతరార్థమేంటి? పురాణాల్లో శివుడు అర్ధ నారీశ్వరుడు కదా? నోట్లో సగం పళ్ళు గౌరి (పార్వతి) వే. కాబట్టి మిగిలిన పదహారు పళ్ళ సంగతే ప్రస్తావించి,  అవి రాల్తాయని చమత్కారంగా చెప్పటమన్నమాట!

సీత అగ్నిప్రవేశం..

Image
సీత అగ్నిప్రవేశం.. సీతకన్నా కూడా రామునికే అగ్ని పరీక్షగా మారింది. ..... .  (రామాయణ కల్పవృక్షం.! శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.) .  హనుమంతుని తోకకి నిప్పంటించినప్పుడు, అది కాలకుండా, అగ్నికున్న ఉష్ణాన్ని సీత తనలో దాచుకుంటుందిట!  ఇంద్రజిత్తు వేసిన ఒక అస్త్రానికి రామలక్ష్మణులు మూర్ఛపోతారు.  అప్పుడు రావణుడు వాళ్ళు చనిపోయారనే భావించి సీతదగ్గరకి వచ్చి, వాళ్ళు చనిపోయారన్న వార్త చెప్తాడు.  సీత నమ్మదు. త్రిజట స్వయంగా యుద్ధరంగానికి వెళ్ళి చూసివచ్చి చెప్తుంది, వాళ్ళు పడిపోయే ఉన్నారు కాని వాళ్ళ ముఖాలు కాంతివంతంగానే ఉన్నాయని.  అప్పుడు సీత ఒక విచిత్రమైన మొక్కు మొక్కుకుంటుంది. .  ఈ ఆపదనుంచి రామలక్ష్మణులు బయట పడిన తర్వాత, ఏ అగ్నిసాక్షిగా అయితే తను రాముని పెళ్ళాడిందో, ఆ అగ్నిలో తాను దూకుతానని ఆ మొక్కు.  రావణుడాంటాడు, రామునిలాంటి భర్తని నమ్ముకుంటే నీకు అగ్నిప్రవేశమే గతి అని! రాముడెలాగూ యుధ్ధంలో చనిపోతాడు, అతనితో సీత సహగమనం చెయ్యడానికి నిప్పులో దూకాల్సి వస్తుంది అని అక్కడ రావణుని ఉద్దేశం.  మరి తర్వాత సీత చేసిన అగ్నిప్రవేశం తన మొక్కు తీర్చుకోడానికా? తన భర్త ఉన్నా తనకి లేనట్టే