Posts

Showing posts from January, 2014

శ్రీ మాత్రే నమః.

Image
అమృతమధనం జరిగిన సమయంలో, అందులోనుంచి కల్పవృక్షం,కామధేనువు,పాంచజన్యం, పారిజాతం, ఉచ్చై శ్రావం, ఐరావతం, కౌస్తుభమణి, కాలకూటం, చంద్రుడు, లక్ష్మిదేవి ఉద్భవించడం జరిగింది.  వీళ్ళందరూ సోదరసోదరీ గణం కాబట్టి లక్ష్మీదేవికి వాళ్ళపోలికలు కొన్నివచ్చాయి. చంద్రుని నుంచి వక్రత్వం, ఉచ్చైశ్రవం నుంచి చంచలత్వం, విషం నుంచి మైకం, అమృతం నుంచి మదం, కౌస్తుభమణి నుంచి కాఠిన్యం లక్ష్మీదేవికి వచ్చాయి. అందుకే ఆమే ఎప్పుడు, ఎందుకు దూరంగా వెళ్ళుతుందో తెలియదు. అయితే విద్యాసంపన్నుల దగ్గర ఆమే ఎందుకు ఉందటం లేదన్నది ప్రశ్న. ఆ తల్లి వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నది నిఝం. భౌతికమైన ధనరూపంలో కాదు. ఎన్ని వేల కోట్ల రూపాయలను గుమ్మరించిన రాని ఆత్మ శాంతి, స్తిథప్రగ్న్యత రూపంలో ఆమే వారి మన్సుల్లో ఉంటుంది. అమ్మ మనలోనే ఉంది అన్న విషియం గ్రహించటానికి కూడా ఆవిడే శక్తి ఇవ్వాలి...! శ్రీ మాత్రే నమః.

కిటియై కౌగిట జేర్చెను,

Image
కిటియై కౌగిట జేర్చెను, వటుడై వర్ధిల్లి గొలిచె, వడి కృష్ణుండై ఇట పద చిహ్నములిడె, క్రిం దటి బామున నేమి నోచితమ్మ ధరిత్రీ?! (పోతన...)

లలనా! యేటికి తెల్లవాఱె?

Image
లలనా! యేటికి తెల్లవాఱె? రవి యేలాదోఁచెఁ బూర్వాద్రిపైఁ? గలకాలంబు నహంబుగాక నిశిగాఁ గల్పింపఁ డా బ్రహ్మ దా వలఱేఁడుం గృపలేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లోకదే; కలదే మాపటికాల మందు మనకుం గంజాక్షు సంభోగముల్. ఏమే చెలీ! అప్పుడే ఎందుకు తెల్లవారిపోయిందే! తూర్పుకొండమీద ఆ సూర్యుడు ఎందుకు పొద్దుపొడిచేసేడే బాబు! అవును పగళ్ళన్నవి లేకుండా ఎప్పటికి తెల్లవారని రాత్రిళ్ళుగా ఎందుకు చెయ్యడే ఈ బ్రహ్మదేవుడు! ఈ మన్మథుడేమో మరీ కరుణమాలిన వాడైపోయాడు; చిలకలను చూస్తే వారించేవాళ్ళే లేరు; ఇంకా ఎలాగమ్మా బతకటం! అసలు రాత్రి ఎప్పటికేనా అవుతుందా! ఆ కలువ కన్నుల కన్నయ్యతో కలిసే అదృష్టం లభిస్తుందంటావా! (పోతనామాత్యుడు.)

సుందరకాండ విశిష్టత:

Image
సుందరకాండ విశిష్టత:  ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ. ఇది రామాయణంలో ఐదవ కాండ. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. బ్రహ్మాండపురాణం ఈ కాండమును "సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః" అని, "బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి" అని, "అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్" అని ప్రశంసించింది. సుందరకాండకు ఆ పేరు ప్రతిపాదించడానికి అనేక కారణాలున్నాయి. తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ. భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు. అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము. హనుమ సీతారాములిరువురికి ఆనందం కల్గించి సుందరుడైనాడు. ఈ విధముగా పాత్రోచితరీతిలో సుందరకాడ శ్రీరాముని, సీత

"వేంకటేశ్వరా!"

Image
దివ్య దంపతుల శృంగారాన్ని భక్తితో వర్ణించిన వారిలో అన్నమయ్య చాలా ప్రముఖంగా కనిపిస్తాడు. అలమేలుమంగా వేంకటేశ్వరుల శృంగారాన్ని తన సంకీర్తనలలో అతను పుష్కలంగా వర్ణించడం అందరికీ తెలిసిన విషయమే. సంకీర్తనలే కాకుండా, "వేంకటేశ్వరా!" అనే మకుటంతో ఒక శతకం కూడా రచించాడు అన్నమయ్య. ఈ శతకంలో కూడా వారిద్దరి శృంగార విలాసాలు రకరకాలుగా చిత్రించబడ్డాయి. అందులో ఒక సరసమనోజ్ఞమైన సన్నివేశాన్ని వర్ణించే పద్యం ఒకటి రుచి చూద్దాం: "అందవు, కోసి యిమ్ము విరు" లంచును జే రలమేలుమంగ ని  న్నుందగ గోర జెక్కులటు నొక్కిన నాకును నందవంచు న  య్యిందుముఖిం బ్రియంబలర నెత్తుచు పువ్వులు కోయజేయ ని  ష్యందమరందఘర్మరససంగతు లబ్బెను వేంకటేశ్వరా !  స్వామివారు తన సతితో కూడి ఉద్యానవనంలో విహరిస్తున్నారు కాబోలు. అక్కడ కొన్ని పూల చెట్లున్నాయి. ఆ పూలు కోసుకోవాలని అమ్మవారికి కోరిక పుట్టింది. కాని అవి ఎత్తుగా ఉన్నాయి. "ఆ పూలు నాకందవు, మీరు కోసిపెట్టం"డని గోముగా అడిగిందావిడ. అయ్యవారేమయినా తక్కువ తిన్నారా! నాక్కూడా అందవని చెప్పి, నువ్వే కోసుకోమని ఆమెని ప్రేమతో యెత్తుకున్నారు. ఆమె పూలు కోస్తూ ఉంటే, ఆ పూలన

“వీణాపుస్తక పాణి”

Image
సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా ఉన్న కాళిదాసుకి “వీణాపుస్తక పాణి” ఎప్పుడు  పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమై పలకరిస్తుందిట. ఒకరోజు చదువుల తల్లి తన వద్దకి వచ్చినపుడు కాళిదాసు ఇలాప్రశ్నిస్తాడు? “అమ్మా! ఇప్పుడున్న కవి,పండితులలో కవి ఎవరు? పండితుడు ఎవరు?అని.” అపుడు సరస్వతి ఇలా అంటుంది.  “కవిర్దండీ కవిర్డండీ భావభూతిస్తు పండితః” అని శ్లోకపాదం చెప్పిందట. అనగా సంస్కృతంలో దశకుమార చరిత్రం అనే గొప్ప కావ్యాన్నివ్రాసిన దండి అనేవాడే మహాకవి అనుటలో సందేహం లేదు, అని తెలపడానికే రెండు పర్యాయాలు “కవిర్దండీ కవిర్దండీ” అనిపలికి, ఉత్తరరామ చరితం వంటి మహోన్నతమైన నాటకాలు వ్రాసిన భవభూతిని మహాపండితుడు అని వాగ్దేవి చెప్పిందట. అప్పుడు కాళిదాసుకి చాలకోపంవచ్చిందట. కారణం తనని కవి అనికాని,పండితుడని కాని గుర్తించలేదని. లోకంలో కవులు,పండితులేకదా! ఉండేది. తాను ఏ కోవకి చెందని వాడనా అని. వెంటనే “కోహం – -(తరువాతి పదం ఒక తిట్టు.అందుకని పేర్కొన లేదు.) ఓ – నేనెవరిని ? అని గట్టిగా అడిగేడట. పిల్లల కోపాన్ని తల్లి సహించి బుజ్జగిస్తుంది కదా! అందుకే వెంటనే అమ్మ --- “త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం న సంశయః.”  అనగా నీవేనేను, న

అనామిక ....

Image
కాళిదాస మహాకవి గొప్పతనం జగద్విదితం. అందుకే “కవికుల గురు: కాళిదాసః” అని  అందరిచే కీర్తించబడినాడు. ఇంకా కాళిదాసు గొప్పతనాన్ని తెలిపే ఒక చక్కని శ్లోకాన్ని  తెలుసు కొందాం.  “పురా కవీనాం గణన ప్రసంగే /  కనిష్టికా దిష్టిత కాళిదాసః// అద్యాపి తత్తుల్య కవేరభావాత్  అనామికా సార్థవతీ బభూవ //  “ పూర్వం కవులని గణన అనగా ఎవరు ముందు ఎవరు తరువాత అని లెక్కించడం  ప్రారంభించగా, చిటికిన వేలుని (ప్రధమ స్థానాన్ని) కాళిదాసు అధిరోహించెనట. తదుపరి  రెండవ స్ధానం కోసం (ఉంగరం వేలుకి “అనామిక” అని పేరు.) రెండవ వేలుని అధి రోహించడానికి ఇప్పటికీ కాళిదాసుతో సమానమైన కవి లేనందున ఆ రెండవవేలుకి  అనామిక అనేపేరు సార్థకమైంది.”

అన్నమయ్య కీర్తన.. కులుకక నడవరో...

Image
అన్నమయ్య కీర్తన.. కులుకక నడవరో కులుకక నడవరో కొమ్ములాలా  జలజల రాలీని జాజులు మాయమ్మకు ఒయ్యనే మేను కదలీ నొప్పుగా నడవరో గయ్యాళి శ్రీ పాదతాకు కాంతలాలా పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బలమీద అయ్యో చెమరించె మాయమ్మకు నెన్నుదురు|| చల్లెడి గందవొడి మైజారీ నిలువరో పల్లకి వట్టిన ముద్దు పణతులాలా మొలమైన కుందనపు ముత్యాల కుచ్చులదర గల్లనుచు కంకణాలు కదలీ మాయమ్మకు జమళి ముత్యాలతోడి చమ్మాళిగ లిడరో రమణికి మణుల ఆరతు లెత్తరో అమరించి కౌగిట అలమేలుమంగ నిదె సమకూడె వేంకటేశ్వరుడు మాయమ్మకు|| అలమేల్మంగమ్మ పల్లకిలో కూర్చున్నది. పల్లకిని మోసే ముద్దుగుమ్మలను అన్నమయ్య హెచ్చరిస్తున్నాడు. ఓ భామలారా! ఒయ్యారంగా కులుకుతూ నడవకండే! అమ్మ నెరులు చెదరి విరులు జలజలా రాలిపోతున్నాయి, నుదురు చెమరిస్తుంది. పాపటలో జల్లిన గంధపొడి శరీరమంతా జారుతున్నది. జడకు గల ముత్యాల కుచ్చులు అదురుతున్నవి. కర కంకణాలు కదిలిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా నడవండే! అమ్మ పల్లకి దిగినది. దిగిన వెంటనే ముత్యాల పాదరక్షలు అందించండే! మణుల హారతి పట్టండే! అంటూ చెలికత్తెలను అమ్మవారి సేవకు పురమాయిస్తున్నాడన్నమయ్య!

“ భోజనం దేహి రాజేంద్రా ఘ్రుత సూప సమన్వితం

Image
“ఒకరోజు భోజుని ఆస్థానానికి ఒకకవి వచ్చి, చక్కని కవిత్వం చెప్పి, సన్మానింపబడిన పిదప, మంచి భోజనం పెట్టమని అడుగుతాడు. రాజుగారు ఎటువంటి భోజనం కావాలి? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ కవి తనకి కావలసిన పదార్థాలని చక్కని కవితారూపంలో ఇలా అడుగుతాడు.- “ భోజనం దేహి రాజేంద్రా ఘ్రుత సూప సమన్వితం  మాహిషంచ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి”  అనగా “ఓ రాజా! నాకు మంచి భోజనం పెట్టు. ఆ భోజనంలోకి మంచి నెయ్యి,పప్పు మొదలగు పదార్థాలతోపాటు, శరత్ కాలంలోని చంద్రుని కిరణాలవలె తెల్లగా ఉన్న గేదె పాలతో తయారైన గడ్డ పెరుగు కూడ కావాలని కోరుతాడు. పెరుగును కవితాత్మకంగా వర్ణించిన విధానానికి భోజరాజు సంతసించి, చక్కని భోజనం పెట్టి, మరల ఘనంగా సత్కరించి పంపుతాడు. 

యజ్ఞోపవీతం పరమం పవిత్రం”

Image
“ శృంగారాది నవరసాలలో హాస్యానిది రెండవ స్థానం. సంభాషణా చాతుర్యం ద్వారా, హావభావ విన్యాసం ద్వారా మనసుకు హాయిని కలిగించేది హాస్యం” హాస్యానికి ఆలంబనాలు చాటువులు. చమత్కార జనితమైన ఈ చాటువులు కొన్ని శృంగార భరితంగా కూడ ఉంటాయి. కాళిదాసు పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ చాటువుని చదివి ఆనందించండి. “ఆణోరణీయాన్ మహతో మహీయాన్ మధ్యో నితంబశ్చ మదంగనాయాః తదంగ హారిద్ర నిమజ్జనేన  యజ్ఞోపవీతం పరమం పవిత్రం” దానిభావం పరిశీలిద్దాం - మొదటి పాదం “ఆణువుకన్నా చిన్నదైన పరమాణువు అనగా కనీకనిపించనిది అనికదా భావం. అట్లే మహత్తు కన్నా మహత్తు పెద్దవాటిలో పెద్దది అనికదాభావం. అవి అందమైన, యవ్వనంలో ఉన్న స్త్రీయొక్క మధ్యమము అనగా (సన్నని) నడుము, మరియు నితంబము పెద్దది గాను ఉన్నదనియు, అట్టి స్త్రీని ఆలింగనం చేసికొన్నపుడు, ఆమె ఒంటికి రాసుకొన్న పసుపుతో కలసిన యజ్ఞోపవీతము, పరమ పవిత్రమైనది కదా!”

"కళాప్రపూర్ణ శ్రీ గుమ్మడి"

Image
"కళాప్రపూర్ణ శ్రీ గుమ్మడి"  "పంచె కట్టులోన ప్రపంచాన మొనగాడు  ఎవడురా ఇంకెవడు తెలుగువాడు." హుందాగా మూర్తీభవించిన ఆంథ్రుడుగా, ప్రశాంత వదనంతో ,నిత్యం చిరునవ్వుతో ,తెలుగుదనానికి నిలువెత్తు చిరునామాగా మనకు కనిపించే మహామనిషి, శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు.  తెలుగు సినిమారంగంలో అతి చిన్న వయసులో అతి పెద్ద పాత్రలు ధరించి అలవోకగా ప్రేక్షకులను మెప్పించిన మహానటులు గుమ్మడి జులై 9 1927 న గుంటూరు జిల్లా తెనాలికి దగ్గరలోని "రావికంపాడు" గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో తల్లిదండ్రులకు మొదటి సంతానంగా జన్మించారు. ఈ మహానటుణ్ని కన్న తల్లిదండ్రులు, బసవయ్య, బుచ్చమ్మ ల పూర్వపుణ్య ఫలము వలన జన్మించిన గుమ్మడి ఇంతటి మహానటుడౌతాడని వారు ఊహించి ఉండరు. ఉమ్మడి కుటుంబంలో మొదటి సంతానంగా స్థానిక హైస్కూలు విద్య ముగియగానే వారి వ్యవసాయ వృత్తిలోనే గుమ్మడిని కొనసాగించాలని భావించారు. దైవ నిర్ణయమును ఎవరూ మార్చలేరు కదా! వారి పూర్వజన్మ సుకృతము ఊరకనే పోవునా? శ్రీ గుమ్మడి స్థానిక పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఇతనిని ప్రభావితుని చేసిన వ్యక్తి వారి తెలుగు మాస్టారు జాస్తి శ్రీరాములు చౌదరి.

Padmasri..M.Y.S. Prasad

Image
I am very happy to know that one of my close Trivandrum family friend Sri .M.Y.S. Prasad got Padmasree this year.. He is not only a great scientist but also a good writer & drama actor.. iI am fortunate to direct one drama Ame yevaru of Ravi sasthri garu... He & his wife acted in the playlet .. in 1980s

Mana Manasu Manasu Ekamai - Jeevitham (1950) - M.S.Rajeswari, T.R.Ramach...

  మన మనసు మనసు ఏకమై ఆనందమై నవ లోకము చూద్దామా...   మన ప్రేమా వీణా గానమై ఆనందమై నవ లోకము చూద్దామా. ..   చెలి వెన్నెలలో పూ వన్నెలలో మన ప్రణయ కథా రచన  మన మనసు మనసు ఏకమై ఆనందమై నవ లోకము చూద్దామా..

కలవారికోడలు కలికి కామాక్షి

Image
కలవారికోడలు  కలవారికోడలు కలికి కామాక్షి  కడుగుచున్నది పప్పు కడవలో పోసి  అప్పుడే వచ్చేను ఆమె పెద్దన్న  కాళ్ళకు నీ ళ్లి చ్చి కన్నీల్లు నింపె  ఎందుకీ కన్నీళ్ళు ఏమి కష్టాలు  తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు  ఎత్తుకో బిడ్డను ఎక్కు అందలము  చేరి మీ వారితో చెప్పిరావమ్మ  పట్టె మంచం మీద పడుకున్న మామా  మా అన్నలోచ్చారు మమ్మం పుతారా  నేనెరుగ నేనెరుగ మీ అత్త నడుగు  పట్టె మంచం మీద కూర్చున్న ఓ అత్తా  మాఅన్నలోచ్చారు మమ్మం పుతారా  నేనెరుగ నేనెరుగ మీ బావ నడుగు  భారతం చదివేటి ఓ బావా  మా అన్నలోచ్చారు మమ్మం పుతారా  నేనెరుగ నేనెరుగ మీ అక్కనడుగు  వంట చేసే తల్లి ఓ అక్కగారు  మా అన్నలోచ్చారు మమ్మం పుతారా  నేనెరుగ నేనెరుగ నీ భర్త నడుగు  రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగి  మా అన్నలోచ్చారు మమ్మం పుతారా  పెట్టుకో సొమ్ములు కట్టుకో చీరే  పోయి రా సుఖముగా పుట్టినింటికి ...

అడ్డ మయ్యె నాకు గెడ్డ మొక్కటి నేడు” -

Image
“అమ్మ ఒడిని మరల నాదమఱచి హాయి  నిద్రపోవ తలతు నేను! కాని  అడ్డ మయ్యె నాకు గెడ్డ మొక్కటి నేడు” - విమల సుగుణ ధామ వేము భీమ. (రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.)

చిన్నప్పుడు సంవత్సరమంటే…

Image
  చిన్నప్పుడు సంవత్సరమంటే… సంంంంంంంంంంంంవత్సరంలా ఉండేది. ఇప్పుడంటే కొంచెం ఏమారితే చాలు, సంవత్సరాలు, నెలలూ తిరగబడిపోతున్నాయ్. మొన్ననే మన ముందే ఏడుస్తూ పుట్టిన పిల్లల్ని నేడు పలకరిస్తే “ఇంజనీరింగ్ చదువుతున్నాను అంకుల్” అని అంటున్నారు…తేడా ఎక్కడుంది? భూమేమైనా సూర్యుడి చుట్టూ తిరిగే వేగం హెచ్చించిందా? మనమే మంచు భల్లూకాల్లా ఆరునెలలు మనకు తెలియకుండానే హైబర్నెషన్‌లోకి వెళ్ళిపోతున్నామా? లేదా తేడా మన వయస్సు ..భాధ్యతలలో ఉందా .. ఏం జరుగుతోంది…..నాకు తెలియాలి. Y2K సమస్య పోయిన సంవత్సరంలో వచ్చినట్లు ఉంది… చూస్తే దశాబ్దం గడిచిపోయింది. మొత్తానికి జీవితం 8x వేగంతో ఫాస్ట్ పార్వర్డ్‌లో చూస్తూన్న సినిమాలా జరిగిపోతోంది.

అటజని కాంచె......................(కామేశ్వర రావు భైరవభట్ల )

Image
అటజని కాంచె......................(కామేశ్వర రావు భైరవభట్ల  ) అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్ మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యం ఇది. అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగానే (వినగానే) "ఓహో!" అనిపించే పద్యం. ఈ పద్యంలో ఛందస్సుకి సంబంధించిన విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ పద్యాన్ని చంపకమాలలో ఎందుకు రాసుంటాడు పెద్దన అని ఆలోచిస్తే, "అటజని కాంచె" అన్న ప్రారంభం కోసం అని అనిపిస్తుంది. మొదటి నాలుగు లఘువులూ ఆ వెళ్ళడంలోని వేగాన్ని సూచించడం లేదూ! ఇక మొదటి పాదంలో "అంబర చుంబి" దాకా చంపకమాల నడకతో సాగిన పద్యం, హఠాత్తుగా "శిరస్సరజ్ఝరీ" (తడక్-తడక్-తడక్) అన్న నడకలోకి మారిపోడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చంపకమాలతో ఇలాటి నడక సాధించవచ్చా అనిపిస్తుంది. అలానే రెండవ పాదంలో "అభంగ తరంగ మృదంగ" (తధింత-తధింత-తధింత) అన్న నడకకూడా! ఇక ఇందులోని అర్థం విషయానికి వస్తే - "అటజని కాంచె భూమిసురుడు". ఏమిటి చ

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కోరిక..

Image
తెలుగు ఆడ బిడ్డ గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కోరిక.. నలుగురు కూచొని నవ్వే వేళల నాపేరొకతరి తలవండి మీ మీ కన్న బిడ్డల నొకతెకు ప్రేమను నా పేరివ్వండి

కోడలా కోడలా కొడుకు పెళ్ళామా......

Image
కోడలా కోడలా కొడుకు పెళ్ళామా! . కోడలా కోడలా కొడుకు పెళ్ళామా పచ్చి పాల మీద మీగడలేవి? వేడి పాల మీద వెన్నల్లు యేవి? నూనెముంతల మీద నురగల్లుయేవి? అత్తరో ఓయత్త ఆరళ్ళయత్త పచ్చిపాల మీద మీగడుంటుందా? వేడిపాల మీద వెన్నలుంటాయా? నూనె మంతల మీద నురగలుంటాయా? కోడలా కోడలా కొడుకు పెళ్ళామా! కోడుకు ఊళ్ళోలేడు మల్లెలెక్కడివి? గంపంత మబ్బేసి గాలి విసిరింది కొల్లలుగ మల్లెలు కొప్పులో రాలె ఇరుగు పొరుగులార! ఓ చెలియలార అత్తగారి ఆరళ్ళు చిత్తగించరా? పెత్తనం లాగేస్తే పేచీలుపోను ఆరళ్ళ అత్తయిన సవతి పోరయిన తల్లిల్లు దూరమైన భరియించలేము. http://www.youtube.com/watch?v=lFLSN0jiu5E

రామ నృపాలా !

Image
   శ్రీ కంఠ చాపు ఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలస త్కాకుథ్స వంశ మండన రాకేందు యశో విశాల రామ నృపాలా ! (పోతనామాత్యుడు.)

హరియను రెండక్షరములు...

Image
హరియను రెండక్షరములు హరియించును పాతకంబు నంబుజనాభా ! హరి నీ నామస్మరణము  హరి హరి పొగడంగ తరమె హరి శ్రీ కృష్ణా ! (పోతనామాత్యుడు)

(పోతనామాత్యుడు.}

Image
అరయన్ శంతను పుత్రుపై విదురుపై నకౄరుపై కుబ్జ పై నరుపై ద్రౌపది పై కుచేలుని పయిన్ నంద వ్రజ శ్రేణిపై  పరగన్ గల్గు భవత్కృపా రసము నా పై కొంత రానిమ్ము నీ చరణాబ్జంబులె నమ్మినాను జగదీశా ! కృష్ణ ! భక్త ప్రియా ! (పోతనామాత్యుడు.}

భీమ శతకం

Image
భార్య తోడ నీవు బ్రతుకు టెట్లన్నచో, తప్పు చేసి నప్పు డొప్పు కొనుము,  భార్య తప్పు చేయ పన్నెత్త బోకుము!  విమల సుగుణ ధామ వేము భీమ. భీమ శతకం రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.

కృష్ణ శతకము.

Image
కృష్ణ శతకము. దేవేంద్రుఁడలుక తోడను వావిరిగా ఱాళ్ళవాన వడి గురియింపన్ గోవర్థనగిరి యెత్తితివి గోవుల గోపకుల గాచు కొఱకై కృష్ణా! కృష్ణా!దేవేంద్రుడు కోపగించి దట్టమైన,ఱాళ్ళను వేగముగల వానగా కుఱిపించగా గోవర్థనగిరిని గొడుగు వలె చిటికినవ్రేలితో పైకెత్తి ఆవులను,ఆవులను కాచువారిని రక్షించితివి.

పాత పద్యాలకు క్రొత్త పేరడిలు....

Image
పాత పద్యాలకు క్రొత్త పేరడిలు..... అరయన్ శంతనుపుత్రునిపై విదురుపై నక్రూరుపై కుబ్జపై నరుపై ద్రౌపదిపై కుచేలునిపయిన్ నందవ్రజ శ్రేణిపై పరగం గల్గు భవత్కృపారసము నాపై కొంత రానిమ్ము నీ చరణాబ్జంబుల నమ్మినాను జగదీశా! కృష్ణ! భక్తప్రియా! అన్న సుప్రసిద్ధ పద్యం చాలామందికి తెలిసినదే. ఈపద్యం తిక్కన్న వ్రాసినదిగా కొందరు, వెన్నెలంటి జన్నయ వ్రాసిన దేవకీనందన శతకములోనిదని కొందరు పేర్కొన్నారు. వ్రాసినది ఎవరైనా ఈ పద్యానికి అత్యదికమైన పేరడీలున్నాయి. కొన్ని చూద్దాం. 1. వడపై, నవడపై, పకోడిపయి, హల్వాతుంటిపై, బూందియోం పొడిపై, నుప్పిడిపై, రవిడ్డిలిపయిన్ బోండాపయిన్ సేమియా సుడిపై చారు భవత్కృపారసము నిచ్చో కొంతరానిమ్ము నే నుడుకుం గాఫిని ఒక్కచుక్క గొనవే! ఓ కుంభదంభోదరా! (అబ్బూరి రామకృష్ణారావు గారి పేరడి) 2. ఉపమాపై పెసరట్టుపై యిడిలిపై హుమ్మంచు చూపించు నీ జపసంబద్ధ పరాక్రమ క్రమ కటక్షశ్రేణి మన్నించు శు భ్రపు జిల్లేబి పకోడి లడ్వగయిరాపై కొంత రానిమ్ము శ్రీ చపలాంగ సితాంగ నా హృదయపాశాపూజ్యవస్తుప్రియా (అబ్బూరి రామకృష్ణారావు గారి పేరడి) 3. అరయన్ మారుతపుత్రునిపై శబరిపై నాహల్యపై కైకపై వరసుగ

నడిఎటి లో నడచు పడవలా ఆ పడచు గుడి కాడభావి కి నీళ్ళకువస్తది. ఈ పాట ఒక మధుర అనుభూతి

దాశరథీ శతకము.....

Image
దాశరథీ శతకము..... రాముఁడు ఘోరపాతక విరాముఁడు,సద్గుణ కల్పవల్లికా రాముఁడు,షడ్వికారజయు రాముఁడు,సాదుజనావనవ్రతో ద్దాముఁడు రాముఁడే పరమదైవము మాకని మీయడుంగుఁగెం దామరలే భజించెదను,దాశరథీ!కరుణాపయోనిధీ! రామా!దయాసముద్రా!రాముఁడు మహాపాపవిరాముఁడు,సద్గుణ కల్పవల్లికా రాముఁడు,కామాది మనోవికారముల నాఱింటిని గెలుచటచే మనోహరుఁడు, సజ్జన రక్షణమనెడి వ్రతముచే నుద్దాముఁడు, మాకు రాముఁడే పరమదైవమని మీ పాదపద్మములనే భుజింతును.

మన సుమ...

Image
నాకు నచ్చిన తెలుగు కోడలు.... మలయాళం అమ్మయీ...  మనకంటే తెలుగు బాగా తెలుసు.... మన సుమ...

సంక్రాంతి శుభాకాంక్షలు

Image
సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బేతవోలు రామబ్రహ్మంగారి "కొత్తగోదావరి" పద్య కవితా సంపుటినుంచి సంక్రాంతి పద్యాలు మీకోసం. లలి మునుమాపువేళ చదలన్ తెలి ముగ్గిడబూని ముందు చు క్కల నిడి వాని సౌరు గనగా నిలుచున్న నిశామృగాక్షి అ వ్వల నరుదెంచుచున్న ప్రియవల్లభు గాంచిన సంభ్రమాన ము గ్గొలికెనొ చేతినుండి యననొప్పెను పౌషపు పండువెన్నెలల్ రాత్రి అనే సుందరి ఆకాశంలో ముగ్గు వెయ్యడానికి ముందు చుక్కలని పెట్టింది. ఆ చుక్కలే ఎంతో అందంగా కనిపిస్తే, వాటిని చూస్తూ నిలుచుండి పోయింది. ఇంతలో తన భర్త వస్తూ ఉండడం చూసిన తొట్రుపాటులో ఆ ముగ్గు కాస్తా ఒలికి పోయింది. పుష్య మాసం పండు వెన్నెల ఆ ఒలికిన ముగ్గులా ఉంది. ఉదయమనంగ నేగి రెటకో మరి మీ కలవాట యయ్యె ని య్యది యని మూతి మూడ్చుకొను నామెకు తారలహార మిచ్చి బి ట్టదిమి కవుంగిలింపగ నిశాధిపు డత్తఱి జారెనో నిశా మదవతి మేల్ముసుంగనగ మంచు తెరల్ కనుపట్టె నింపుగన్ "ఉదయాన్నే ఎక్కడకో వెళిపోయి రాత్రి దాకా ఇంటికి రాకపోవడం మీకు బాగా అలవాటైపోయింది" అని అలకతో ఆ నిశామృగాక్షి మూతి ముడుచుకుంది. అప్పుడామె భర్త ఆమె అలక తీర

ఇదండీ మకర సంక్రాంతి విశేషం

Image
అంతరిక్షం మొత్తాన్ని 360°గా, 12 రాశులుగా విభజించింది జ్యోతిష్య శాస్త్రం. అందులో సూర్యుడు ప్రతి రాశిలోకి ప్రవేశించే సమయాన్నే సంక్రమణం అంటారు. సూర్య్డు ఒక్కో రాశిలో నెలరోజులా పాటు ఉంటాడు. అలా మనకు ఒక ఏడాదిలో 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు ప్రవేశించడమేంటి అనే అనుమానం వస్తుంది. భూభ్రమణంలో కలిగే మార్పులను అనుసరించి, భూమి యొక్క అక్షాంశ, రేఖాంశలను బట్టి, భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని అనూసరించి ఈ నిర్ణయం జరుగుతుంది. మనం భూమిపై నుంచి గమనిస్తాం కనుక, సూర్యుడు ప్రవేశించాడంటున్నాం. నిజానికి సూర్యుడు ఎప్పుడు తన స్థానంలోనే ఉంటాడు. ఈ విషయం ఆధునికసైన్సు చెప్పక కొన్ని వేల ఏళ్ళ పూర్వమే హిందువులకు తెలుసు. శథపధ బ్రాహ్మణం 'నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. భూమి తన చుట్టూ తాను తిరగడం వలన, పగలు రాత్రి ఏర్పడుతున్నాయి' అంటూ చాలా స్పష్టంగా చెప్పింది. ఏడాదిలో 12 సంక్రాంతులు ముఖ్యమే అయినా, అందులో మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం ప్రధానమైనవి. మకరసంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఉత్తరాయణంలో భూమికి సూర్యునికి మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఉత్తరాయణం దేవతలకు పగలు. ఈ కాలంలోనే ఎన్నో శుభకా

సుబ్బి గొబ్బమ్మ ...

Image
సుబ్బి గొబ్బమ్మ ... సుబ్బనివ్వవే... తామర పువ్వంటి .. తమ్మునివ్వవే... మొగలి పువ్వంటి ..మొగుణ్ణి ఇవ్వవే .. అంటూ ఆడపిల్లలు పాడేవారు .. గొబ్బిమ్మల పాట.. ఇప్పుడు గొబ్బి అయ్యాల బెడద తో మనే సారేమో...

నాడు.. నేడు.

Image
నాడు.. నేడు. నేటి తరం నటీ మణులను చూస్తే జుగుప్స కలుగుతోంది. మహిళలపై గౌరవం క్షీణించి, సమాజంలో నేర ప్రవృత్తి పెరగడానికి వీరే ప్రధాన కారణం.

దాశరథీ శతకం -- రామదాసు

Image
దాశరథీ శతకం -- రామదాసు  చరణము సోకినట్టి శిల జవ్వనిరూపగు టోక్కవింత సు స్థిరముగ నీటిపై గిరులు దేలినదోక్కటి వింతగాని మీ స్మరణదనర్చు మానవులు సద్గతిచెందిన దెంతవింత, యీ ధరను ధరాత్మజారమణ ! దాశరథీ కరుణాపయోనిధీ ! దాశరధ పుత్రా దయా సముద్రా రామా ! నీ పాద స్పర్స చేతనే ఒకరాయి యవ్వనవతి అగు స్త్రీ గా మారుట ఒక ఆచ్చర్యము. నీతిమీద ములగక కొండలు తేలుట మరో వింత . కాని భూమిపై నీ నామము స్మరించు మనుషులకు  తొందరలో మక్షము పొందుటలో ఏ వింతయు లేదు.

ఇతి హస సుందరి టిజి కమల దేవి. (By Tvs Sastry garu)

Image
ఇతి హస సుందరి టిజి కమల దేవి. (By Tvs Sastry garu) పాతాళభైరవి చిత్రం 1951లో కాబోలు వచ్చింది. అందులో ఆదిలో ఇతిహాసం విన్నారా అన్న పాట బుర్రకథగా వినిపిస్తుంది. పాడినదీ నటించినదీ టిజి కమలాదేవి. ఆమెను చూశాక హీరోయిన్ మాలతిని చూసి – కమలవంటి అందగత్తె ఉండగా మాలతిని ఎందుకు ఎంపిక చేశారా అనిపించింది. ఆతర్వాత మల్లీశ్వరి కూడా ఆ ఏడే చూశాను. అందులో టిజి కమల చిన్న చెలికత్తె పాత్రలో తుమ్మెదా అని పాడుతూ కనిపిస్తుంది. ఆమె భానుమతికంటే అందంగా అనిపించింది. ఆస్తులూ అంతస్తులూ (1969లో కావచ్చు) చిత్రంలో గయ్యాళి అత్తగా చూసినప్పుడు అచ్చం ఎస్. వరలక్ష్మిలా ఉన్నదనుకున్నాను. చిత్రం పేరు అదేనని ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే అమె వివరాలలో ఈ చిత్రం పేరు లేదు> ఆమె రూపం, గొంతు, హావభావాలు అంతలా ముద్ర వేశాయి. మాటివి గుర్తుకొస్తున్నాయి శీర్శికలో ఆమెతో ఇంటర్వ్యూ నిర్వహించింది.. తాజమహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అని మహాకవి వాపోయాడు కానీ – మనకి మహాప్రభువుల్నే తప్ప మహామహుల్ని సంస్మరించే అలవాటు లేదనడానికి మాన్యులు శ్రీ పివి నరసింహారావుగారే నిదర్శనం. ఈ ఆగస్ట్ 16న ఆ కళామూర్తి వేరే లోకానికి వెళ్లిపోయింది.

కాళిదాసు ఉప్మా...

Image
కాళిదాసు ఉప్మా... ఒక సారి భోజమహారాజుకి తన కొలువులో ఉన్న కవులందరితో కలిసి వనభోజనానికి వెళ్ళాలనే కోరిక పుట్టింది. మందీ మార్బలంతో వెళితే కవితాగోష్టికి కావలసినంత సమయం దొరకదు కనుక తానూ, మంత్రీ నవరత్నాలూ మాత్రమే వెళ్ళేలాగా, అక్కడ భోజనానికి గానూ ప్రతీ కవి తమ ఇంటినుంచి ఏదో ఒకటి చేసుకు వచ్చేలాగా ఏర్పాట్లు చేసుకుని వనభోజనానికి వెళ్ళేరు.  ఉన్నవారు నవరత్నాలైనా తొమ్మండుగురూ వంట చేసుకొస్తే అది చాలా ఎక్కువైపోతుంది కనుక కేవలం నలుగురు మాత్రం ఉప్మా చేసుకుని వెళ్ళేరట.  మహా ఉత్సాహంతో కవిత్వం చెప్పుకుంటూ, ఆనందిస్తుండగా భోజనం వేళ అయింది.  నలుగురు కవులూ తమవెంట తెచ్చిన ఉప్మా రాజుగారికి వంతులవారిగా వడ్డించేరు. మహదానందంగా తిన్నారు భోజరాజు. ఉప్మా రుచి ఎలా ఉందంటారో అని అది చేసుకొచ్చిన నలుగురూ ఎదురు చూస్తుండగా భోజరాజు ఇలా అన్నారట.  దండినః పదలాలిత్యం  భారవేరర్ధ గౌరవం  ఉపమా కాళిదాసశ్య  మఘో సంతి త్రయోగుణాః అంటే  దండి వండి తెచ్చిన ఉప్మా నాల్గవ వంతు మాత్రం ఉడికింది, భారవి గారి ఉప్మా సగం ఉడికింది, మాఘుని ఉప్మా మూడొంతులు ఉడకగా, కాళిదాసు గారి ఉప్మా అద్భుతంగా వచ్చింది  అని. ఇది సరదాగా చె

ఈ రోజు వైకుంఠ ఏకాదశి..మహాపర్వదినం

Image
ఈ రోజు వైకుంఠ ఏకాదశి..మహాపర్వదినం  దేవాలయంలో స్వామికి వజ్రకిరీట ధారణ  తండోపతండాలుగా జనసందోహం  ఇసుకవేస్తే రాలడంలేదు  దేవాదాయ మంత్రివర్యులు కూడా విచ్చేసారు  ప్రసాదాలు గుండిగెలతో బారులు తీరి వున్నాయి  దొన్నె అయిదురూపాయలు  ఎగబడి కొంటున్నారు భక్తులు  కోట్లుఖరీదుచేసే ఆకిరీటంకేసి,  ప్రసాదాల గుండిగల కేసి  ఆబగా చూస్తున్నారు  వరదల్లో సమస్తంకోల్పోయిన భాధితులు...

సత్కథా సుధారసంబు ...

Image
"అచ్చమైన యమృత మమరులు త్రావినా రోయి! దానికే నసూయ పడను పరమమౌనియైన వాల్మీకి కృత రామ సత్కథా సుధారసంబు ద్రావి"

కత్తిలాంటి పద్యం!

Image
కత్తిలాంటి పద్యం! చింతలతోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బా లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్ బొంతలు లేవు కప్పుటకు; బొంది హిమం బయిపోవునేమొ సా గింతును రుద్రవీణపయి నించుక వెచ్చని అగ్నిగీతముల్ చింతలతోపు. హోరున కురిసే వాన. వానలో తడిసి ముద్దవుతున్న బాలెంత. ఆమె ఒడిలో పసి మొగ్గలాంటి చిన్ని బిడ్డ. ఆ బిడ్డకి కప్పడానికి ఒక్క బొంతకూడా లేదు. ఇది కవికి కనిపించిన దృశ్యం. మనిషిగా అతని గుండె మండింది. కవిగా పద్యం పొంగింది. భౌతిక ప్రపంచంలో అలాంటి వేలమంది బాలెంతలకి పసిబిడ్డలకి ప్రతిరూపంగా కవి మనసులో కదలాడిన చిత్రమది. ఏం చెయ్యగలడు కవి? ఆ చలిలో ఆ పసిబిడ్డ శరీరం గడ్డకట్టుకు పోతుందేమో! ఎలా కాపాడడం? కవి దగ్గరున్న పరికరం ఒక్కటే, పద్యం! కవి చేతిలో ఏ రూపాన్నయినా ధరించగలదది. అగ్నిధార కురిపించ గలదు. అమృతాభిషేకం చెయ్యగలదు. రుద్రవీణ వినిపించగలదు. ఇక్కడ, రుద్రవీణని మీటి తన గుండెమంటనే అగ్నిగీతాలుగా చేసి పాడుతున్నాడు కవి. ఆ గీతాలు పసిబిడ్డకి కాస్తంత వెచ్చదనాన్ని యిస్తాయేమోనని!  దాశరథి "రుద్రవీణ" అనే కవితా సంపుటిలో "మూర్చన" అనే కవితలోని పద్యమిది. సానబెట్టిన కత్త

దత్తపది ----------------------------(Virabhadra Sastri Kalanadhabhatta.)

Image
దత్తపది ----------------------------(Virabhadra Sastri Kalanadhabhatta.) భక్తి ఆరోజు ఏకాదశి..మహాపర్వదినం  దేవాలయంలో స్వామికి వజ్రకిరీట ధారణ  తండోపతండాలుగా జనసందోహం  ఇసుకవేస్తే రాలడంలేదు  రక్తి పౌరాణిక సినిమాల్లో దేవిగా నటించిన  ప్రఖ్యాత నటీమణి ధరించిన కిరీటం  ఆరోజు వేలానికి వచ్చింది  వేలం వెర్రిగా వేలం పాట సాగుతోంది  చివరకి ఆ గిల్టు కిరీటాన్ని  లక్షా ఏభైవేలకి ఒక వీరాభిమాని స్వంతం అయింది  అది దక్కని మిగిలిన అభిమానులు నిరాశతో వెనక్కి  అయ్యో ఈసొమ్మూతో వరదలో కూలిపోయిన ఇళ్ళు బాగుచేయించుకోవచ్చుగదా  వరద భాదితుల ఆవేదన ముక్తి మధ్య తరగతి కుటుంబం  వున్న అన్నం కాస్తా పిల్లలకు సహం కడుపేనింపింది  కాస్త కాఫీ తాగి భర్త ఆఫీసుకు వెళ్ళాడు  సాయంత్రం వచ్చేటప్పుడు ఎక్కడైనా అప్పు తెస్తానని  ముసలి అత్త మామలు, తనూ మిగిలారు  బిక్కు బిక్కు మంటూ చూస్తున్న కోడలని చూసి అత్త అంది  ఈవేళ ఏకాదశి కదమ్మా!  వుపవాసం వుంటే పుణ్యం కదా!  నిజమే వంటికి ఆరోగ్యం.. ముక్తికి ముక్తీను విరక్తి ఛీ !! ఇక రాజకీయాలనుండి తప్పుకోవాలి  (గోడమీద బాపూ పెదవులపై మందహ

అలుక చెందిన భార్యలకు ...

Image
ఒకనాడు రాయలువారు అర్ధరాత్రివేళ చిన్నమదేవి అంత:పురానికి వెళ్ళేసరికి అప్పటివరకు రాయలుకోసం వేచివున్న చిన్నమదేవి నిద్రకు ఆగలేక తల్పంపైన పరుండినది. ఆమెకు నిద్రాభంగము కావించరాదని రాయలు ఆమె ప్రక్కనే ఆమె కాళ్ళవైపు పరుండెనట. నిద్రలో ఆమె కాలు జాచుకొనుసరికి ఆమె ఎడమకాలు రాయల శిరస్సుకు తగిలినది. అందుకు రాయలు కోపోద్దీపుడై విస విసా వెడలినారుట. తనకాలికేదో తగిలిందని చివుక్కున లేచిన చిన్నమదేవి వెళ్ళిపోతున్న భర్తను జూచింది. కాని అప్పటికే రాయలు ఆమె అంత:పురం దాటి వెళ్ళారుట. ఆ తరువాత రాయలు ఆమె వద్దకే రావడం మానివేసారు. పొరపాటున తన కాలు రాయలవారి శిరస్సుకు తగిలినందువల్లే ఆగ్రహించి రాయలు రావడం లేదని గ్రహించిన చిన్నమదేవి ముక్కు తిమ్మన్నగారితో చెప్పుకొని దు:ఖించింది. అప్పుడు తిమ్మన్నగారు పారిజాతాపహరణ కావ్యం రచించి ఈ పద్యంలో చిన్నమ దేవి తప్పు ఇసుమంతైనా లేదని నిగూడంగా తెలియబరిచారుట. జలజాతాసన వాసవాది సురపూజాభాజనంబైతన  ర్చులతాంతాయుధుకన్నతండ్రి శిరమిచ్చో వామపాదంబునం  దొలగంద్రోచెలతాంగి;యట్లెయగు నాధుల్నేరముల్సేయ పే  రలుకం జెందినయట్టి కాంతలుచితవ్యాపరముల్నేర్తురే ఎలా సమర్ధించారు? ఈ పద్యంలోని భావం పరికిద్ద

నందితిమ్మన్నను ముక్కుతిమ్మన్న అని ఎందుకు అన్నారు

Image
నందితిమ్మన్నను ముక్కుతిమ్మన్న అని ఎందుకు అన్నారు అంటే దానికి ఒక ముచ్చట చెప్తారు. ఒకనాడు తనకు క్షౌరం చక్కగా చేసినందుకు సంతోషించి తిమ్మన్న మంగలికి బహుమతి ఇవ్వబోవగా, వాడు కవిగారూ నాకు డబ్బు వద్దు, మంచి పద్యం ఏదైనా వ్రాసి ఇవ్వండి అన్నాడుట. తిమ్మన్న సంతోషించి డబ్బుతోకూడ ఈక్రింది పద్యం ముక్కు మీద వ్రాసి ఇచ్చారుట.  నానాసూన వితాన వాసనల నానందించు సారంగ మే  లానన్నొల్లదటంచు గంధఫలి బల్ కానందవంబంది, యో  షా నాసాకృతి బూని సర్వసుమనస్సౌరభ్య సంవాసియై  పూనెన్ ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్ ఒకనాడు భట్టుమూర్తి ఈపద్యం విని మహదానందంతో వాడికి చాలా ధనం ఇచ్చి కొనుక్కున్నాడని, తర్వాత తన వసుచరిత్రలో దానిని చేర్చుకున్నారని అంటారు. ఇంత ప్రఖ్యాతిపొందిన ముక్కు పద్యం వ్రాసిన కవి కాబట్టి ఇతడు ముక్కు తిమ్మన్న అయిపోయాడంటారు.

అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి . గోవింద గోవింద అని కొలువరెగోవింద గోవిందయని కొలువరెగోవిందాయని కొలువరె 1.హరియచ్యుతాయని యాడరెపురుషోత్తమాయని పొగడరెపరమపురుషాయని పలుకరెసిరివరయనుచును జెలగరె జనులు 2. పాండవవరదా అని పాడరెఅండజవాహను కొనియాడరెకొండలరాయనినే కోరరెదండితో మాధవునినే తలచరే జనులు 3.దేవుడు శ్రీవిభుడని తెలియరెసోవల యనంతుని చూడరెశ్రీవెంకటనాథుని చేరరెపావనమైయెపుడును బ్రదుకరె జనులు ....ఆంతర్యము

Image
అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి . గోవింద గోవింద అని కొలువరె గోవింద గోవిందయని కొలువరె గోవిందాయని కొలువరె 1.హరియచ్యుతాయని యాడరె పురుషోత్తమాయని పొగడరె పరమపురుషాయని పలుకరె సిరివరయనుచును జెలగరె జనులు 2. పాండవవరదా అని పాడరె అండజవాహను కొనియాడరె కొండలరాయనినే కోరరె దండితో మాధవునినే తలచరే  జనులు 3.దేవుడు శ్రీవిభుడని తెలియరె సోవల యనంతుని చూడరె శ్రీవెంకటనాథుని చేరరె పావనమైయెపుడును బ్రదుకరె జనులు   .... ఆంతర్యము ఇది తాళ్లపాక చిన తిరుమలాచార్యుల వారి రచన.  తాళ్లపాక చిన తిరుమలాచార్యులు  అన్నమయ్య మనుమడు.  ఇది   చిన తిరుమలాచార్యులు రాసాడని చెబితే తప్ప , ఈ కీర్తన రచయిత అన్నమయ్యే  అని అందరూ నమ్ముతారు. అది ఆ తాళ్ల పాక వంశ మహిమ. భక్తి వారి గళములో, గంటంలో సమానంగా  హెచ్చు తగ్గులు లేకుండా   నినదించింది. గోవిందా అన్న పదం వేంకటేశునికి చాలా ఇష్టమైన పదం. అందుకే తాళ్ల పాక కవులకి కూడా చాల ఇష్టమైన పదం. ఈ కీర్తన కిరీటంలో మూడు గోవింద పదాల మణులు విరాజిల్లుతున్నాయి. పనికి మాలిన రాజులకి, అధికారులకి సేవ చేయట మేమిటి? వాళ్లని  కొలవట మేమిటి ? చక్కగా  గోవిందా అంటూ గ

రమణ మహర్షి

Image
ఒక ఉడుత ఎప్పుడూ లాగే రమణ మహర్షి దగ్గరకు వచ్చింది, ఆయన దానికి జీడిపప్పు పెడుతున్నారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు. " నిన్న ఒక భక్తుడు కొన్ని జీడిపప్పులు నా ఈ మూగ స్నేహితుల కోసం పంపాను అన్నాడు. కాని ఇవి మూగావి కావు. అవి నాతో మాట్లాడుతాయి. ఎప్పుడైనా నేను స్వల్ప నిద్రలో ఉన్నప్పుడు అవి నా దగ్గరకు వచ్చి నా వేళ్ళు కొరికి మరీ నా ధ్యానము వాటి పైకి మలచుకుంటాయి. అంతే కాదు వాటికి తమ సొంత భాష ఉంటుంది. ఉడుతలలో ఒక గొప్ప నేర్చుకోవలసిన విషయం ఉంది. వాటి ముందు మీరు ఎంత ఆహారము పెట్టినా, అవి వాటికి ఎంత కావాలో అంత తిని వెళ్ళిపోతాయి. అవి ఎలుకల వలె దొరికినది అల్లా తీసుకుని తమ చిల్లి లో దాచుకోవు. "

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు

Image
ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు           By - Kameswara Sarma Sriadibhatla   బడికెళ్ళాలంటే చాలా బాధగా ఉండేది ఏ చిన్న తప్పిదం జరిగినా కొట్టేవారు మేష్టర్లు.భాస్కర శర్మగారైతే మరీనూ, ఆతను మాకు తెలుగు చెప్పేవారు ఈ రోజు చెప్పిన పద్య భాగంలో పువ్వుగుర్తున్న పద్యాలనీ మరుసటి రోజుకు అప్పచెప్పాలి, చెప్పలేకపోయేమో మొట్టికాయలతో బుర్ర రామకీర్తన పాడేవారు.చెపుతూ గనక తడబడ్డానో, భట్టూ భెక్కుతావేమిరా అంటూ మరో రెండు మొట్లు మొట్టేవారు. శనివారం వచ్చిందంటే చచ్చేంత భయంగా ఉండేది.ఆ రోజు అటు ఇంగ్లీషులోనూ ఇటు తెలుగులోనూ వ్యాకరణం చెప్పేవారు. భాస్కర శర్మగారి మొట్టికాయలకు తోడుగా ఇంగ్లీషు మేష్టారి బెత్తం. మిగతా మేష్టర్లేమన్నా తక్కువ తిన్నారా, గోడకుర్చీ వేయించేవారు ఒకరూ, మోకాళ్ళమీద కూర్చేపెట్టేవారు మరొకరూనూ. దాన్నా దీన్నా బడి అంటే అదో భయం.           ఎంత త్వరగా బళ్ళో చదువు పూర్తి చేసుకుని కాలేజీకి వెళిపోతానా అనుకుంటూ ఉండేవాడిని. నాకంటే పెద్దవాళ్ళు చెప్పేవారు, కాలేజీలో స్టూడెంట్లని కొట్టరుట.           అనుకున్న రోజు రానే వచ్చింది. టెంత్ పాసయి ఇంటర్లో చేరేను. ఏనుగెక్కినంత ఆనందంగా అనిపించిది. కాలేజీలో

మృత్యుంజయా! పద్యకవితా ఖండికలు.

Image
మృత్యుంజయా!            పద్యకవితా ఖండికలు. ( మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి  గారు.    విశ్లేషణ :కామేశ్వర రావు భైరవభట్ల  ) శివుడి మీద నాకు చాలా యిష్టమైన పద్యాలలో శ్రీ మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారి "మృత్యుంజయా" పద్యాలు ముందువరసలో ఉంటాయి. వాటిలో హాస్యముంది, భక్తి ఉంది, ఆర్తి ఉంది, అధిక్షేపణ ఉంది. ఎన్నెన్నో భావాలొలికిస్తాయవి. వాటన్నిటిలోనూ అంతస్సూత్రంగా ఒకానొక ఆత్మీయత మెరిసిపోతూ ఉంటుంది. పాపమీ కవి ఈశ్వరునికి తన గోడేదో చెప్పుకుందామనుకుంటాడు. అంతలోనే ఒక పెద్ద అనుమానం వచ్చిపడుతుంది! అసలు తన మొఱ ఆ యీశ్వరునికి వినిపిస్తుందా అని. ఎందుకా అనుమానమంటే చెపుతున్నాడు కవి: మెడ నాగన్నకు నొక్కటే బుసబుసల్, మేనన్ సగంబైన యా బిడతో నీ కెపు డొక్కటే గుసగుసల్, వీక్షించి మీ చంద మె క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్, నీ చెవిం బడుటేలాగునొ మా మొఱల్ తెలియదప్పా మాకు మృత్యుంజయా! ఓ వైపు పాముల బుసబుసలు, మరోవైపు అర్థాంగితో గుసగుసలు. అది చూసి నెత్తినున్న గంగమ్మకు రుసరుసలు! ఈ గోలలో తనలాంటి భక్తుల మొఱలు ఆయనకెలా వినిపిస్తాయని కవిగారి సంశయం. "అప్పా" అన్న సంబోధనలో ఎ

ఇల్లరికపుటల్లుడు!

Image
ఇల్లరికపుటల్లుడు! శివపార్వతులు ఒకరికోసం ఒకరు తపస్సు చేసుకొని చివరికి పెళ్ళిచేసుకున్నాక, శివుడు సపరివారంగా హిమగిరిపైనే, మావగారింటనే నివాసమున్నాడట. "శివుడికి తన భార్యంటే ఎంత ప్రేమో, అలా ఇల్లరికం ఉండిపోయాడు!" అని ఆశ్చర్యపడతాడు శ్రీనాథుడు. అయితే ఆ సంబడం ఎంతో కాలం సాగదు. కొన్నాళ్ళు గడిచాక అత్తమామమలకి అతనిమీద చిరాకు కలుగుతుంది. . దానితో హిమవంతుడికి చిఱ్ఱెత్తుకొచ్చింది. రాదు మరీ! కానీ ఏం చేస్తాడు పాపం. తన కూతురు కోరి ప్రేమించి పెళ్ళిచేసుకున్న అల్లుడాయె! వెళ్ళి తన కూతురిదగ్గరే మొరపెట్టుకుంటాడు.  ఇలా శివుడి బంధుగణాన్నీ, శివుడినీ ఆక్షేపిస్తూ హిమవంతుడన్న మాటల్లో శివుడి ఆకారాన్ని వెక్కిరించే మాంచి అందమైన చమత్కార పద్యం ఒకటి మనకందించాడు శ్రీనాథుడు. అవధరించండి మరి: తలమీద చదలేటి దరిమీల దినజేరు కొంగలు చెలగి కొంగొంగురనగ మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ గట్టిన పులితోలు కడకొంగు సోకి యా బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱు మనగ గడియంపు బాములు కకపాలలో నున్న భూతి మై జిలికిన బుస్సు రనగ దమ్మిపూజూలి పునుకకంచమ్ము సాచి దిట్టతనమున బిచ్చము దేహి యనుచు వా

దశావతారస్తుతి

Image
దశావతారస్తుతి నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే | రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే మీనాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౧ || మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో కూర్మాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౨ || భూచోరకహర పుణ్యమతే క్రీఢోద్ధృతభూదేశహరే క్రోఢాకార శరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౩ ||

శ్రీ రుక్మిణీశ కేశవ.....

Image
శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల /నగధర శౌరీ ద్వారక నిలయ జనార్ధన కారుణ్యముతోడ మమ్ము/గావుము కృష్ణా! రుక్మిణీదేవికి భర్తవు,పరమేశ్వరుడవు,నారదుడు చేయు గానమందు ఆసక్తి గలఁవాడవు.కొండనెత్తిన వాడవు.ద్వారకా పట్టణమందు నివసించువాడవు.జనులు అను రాక్షసులను చంపిన వాడవు.అయిన ఓ కృష్ణా!దయతో మమ్ములను రక్షించుము.

మనస్సే అన్నింటికీ మూలం.

Image
'..మనస్సే అన్నింటికీ మూలం. అది పుట్టగానే అన్నీ పుడతాయి. అది అణిగితే అన్నీ అణుగుతాయి.  అన్నింటికీ కారణమైన ఆ మనస్సును అదుపులో పెట్టుకోవడమే ఆధ్యాత్మిక సాధన..'' - భగవాన్ రమణ మహర్షి

శ్రీకాళహస్తీశ్వర శతకము.......(ధూర్జటి)

శ్రీకాళహస్తీశ్వర శతకము.......(ధూర్జటి) వాణీనల్లభ దుర్లభంబగు భవ / ద్వారంబునన్నిల్చి,ని ర్వాణశ్రీ చెరపట్టచూచిన విచా / రద్రోహమో,నిత్య క ళ్యాణ క్రీడలబాసి,దుర్దశలపా / లై,రాజలోకాధమ శ్రేణీ ద్వారము దూరజేసి దిపుడో / శ్రీకాళహస్తీశ్వరా! శ్రీకాళాహస్తీశ్వరా!సరస్వతీ దేవికి భర్తయగు బ్రహ్మదేవునకు కూడ అసాద్యమైన నీ వాకిటిలోనిల్చి,మోక్షమనే లక్ష్మీదేవిని పొందాలని కోరుకోటం నేను చేసిన చెడుపని అని నీవు భావించితివి.కాకపోతే నిత్యమూ శుభకరములైన పనులను చేసే నేను వానికి దూరమై,చెడుగతుల పాలిట బడిపోయి,అతితక్కువ శ్రేణికి చెందిన రాజులయొక్క ద్వారముల వద్ద ఉండునట్లుగా చేసితివి.కనుక నాతప్పు మన్నించుము.

జోకభి .రామయణం.

జోకభి  .రామయణం. మల్లి గాడు ...పిల్లి గాడు...సోల్లుగాడు....అని ముగ్గురు మిత్రులు... మల్లిగాడు పేపర్ చదువుతున్నాడు.... పిల్లిగాడు తన కాలేజి పుస్తకం చదువుతున్నాడు... సోల్లుగాడు ఇదిగో ఈ మెసేజ్ చదువుతున్నాడు... ------------------\ IMPOSSIBILITIES IN THE WORLD..... 1) మీ తలవెంట్రుకలను మీరు లెక్కపెట్టలేరు..... 2) మీ కళ్ళను సబ్బుతో కడుగలేరు...... 3) మీ నాలుకను బయట పెట్టుకుని మీరు శ్వాస తీసుకోలేరు.... . . . . . హ.హ హ హ హ ... ఇక చాలు మీ నాలుకను నోట్లోకి పంపండి....!!!!!! --------- ఒక వేల అమ్మాయి కనుక ప్రేమ లో పడితే  తన parents ఇలా అడుగుతారు ఎవరా " IDIOT " అదే అబ్బాయి ఐతే తన parents ఈవిధంగా అగుగుతారు  " IDIOT " ఎవర్రా ఆ అమ్మాయి.... . . . MORAL :- ఇంకేముంది ప్రేమిస్తే " IDIOT " అయ్యేది అబ్బాయిలే కదా... --------- ఓ అమ్మాయి మనసు సముద్రమంత లోతు అర్థం చేసుకోవడంలో అబ్బాయికి ఆకాశమంత ఓపిక ఉండాలి ======= Welcome to Mobile marriages  సంబంధం కోసం 1 నొక్కండి....... పెళ్లిచూపుల కోసం 2 నొక్