Posts

Showing posts from October, 2014

మా దివాకర్ల వెంకట అవధాని సార్

Image
మా దివాకర్ల వెంకట అవధాని సార్ తెలుగు ప్రాచీన సాహిత్యం పట్ల మాలో  ఎంత గాఢానురక్తిని క్లాసులో పెంచి పోషించేవారంటే ఏ ఒక్కరం కూడా తెలుగు క్లాస్‌ను తప్పించుకునే వాళ్లం కాదు. ఆయన రాగయుక్తంగా ప్రబంధపద్యాలు పాడి వినిపిస్తుంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్లం. పద్యాన్ని మొదటిసారి రాగయుక్తంగా, రెండోసారి మామూలుగా చదివి వినిపించే ఆయన నేర్పుకు మేం దాసోహమయ్యేవాళ్లం. పద్యాన్ని రాగయుక్తంగా పాడకుండా చదివి వినిపించాలన్న నిబంధన ఇంటర్, డిగ్రీ, పిజి తరగతులలో అప్పటికే అమలవుతున్నందువల్ల మేం పై చదువులకు వెళ్లే కొద్దీ తెలుగు పద్య గాన మహిమా శ్రవణానుభవం మాకు కొరవడిందనుకోండి. ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై అటజని గాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన స్పుట నటనానురూప పరిపుల్ల కలాపి జాలమున్ గ్ర కట శరత్కరేణు కర కంపిత జాలము శీత సాలమున్ అంటూ సంస్కృత సమాస పద భూయిష్టమైన మనుచరిత్రలోని ప్రవరుడి ఘట్టా

శృంగారనికి వయ్యారనికి .మారు పేరు బాపు బొమ్మా. .

Image
శృంగారనికి వయ్యారనికి .మారు పేరు బాపు బొమ్మా. . “ఉవ్విళులూరుచుం బలుకున్ ఒప్పులకుప్ప” “పలుకు నుడికారమున ఆంధ్ర భాష యందురు”

నేను మానవ సుర్యుణ్ణి

Image
ఆడవుల్లో అశాంతితో పరుగెత్తే దావాగ్నిని నేను తెలిమబ్బుల మందల్లోనించి వడిగా  ఒక తార వైపుకు పరుగెత్తే చిరుమబ్బును నేను బాధల్లో మునుగుతాను సంతోషాల్లో ఉదయిస్తాను నేను మానవ సుర్యుణ్ణి విప్లవ భాషావిధాత కవిసేన మేనిఫెస్టోప్రణేత భుధజన విధేయ శేషేంద్ర నామదేయ కవివర్మ ప్రణీత ఆధునిక మహాభారతస్య అనుబంధకావ్యం లో బ్రమరకాండ నుంచి

ఋణోదయం

Image
ధర్మరాజుగారికో రోజున రోఖం కావలసివచ్చి వేళకు జతపడక భీమసేనుడిని కుబేరుడి దగ్గరకు పంపాడుట అప్పు తెమ్మని. తీరా అతను అందాకా వెళ్ళి అడిగే సరికి కుబేరుడేమో మీ అన్న వడ్డీ ఇస్తాడా మరి అన్నాడట. రణరంగంలోనే తప్ప ఋణరంగంలో ప్రభావశాలిగాని భీముడు ఠంగున జవాబివ్వలేక మళ్ళీ భూలోకం వచ్చేసి, అన్నా వినమని కధ చెప్పాడు. వడ్జీ పుచ్చుకోకపోతే మనం అప్పు పుచ్చుకోము అని చెప్పు అని కబురంపాడు ధర్మరాజు ఎందుకైనా మంచిదని. కుబేరుడు అప్పు ఇచ్చాడు. వడ్డీ వద్దనీ అన్నాడు. ఇది అప్పు ఇచ్చే వారి మీద బాగా పనిచేసే ట్రిక్కు.... ఋ మణుడు రాసిన ఋణోపదేశం అనే మహాసందేశాత్మక కథనుండి  ఊరికే ఇలాటి ఋణట్రిక్కులు నేర్చుకుంటే ఫలించవని ఋమణు గురవుల ఉవాఛ.... ఇది మీకు చేర్చిన వాడికి కనీసం ఓ ఫైవు అప్పిచ్చి ఋణ రమణుడి ఋణం తీర్చుకోండి.... మీ కోసం అప్పుల అప్పారావు. మిత్రులందరికీ ఋణోదయం

బాపు గారి శకుంతల..

Image
బాపు గారి శకుంతల.. . చెలియను మఱచిన వేళల కలిగెడు దుఃఖము కలంచు గాదే, చెలుడా వలపుల పలుకుల నిత్తఱి సులభత మఱచుటయె వింత; చోద్యము సుమ్మా! x

హాలా హల భక్షణం...

Image
పోతన గారి భాగవతం లోని.. . హాలా హల భక్షణం... కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషము వేడిమి ప్రభువై యుంటకు నార్తుల యాపద గెంటింపగ ఫలము గాదె కీర్తి మృగాక్షీ !! మ్రింగెడి వాడు విభుండని మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్ మ్రింగుమనె సర్వ మంగళ మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో !! కదలం బారవు పాప పేరులొడలన్ ఘర్మాంబు జాలంబు వు ట్టదు నేత్రమ్ముల చెమ్మ వోదు నిజ జూటా చంద్రుడున్ గందడున్ వదనాంభోజము వాడదా విషము నాహ్వానించుచో డాయుచో పదిలుండై కడి సేయుచో దిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్ !! x

నిరాశ - గొప్ప శత్రువు.....బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. (బాపు గారి చిత్రం.)

Image
                నిరాశ - గొప్ప శత్రువు.....బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు.      ..(బాపు గారి చిత్రం.) x

కుక్కతోక ...

Image
కుక్కతోక ...By - Virabhadra Sastri Kalanadhabhatta . సుమారు డబ్భై అయిదేళ్ళక్రితం పిచ్చమ్మకు ఆమె మూడో ఏటనే పెళ్ళి అయింది. పదమూడో ఏడు వచ్చేసరికి ఆమె ఐదోతనం కాస్తా బుగ్గయింది.  ఇహనేం ఆచారం ప్రకారం సకల లాంఛనాలతో ఆమెని విధవను చేసారు.  క్షమించాలి మరీ పచ్చిగా చెప్తున్నందుకు  లాంఛనాలంటే గుండుతో సహా..  ఆపైన ఆమె జీవితం వంటింటికే పరిమితం అయింది.  ఎవరకీ కనపడకూదదు. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా ఉదయం లేవగానే వారి కళ్ళా బడకూడదు.  అల్లాగే ప్రయాణం చేసేవారికి ఎదురురాకూడదు మరి అపశకునంకదా  ఒకపూటే భోజనం.  రాత్రి విధిగా వుప్పుపిండే ఆహారం.  ఏకాదశులు వుపవాసం  వంటింటి పని ఆమెదే  మడి మడి  తద్దినాలలో వంట ఆమేచెయ్యాలి  భర్తపోయిన ఏయువతినైనా వితంతువు చేసినప్పుడు కర్మ పదోరోజున ఈమెనే పిలిచేవారు ఆకార్యక్రమ నిర్వహణకు  ఆవితంతువును మంచి ముహూర్తం వచ్చేవరకూ ఎవరూ చూడరు గనుక, అంతవరకూ ఆమెను ఈమే కనిపెట్టుకొని వుండాలి  ** ** **  మా తర్వాత తరం వచ్చేసరికి  యువతులులో చదువుకోవడం, సాంఘీక దురాచారాలను ఖండిచడం వంటి అభ్యుదయ భావాలు పెరిగాయి.  . పునర్వివాహాలకు అభ్యంతరాలు తగ్గాయి.  తర్వాత తర్వాత అసలు

"నేను, నేనని" నీవనుచున్నావు,

Image
"నేను, నేనని" నీవనుచున్నావు, అదే నేనూ అనుచున్నాను  అందరిలోనా వున్న ఈ నేనెవరన్నదే వేదాంతం  ఈ దేహేంద్రియములు, ప్రాణముకూడా కాదు "నేను"  గుండెగుహలో చిరుజ్యోతిగా వెలిగెడి ఆత్మయే "నేను" 

కరుణశ్రీ కవిత్వం

Image
కరుణశ్రీ కవిత్వం అద్వైతమూర్తి చూచెదవేలనో ప్రణయ సుందరి, కాటుక కళ్ళలోని యా లోచనలేమిటో హరిణ లోచని నీ చిరునవ్వులోని సం కోచములెందుకో కుసుమ కోమలి నీ మధురాధరమ్ములో దాచుకొనంగ నేటికి సుధామయ సూక్తి కళావిలాసినీ మనదాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ములో లోతులన్ గనియెన్ సాగెను భాగ్యనౌక కవితా కాళిందిలో నవ్య జీ వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము నే కొల్ల గొం దును నీ కోమల బాహు బంధనములందున్ కోటి స్వర్గమ్ములన్ భావోద్యానమునందు కొత్త వలపుం పందిళ్ళలో కోరికల్ తీవెల్ సాగెను పూలు బూచెను రసాద్రీ భూత తేజమ్ముతో నీవే నేనుగ నేనెనీవుగ లతాంగీ ఏకమై పోదమీ ప్రావృణ్ణీ రద పంక్తి క్రింద పులకింపన్ పూర్వ పుణ్యావళుల్ సాంధ్యశ్రీ సాంధ్యశ్రీ ! (కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి .) - అంజన రేఖ వాల్కనుల యంచులదాటి మనోజ్ఞ మల్లికా కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ కంజ దళాక్షి, నీ ప్రణయ గానములో పులకింతునా మనో రంజని బుష్పవృష్టి పయి రాల్పి నినున్ బులకింప జేతునా! - క్రొంజిగురాకు వేళుల కురుల్ తడియార్పుచు గూరుచున్న య భ్యంజన మంగళాంగి జడలల్లుదునా, మకరంద మాధురీ మంజు

కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్, న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.

Image
 కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్, న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్. . అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చును. . చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము,  విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు,  వేదములకు సమానమైన శాస్తమ్రులు, గంగకంటే పుణ్యప్రథములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం.  కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది . శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశే

శ్రీకాళహస్తీశ్వర శతకము....ధూర్జటి.

Image
శుభోదయం... శ్రీకాళహస్తీశ్వర శతకము....ధూర్జటి. . అంతా మిధ్య తలంచిచూచిన నరుం / సట్లౌటెరింగిన్ సదా కాంతల్పుత్రులు నర్థముల్ తనువు ని / క్కంబంచు మోహర్ణవ భ్రాంతింజెంది చరించుగాని,పరమా / ర్థంబైన నీయందు దా చింతాకంతయు చింతనిల్పుడు కదా / శ్రీకాళాహస్తీశ్వరా! . శ్రీకాళాహస్తీశ్వరా!మానవుడు పుట్టుట,చచ్చుట మొదలగు చేష్టలచే ప్రపంచమంతయు మిష్యారూపమైన మాయాని తెలిసి కూడ,అశాశ్వతమగు భార్యాపుత్రులయందు మోహమును విడనాడక సంచరించును.కాని ముక్తిని ఇచ్చెడు నీయందు చింతాకాంతయైనను మనస్సును లగ్నముఁచేసి సంచరించడు గదా?

మన రాజకీయ నాయకులు...

Image
మన రాజకీయ నాయకులు... . మన రాజకీయ నాయకుడొకాయన ఓ సారి అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఓ రాజకీయ నాయకుడు అతన్ని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. మన నాయకుడు ఆయనకున్న విశాలమైన భవనాలు, ఇంటి ముందు కావాల్సినంత ఖాళీ స్థలం, ఖరీదైనా ఫర్నీచర్ అన్నీ చూసి ముచ్చట పడి… “మీ కొచ్చే కొద్దిపాటి జీతాలతో ఇంత ఇంటిని, వస్తువులను ఎలా సంపాదించగలిగారు” అని అడిగాడు. దానికి ఆ సెనేటర్ నెమ్మదిగా నవ్వి అతన్ని కిటికీ దగ్గరికి తీసుకెళ్ళాడు. “అదిగో ఆ నది కనిపిస్తోందా?” “కనిపిస్తోంది” “దాని మీద వంతెన కనిపిస్తోందా?” “కనిపిస్తోంది” “10%” అన్నాడు. మన నాయకుడు అర్థమైందన్నట్లుగా నెమ్మదిగా తల పంకించాడు. తర్వాత కొద్ది రోజులకు సదరు అమెరికన్ సెనేటర్ భారత్ కు వేంచేశాడు. అతన్ని మన నాయకుడు తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. సెనేటర్ కి మన నాయకుడు ఇల్లు చూడగానే మతిపోయినంత పనైంది. రాజభవనాన్ని తలదన్నే ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన సామాగ్రి, నౌకర్లు, కార్లు… ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. “మీకొచ్చే రూపాయల్లో జీతంతో ఇదెలా సాధ్యం?” అని ప్రశ్నించాడా సెనేటర్. మన నాయకుడు అతన్ని కిటికీ దగ్గరకు తీసుకె

ఈ హాయి ఏమియో జాబిలి.....

Image
వెన్నెల లోనే ఉరకలు లేలోనో ..... ఉరకలు లోనే పరుగు లేలోనో... ఈ హాయి ఏమియో జాబిలి.....

కల్యాణ రాముని అవతార కథ.!

Image
కల్యాణ రాముని అవతార కథ.! . జన్మ వృత్తాంతం త్రేతా యుగమున రావణాసురుడు యను రాక్షసుడు భూలోకమున లంకాధీశుడై పరమశివుడు, బ్రహ్మలగురించి తపస్సు చేసి వారిచే అనుగ్రహింపబడిన వర గర్వితుడై ఎవ్వరిని లెక్క చేయక దేవతలను, ఋషులను, హరి (విష్టువు) భక్తులను వేధించుచుండెను. అప్పుడు వారందరు హరిని ప్రార్ధించి తమ కష్టములను మొర పెట్టుకొనగా, ఆ మహా విష్ణువు రామునిగా అవతరించి రావణుని కడతేర్చెద నని వారికి చెప్పి, వారిని శాంతపరచి పంపెను. భూలోకమున అయోధ్యా నగర చక్రవర్తి దశరధుడు పుత్రుల కొరకై పుత్ర కామేష్టి యను యఙ్ఞమును చేయుచుండెను. ఆ యఙ్ఞమునకు సంతసించిన దేవతలు అగ్ని దేవుని ద్వారా దశరధునికి పాయసము ను పంపిరి. ఆ పాయసమును దశరధుడు తన మువ్వురు భార్యలకు అనగా కౌసల్య, సుమిత్ర,కైకేయి లకు పంచెను. కొన్నాళ్లకు యీ మువ్వురు భార్యలు గర్భవతులై నలుగురు మగబిడ్డలను ప్రసవించారు. ఆ మహా విష్ణువే తన ఆది శేషువు, శంఖ చక్రములు, గదలతో సహా యీ నలుగురు పుత్రులుగా అవతిరించెను. రావణ సంహారము కొరకు అవతరించిన ఆనలుగురు పుత్రులే శ్రీరామ చంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు.

భామ కలాపం లో సత్య భామ .. మాధవి (మాధవుడే) సంభాషణ

Image
భామ కలాపం లో సత్య భామ .. మాధవి (మాధవుడే) సంభాషణ  చాల చిత్రంగా ఉంటుంది. . .మాధవి వేసే ప్రశ్నలు క్లుప్తంగాను, అర్ధవంతంగాను వుంటాయి. ముఖ్యంగా స్వామి వారి రూపురేఖా విలాసాలు వర్ణించమని అడుగుతుంది. నా స్వామి మదనమోహనా కారుడని - మందర గిరిధరుడని అంటుంది - సత్య అలాకాదు కొన్ని గుర్తులు చెప్పమంటుంది - మాధవి నా స్వామి శంఖము ధరించిన వాడంటుంది - సత్య శంఖము ధరించిన వాడు జంగాల వారి చిన్న వాడేకాని నీ భర్త కాడు అంటుంది - మాధవి మాధవి అభినయం నుండి పరోక్షంగా "పాంచజన్యం" పూరించిన పరమాత్మ గోచరం అవుతుంది. తరువాత సంభాషణలలో తర్కము ముదిరి విషయం పాకాన పడుతుంది. చక్రము ధరించిన వాడే వోయమ్మా! - సత్య కులాల వారి చిన్న వాడంటుంది - మాధవి ఆయన కాదని అందోళన చెందుతుంది - సత్య

దీపం అంటే వెలుగు ..

Image
దీపం అంటే వెలుగు .. వెలుగు అంటే చీకటిని పారదోలేది .. చీకటిని పారదోలడం అంటే జ్నానాన్ని సంపాదించుకోవడం... లక్ష్మీ నివాసం అంటే కేవలం డబ్బు ఉంటేనే కాదు.. జ్ఞానం కూడా లక్స్మీ దేవి.. ఆరోగ్యం కూడా లక్ష్మీ దేవి.. చిరునవ్వు కూడా లక్స్మీ దేవి ... కాబట్టి  ఆ లక్ష్మీ దేవి మీ ఇంటిలో ఏళ్ల వేళలా సిరి సంపదలు, జ్ఞానం, పాడిపంటలు, ఆరోగ్యం, చిరునవ్వులు వీటితో పాటు సుఖ సంతోషాలతో కూడిన మానసిక ప్రశాంతత ఇవ్వాలి అని ఆ లక్స్మీదేవి ని వేడుకొంటూ ..... మీకు మీ కుటుంబ సబ్యులకు దీపావళి శుబాకాంక్షలు !!! x

కిన్నెరసాని....

Image
కిన్నెరసాని.అంటే ఒక వాగు కృష్ణ నదికి పాయ...  కాని కవులు ఒక అందం అయిన అమ్మాయి గా వర్ణిస్తారు నిజమేనంటారా.... విశ్వనాథ గారి ..కిన్నెరసాని..

భామాకలాపం:---

Image
భామాకలాపం:--- . భామాకలాపం అన్న పేరు బాహ్యంగా శృంగార భూయిష్టంగా వున్నా, వేదాంతం పరమార్ధం మూలముగా కలిగినదీ కలాపం. భామాకలాపం వేదాంత ప్రబోధకై ఏర్పడిన గాధ.  . ఈ గాధ వెనుక ప్రత్యేక ధ్వని సిద్దాంతం తెలియబడుతూ వుంటుంది. సతి చరిత్ర నుడవ బడుతుంటే, పతి చరిత్ర వినబడుతూ వుంటుంది  . . "నయతి వృత్తం ఫలం ప్రపోతిచ ఇతి వినాయక" నాయకుడు ఫలమునకై ప్రయత్నించి తుదకు పొందువాడు.  మువ్వురికి ఆది మూలమై శేషునిపై పవ్వళించి యున్న శ్రీకృష్ణ పరమాత్మ ఇందలి నాయకుడు. నాయిక ఇట్టి నాయకుని రూపురేఖా విలాసములు భావ, రాగ, నాట్య గతులచే పర్ణించుచూ, శృంగారముగా కన్నుల నిండా జూచి బంగారు పూవుల పూజ సేయును.  . మాధవి పాత్ర ప్రత్యేకముగా మాధవుడు గనే గోచరం అగుచూ వుంటుంది.  . మాధవి అనంప్పుడు అది ఒక స్త్రీ వేషంలో వచ్చిన శ్రీకృష్న అంశ. సత్య భామ అంతరంగం అట్టడుగు వరకూ చూడగలిగి తెలిసి అందునా భగవత్ సాక్షాత్కారానికి ప్రతిబంధకాలయిన అహంకార మమకార గుణాలను వెలికి తీయుటకు తర్క రూపమయిన పరీక్ష బెట్టి అజ్ఞానం తనంతట తాను మాయం జేసుకునేటట్లు మార్గంచూపించుటకై, సాధనకై,  భగవత్ భక్తికై యేర్పడిన మానవ రూపం.

...... అప్పారావు ..ఎవరిని వదలడా .....

Image
                           ......  అప్పారావు ..ఎవరిని వదలడా .....

’చిగురాకులలో చిలకమ్మా ‘’

Image
’చిగురాకులలో చిలకమ్మా ‘’ అన్న పూర్ణా బానేర్ పై నాగేశ్వర రావు నిర్మించిన మొదటి చిత్రం దొంగ రాముడు . సాంఘిక చిత్రాల లో ఆణిన ముత్యం గా  కే వి.రెడ్డి దీన్ని  తీర్చి దిద్దాడు  .మాటా ,పాటా సీనియర్ సముద్రాల .సంగీతంసుస్వరానికి మాధుర్యానికి ‘’పెంద్యులం ‘’అయిన  పెండ్యాల .అందరు కమ్మని వంట గాళ్ళే.అందుకే అంత కమ్మగా సినిమా తయారైంది  .నాగేశ్వర రావు యవ్వన సౌందర్యం ,ఇంకా లావేక్కని సావిత్రి అందచందాలు, అభినయం ,వీటికి తావిని అందించాయి . హాయిగా కమ్మగా సాగే హుషారు పాట, కొంటె పాట ,  ‘’సాహిత్య సముద్రం’’ సముద్రాల కలకండ పదాలతో పాటలు రాసి వన్నె తెచ్చాడు  .పెండ్యాల నాగేశ్వర రావు తన సంగీత వైదుష్యానికి సొగసు లద్డాడు.  సరళ స్వరాలతో మనసు గిలి గింతలు పెట్టాడు .అలా విరిసిన ఒక పుష్ప గీతమే సావిత్రి ,నాగేశ్వరరావు ల మధ్య నడిచిన యుగళ గీతం  . ‘’ఓ చిగురాకులలో చిలకమ్మా –చిన్న మాట విన రావమ్మా మరు మల్లెలలో మామయ్యా –మంచి మాట సెలవీవయ్యా . పున్నమి వెన్నెల గిలి గిం తలకు-పూచిన మల్లెల మురిపాలు నీ చిరు నవ్వు కు సరి కావమ్మా – ఓ—ఓ– ఓ – ఎవరన్నారో ఈ మాటా తెలిసీ పలికిన నీ నోటా ఆ –ఆ –

ముద్దుల నా యెంకి

Image
ముద్దుల నా యెంకి ముద్దుల నా యెంకి గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ కూకుండ నీదురా కూసింత సేపు! ………………….. నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది, యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ || ………………. కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది, దగ్గరగ కూకుంటే అగ్గిసూస్తాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ || ………………. యీడుండమంటాది ఇలు దూరిపోతాది, యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ || ………………. మందో మాకో యెట్టి మరిగించినాదీ, వల్లకుందామంటే పాణ మాగదురా! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ||

న్యాయం ..తర్కం..

Image
న్యాయం ..తర్కం.. . 69 వ ఏట ఇరవై ఏళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకోవటం న్యాయశాస్త్రం ఒప్పుకోవచ్చు, . కానీ ఆ పెళ్ళి తర్కానికి నిలువదు. . అలాగే ముసలి వాడి పడచు భార్య 25 ఏళ్ళ కుర్రాడిని ప్రేమికుడిగా  కలిగి ఉండటం తర్కానికి నిలుస్తుంది కానీ  న్యాయశాస్త్రానికి నిలువదు.

శ్రీ కృష్ణుని రసికత, వాచాలత....

Image
శ్రీ కృష్ణుని రసికత, వాచాలత.... . శ్రీ కృష్ణుడు చాల రోజుల తరువాత ద్వారకకు తిరిగి వస్తాడు... .. అప్పుడు కృష్ణుడు ఒక భామ ఇంటికి ముందు వెళితేవేరొకతె లోఁ గుందునో, సుకరాలాపములాడదో, సొలయునో,సుప్రీతి వీక్షింపదో అని శంకించి . ఒకే సారి అందరి ఇళ్ళలో ప్రవేశించి, వారిని కుశల ప్రశ్నలు వేస్తున్నాడు।ఎలాగంటే,... సీసము: తిలకమేటికి లేదు తిలకినీ తిలకమా? పువ్వులు దురుమవా పువ్వుఁ బోడి? కస్తూరి యలదవా కస్తూరికా గంధి? తొడవులు దొడువవా తొడవుతొడవ? కలహంస బెంపుదే కలహంస గామిని? కీరముఁ జదివింతె కీరవాణి? లతలఁ బోషింతువా లతికా లలితదేహ? సరసి నోలాడుదే సరసిజాక్షి? . ఆటవెలది: మృగికి మేతలిడుదె మృగశాబలోచన? గురులనాదరింతె గురువివేక? బంధుజనుల బ్రోతె బంధుచింతామణి? యనుచు సతుల నడిగె నచ్యుతుండు. . మనసెరిగి మాట్లాడడమంటే ఇదే! ఏ భామకి దేనియందు మక్కువో గ్రహించి ఆమె taste ని ప్రశంసిస్తూనే ప్రోత్సహిస్తున్నాడు, ధర్మం హెచ్చరిస్తున్నాడు। ఇవన్నీ, మనసు నొచ్చుకోకుండా। బంధుజనుల బ్రోతె బంధు చింతామణీ? . అనడంలో ఎక్కడా నిదరణ గాని,హిత బోధ గాని, లేదు। ఇదే పద్ధతి శ్రీ రాముడు కూడా అవలంబిస్తాడు రామ

శబ్దం ద్వారా అర్థం

Image
శబ్దం ద్వారా అర్థం ప్రసిద్ధమైన అల్లసాని పెద్దన పద్యం: అట జని కాంచె భూమిసురుడంబర-చుంబి శిరస్సరజ్ఝరీ- పటల ముహుర్ముహుర్-లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన- స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్,  కటక కరేణు దీర్ఘ కరకంపిత సాలము శీత శైలమున్.... . బయటకు గట్టిగా చదిబినచో శబ్దం ద్వారా అర్థం గోచరించును.... అదే ఈ పద్యం ఒక్క ప్రచేకత...

రాముణ్ణి గుర్తు చేసే సీత ఆకృతి..

Image
రాముణ్ణి గుర్తు చేసే సీత ఆకృతి అశోక వనంలో  హనుమకి కనబడిన సీత ఆకృతి రాముణ్ణి స్ఫురింప జేసిందని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి అద్భుత కల్పన, వారి 'రామాయణ కల్పవృక్షం' కావ్యంలోనిది:.  ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా- పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే- హాకృతి, సర్వ దేహమునయందున రాఘవ వంశ మౌళి ధ- ర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ణ యట్లుగాన్ ఆదర్శ  దాంపత్యమంటే, ఆయన్ని చూస్తే ఆవిడా గుర్తుకు రావాలి, ఆమెను చూస్తే అయన గుర్తుకు రావాలి, వారి ఇంటి మర్యాద గుర్తుకి రావాలి.

నీ కోసమే నే జీవించునది...ఈ విరహంలో .. ఈ నిరాశలో... (బాపు గారి బొమ్మ.)

Image
నీ కోసమే నే జీవించునది...ఈ విరహంలో .. ఈ నిరాశలో... (బాపు గారి బొమ్మ.)

పోతనగారి పద్యం బాపు చిత్రం..౧౨

Image
పోతనగారి పద్యం బాపు చిత్రం. లఘు పద్యం కానీ ......నాలుకకి క్లిష్టం.. . గజేంద్ర మోక్షణం . అడిగెదనని కడు వడిఁ జను- నడిగిన దను మగుడనుడుగడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడఁ బడ  నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ గజేంద్ర మోక్షణ ఘట్టం. భర్తగారు ఎక్కడికో హడావుడిగా పరిగెడుతున్నారు. లక్ష్మి తటపటాయింపు ఆమె అడుగుల్లో కనబడుతోందని పోతన యీ పద్యంలో పదాలలో చూపించారు. ఇది 'సర్వలఘు కంద పద్యం'. . `ఎక్కడికి వెళ్తున్నారు?' అని అడుగుదామని తొందరగా ముందుకెళ్తుంది. అడిగినా వెనుకకి పొమ్మంటారని వెనుకకు జంకుతుంది. ఇలా అటూ యిటూ ఆగి, వెళ్ళి, తడబడుతూ అడుగులేస్తోంది. పైకి చదివితే ఈ పద్యం అందం బయటపడుతుంది.

బాపు గారి .......విష్ణుమూర్తి ..

Image
బాపు గారి .......విష్ణుమూర్తి .. . మునులు సిద్ధులు " గరుడా ! విష్ణు భక్తుడవై సదా విష్ణువుకు సమీపంలో ఉండే నీవు మాకు విష్ణుతత్వము ఎరిగించగల సమర్ధుడవు. కనుక భక్త సులభుడైన  విష్ణుతత్వము గురించి మాకు వివరించు " అని అడిగారు.  . మహానుభావులారా ! ఈ మూడు లోకములను విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు అని మాత్రమే నాకు తెలుసు. అంతమాత్రాన నాకు అన్ని తెలుసునని అనుకోవడం కష్టం. మీకు నాకే కాదు ఎవరికైనా విష్ణుతత్వము గురించి చెప్పడము కష్టమే.  . నేను విన్న ఆయన కథలను కావాలంటే చెప్తాను. నేను దేంద్రుడిని జయించి అమృతభాంఢమును తీసుకు వెడుతున్న తరుణంలో ఆకాశం నుండి " గరుడా ! నీ పరాక్రమానికి మెచ్చాను ఏదైనా వరం కోరుకో " అనే మాటలు వినిపించాయి. . అప్పుడు నేను " అయ్యా ! మీరెవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలిపి వరాలను ఇవ్వండి " అన్నాను. . ఆ మాటలకు బదులుగా ఒక నవ్వు వినిపించి తరువాత " కాలక్రమేణా నీకు నేనెవరో తెలుస్తుంది. నీవు నా వాహనముగా ఉండు. నీకు వ్యాధులు సోకవు మరణం ఉండదు. అసురులను జయిస్తావు " అన్న మాటాలు చెప్తూ ఒక కాంతిపుంజము నా ఎదుట నిలిచింది.  . నేను ఆ
Image
బాపు చిత్రం .... శ్రీ వింజమూరి శివ రామారావు గారి జోల పాట,

మన మధుర గాయకులు – ఎస్. వరలక్ష్మి

శోభనాచల: మన మధుర గాయకులు – ఎస్. వరలక్ష్మి : “తెలుగు స్వతంత్ర” వారపత్రికలో (1953) “మన మధురగాయకులు” శీర్షికన (ప్రెస్ అకాడమీ సౌజన్యం) ఎస్. వరలక్ష్మి s varalakshmi గారి గురించి ప్ర...

మన మధుర గాయకులు – ఎస్. వరలక్ష్మి

శోభనాచల: మన మధుర గాయకులు – ఎస్. వరలక్ష్మి : “తెలుగు స్వతంత్ర” వారపత్రికలో (1953) “మన మధురగాయకులు” శీర్షికన (ప్రెస్ అకాడమీ సౌజన్యం) ఎస్. వరలక్ష్మి s varalakshmi గారి గురించి ప్ర...

వేణీ సంహారం ....

Image
వేణీసంహార నాటక కర్త ------------భట్ట నారాయణుడు . వేణీ సంహారం అంటే - వేణి (ముడివేయడం) కొరకు సంహారం వేణి వలన (జరిగిన కౌరవ) సంహారం వేణి కి సంహారం (నివృత్తి) భట్ట నారాయణుడు ఏడవ శతాబ్దికవి  అంటారు .550-650 అని చెప్పవచ్చు . ఆయన రాసిన ‘’ వేణీసంహార నాటకం ‘’ వీర రస ప్రధానమై గొప్ప పేరుపొందింది  వేణీసంహార నాటకం మహా భారత ఇతి వృత్తం .  . ఇందులో ఆరు  అంకాలున్నాయి .ప్రధమాం కం లో శ్రీకృష్ణుని కౌరవుల వద్దకు రాయ బారిగా ధర్మ రాజు పంపి సంధి చేయమని కోరటం భీమ ద్రౌపదులకు ఇష్టం ఉండదు .సహదేవుడు భీముడిని శాంత చిత్తుని చేస్తాడు .కాని నిండుసభలో పాండవ రాజ పత్నియైన ద్రౌపది  తీవ్ర అవమానం పొందటం హృదయ శల్యం గా భావించి భీముడిని రెచ్చ గొట్టే ప్రసంగం చేసి అతనిలోని పౌరుషాగ్నిని రగుల్గొల్పుతుంది .ఈ మాటలకు ఉద్రేకం, ఉత్తేజం పొందిన భీముడు తన గద తో దుర్యోధనుడి తొడలను విరుగ గొట్టి ,దుశ్శాసనుడి వక్షస్తలాన్ని చీల్చి రక్తం తాగి ,ఆ రక్తం తో తడిసిన చేతులతో ద్రౌపది కేశ పాశాన్ని ముడుస్తాను అని ఘోర ,భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. ద్రౌపది దీనితో శాంతిస్తుంది .విఫలమైన సందిరాయబారం తో వికల మనస్కుడై కృష్ణుడు అప్

మనసున మల్లెల మాలలూగెనే

Image
భావకవికి ...బాపు చిత్రం.... . మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో కొన్ని వాక్యాలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు. చదివినకొద్దీ మరింత ఆహ్లాదంగా ఉంటాయి. పిల్లగాలులు పలకరిస్తాయి. మనసులో మల్లెలు పూయిస్తాయి. వెన్నెల్లోకి లాక్కెళతాయి. కమనీయమైన ప్రకృతిని హృదయానికతిస్తాయి. ఆ వాక్యాల్లో ఉన్న మత్తు అలాంటిది. 1950 లో తెలుగు సినిమా పాటకి భావ కవిత్వపు వెన్నెల సొబగులద్దీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కలం పూయించిన పారిజాత కుసుమాలు పై వాక్యాలు. అంతవరకూ సాదా సీదాగా సాగుతున్న తెలుగు పాటలోకి మల్లెల జలపాతంలా చొచ్చుకు పోయింది కృష్ణ శాస్త్రి గారి భావ కవిత్వం. తెలుగు సినిమా పాటకి కొత్త వొరవడిని చూపించి, కావ్య వర్ణనా రీతిని చొప్పించిన ఘనత కృష్ణ శాస్త్రి గారి కవిత్వానిది. భావ కవిత్వ సాగరాన్ని చిన్న పాటలో చుట్టేసిన కమనీయ విశిష్ట భావనా శిల్పం ఆయన కవిత. ఎంత రాసినా కాసింత మిగిలిపోతుంది. పైన ఉదహరించిన పాట పల్లవి మల్లీశ్వరి సినిమాలోదే! పల్లవి ఎత్తుగడే అలా ఉంటే, ఇహ చరణాలు సంగతి సరే సరి. మధురమైన ప్రేమ భావన వల్ల కలిగిన అనుభూత

బాలు........రఘు ........సాగరసంగమం

Image
బాలు........రఘు ........సాగరసంగమం . సాగరసంగమం, జూన్ 3, 1983 లో విడుదలైన తెలుగు చిత్రము.. విశ్వనాధ్ మరియు కమల్ హాసన్‌ల నట జీవితంలో ఈ చిత్రానికి ఒక ప్రముఖ స్థానం ఉంది.  . అందులో బాలు (కమల హసను ) అతని మిత్రుడు రఘు (శరత్ద్వా బాబు) ద్వారా తన భావాలు చక్కగా జంధ్యాలగారు తెలియచేస్తారు.. . “మృతిలోన ముగిసినా చితిలోన రగిలినా కడతేరి పోనీదీ మధురానుబంధము,  ఎద వీడిపోనిదీ మమతాను రాగము.” . ఈ కొన్ని మాటలతోనే బాలు అనే ఒక తాగుబోతు నాట్య కళాకారుడు కి అతని ప్రాణమిత్రుడు, కవి ఐన రఘు ల బంధం తెలియ వస్తుంది.  . కవిగా రఘు ని గురించి చెప్పడానికి జంధ్యాల వ్రాసిన . “పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్ని రాయిలా నిలిపేవాడు ఋషి, రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్య లా మలిచేవాడు మనిషి.” అన్న మాటలు చాలు. శరత్ బాబు వ్యక్తిత్వాన్ని చెప్పడానికి జంధ్యాల వ్రాసిన ఈ మాటల కన్నా ఎక్కువుగా బహుశా విశ్వనాధ్ ఇంకేమీ కోరుకొని ఉండరు.  ఆ సినిమాలోనే ఇంకోచోట, జయప్రద ఔదార్యాన్ని భరించలేక (తట్టుకోలేక) అనిపిస్తాడు “రోగం పేరుతో దానికి, దాని మొగుడి హోదాలో నాకు బానే మర్యాదలు జరుగుతున్నాయండి.” ఇక్కడ కూడా మధ్య తరగతి మనస్

దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి శబరి....బాపు చిత్రం.

Image
దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి శబరి....బాపు చిత్రం. . భగవంతుని కృప కోసం ఆర్తితో అర్థించే భక్తురాలి విన్నపంలో జాలి ఉంది. అందులో కవి హృదయ నివేదన దాగుంది. అలాగే రామాయణ కావ్య గొప్పతనం అతి సులభంగా చెప్పిన ఈ పాట చూస్తే మనసు కరుణ ప్రాయంగా మారుతుంది. ఏమి రామ కథ శబరీ, శబరీ ఏదీ మరియొక సారీ ఏమి రామ కథ – రామ కథా సుధ ఎంత తీయనిదీ శబరీ – శబరీ || ఏమి రామ కథ || భక్త శబరి చిత్రంలో ఈ పాటలో రెండు దృశ్యాల చిత్రీకరణ దాగి ఉంది. శబరి రాముడికి ఎంగిలి చేసిన పళ్ళని సమర్పిస్తే – “అవి ఎంతో తీయగా ఉన్నాయి, ఏదీ మరియొక సారీ ” అంటూ అవి తినే రాముడు కనిపిస్తాడు. రామ దర్శనం కోసం ఎదురు తెన్నులు చూసిన శబరి ఆనందం కనిపిస్తుంది. ఇది ఒక చిత్రం. రెండోది. రామా కథా మృతం – ఎన్ని సార్లు తాగినా దాహం తీరదు. ఇంకా ఆ సుధని సేవించాలానే మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఇలా రెండు దృశ్యాల్ని నాలుగు వాక్యాల్లో కమనీయం గా చుట్ట గలిగిన ప్రతిభ ఈ పాటలో కనిపిస్తుంది. సంపూర్ణ రామాయణం సినిమాలో “అదిగో రామయ్యా – ఆ అడుగులు నా తండ్రివి..” పాటలో రాముడి రాక కోసం పరితపించే శబరి ఆత్రుతని ఎంతో కమనీయంగా రాసారు. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతోంది.

అందరం సరదాగా పాడుకునే గేయం

Image
అందరం సరదాగా పాడుకునే గేయం గడపలన్నిం టిలోకి ఎ గడప మేలు ? మహాలక్ష్మి నర్తించు మా గడప మేలు అరుగులన్నిం టి లోకి ఎ అరుగు మేలు ? అతిధులందరూ జేరు మా అరుగు మేలు వీధులన్నిం టిలోకి ఈ వీధి మేలు ? కొట్లాటలే లేని మా వీధి మేలు ఊరులన్నిం టిలోకి ఎ ఊరు మేలు ? సిరులు, సంపదలు తులతూగు మా ఊరు మేలు గురువు లందరిలోన ఎ గురువు మేలు ? వేద సారము తెలుపు మా గురువు మేలు x

అద్భుత వర్ణ చిత్రాల సృష్టికర్త.... ఎంటీవీ ఆచార్య!

Image
అద్భుత వర్ణ చిత్రాల సృష్టికర్త.... ఎంటీవీ ఆచార్య! . మడిపడగ బలరామాచార్య అనే చిత్రకారుడి బొమ్మలు మాత్రం అందరికి తెలుసు. ఆయన ఎన్నో ఏళ్ళ క్రితం పాఠశాల పాఠ్యపుస్తకాలకు చక్కటి బొమ్మలు వేశారు. . ‘మహా భారతం అట్టచివరి బొమ్మకూ, అట్టమీది బొమ్మకూ ఆయన అద్భుతమైన బొమ్మలు గీశారు. ఆయనకు మనుషుల ఎనాటమీ క్షుణ్ణంగా తెలుసు. సుమారు 20 ఏళ్ళ పాటు కొనసాగిన మహాభారతం సీరియల్‌కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏ మాత్రమూ మార్పు లేకుండా చిత్రీకరించారు. అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయేది. భీష్ముడికి తెల్ల గడ్డమూ, బట్టతలా ఆయనే మొదటగా గీసినట్టు గుర్తు. భీష్మ సినిమాలో ఎన్‌.టి.రామారావు మేకప్‌ అంతా “చందమామ”కు కాపీ అని నా ఉద్దేశం.’’  . ‘కీచక వధ’ ఘట్టాన్ని ఎంత బాగా చిత్రించారో చూడండి. అస్పష్టమైన చీకటి నేపథ్యంలో భీమ, కీచకుల పోరాటం, ద్రౌపది హావభావాలు గమనించండి! అంతకుముందు భీముడితో మొరపెట్టుకుంటున్నద్రౌపది

శ్రీకృష్ణుని జననము - ........(కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా)

Image
శ్రీకృష్ణుని జననము - 1 (కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా) . స్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా  శ్రీరంగ రంగరంగా - నినుబాసి - యెట్లునే మరచుందురా కంసుణ్ణి సంహరింపా - సద్గురుడు - అవతారమెత్తెనపుడూ దేవకీ గర్భముననూ - కృష్ణావ - తారమై జన్మించెనూ యేడు రత్రులు చేరిచీ - ఒకరాత్రి - యేకరాత్రిగజేసెను ఆదివారము పూటనూ - అష్టమీ - దినమందు జన్మించెను తలతోను జన్మమైతే - తనకు బహు - మోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను బ్ట్టెను - ఏడుగురు - దాదులను జంపెనపుడు నెత్తురుతొవుండి యపుడూ - ఆబాల - కావుకావున ఏడ్చుచు నన్నేల యెత్తుకొనవే - ఓతల్లి - దేవకీ వందనంబు ఒళ్ళెల్ల హీనంబుతో - ఈరీతి - నున్నాను కన్నతండ్రి నిన్నెట్లు ఎత్తుకొందూ - నీవొక్క - నిముషంబు తాళరన్నా గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల - గంగతా నుప్పొంగెను గంగనదిలో నప్పుడూ - దేవకీ - జలకంబు లాడెనపుడు ఇకనైన యెత్తుకొనవే - నాతల్లి - దేవకీ వందనంబు కాని బాలుని వలెను - నన్నిట్లు - యెడబాసి యుండతగునా నీ పుణ్యమయె కొడకా - యింకొక్క - నిముషంబు తాళుమనుచూ కామధేనువు నప్పుడూ - దేవకీ - కడగి ప్రార్థించగాను పాలవర్షము గురిసెను - అప్పుడా