Posts

Showing posts from May, 2016

నాట్యమయూరి.!

Image
నాట్యమయూరి.! మదన మనోహర సుందర నారి  మధుర ధరస్మిత నయనచకోరి  మందగమన జిత రాజమరాళి  నాట్యమయూరి ఈ ఈ ఈ ఈ ఈ  అనార్కలి అనార్కలి అనార్కలి

నీ రూపమే ఆలాపన!

Image
నీ రూపమే ఆలాపన! . నీడజూసి నీవనుకొని పులకరింతునే అలవికాని మమతలతో కలువరింతునే నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే రావే రాగమయీ నా అనురాగమయీ రావే రాగమయీ నా అనురాగమయీ

కృష్ణ భక్తప్రియా !.

Image
కృష్ణ శతకం .!.....(31/5/16.) . (కృష్ణ శతకం లోనిదీ పద్యం . కృష్ణ శతకం తిక్కన రాసిన దని కొందరి అభిప్రాయం . ఈ శతకం ఇప్పుడు లభించడం లేదు .) . "అరయన్ శంతను పుత్రుపై విదురుపై నక్రూరుపై గుబ్జపై నరుపై ద్రౌపదిపై గుచేలునిపయిన్ నందవ్రజ శ్రేణిపై బరగం గల్గు భవత్కృపారసము నాపై గొంత రానిమ్ము నీ చరణాబ్జమ్ములె నమ్మినాడ జగదీశా ! కృష్ణ భక్తప్రియా !. . భక్తులు ఎంతమందో ! గాంగేయుడు , విదురుడు , అకౄరుడు , కుబ్జ , ద్రౌపది , కుచేలుడు , నందుని పరివారమంతా ,చెప్పుకుంటూ పోతే ఎంతమందో . జగన్నాటక సూత్రధారి దయకు పాత్రులైనవారు లెక్కకు మించి ఉన్నారు . . భక్తుడు భగవంతునికి కొందరు భక్తుల పేర్లను జ్ఞాపకం చేసి , పరమాత్మా నేనుకూడా నీ శ్రీచరణాలను ఆశ్రయించిన వాడినే .  ఇతర భక్తులమీద చూపిన కృప నా మీద కూడా కొంతైనా ప్రసరింపజేయవా !  అని దీనంగా అర్థిస్తున్నాడు . . నేను నీ భక్తుణ్ణేనని చెబుతూ , కృష్ణా భక్త ప్రియా అని సంబోధించి ఆ స్వామి దయకు డవుతున్నాడు . ” శరణం నీ దివ్య చరణం ” అని భక్తుడు ప్రార్థిస్తే భగవంతుడు కరిగిపోడా (కేశవన్ గారి చిత్రం...శ్రీకృష్ణ..కుబ్జా.)

పోతన - శ్రీమద్భాగవతం !... జనయిత్రి.!

Image
పోతన - శ్రీమద్భాగవతం !... జనయిత్రి . జనయిత్రి గర్భమందును ఘనక్రిమివిణ్మూత్రరక్తగర్భములోనన్ మునుగుచు జఠరాగ్నిని దిన దినమును సంతప్యమానదేహుండగుచున్ . పద విభాగం: జనయిత్రి, గర్భమందును, ఘన, క్రిమివిత్, మూత్ర, రక్తగర్తము, లోనన్, మునుగుచు, జఠరాగ్నిని, దినదినమును, సంతప్యమాన, దేహుండు, అగుచున్ భావం : ఓ తల్లీ! మనిషి.. తల్లి గర్భంలో ప్రవేశించి, అందులో ఉన్న దట్టమైన క్రిమి సమూహాలతో, రక్త మల మూత్రాలతో నిండి ఉన్న గుంటలో పడి, అక్కడ జఠరాగ్నితో రోజురోజూ పెరుగుతూ, బాధలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు.

కలయో ! వైష్ణవ మాయయో ?

Image
కలయో ! వైష్ణవ మాయయో ? (వడ్డాది వారి చిత్రం.) . "కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమో తలపన్నేరక యున్నదాననో ! యశోదాదేవి గానో ! పర స్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర జ్వలమై యుండుట కేమి హేతువో ! మహాశ్చర్యంబు చింతింపగన్" . భాగవతంలో భగవంతుడు యశోదాదేవికి విశ్వరూపాన్ని చూపించిన ఘట్టం . పసిబాలుని నోటిలో సప్త సముద్రాలు , ఎత్తైన కొండలు , మహారణ్యాలు , సూర్య చంద్రులు , భూగోళం , సకల నక్షత్రాలు కనిపించాయి . బ్రహ్మాండాన్ని కనులతో చూచిన ఆ తల్లికి ఒక్కసారిగా మతిపోయింది . ” ఇది కలా ! నిజమా ! అసలు నేను యశోదా దేవినేనా . ఇది మా యిల్లేనా ? విష్ణుమాయా ? సత్యమేనా ? అసలు నా బుధ్ధి పనిజేస్తోందా ? చూడడానికి పసి బాలుడు . నోరు తెరిస్తే విశ్వం కనిపిస్తోంది . ఇంతకంటే వింత ఏదైనా ఉంటుందా ? . అలోచించిన కొలదీ ఆశ్చర్యం వేస్తున్నది . అని ఆమె మనసు పరి పరి విధాల ఆలోచించింది . నా భ్రమ తొలగడానికి అన్ని లోకాలకూ అధిపతి అయిన ఆ విష్ణుమూర్తినే శరణు కోరుతాను ” అని అనుకొని భగవంతుని శరణు కోరింది మాత . కోరిన మరుక్షణం మాయ కరిగి పోయింది . సర్వాత్ముడు పసిబాలుడుగా కనిపించాడు . క్షణక

గానుగ .!

Image
గానుగ .! గానుగ మనిషిని పిలిచి 'గానుగ ఆడుతున్నట్లు ఎట్లా తెలుస్తుంది? అని అడిగాడు. ఎద్దుమెడలో గంట ఉంది గదా అన్నాడు గానుగ మనిషి. ఎద్దు ఒకే చోట నిలబడి మెడ ఆడిస్తే ఏం చేస్తావన్నాడు పండితుడు.  నా ఎద్దు నీలాగ చదువుకోలేదు.

ఈ కథ చాలా పాతకాలందిలెండి.!

Image
వ్యాకరణంలో సంబాషణ! . ఈ కథ చాలా పాతకాలందిలెండి.! ఒక పండితుడు ఇంకో పండితుడి గ్రామానికి బస్సు లో వస్తున్నానని కబురు చేశాడు.తన ఇంటికి వస్తున్నఆ పండితుడిని ఆహ్వానించడానికి ఈయన బండి కట్టుకొని ఆ బస్సు వచ్చే చోటికి వెళ్తాడు.అది గ్రామానికి 3,4 మైళ్ళ దూరంలో వుంది..వెళ్లి ఆ పండితుడిని సాదరంగా ఆహ్వానించి బండి లో కూర్చో బెట్టి బయల్దేరాడు . త్రోవ బాగా లేకపోవడం వల్ల బండి కుదుపులతో నడుస్తూ వుంది.కుదుపులు ఎక్కువవడం తో .  పోరుగూరినుంచి వచ్చిన శాస్త్రి గారు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు.  దానికి ఆ బండి యజమాని శాస్త్రి గారూ  మీరంటున్నది షష్టీ తత్పురుష మా లేక కర్మధారయమా?అన్నాడు నవ్వుతూ  షష్టీ తత్పురుషము అంటే వెధవ యొక్క బండిఅనే అర్థము వస్తుంది  కర్మధారయ మైతే 'వెధవ యైన బండి' అని అర్థము వస్తుంది. (బండి యొక్క యజమాని వెధవనా?బండి వెధవదా?)  ఆ శాస్త్రి గారు నవ్వుతూ యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి.  (అంటే వెధవ కొరకు యిలాంటి బండి) అన్నాడు. యిద్దరూ హాయిగా నవ్వుకున్నారు.. ఆ కాలం పండితులు అలాంటి చెణుకులు విసురుకునేవారు. .... ఒక శిష్యుడు గురువుగారి దగర విద్య నభ్యసించి,పెళ

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా

Image
చుట్టూపక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా కళ్ళముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం సాధించదు ఏ పరమార్ధం, బ్రతుకును కానీయకు వ్యర్ధం

మృదుపదాల మేస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి!

Image
మృదుపదాల మేస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి! . పాటల లోకంలో విరిసిన పారిజాతం దేవులపల్లి. ఆయన 1897లో రామచంద్రపాలెంలో జన్మించినప్పట్నించీ-  -''ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై''- మాటల ముత్యాలతో తెలుగు వాగ్గేయకారుల్ని మించిన అందాల్ని తెలుగు పాటలకు అందించారు. ఆయన బ్రహ్మ సమాజవాది. కనిపించే ప్రతి రాయికీ, ప్రతి రప్పకీ, బొమ్మకీ, శిలకీ మొక్కవద్దని చాలా స్పష్టంగానే అన్నారు.  . ''ప్రతి కోవెలకూ పరుగిడకు  ప్రతి బొమ్మకు కైమోడ్చకు...''  . ఆయన ''ప్రభు! ప్రభు! ప్రభు! దీనబంధు, ప్రాణేశ్వర దయాసింధు...'' అంటూ ఈశ్వరుడిని ఎలా వేడుకొన్నారో హైదరాబాదులో ఉన్న తరుణంలో సాయంత్రం వేళ నమాజు విని అల్లాను అలాగే వేడుకొన్నారు.  . ఖుదా! నీదే అదే పిలుపు  ఖుదా! నీదే సదా గెలుపు  . కృష్ణశాస్త్రి ఏ విషయంమీద పాట రాసినా ప్రతి మాట లయాత్మకంగా అందులో ఒదిగి పోతుంది. ఆయన్ని అందుకే వడ్డెపల్లి కృష్ణ ''మృదు పదాల మేస్త్రీ'' అన్నారు... లేకుంటే ఇంత కమ్మగా ఎలా సాధ్యమైంది-  . ''ముందు తెలిసెనా, ప్రభు ఈ  మంద

శిథిలాలయమ్ములో శివుడు లేడోయి-

Image
ఎన్నాళ్ళయ్యిందండీ..కృష్ణ శాస్త్రి గారి పాట విని , (ఇక్కడ కృష్ణ శాస్త్రి గారి భావన శిధిలావస్థలో  ఉన్న శరీరం లో ప్రాణం ఉన్నా లేకున్నా ఒకటే.) . శిథిలాలయమ్ములో శివుడు లేడోయి- ప్రాంగణమ్మున గంట పలుకదోయి . దివ్యశంఖము గొంతు తెరువ లేదోయి-  పూజారి గుడి నుండి పోవలేడోయి . చిత్ర చిత్రపు పూలు చైత్ర మాసపు పూలు- ఊరూర నిటింట ఊరకే పూచాయి . శిథిలాలయమ్ము లోశిలకెదురుగా పూలు-  పూజారి కొకటేని పూవు లేదోయి . వాడవాడల వాడె జాడలన్నిట వాడె- ఇంటి ముంగిట వాడె ఇంటింటి లో వాడె . శిథిలాలయమ్ము లో శిలను సందిట బట్టి-  పూజారి వాని కై పొంచి ఉన్నాడోయి. .. దేవులపల్లి వారి పాట యేదయినా సరే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంటాయి.  . ("అడుగడుగున గుడి ఉందీ - అందరిలో గుడి ఉందీ,  నిదురించే తోటలోకీ పాట ఒకటి వచ్చిందీ,  రాయినయినా కాక పోతిని రామ పాదము సోకగా, ఆకులో ఆకునై, వగైరా పాటలు)

తల్లి ప్రేమ.!

Image
తల్లి ప్రేమ.! . కస్తూరి రంగరంగా - నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా - నినుబాసి ఎట్లునే మరచుందురా కస్తూరి రంగరంగా - నాయన్న కావేటి రంగరంగా. . శ్రీరంగరంగరంగా - నినుబాసి ఎట్లునే మరచుందురా. కంసుణ్ణి సం హరింప - సద్గురుఢు అవాతారమెత్తినపుఢు.  దేవకి గర్భమునను - కృష్ణావతారమై జన్మించెనూ.  ఏడు రాతృలు వింతగా - తాబూని ఏకరాత్రిగ చెసెను. ఆదివారము పూటనూ - అష్టమి దినమందు జన్మించెను. తలతోటి జననమైతే - తనకు బహుమోసంబు వచ్చుననుచు.  ఎదురు కాళ్ళను బుట్టెనూ - ఏడుగురు దాదులను తాచంపెనూ. నెత్తుటిలో వుండినపుడు - ఆబాల కావుకావున ఏడ్చుచూ. నన్నేల ఎత్తుకొనవే - నాతల్లి దేవకీ వందనంబు.  ఒళ్ళెళ్ళ హీనంబుతో - ఈరీతి నున్నవు కన్నతండ్రీ.  నిన్నెట్టు లెత్తుకుందూ - నీవొక్క నిముసంబు తాళుమంచు.  గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల గంగ తానుప్పొంగెనూ.  గంగ నీటిలోనప్పుడూ - దేవకీ జలకంబు లాడెతానూ.  ఇకనైన ఎత్తుకొనవే - నాతల్లి దేవకే వ0దన0బు.  కానిబాలునివోలెను - నన్నిట్ట్లు ఎడబాసి వు0డతగునా.  నీ పుణ్యమాయె కొడకా - ఇ0కొక్క నిమిష0బు తాళుమనుచూ.  కామధేనువు నప్పుడూ - దేవకీ మదిలోన తలచగానూ. పాలవర్షము కురి

దాసు శ్రీరాములు...(కీర్తన)..........కట్టివైతునా పడకింటిలో ..! .

Image
దాసు శ్రీరాములు...(కీర్తన)..........కట్టివైతునా పడకింటిలో ..! . కాంభోజి - త్రిపుట  . పల్లవి:  కట్టివైతునా పడకింటిలో వాని బట్టి పైట కొంగున ॥కట్టి॥  అనుపల్లవి:  ఇట్టివాడు వంట - ఇంటి కుందేలాయె ఎక్కడ బోయే ననుకో రాదమ్మ ॥కట్టి॥  చరణ:  విడచితినా సామి - వీధివీధి తిరిగి - వేగత్తెల గుడునే తడబాటులేక చే - తను జిక్కినప్పుడే చెడనీక పదిలము - చేసుకోవలెనమ్మ ॥కట్టి॥  ఏమరి నేనూరకుంటినా - ఈ రాత్రి - ఏవేళ కేబుద్ధియో కోమలమున నింత - గోవగొన్నవాడు వామాక్షి మనవాడ నమ్మరాదమ్మా ॥కట్టి॥  మోస పోతిని వేణు - గోపాల దేవుని - బాస నిజము గాదే దాసు శ్రీరామదాసుని - హృదయము బాసి గడియయైన - నిలువ నొల్లడమ్మా ॥కట్టి॥

వక్రత .!

Image
వక్రత .! వక్రత అంటే, చెప్పే విషయాన్ని సాధారణంగా సూటిగా కాకుండా, విభిన్నంగా చెప్పడం.  ఉదాహరణకి “శ్రామికుని నెత్తురు చెమటగా కారిపోతోంది” అని చెప్పడం సాధారణ అలంకారం.  అదే, “శ్రామికుని నెత్తురు ఎఱ్ఱదనం కోల్పోయి పల్చబడి ఒంటిమీంచి జారిపోతోంది” అని అంటే అది వక్రత.  వక్రత చెప్పే విషయాన్ని గూర్చి అనేక కోణాలని చూపించగలుగుతుంది, కానీ కొన్నిసార్లు కవిత్వంలో అస్పష్టతకి కూడా దారితీస్తుంది.  ఉత్తరహరివంశంలో అడుగడుగునా యీ వక్రత అగుపడుతుంది.  చెప్పే విషయం కానీ, చేసే వర్ణనకానీ ఏదో విలక్షణతతో,  వక్రమార్గం లోనే సాగించడం సోమన ప్రత్యేకత.  ఉదాహరణకి యీ పద్యం చూడండి: . "కుజము కుంజరముచే కూలునో కూలదో? . కూలు; కుంజరము నీ కుజము గూల్చె! . మ్రాను పేరేటిచే మడుగునో మడుగదో? . మడుగు; పేరేటి నీ మ్రాను మడచె! . గాలునో యొకనిచే గాలదో సాలంబు? . గాలు; నీ సాలంబు గాల్చె నొకని! . దునియునో పరశుచే దునియదో వృక్షంబు? . తునియు; నీ వృక్షంబు తునిమె బరశు! . ననుచు దమలోన జర్చించు నమరవరుల కభిమతార్థ ఫలార్థమై యంద వచ్చు పారిజాతంబు నా మ్రోల బండియుండ నంద గంటి నా కోర్కుల నంద

తెనాలి వారి స్వభావ చిత్రణము.!

Image
తెనాలి వారి స్వభావ చిత్రణము.! ఉ: ఎల్లరు నెల్లచో ధనములిచ్చి మృగాక్షుల గొంద్రు గాని, యో పల్లవపాణి ! నే పరమ పావన వంశమునిచ్చిఁ గొంటి , నీ 'నల్లనిరూపు' నిక్కమని నమ్మి ధృవంబటుఁగాక, నేడు వి ద్యుల్లతికాధికాభినయ ధూర్వహ మౌట నెఱుంగ భామినీ ! పాం:మాహాత్మ్యము -3 ఆ: 93వ :పద్యము; కఠిన పదముల కర్ధము:- మృగాక్షులు-స్త్రీలు; పల్లవపాణి- చిగురాకులవంటి చేతులు గల చాన ; ధృవము- శాశ్వతము ; విద్యుల్లతిక-మెఱపుతీగ ; అభినయము- నటన ; ధూర్వహము-భారమును మోసెడిది; కతిపయ దినములకు కాపుచిన్నది యకాల మరణము నందెను. ఇట్లువారిముచ్చట మూన్నాళ్ళు సాగినది. నిగమ శర్మ కొత్త తోడు కోసం వెదకులాట మొదలు పెట్టినాడు. వాని స్వభావ మట్టిది. అతడాకలికాగలేడు.ముఖ్యముగా మూడు అతనికి ముఖ్యావసరములు గామారినవి 1 మద్యము 2మాంసము 3మగువ ; వీనిలో మగువకిచ్చిన ప్రాధాన్యము మరియొకదానికి లేదు. ఆకారడవిలో నతనికి చిక్కెడిదెవరు? ఒక ఆటవిక వనత మాతంగి చిక్కినది. అది నల్లని వికృత రూపి. అయినను కామాంధుడగు ఆతనికి యందగత్తెగానే దోచినది. తామెచ్చినది రంభ!తామునిగినది గంగ గదా! దానితోనేపునః సంసార మారంభమైనది. దానికి వరుసకాన్పులు.ఆరునెలలు బాలింత మఱి యా

ఆకాశవాణి ..విజయవాడ .!

Image
ఆకాశవాణి ..విజయవాడ .! . బాలాంత్రపు రజనీకాంతరావు పేరు చెబితే... ఆకాశవాణి గుర్తుకొస్తుంది. ఆకాశవాణి పేరు చెబితే... రజనీకాంతరావు గుర్తొస్తారు. ప్రారంభదశలో ఆకాశవాణి కి జవం, జీవం ఇచ్చిన రూపశిల్పి ఆయన. తొలినాళ్లలో ఆకాశవాణికి దిశానిర్దేశం చేసిన దార్శనికుడాయన. గొప్ప గొప్ప కళాకారుల్ని పరిచయం చేయడమే కాక, భక్తిరంజని వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించిన సృజనశీలి... సంగీత, సాహిత్య శిఖరాలను అధిరోహించిన వాగ్గేయకారుడు రజనీకాంతరావుతో కొంతకాలం కిందట విశాఖలో కె.రామచంద్రమూర్తి జరిపిన ప్రత్యేక సంభాషణ ఇది... మీ ఆధ్వర్యంలో ఆకాశవాణికి అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆ సందర్భంలో మీ అనుభూతి... ? అంతర్జాతీయ రేడియో కార్యక్రమాల పోటీలో మనం కూడా పాల్గొనాలి అని మా డెరైక్టర్ జనరల్ చెప్పారు. అది నీ ద్వారానే జరగాలి, పోటీకి పంపాల్సిన కార్యక్రమాన్ని నువ్వే తయారు చేయాలి అని నాతో అన్నారాయన. అది పిల్లలకు భౌగోళిక శాస్త్రం బోధించే విధంగా ఉండాలని చెప్పారు. అలా ఉండాలి అంటే... పిల్లలకు ఏ నదుల గురించో పర్వతాల గురించో వివరిస్తూ ఉన్నట్టుగా ఓ యాత్రాకథనాన్ని తయారు చేయాలనిపించింది నాకు. దాంతో ‘కొండ నుంచి కడలి దాకా’ అన్న

ఉన్నదొక్కటే. !

Image
ఉన్నదొక్కటే. ! . ఉన్నది ఒక్కటే, లేనేలేదు రెండవది  నీలోనా, నాలోనా మన అందరిలోనా ఉన్నదొక్కటే  నీటిలో,నింగిలో,గాలిలో,అగ్గిలో,భూమిలో  అంతటా వ్యాపించి ఉన్నదొక్కటే . "నేను, నేనని" నీవనుచున్నావు, అదే నేనూ అనుచున్నాను  అందరిలోనా వున్న ఈ నేనెవరన్నదే వేదాంతం  ఈ దేహేంద్రియములు, ప్రాణముకూడా కాదు "నేను"  గుండెగుహలో చిరుజ్యోతిగా వెలిగెడి ఆత్మయే "నేను" భాషా భారతి's photo.

నగేష్‌ !

Image
గోపీ..కాఫీ.. అంటే మన సుందరం గుర్తుకు వస్తాడు. నటుడు తెరపెై ఎంతసేపు కనిపించాడన్నది కాదు ప్రశ్న,  ఎంతలా ప్రేక్షకుల హృదయాల్ని రంజింపచేశాడన్నది ముఖ్యం.  తెరపెై రెండు సెకన్లు కనిపించినా గంటల కొద్దీ నవ్వు తెప్పించగల నటుల్లో  నగేష్‌ ప్రధముడు. సున్నిత మైన హాస్యాన్ని పండించడంలో దిట్ట.  వెకిలి హాస్యం అన్నదే అతనికి తెలీదు.  అందుకే అతని పుట్టించిన నవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతూనే ఉంటుంది.  తెలుగు సినిమాకి లభించిన సున్నితమైన హాస్య నటుల్లో నగేష్‌ పేరు  చిరస్తాయిగా నిలిచిపోతుంది.

భార్యలను "ఒసే" అని పిలవడం .!

Image
భార్యలను "ఒసే" అని పిలవడం .! (శ్రీ తుర్లపాటి కుటుంబరావుఆత్మకథవిషయపేజీలు నుండి.) . నా వివాహమైన తరువాత కూడా నా భార్యను "ఏమండీ!" అని సంబోధించే వాడిని! ఎందువల్ల నంటే, ఆమె నాకు పెళ్లికి పూర్వమే పరిచయం అయింది. అప్పుడు సహజంగా ఆమెను మీరు, ఏమండీ! అని సంబోధించేవాడిని. ఔను! పెళ్లికి పూర్వం ఏమండీ! అని పిలిచిన వ్యక్తిని పెళ్లి కాగానే "ఒసేయ్! ఏమేవ్‌!" అని పిలవాలా? ఏమి! పెళ్లి కాగానే స్థాయి, విలువ, గౌరవం పెరగాలి కాని, తగ్గిపోవాలా? అది పురుషాధిక్యతా మనస్తత్వం కాదా? అంతకాలం "ఏమండీ!" అని పిలిచి, మూడు ముళ్లుపడగానే భార్యకు బానిసత్వం, భర్తకు "బాస్‌ తత్వం" రావాలా? ఈ ఆలోచనే ఆమెను "ఏమండీ!" అని పిలిపించింది! అయితే, నా "పిలుపు" కుటుంబంలోని పెద్దలకు కొంత ఇబ్బందే కలిగించింది. కవయిత్రి అయిన మా అమ్మగారు కూడా తన కుమారులమైన మమ్మల్ని "ఏరా!" అని పిలిచేది కాదు. పేరు పెట్టి పిలిచేదే కాని, "ఒరే", "ఏరా" అనేది కాదు. అప్పటిలో కోడళ్లను కొందరు అత్తలు చాలా చులకనగా, కేవలం పనిమనుషులుగా, హీనంగా చూచేవారు. ఒస

అసలు వేదమనగానేమి ?

Image
అసలు వేదమనగానేమి ? వేదమంటే ’ జ్ఞానము ’ అని అర్థము. పరమాత్మ , జీవులు , దేవతలు , ప్రకృతి , ధర్మము మొదలగు విషయములను గురించిన జ్ఞానము. అతి పవిత్రమై , అత్యంత ప్రామాణికమై , మన ధర్మములు , దర్శనము , సమాజము మొదలగు వాటిపై అంతిమ నిర్ణయమును చెప్పు అధికారమున్న గ్రంధమే వేదమని చెప్పవచ్చును. అది అతీంద్రియ సత్యములను తెలియగోరు అందరు సాధకుల పవిత్ర గ్రంధము. వేదమను పదము , ’ జ్ఞానము ’ అథవా ’ పొందుట ’ యను అర్థమును ఇచ్చు ’ విద్ ’ అను ధాతువు నుండీ ఏర్పడ్డ శబ్దము. || వే॒దేన॒ వై దే॒వా అసు॑రాణాం వి॒త్తం వేద్య॑మవిన్దన్త॒ తద్వే॒దస్య॑ వేద॒త్వమ్ || అనే తైత్తిరీయ సంహితలోని ఈ మంత్రము వలన ఈ విధముగా తెలియుచున్నది: అసురులు పొందిన , మరియు ఉపయోగించనున్న ద్రవ్యములను దేవతలు దేనివలన తెలుసుకొని పొందినారో , అది వేదము. వేదమంటే జ్ఞానము మాత్రమే కాదు. అది , మానవుడు కాంక్షించు అనేక విషయములను అతనికి తెచ్చి ఇవ్వగల సామర్థ్యము కలిగినది. || ఇష్ట ప్రాప్త్యనిష్ట పరిహారయోః అలౌకికం ఉపాయం యో గ్రంధో వేదయతి స వేదః || కోరిన ఇష్టములను పొందుటకును , కీడు ను తప్పించుకొనుటకును గల అలౌకిక ఉపాయమును తెలుపు గ్రంధమే వేదము అని ఆచార్య సాయణుల

వాల్మీకి మహర్షి ...అగ్నిశర్మ..!

Image
వాల్మీకి మహర్షి ...అగ్నిశర్మ..! మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు  వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. "తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం | నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం || . సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి "నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు" అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్

అప్పటి మాటలకు.! . కీర్తన........ దాసు శ్రీరాములు

Image
అప్పటి మాటలకు.!  . కీర్తన........ దాసు శ్రీరాములు . తోడి - త్రిపుట పల్లవి: అప్పటి మాటలకు - దుప్పటిచ్చె గాని అప్పటి గప్ప నిచ్చెనటే చెలి ॥అప్పటి॥ అనుపల్లవి: తప్ప నే నితరుల - దరి జేరనని యెన్నో చెప్పిన తలచు కొంటినే ఓ చెలి ॥అప్పటి॥ చరణ: తొలినాటి వగలే యా - మరునాటి పగలు మా చెలిమి కాకియు కో - వెల చందమాయెనే ॥అప్పటి॥ పడతి మగవారి బారు - పడకింట మితిమీరు గడప దాటిన వెనుక - కారు మన వారు బడిబడి నాడు వారు - బ్రతిమాలి పాదముల బడి వేడు కొన్నగాని - పలుకే మేల్మి బంగారు ॥అప్పటి॥ కాసు వీసము లిచ్చి - గోస గూసల మసి బూసి నేరేడు గాయ - జేసెనే చెలి వేసాలమారి మా - వేణుగోపాల మూర్తి దాసు శ్రీరామకవి - డాసి యేలుచుండెనే ఓ చెలి ॥అప్పటి॥

ఉత్తరకుమారుడు!

Image
ఉత్తరకుమారుడు! . "భీష్మద్రోణ కృపాది ధన్వినికరా భీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త జా లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజా ర్చిష్మత్వాకలితంబుసైన్యమిదియే జేరంగ శక్తుండనే" . ఈ పద్యం విరాటపర్వం,చతుర్ధాశ్వాసంలో ఉత్తరకుమారుడు కురుసైన్యాన్ని చూసి భయ భ్రాంతుడైన సందర్భంలోది. భీష్మద్రోణ కృపాదులవంటి అతిరధ,మహారధులు, వేసవిసూర్యుడి ప్రతాపం లాంటి శౌర్యంగల వీరులు నిండివున్న అపారమైన సేననుగూర్చి చెప్పేటప్పటి భాషకు ఎంతటి రాజసం , హంగు ఉండాలో ఈ పద్యం చూపిస్తుంది. పైపెచ్చు చెబుతున్నది  సముద్రంలాంటి సేనను చూసి భయభ్రాంతుడైన రాకుమారుడు ఉత్తరకుమారుడు. భయపడ్డ అతనికనులకు ఈ ఉద్దండమైన సేన మరీ ఉగ్రంగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. . గుక్కతిప్పకుండా చక్కటి ఉచ్చారణతో ఈ పద్యం చదివితే , పద్యం తాలూకు వాచ్యార్ధం పూర్తిగా తెలియకముందే , ఈ పద్యానికి మూలభావం మనకు స్ఫురిస్తుంది. ఆ మూలభావం గొప్ప అబ్బురంతో , అడ్మిరేషన్ తో కూడిన భయం. “శస్త్రాస్త జా లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజార్చిష్మత్వాకలితంబు” అనేసరికి , . ఆ మేఘగర్జనలాంటి

స్థితిగతులు!

Image
స్థితిగతులు! . పాతికేళ్ళ క్రితం – రామయ్యకి రోజుకొక్క పూటే- నోట్లోకి నాలుగు వేళ్లు పోయేవి…… పాపం – పేదరికం ! . ఇప్పుడతను రామయ్యగారు…. కోటీశ్వరుడైపోయాడు- ఇప్పుడా ఒక్కపూటైనా నోట్లోకి నాలుగువేళ్లు పోవడం లేదట—- అనారోగ్యమేమో అనుకొన్నాను ! . అతని వేళ్ల దురదృష్టానికి బాధపడుతూ అతని కుడి చేతి వేళ్ళ వైపు జాలిగా చూశాను— పది తులాలకు తగ్గని కండబలంతో వేలికొక పసిడిదేవుడు చుట్టుకొని వున్నాడు! అరెరె…. ఎడం చేతి వేళ్లకు కూడా ! ఇక నోట్లోకి వేళ్లా? ఎలా? అయ్యోపాపం… ఐశ్వర్యం!!!

నాలుగుస్తంభాలాట! .

Image
నాలుగుస్తంభాలాట! . నాలుగు స్తంభా లాటా, నడిమికి తొడిమికి, తానక తప్పక, తన పేరేమంటే, ఉట్టిమీద బెల్లం, పొట్టికాకరకాయ! బావా! బావా! బరుకూ, బరుకూ! తన్నులు తింటే -- తలకొకటి. (తలకట్టు)

ఏనుగమ్మా ఏనుగు!బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి

Image
బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి  ఏనుగమ్మా ఏనుగు! . ఏనుగమ్మా ఏనుగు! ఏ ఊరొచ్చింది ఏనుగు? మా ఊరొచ్చింది ఏనుగు. ఏం చేసింది ఏనుగు? మంచినీళ్లు తాగింది ఏనుగు. ఏనుగు ఏనుగు నల్లన్న, ఏనుగు కొమ్ములు తెల్లన్న, ఏనుగుమీద రాముడు ఎంతో చక్కని దేవుడు!

అంత గీర్వాణము - నేనేరరా స్వామి కీర్తన దాసు శ్రీరాములు

Image
అంత గీర్వాణము - నేనేరరా స్వామి కీర్తన దాసు శ్రీరాములు ..అసావేరి -త్రిపుట . పల్లవి: అంత గీర్వాణము - నేనేరరా స్వామి అచ్చతెనుగు జెప్పరా ॥అంత॥ అనుపల్లవి: వింతగా ననుజూచి - "విరిబోణియవి పూవు బంతులా యేమని" - పకపక నగియెదవు ॥అంత॥ చరణ: చాలగా మదన ప్ర - చారములను నే జాణగాను గదరా "మేలు వేలుపుప్రోడ - మిద్దెటింటికి జేర వీలు దెలుపు" మని - వేవేగ ననియెదవు ॥అంత॥ వీరాసనము వైచి - పెదవి పంటను గరచి తీరుగా కన్నుగీటుచు "వారిజ ముఖి మంచి - పగడము ముత్యాల చేరులోనికి దయ - సేయుమీ" అనియెదవు ॥అంత॥ వాలాయముగ తోట్ల - వల్లూరి వేణుగో పాల నిన్నే నమ్మితి శీల మొప్పగ "దాసు - శ్రీరామ కవి కృతి లీలాం శ్రుణు మహిళే" - అని పల్కెదవు ॥అంత॥

ఒలియో ఒలియా ఒలియా వేలుగలవాడా రారా పొలిగాడా!

Image
పొలిపదం! (వడ్డాది వారి చిత్రం.) . ఒలియో ఒలియా ఒలియా వేలుగలవాడా రారా పొలిగాడా . ఊరికి ఉత్తరాన ఊడల మఱ్ఱి ఊడలామఱ్ఱిక్రింద ఉత్తముడిచేతికె ఉత్తముడి చెబికెలో రత్నాలపందిరి రత్నాల పందిట్లో ముత్యాలకొలిమి గిద్దెడు ముత్యాల గిలకలా కొలిమి అరసోలముత్యాల అమరినా కొలిమి సోలెడుముత్యాల చోద్యాల కొలిమి తవ్వెడు ముత్యాల తరచినా కొలిమి మానెడు ముత్యాల మలచినా కొలిమి అడ్డెడు ముత్యాల అలచినా కొలిమి తూముడు ముత్యాల తూగెనే కొలిమి చద్ది అన్నముతినీ సాగించు కొలిమి ఉడుకు అన్నముతిని ఊదెనే కొలిమి పాల అన్నముతిని పట్టెనే కొలిమి ఊదేటి తిత్తులు ఉరుములామోలు వేసేటి సంపెట్లు పిడుగులామోలు లేచేటి రవ్వలు మెరుపులామోలు చుట్టున కాపులు చుక్కలామోలు నడుమకమ్మరిబిడ్డ చంద్రుణ్ణి బోలు ...

యాజమాన్య నైపుణ్యాలు! (లేక ఏమిలేని అయ్య ఊట్టి కిఎక్కుట.)

Image
యాజమాన్య నైపుణ్యాలు! (లేక ఏమిలేని అయ్య ఊట్టి కిఎక్కుట.) . తండ్రి: (కొడుకుతో) నాన్నా! నేనో అమ్మాయిని చూశాను. నువ్వు వెంటనే పెళ్ళిచేసుకోవాలి. కొడుకు: ఉన్న ఫళాన పెళ్ళా! అదెలా సాధ్యం.  తండ్రి: మరొక్క సారి ఆలోచించుకో! వచ్చిన సంబంధం బిల్ గేట్స్ కూతురు  కొడుకు: అలాగే (తండ్రి బిల్ గేట్స్ వద్దకెళ్ళి) తండ్రి: మావాడు మీ అమ్మాయిని పెళ్ళిచేసుకోవాలి!  బిల్ గేట్స్: అసంభవం! తండ్రి: మరోసారి ఆలోచించుకొండి! మావాడు స్విస్ బ్యాంకు సీయీఓ.  బిల్ గేట్స్: ముహూర్తాలు పెట్టించండి! (తండ్రి స్విస్ బ్యాంకుకెళ్తాడు) తండ్రి: మావాడిని మీ బ్యాంకు సీయీఓ గా నియమించాలి! బ్యాంకు: అదెలా? అసంభవం! అసాధ్యం! తండ్రి: మరోసారి ఆలోచించుకొండి! మావాడు బిల్ గేట్స్ అల్లుడు, బ్యాంకు: ఓహ్! నియామక పత్రాలు తీసుకెళ్ళండి!  @ ఇది హర్షాద్ మెహతానుండి రామలింగరాజుదాకా అనుసరించిన పాఠం  “వీళ్ళందరి గతి ఏమైంద”ని మనలాంటివాళ్ళు ఎకెసెక్కంగా అడిగితే “రిలయంస్‌ మాదిరిగా నీరా రాడియా లాంటి పీ ఆర్ ఓ ని నియమించుకోవాలి”  ఇదో కొనసాగింపు పాఠం.!!!!!!

ఏది నిజం- ఏది నీడ.!

Image
ఏది నిజం- ఏది నీడ.! . అద్వైతం అన్న మాట లోనే ద్వైతం ఉంది .  ద్వైతం అంటే రెండు .  ఆ రెండూ ఒక్కటనే భావం అద్వైతంలో ఉంది  . భగవదాంశ ఒకటి మనలో ఉండేది నిజం అయితే ,  అదే ఆత్మ అని అంటే ఆ ఆత్మే  మనం అన్నది సత్యమైతే మనకు కష్టాలు ఎందుకు ? . మనలో ఇద్దరు ఉన్నారు . ఎన్నడు విడివడని రెండు పక్షులు ఒకే చెట్టు పై కూర్చున్నాయి . వాటిలో ఒకటి పండ్లను ఆస్వాదిస్తూ తింటున్నది.  మరొకటి తినకుండా చూస్తూఉన్నది .  జీవుడు , ఆత్మ ఒకే శరీరంలో ఉన్నారు.  మనిషి అజ్ఞానంలో మునిగి పోయి ఉన్నాడు ,  బ్రాంతిచెంది ధు:ఖిస్తున్నాడు. .

ఎట్టా పోనిత్తురా..జానపద గేయము!

Image
జానపద గేయము!  ఎట్టా పోనిత్తురా . కందిరీగ నడుముదాన్ని ఎట్టా పోనిత్తురా? బెదురూ చూపూలదాన్ని ఎట్టా పోనిత్తురా? తుమ్మేద నెరులదాన్ని ఎట్టా పోనిత్తురా? అట్టాటిట్టాటి దాన్ని ఎట్టా పోనిత్తురా?

యమునితో ముఖాముఖీ.!

Image
యమునితో ముఖాముఖీ.! . సాందీపని కృష్ణునికి గాయత్రీ మంత్రము ఉపదేశించినపుడు ఆయనకు చిత్రమైన అనుభవం కలిగినది. గాయత్రీదేవికే గాయత్రి ఉపదేశిస్తున్న భావన. అపుడు కృష్ణుడెవరో ఆయనకు పూర్తిగా తెలిసినది. సామాన్యుల కంటే తక్కువ సమయంలోనే వారు విద్యలన్నీ నేర్చుకున్నారు. చదువు పూర్తి చేసుకొని ఆయనను గురుదక్షిణ ఏమికావాలని అడిగారు. వారి శక్తి తెలిసిన గురువు తగిన కోరిక చెప్పారు. కొన్నిసంవత్సరాల క్రితం చనిపోయిన వారి పుత్రుని తిరిగి తెమ్మని అడిగారు. అదొక అద్భుత ఘట్టం.  . మనుష్యులు తప్పించుకొనలేనిది మృత్యువు., ఆత్మీయులు దూరమైనప్పుడు కలిగే దుఃఖాన్ని ప్రతివారూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసినదే.  అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని అనుగ్రహంతో చిరంజీవి అయ్యాడు. సావిత్రి యమునితో వాదించి భర్త సత్యవంతుడి ప్రాణాలు తిరిగి తీసుకురాగలిగినది. నచికేతుడు యమునితో వాదించి యముని వద్దనుండి తిరిగి రాగలిగాడు.  కృష్ణుడు, బలరాముడు యముని వద్దకి వెళ్ళి సాందీపని పుత్రుని ప్రాణాలు తీసుకొని వచ్చారు. కృష్ణుడు ఉత్తరాగర్భంలోని మృత శిశువుని బ్రతికేస్తేనే పరీక్షిత్తు బ్రతికి బట్టకట్టాడు. ఇది ఎలా సాధ్యం? దేవుళ్ళు కాబట్టి

ద్రౌపది!

Image
ద్రౌపది!................ (కామేశ్వర రావు భైరవభట్ల ) . ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని)  ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది. ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట? . సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవం జరుగుతుంది. అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు!  అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది. ఏమిటీ అన్యాయమని. దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు.  కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపదిని ఊరుకోమంటాడు.  నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక, ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడతావు అంటాడు.  . ఏవండీ, చీమూ నెత్తురూ ఉన్న ఏ మనిషైనా ఇలాంటి మాటంటే తట్టుకోగలరా? అక్కడికక్కడే ధర్మరాజుని లాగి లెంపకాయ కొట్టాలనిపించదూ?  అనిపిస్తుంది. ద్రౌపదికి కూడా

వైణిక సార్వభౌమ పొడుగు రామమూర్తి - రచన : తనికెళ్ళ భరణి .

Image
    . వైణిక సార్వభౌమ పొడుగు రామమూర్తి ! - రచన : తనికెళ్ళ భరణి     .     వైణిక సార్వభౌమ పొడుగు రామమూర్తి కళాకారుడు స్వేఛ్ఛాజీవి! వాడికొక ప్రత్యేక రాజ్యం...ఇష్టారాజ్యం!! స్వేఛ్చగా ఆలోచిస్తాడు..అందులోంచే సృజనాత్మక శక్తి ఆవిర్భవించి సామాన్యులకు అనుభవంలోకి రాని సంగతులన్నీ.. కొత్త కోణంలో ఆవిష్కరిస్తాడు.. ఆశ్చర్యపరుస్తాడు...ఆనంద పరుస్తాడు... తృప్తిగా నిట్టూరుస్తాడు.!! మొట్టమొదట కావాల్సింది..స్వేఛ్చ.! అంచేతే అన్నారు... బెదిరించి ఓ సింహాన్ని బంధించగలవేమోగానీ, శాసించి ఒక్క పూవును కూడా వికసింప చెయ్యలేవు అని.. అయినా కళాకారుడు ఏమడిగాడనీ..స్వేఛ్ఛగా ఉండనిమ్మన్నాడు..నా యిష్టానికి నన్నొదిలేయ్యండయ్యా.. ఆ తర్వాత నా మనస్సురాల్చే పారిజాతాలు ఏరుకోండి అన్నాడు..! ఆహా..! వాణ్ణి బంధించి వాడి మెదడుని గాజు సీసాలో వేసి దాన్నుంచి అద్భుతాన్ని పిండుకుందామంటే ఎలా వస్తుంది.? బంగారు పంజరంలో ఉన్న ఏ చిలకని ప్రశ్నించినా బెంగగా ఒకే మాట చెప్తుంది! అడవిలోకెళ్ళి అడుక్కుతినాల్ని ఉందీ అని.. అదే కళాకారుడు తత్త్వం! వాడే కళాకారుడు!! సొమ్ముకి అమ్ముడుపోయేవాడు..కళ.

తలపాగా! (జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ.)

Image
తలపాగా! (జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ.) . అలోమల్లో రాగూల మల్లు రాగూల కేసినా రంగూపురి సాప సాపాదిరుగోలె సౌకారు కోట కోట్లెన్ని కొమ్మాలెన్ని కొమ్మాల సందూన మర్రియాకు మర్రి మర్రీకే జిల్లేడాకు జిల్లేడాకూల బెల్లముండె నీకూ దొరికాక నక్కాకు దొరికె అటుగుంజి ఇటుగుంజి జివ్వేడాకె జివ్వోడి కాపుల్‌ మరి మంచోళ్ళు బతుకూమాని రెండూ మామిళ్ళిచ్చిరి మామిళ్ళ దర్మాన పూతా గూసె పూతాదర్మాన కాతాగాసె కాతాదర్మాన పనలేమక్కె పనలా దర్మాన పైకాలొచ్చె పైకాల దర్మాన పాగాలొచ్చె పాగా జుట్టుకొని పల్లెకు పోతే పల్లె కుక్కాలన్ని బవ్‌ బవ్‌ మనె అప్పుడే నాకడుపు జల్లూమనె చిత్రం...వడ్డాది .

పతి భక్తి..లేక ఇచ్చకాల భార్య..మెచ్చుకోలు భర్త.!

Image
లేకున్న తప్పదు యుద్ధం .. బంధ నాశనం .. . పతి భక్తి..లేక ఇచ్చకాల భార్య..మెచ్చుకోలు భర్త.!

నా జీవితంఒక తెరచిన పుస్తకం...

Image
మరి పొగడకు... . నా జీవితంఒక తెరచిన పుస్తకం... ఒక అలుపెరుగని పోరాటం.. మలుపుల నాటకం.. ఒక ఉదయించిన కిరణం... ఒక ప్రజ్వలించిన అగ్ని శకలం.... ఒక సుందర, సుమధుర స్వప్నం... ఆకాశపు అంచులనూ తాకాను.... పాతాళపు పల్లాలన్నీ చూశాను.... అంతులేని ఆనందాన్ని అనుభవించాను.... మరువలేని విషాదాన్ని దిగమింగాను... నిండు పున్నమి వెన్నెలని ఆస్వాదించాను... చిమ్మ చీకట్ల అమావాశ్యనూ చూశాను...x

లావొక్కింతయు లేదు!

Image
అసలు పోతన గారి పద్యం ఇది  . "లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్:  ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్:  నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్:  రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా." . ఇక చోద్యం కి వద్దం. అయినా విడ్డూరం కాకపోతే లావు ఒకింత ఎక్కడైనా ఉంటుందా? ఉంటే లావు, లేకపోతే సన్నం అంతే కానీ ఒకింత’ లావు చూడాలంటే నడుము దగ్గర తడుముకోండి ఒకింత కూడ లేకపోవడం ఉంటుంది – జీరోసైజని  .......... . లావొక్కింతయు లేదు వేళ్ళ కొనలన్ లాస్యంబుగా పట్టగా సావొచ్చే పనియౌను దట్టపు పొగల్ సర్దాగ సృష్టింపగా రావే కమ్మని కైపులెంత కసిగా లాగించి నే పీల్చినా? పోవో! ఈ సిగరెట్టు ఎందు సరిపోబోదోయి నా చుట్టతో పొగ చుట్టలెన్ని యైనను సిగరెట్టుకి సాటి రావు అన్నాడు శ్రీశ్రీ  . కాస్త “లంచ” మి స్తే చలం ని కూడా తిరగేయవచ్చు.... .

ఘనాపాఠి అని ఎవరిని అంటారు ?

Image
ఘనాపాఠి అని ఎవరిని అంటారు ? దేనిలో ప్రావిణ్యం ఉన్నవారికి  ఈ బిరుదు లభిస్తుంది ? . కృష్ణ యజుర్వేదంలో వరుసగా...సంహిత మంత్రాలు (42 పన్నాలు లేక ప్రశ్నలు ), అరణ్యకం ( బ్రహ్మ విచారం ) (12 ప్రశ్నలు ), బ్రాహ్మణం ( మంత్రం యొక్క తంతు భాగం )(28 ప్రశ్నలు ) ...  ఈ మొత్తం 82 ప్రశ్నలను "ఆశీతిద్వయం " అందురు.  మొత్తం 82 ప్రశ్నలను ఆవర్తనం చేసిన పిదప ... సంహిత మంత్రాలకు  (42 ప్రశ్నలకు ) పదపాటం , క్రమ , జట , ఘనాపాఠం చేసి " ఘనాపాఠి " అవుతారు. ఘనం అంటే అదొక వేద పఠనములో ఉచ్చారణ ప్రక్రియ. ఉదాహరణకు 12-21-123-321-123-23-32 ఇలా వరుసలో చదువుతారు. (ఇక్కడ అంకెలు శబ్దాలు) ...  ఉదా : గణాణాం / త్వా / గణపతిగుం ( Contd )....అనే దానిలో ఒక్కో పదాన్ని 1,2,3 లాగా తీసికొని పైన చెప్పిన 12-21-123-321-123-23-32 వరుస క్రమములో గబగబా చదవగలగాలి .  ఇలా మొత్తం శ్లోకాన్ని ఈ ఘనం క్రమంలో చదివి మీరు కూడా చిన్నపాటి ఘనాపాఠి అయిపోయి అందరి మెప్పును పొందవచ్చు .

ఊర్మిళాదేవి నిద్ర !

Image
ఊర్మిళాదేవి నిద్ర ! . సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చిపెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది.  ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు.  వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు.  ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు.  అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది. కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు. అలా ఒంటరిగా వదిలివేయబడ్డ ఊర్మిళా, అడివికి వెళ్ళిపోతున్న లక్ష్మణుడూ ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం లక్ష్మణుడు తన నిద్రని ఊర్మిళకిస్తాడు. ఊర్మిళ తన మెలకువని లక్ష్మణుడికిస్తుంది. తన భర్త అడివిలో ఉన్న పధ్నాలుగేళ్ళూ ఊర్మిళ నిద్రపోతుంది. లక్ష్మణుడు ఆ పధ్నాలుగేళ్ళూ పూర్తిగా మెలకువగానే ఉంటాడు. ఊర్మిళ భర్తృవిరహాన్ని అనుభవించనక్కర్లేకుండా, లక్ష్మణుడు తన భార్య జ్ఞాపకాన్ని మరిచిపోనక్కర్లేకుండా ఈ చమత్కారమైన ఊహ చేశారు తెలుగు ఆడవాళ్ళు. . ఊర్మిళాదేవి నిద్ర సరిగ్గా ఈ రకంగా నిర్మించబడింది. పాట ప్రారంభంలో శ్రీరాముడి పొగడ్తతో మొదలౌతుంది. శ్రీరామభ

సీతాసౌందర్యము.!

Image
సీతాసౌందర్యము.! . (రామాయణము, అరణ్యకాండము - మొల్ల.) శూర్పణఖ రావణుని యెదుట సీతాసౌందర్యమును వర్ణించుట.:- . కన్నులు కలువలో? కాము బాణంబులో? తెలివిగా నింతికిఁ దెలియరాదు, పలుకులు కిన్నెర పలుకులో?  చిలుకలపలుకులో? నాతి కేర్పఱుపరాదు, అమృతాంశుబింబమో? యద్దమో? నెమ్మోము తెంపుతో సతికి భావింపరాదు. మన్మధుడికి పంచబాణుడు అని కూడ పేరుంది.  ఆ ఐదు బాణాలు: అరవిందము (తెల్ల కలువ), అశోకము, మామిడి పూవు,  . నవమల్లిక, నల్ల కలువ: అరవిందమశోకంచ చూతంచ నవమల్లికా నీలోత్పలంచ పంచయితే పంచబాణస్య సాయకాః

రాధ రజిత రమ్య రంజని!

Image
రాణి గుండే లొ రాధ రజిత రమ్య రంజని వద్దు రాగమాల ప్రేమమాల రత్నమాల అసలు వద్ధు మధిరామం కోరిన రమణీయం చాలు. రాజహంసలా అందంగా వున్నావు రాగాల పల్లకిలో నీ అనురాగమై నిలిచి రంగురంగుల కలలు కంటు విపంచినై రాగాలు తీస్తున్న రచయితనై విరంచిలా కలలను కావ్యాలను రాస్తూ మదిలో దాచుకోన్న . (వడ్డాది వారిచిత్రం.)

మరవాలి.!

Image
మరవాలి.! "మరవాలి ...అనుకుంటూ.... నిను మరువలేకున్నా... మరిచాను .....అనుకుంటూ.... నీ తలపులలో...మైమరచిపోతున్నా.... మరవాలి అనుకుంటున్న నిన్ను తలుస్తూ... ఈ ప్రపంచాన్నే మరిచిపోతున్నా""..... (వడ్డాది వారి చిత్రం.)

నూతన వసంతం!

Image
నూతన వసంతం (శిష్‌ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్‌...చిత్రం వడ్డాది.) . వచ్చె బహుధాన్య సంవత్సరాది! వచ్చె వచ్చె నూతన వసంతాకాలము! మిత్రమా రావోయి! వసంతం వాసంత మోయీ! వచ్చినది వాసంత మోయీ! మిత్రమా రావోయి! కలిసి సావాసముగా మెలిసి ఎకచక పరాచికాలతో పోదాము రావోయి! కోయిలలు కూయగా గోరంకి చిలకకై కులుకుతూ పలుకగా విందాము రావోయి! చిట్టి మట్టెలపైన కడియాలతో అడుగులు వేయు చడుగుడుల మనసులు గల వాసంతిక లరుగో! వచ్చింది వాసంత మోయీ! ఏదైనా గున్న మామిడికై వెళ్ళి పోదామోయి! మంచుపూవుల బోలు తుమ్మి పూవులను దసరాలోనే గాదు వసంతా కాలమున గూడ ఏరుదాము రావోయి! రత్నపూ రేకులను నమలుతూ పొగడ కొమ్మల క్రింద ఉందామా? మీ ఇంటికి మా ఇంటికి దూరముతో తంగేడుచెట్లకు దారముతో వసంతాకాలమున ఎక్కడకు పోయినా ప్రేయసీ! ఏ వూరు పోయినా ఏటికి అవతల ఉన్నట్లేగద! ఆయేరు ఏరువాకయే ఐన, నీ ప్రణయసొన యేరువాకయే యైన ఇవతలేమి అవతలేమి! ప్రణయసొన యేరువాకతో ప్రాహ్లాద కవితా ఫణితితో వసంతం వచ్చెనోయీ, రావోయి నీవు నీవు!

అజరామర సూక్తి.!

Image
అజరామర సూక్తి.! . ."మరణం ప్రకృతిః శరీరిణాంవికృతిర్జీవితముచ్యతే బుధైః క్షణమప్యవతిష్ఠతే శ్వసన్ యది జంతుర్నను లాభవానసౌ" . విజ్ఞులు మరణము ప్రకృతిసిద్ధమైనదని జీవితము యాదృచ్చికము అని నుడువుతారు. ఒక్క క్షణము శ్వాస పీల్చి వదలినామంటే ఆక్షణము జీవితమును సాదినట్లనుకొనవలెను. . రఘువంశము(మహాకవి కాళీదాసు)

లక్ష్మీదేవి ఎవరింట నివసిస్తుంది "

Image
లక్ష్మీదేవి ఎవరింట నివసిస్తుంది " . ఒక సారి రుక్మిణీ దేవి లక్ష్మీదేవిని ఈ ప్రశ్న వేసింది. అప్పుడు లక్ష్మీదేవి ఋక్మిణీ దేవికి చెప్పిన విషయము . నిత్యము సత్యము పలికే వారు, శుచిగా శుభ్రంగా ఉండే వారు, గురువుల ఎడ భక్తి కలవారు, ఎల్లప్పుడూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండేవారు, సదా దక్షతతో దీక్షితులుగా ఉండేవారు, మంచి పనులు చేసే వారు, మలినము లేని వారు, ఎప్పుడూ మంచి పనులు చేసే వారు, వుజ్ఞావంతులు, తపస్సు చేసే వారు, తనకు ఉన్నంతలో దానము చేసే వారు, బ్రహ్మచర్యము పాటించే వారు, ఇంద్రియ నిగ్రహము కల వారు నాకు ప్రేమ పాత్రులు నేను వారి వెంట ఎప్పుడూ ఉంటాను.  ఇక క్రూరాత్ములు, నాస్థికులు, కృతఘ్నులు, దుర్మార్గుల వద్ద అసలు ఉండను. ఇక స్త్రీల వాద ఎవరి ఎంగిలి తినని వారు, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకునే వారు వారి అందు నివసిస్తాను. ఇక భర్తకు ఎదురు చెప్పే వారు, ఇతరులను నిందించు వారు, భర్తకు తెలవకుండా పర పురుషుల ఇళ్ళకు వెళ్ళే వారు, ఎప్పుడూ నిద్రించె వారు వారి వద్ద నేను ఉండను. మరియు నేను తామర పువ్వులందు, పూల తోటలందు, ఫలవృక్షముల అందు నేను నివసిస్తాను " అని లక్ష్మీ దేవి రుక్మిణీ దేవికి చెప్పింది "