Posts

Showing posts from March, 2017

ద్రౌపది!................ (కామేశ్వర రావు భైరవభట్ల ) .

Image
ద్రౌపది!................ (కామేశ్వర రావు భైరవభట్ల ) .  ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది.  ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట? . సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవం జరుగుతుంది. అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు! అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది. ఏమిటీ అన్యాయమని. దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు. కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపదిని ఊరుకోమంటాడు. నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక, ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడతావు అంటాడు. ఏవండీ, చీమూ నెత్తురూ ఉన్న ఏ మనిషైనా ఇలాంటి మాటంటే తట్టుకోగలరా? అక్కడికక్కడే ధర్మరాజుని లాగి లెంపకాయ కొట్టాలనిపించదూ? అనిపిస్తుంది. ద్రౌపదికి కూడా అనిపించింది

పోతన సరస్వతీదేవి !

Image
పోతన సరస్వతీదేవి ! . పోతన సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించడమే అతని కవిత్వమాధుర్యానికి కారణము. .  అతని యీ రెండు పద్యాలు అతి మధరం. . :శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ! . భారతీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడీ పద్యంలో. తెల్లని వస్తువులని ఏకరువుపెట్టి, అలాంటి శుభాకారతతో వెలిగే నీ రూపాన్ని ఎప్పుడు చూస్తానో కదా అని ఆ సరస్వతిని వేడుకుంటున్నాడు. ఒక్క శరత్ జ్యోత్స్నతో తృప్తిపడలేదు పోతన మనసు! శరత్కాలపు మేఘాలు, చంద్రుడు, కర్పూరము, చందనము, హంస, మల్లెల మాల, మంచు, సముద్రపు నురుగు, హిమాలయము, ఱెల్లుగడ్డి, ఆదిశేషువు, మొల్లలు, తెల్ల మందారము, సుధాసముద్రము, తెల్లతామర, ఆకాశగంగ - ఇవన్నీ గుర్తుకొచ్చాయి అతనికి. వాటన్నిటితో పోలిస్తే కాని తృప్తి కలగలేదతనికి! ఇక రెండో పద్యం: "క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి, చంచరీకచయ సుందరవేణికి, రక్షితామర శ్రేణికి, తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి, అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన

శ్రీకాళహస్తీశ్వర శతకం. ! (ధూర్జటి మహా కవి.)

Image
శ్రీకాళహస్తీశ్వర శతకం. ! (ధూర్జటి మహా కవి.) . తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది శ్రీకాళహిస్తీశ్వర శతకం. భక్తిశతకాలలో సాధారణంగా దేవుడి గూర్చి స్తోత్రం తప్ప మరేమీ కనిపించదు.  శ్రీకాళహిస్తీశ్వరశతకం వాటికన్నా భిన్నమైనది. ప్రత్యేకమైనది. ఇందులో కవి వ్యక్తిత్వం మనకి వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. అతను పడే తపన, ఆర్తి హృదయానికి హత్తుకుంటుంది. దానికి కారణం కవి పలుకులలోని మాధురీమహిమ! . ఇది యీ శతకంలో మొట్టమొదటి పద్యం. శ్రీ, విద్యుత్ (మెరుపు) కలిత, ఆజవంజవ (సంసారం), మహాజీమూత, పాప, అంబుధారా, వేగంబున, మత్, మనః అబ్జ, సముదీర్ణత్వంబు, కోల్పోయితిన్.  సంపద అనే మెరుపుతో కూడుకున్న పెనుమేఘం సంసారం. అది నిరంతర ధారగా కురిసేది పాపాల జడివాన.  తన హృదయమనే పద్మం ఆ వానలో తడిసిపోతూ వికాసాన్ని కోల్పోయింది, అంటే కుంచించుకుపోయింది.  అది మళ్ళీ వికసించాలంటే వానకారు పోవాలి. పోవాలంటే వెన్నెల ఋతువు శరత్తు రావాలి. అందుకే ఆ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి యిలా కోరుకుంటున్నాడు కవి. "ఓ దేవా! నీ కరుణ అనే శరత్కాలాన్ని ప్రసాదించవయ్యా,  అంతే చాలు. అప్పుడు విక

రామాయణంలో పిడకల వేట !!

Image
రామాయణంలో  పిడకల వేట !! రామాయణం అంటే వాల్మీకి అడిగిన ప్రశ్న అంటే ఈ జగత్తులో అత్యుత్తమమైన పురుషుడెవ్వడు అన్న ప్రశ్నకి సమాధానం. ఆ పురుషుని గుణములు, ఆ పురుషుని కథే మనకి రామాయణం. ఆ ఉత్తమపురుషుని కథ వదిలేసి ఇంక ఏదో పొడి కథలలోకి పోవడమే "రామాయణంలో పిడకలవేట " అని అనబడుతుంది.

ప౦చా౦గ శ్రవణ౦

Image
ప౦చా౦గ శ్రవణ౦ ! ఉగాది మన౦దర౦ ప్రత్యేకమైన గౌరవ ప్రపత్తులతో చేసుకొనేటువ౦టి ప౦డుగ. దీనికే యుగాది అని పేరు. అ౦టే కలియుగ ప్రార౦భ౦ ఇవ్వాళ్టి రోజే జరిగి౦ది అని. భాషాపర౦గా, రాష్ట్ర పర౦గా వేర్వేరు ఉగాదులున్నప్పటికీ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది జరుపుకు౦టారు. మన౦ చా౦ద్రమానాన్ని కాలగణనకు ప్రాతిపదికగా తీసుకు౦టా౦. ఇ౦దులో చైత్రమాస౦ మొట్టమొదటిది. ఉగాది నాడు బ్రాహ్మీముహూర్తానికి తరువాత నిద్ర లేవకూడదు. పూర్వ యామమున౦దు అనగా సూర్యోదయాత్పూర్వమే ఉగాది పచ్చడి తినాలి. అప్పుడు తినాలి అ౦టే భగవ౦తునికి నివేదన జరిగి ఉ౦డాలి కదా. అలా జరగాలి అ౦టే బ్రాహ్మీముహూర్తానాకి అభ్య౦గన స్నాన౦ చేయాలి. ఈరోజు తైలము అ౦టుకొని స్నాన౦ చేస్తే అలక్ష్మి తొలగుతు౦ది. సూర్యోదయ౦ వరకు నీటిలో గ౦గ ఆవహి౦చి ఉ౦టు౦ది. స౦వత్సరార౦భ౦లో వేపపువ్వు, బెల్ల౦, చి౦తప౦డు రస౦, ఆవునెయ్యి కలిపి చేసిన పచ్చడిని సూర్యోదయానికి పూర్వమే తినాలి. అలా తిన్న వారికి స౦వత్సరమ౦తా సౌఖ్యదాయకమై ఉ౦టు౦ది అని శాస్త్రవాక్య౦. ఇ౦దులో వేపపువ్వు ప్రధానమైనది. ని౦బ అనగా "ఆరోగ్య౦ నయితీతి ని౦బః". అది సేవి౦చడ౦ వల్ల నూరు స౦వత్సరములు ఆరోగ్య౦తో జీవి౦చగలిగిన లక్షణ౦ ఇస్తు౦ది.

ఉగాది శుభాకాంక్షలు ..🙏

Image
సుఖ శాంతి సుయోగేషు  ప్రజ బంధు హితేషు చ / అవిలంబేన సంసిద్ధిః  హే విళంబి సమాగమే// ఉగాది శుభాకాంక్షలు ..🙏

శ్రీ సీతారాముల కళ్యాణం !

Image
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు.  ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. అంతటి మహత్తరమైన రొజు శ్రీరామనవమి ... తాటాకు పందిళ్ళు .....మామిడాకుల తోరణాలు .....బాజా భజంత్రీలు ... పసుపు కుంకుమలు ....పట్టు వస్త్రాలు ..తాళిబొట్టు ....... వధూ వరులు .....ఏడడుగులు ....మూడు ముళ్ళు ..... ఇలాంటి అపురూపమైన పదాలతో ముడిపడిన బంధం వివాహ బంధం . ఓం ..జై శ్రీరాం..జై సీతారాం ........ఈ పదానికి అర్ధం నిలిపే జంటలు  మళ్లీ భగవంతుని సన్నిధిలో వివాహం జరుపుకోవడానికి  ఇదే శుభప్రదమైన రోజు .....అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో ..

శివ ధనుస్సు ......విష్ణు ధనుస్సు!

Image
శివ ధనుస్సు ......విష్ణు ధనుస్సు! . సీతా స్వయంవరం అప్పుడు శివధనస్సు ఎక్కుపెడితే ఎందుకు విరిగిపోతుంది? విరిగిపోతే అందఱూ (బాధపడాలి కానీ) ఎందుకు సంతోషిస్తారు? రాముడు అవతారపురుషుడు అని అందరికీ తెలిసినదే కదా! ఆయన ఏమి చేసినా ఒక మానవుడు ఎలా బ్రతకాలి తద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అని చెప్పడానికే చేశాడు. ఆయన ప్రతీ కదలికకీ అంతరార్థం, పరమార్థం ఉన్నాయి. అలానే శివధనుస్సు విషయానికి వస్తే….. అకార ఉకార మకారములు ప్రణవము, ప్రణవం ధనుహు, శరోహ్యాత్మ, బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేధ్ధవ్యం శరవత్ తన్మయో భవేత్ అన్నారు. అంటే…. అ, ఉ, మ కలిస్తేనే ప్రణవ నాదమయిన ఓం కారం వస్తుంది. ధనుస్సు (ప్రణవం) అంటే ఈ ఓంకారం అనమాట. శరము (బాణము) అంటే ఆత్మ. బాణముతో ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు కనిపించే లక్ష్యమే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనగా పరబ్రహ్మ లేదా పరమాత్మ. బాణాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా, చిత్త శుద్ధితో కొడితేనే లయమయ్యి లక్ష్యాన్ని చేరుతుంది. ఇది ధనుస్సు యొక్క అంతరార్థం. ఇక్కడ శివధనుస్సు ఆవిర్భావం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ శివధనుస్సును శివుడు త్రిపురాసురుని సంహరించడం కోసం సృష్టించాడు అన్

దశకొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు!

Image
దశకొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు! (చిత్రం ..వడ్డాది పాపయ్యగారి.. దానం.) దానం చేయాలని ప్రముఖంగా చెబుతుంది, సనాతన ధర్మం.. ’పెట్టందే పుట్టదు’ అనీ అంటుంది. ’చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంతా’ అంటారు.  ’పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్దీ బిడ్డలూ’ అనీ అంటుంది లోకం. ఇలా దానం యొక్క గొప్పతనాన్ని చెబుతారు.  దానం చేసినవారిలో ప్రముఖులనీ చెబుతారు. దధీచి తన వెన్నెముకనే దానం చేశారు, ఇంద్రుని వజ్రాయుధం కోసం. బలి చక్రవర్తి మూడడుగుల నేల కావాలంటే దానం చేసి పాతాళానికెళ్ళేరు, శిబి చక్రవర్తి తన తొడ మాంసం కోసి పావురాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేశారు, సరిపోకపోతే తానే సమర్పించుకోడానికి సిద్ధమయ్యారు. నేటి కాలానికీ ప్రపంచంలో కలిగినవారు తమ సొత్తులో కొంత లేక అంతా దానం చేస్తూనే ఉన్నారు, సమాజ హితం కోసం. ఎవరికైనా కావలసింది పిడికెడు మెతుకులు బతికున్నపుడు,చస్తే తగలబెట్టడానికో పూడ్చి పెట్టడానికో కావలసిన చోటు ఆరడుగుల నేల. ఎవరూ పోయేటపుడు కూడా ఏం పట్టుకుపోరు. అన్ని మతాలూ దానం చేయమనే చెబుతాయి. అపాత్రులకు దానం చేయకూడదు. దానంతీసుకునేవారు మనకంటే తక్కువవారనుకోవడం చాలా తప్పు, వారు, మనం దానం చేయడానికి వీలు

గుమ్మడి అమ్మ గుమ్మడి !

Image
గుమ్మడి అమ్మ గుమ్మడి ! . ఇంత గొప్ప నటునికి పద్మశ్రీ రాలేదు. . ఎన్.టి.రామారావుతో విబేధాలు! . మొదటి చిత్రంలో నటించే సమయంలో చిత్రం నిర్మణం పూర్తి అయ్యే వరకు నటుడు నాగయ్య కార్యాలయంలోని ఒక రూములో నివసించిన గుమ్మడి వెంకటేశ్వరరావు తరువాత తన మకామును హోటల్ రూముకు మార్చాడు. ఆసమయంలో ట్.ఎన్.టి ఆఫీసు ఎదురుగా ఉన్న హోటల్ రూములో సంగీత దర్శకుడు టి.వి.రాజుతో కలసి ఉన్న ఎన్.టి. రామారావుతో ఏర్పడిన పరిచయం సన్నిహితంగా మారి అది రామారావు స్వంత చిత్రంలో వేషం ఇచ్చే వరకు వెళ్ళింది. ఎన్.టి. రామారవు ఇచ్చిన అవకాశం గుమ్మడి వెంకటేశ్వరరావును చిత్రసీమలో కొనసాగేలా చేసింది.  ఆ సమయంలో ఆయనకు ఎన్.టి. రామారావు కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.  అక్కినేని నాగేశ్వరరావు మరియు ఎన్.టి.రామారావుల మధ్య చెలరేగిన వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారాయి. గుమ్మడి ఆసమయంలో అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలలో అధికంగా నటించడం వలన కొన్ని అనుకోని సంఘటనల ఆధారంగా ఎన్.టి.రామారావు అయనను అక్కినేని నాగేశ్వరరావుకు కావలసిన మనిషిగా భావించడంతో గుమ్మడి వెంకటేశ్వరరావు ఎన్.టి. రామారావుకు మధ్య దూరం అధికం అయింది. ఈ విషయం గుమ్మడి

హరిహరనాథ !

Image
హరిహరనాథ ! . 'కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహు మన్యసే? త్వం కిం కాలకూట: కిము వా యశోదా- స్తన్యం తవ స్వాదు? వద ప్రభో ! మే // . నా స్వామీ!  నిన్ను చూస్తూంటే 'సగం శివుడిగాను, సగం మాధవుడవుగాను' కనిపిస్తున్నావు! మరి నీవు అలంకరణ (పరిష్క్రియ) విషయంలో ఎముకలదండను ఇష్టపడతావా లేక కౌస్తుభాన్ని ఇష్టపడతావా?  అదేవిధంగా నీకు ఇష్టమైన పానీయం కాలకూటమా?  లేక యశోదాదేవి చనుబాలా?'

తెనాలి రామకృష్ణుడి విమర్శకు పాలైన "అమవస నిశి" పద్యం!

Image
తెనాలి రామకృష్ణుడి విమర్శకు పాలైన "అమవస నిశి" పద్యం! కలనాటి ధనము లక్కర గలనాటికి దాచ కమల గర్భుని వశమా నెల నడిమి నాటి వెన్నెల యలవడునే గాదె బోయె నమవస నిశికిన్.! . ఏమిదిని చేపిటివి కవితము -  భ్రమపడి వెల్లుల్లి పాయ తిని చేపితో ఉమ్మెత్త కాయ తింటివో - అమవస నిసి కం చు నీవు అలసని పెదనా - అనికాదివిన జ్ఞాపకము .

దశావతారాలు ...తిరుపతి వేంకటకవులు !

Image
దశావతారాలు ...తిరుపతి వేంకటకవులు ! . ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, 'అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి'. పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? విస్తీర్ణం కలిగిన వృత్తాలు కదా!  'అయ్యా! అయితే ఒక చిన్న విన్నపం. కంద పద్యంలో చెప్పాలి' అన్నారు.  దశావతారాలు ఒకొటొకటి చెప్పుకుంటూ లెక్కపెట్టుకుంటేనే కందానికి ఎన్ని అక్షరాలు కావాలో ఆ అక్షరాలను దాటిపోతుంది.  సరే! వెంకటశాస్త్రి గారు 'జలచర ఢులి కిరి నరహరి' మొదలుపెట్టారు. ఒక పాదం అయిపోయింది నాలుగవతారాలతో. పృచ్ఛకుడు ఆపాడు. 'ఏమండోయ్ నా కోరిక ఇంకా మీరు పూర్తిగా వినలే'దన్నాడు. 'అయ్యా! దశావతారాలు కందపద్యంలో చెప్తున్నాము కదా, జలచర ఢులి కిరి నరహరి.. అర్థం చెప్తాము' అంటే, 'అయ్యా! ఆగండి. ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా ఉండాలండి' చెప్పాడు పృచ్ఛకుడు. మళ్ళీ ఇదేం మెలిక అనుకుంటూ ‘ఏం పర్వాలేదులే చెప్పుకుందాం’అనుకు

ఏకలవ్యుడి వృత్తాంతం.! (ఇదీ ఆరుద్ర గారి పరిశోధనా వ్యాసం!)

Image
ఏకలవ్యుడి వృత్తాంతం.! (ఇదీ ఆరుద్ర గారి పరిశోధనా వ్యాసం!ఏకలవ్యుడు నిషాదులింట పెరిగి, నిషాదునిగా గుర్తించపడ్డాడు.కులదూషణకు,కుల వివక్షతకు గురి అయ్యాడు.ఎన్నో అవమానాలు భరించాడు.నేటి సమాజంలో దళితులు ఏకలవ్యుడిని దత్తత చేసుకొన్నారు. ఇది చాలావరకు న్యాయమే) . , మనలో చాలామందికి ఏకలవ్యుడి కధ ఈ క్రింది విధంగా తెలుసు! ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప పాత్ర. ఇతను ఎరుకల కులానికి చెందినవాడు. ద్రోణాచార్యుని వద్ద విలువిద్యను అభ్యసించాలని కోరిక ఇతనికి ఎక్కువగా ఉండేది. ఆ కోరికను ద్రోణుడికి తెలియచేసాడు. ద్రోణుడు అతని కోరికను మన్నించక, దాన్ని తిరస్కరించాడు.కానీ కొన్ని కథల్లో, ద్రోణుడు ఏకలవ్యుడిని దూరంగా ఉంచటానికి కారణం అతని కులం అని చెపుతారు.ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సంపాదించాడు. ఒక సారి విలువిద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కులను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క వేగంగా తెలియక ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లిం

అచ్చ తెలుగు...అర్ధమయి చావదు ! .

Image
అచ్చ తెలుగు...అర్ధమయి చావదు ! . ఇదిచదివి అనందించండి.  ఒకానొక సమయంలో ఉభయ భాషాప్రవీణులు పండిత ......... అవదానిగారు రాజమహేంద్రవరంలో ధూమశకట గమనాగమన ప్రదేశ ప్రాంగణ మందున్న శకటాధిరోహణ అనుజ్ఞాపత్ర విక్రేత మహాశయా బెజవాడ ప్రయాణమునకు వలయు విత్తమును గైకొని శీఘ్రమే అనుజ్ఞా పత్రమును నొసగుమా అని విన్నవించి వలయు పైకము తీయ ప్రయత్నిచుచున్న వేళ. ధుమశకటాగమన నిర్గమనములు సమాప్తమాయెను. తదుపరి వచ్చు ధూమశటమునకై నిరీక్షణ కొనసాగెను,  అంతలో సూర్యాస్తమానముకావచ్చెను. సాయంధ్యానుష్టానమునకు అవధానిగారు గృహోన్ముఖులైరి.

క్రొత్త ఇల్లు కూడా పాతదైపోతుంది.

Image
క్రొత్త ఇల్లు కూడా పాతదైపోతుంది.  రంగులు వేసుకుంటాం గానీ ఇంటిని పారేయం కదా! - అవును .... క్రొత్త ఇల్లు కూడా పాతదైపోతుంది.  రంగులు వేసుకుంటాం గానీ ఇంటిని పారేయం కదా..!? మనుషులను అర్ధం చేసుకున్న కొద్దీ, వాల్ల లోపాలు బలహీనతలు తెలుస్తుంటాయి బయటపడేయడానికో బాగుచేసుకోడానికో ప్రయత్నం చేయాలి గాని వారి చావు వారు చావనీ అని వదిలేయడమొ , మొత్తానికి విమర్శించి విడిపించుకోవడమో తరిమేయడమో చేయలేం కదా.. !! .

పూజ కొద్ది పురుషుడు.. పుణ్యం కొద్ది పిల్లలు ...

Image
పూజ కొద్ది పురుషుడు.. పుణ్యం కొద్ది పిల్లలు ... "అదృష్టం కొద్ది ఆలి(భార్య)" చెబుతారు. . గతంలో వధువుల తరఫు పెద్దలే పురుషులను ఎంచుకునే వారు. (నిజానికి ఇప్పుడూ అమ్మాయిలే కాబోయే వారిని రకరకాల పరరీక్షలు రపెట్టి మరీ యెంచుకుంటారని వినికిడి.) కనుక వారే పురుషులను చూసి యెంచుకుంటారు కావున మనం చేసే మంచి పనులే మనలను వారి దృష్టిలో పడవేస్తాయనీ, మనంగా వేరే వ్రతాలూ గట్రా చేయాల్సిన పని లేదనీ, చేయాల్సిందల్లా  ఆ యొక్క "ఏడు" బాధ్యతలను చక్కగా నెరవేర్చడమేననీ...నా అభిప్రాయం. . నిజానికి కొత్తగా వివాహం అయిన అబ్బాయికి జీవితం కత్తి మీద సాము లాంటిదే. ఉమ్మడి కుటుంబం అయితే మరీను. భరించువాడు భర్త అనే సామెత ఉండనే ఉంది. వివాహం అయిన కొత్తల్లో అబ్బాయి చాలా చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. నొప్పించకుండా తన నిర్ణయాలు ఉండాలి. ముఖ్యంగా అబ్బాయిలు గుర్తుంచుకోవలసింది ఏంటంటే, తల్లి మరియు భార్య, ఇద్దరూ కూడా రెండు కండ్లలాంటి వారు. కొత్తల్లో ఏదైనా సమస్య వస్తే తల్లిని, తల్లే కదా అని భార్య ఎదుట చిర్రుబుర్రు లాడటం, నీకేం తెలియదులే అమ్మా అనడం చేయకూడదు. తల్లి ఎదుట భార్యని, నువ్వు ఈ పని సరిగ్గా చ

కాకిగోల- ____ (ఇందుర్తి వెంకట ప్రభాకరరావు)

Image
కాకిగోల- ____ (ఇందుర్తి వెంకట ప్రభాకరరావు) . నేను చదువుకునే రోజుల్లో మా తెలుగు మాష్టారు 'కాకి - కోకిల' ల  మధ్య కనిపించే సారూప్య, వ్యత్యాసాలని వివరిస్తూ  ఈ క్రింది శ్లోకం చెప్పేవారు: "కాకః కృష్ణః పికః కృష్ణః  కో బేదః పిక కాకయో:  వసంత కాలే సంప్రాప్తే  కాకః కాకః పికః పికః! . దీని అర్థం ఏంటంటే : కాకి నల్లగా ఉంటుంది . కోకిల కూడా నల్లగా ఉంటుంది . కానీ వసంత కాలంలో కాకి గొంతు లోని కాఠిన్యం, కోకిల గొంతులోని మాధర్యం సులువుగా గుర్తించ వచ్చు . ఆ రోజుల్లోనే మా స్నేహితులు ఈ క్రింది వాక్యానికి అర్థం చెప్పమనేవారు: . కాకికికాకీకకాకకాకికికోకేల ? . పై వాక్యాన్ని అర్థవంతంగా విడగొడితే ఈ విధంగా వ్రాయ వచ్చు: కాకికి .. కాకీక . కాక ..కాకికి ..కోకేల ? అంటే దీని అర్థం: కాకికి దాని తాలూకు ఈకలే చీరగా (కోక) ఉపయోగ పడినప్పుడు, ఆ కాకికి వేరే చీర (కోక) అవసరం ఏముంది? . నేను హైదరాబాదీయుడిని కాబట్టి పై వాక్యానికి కాస్త ఉర్దూ మిలాయించి ఇలా రాసాను: కాకికి కాకీక కాక కాకికి కోక కైకు?  . 'కైకు' అంటే అర్థం చెప్పక్కర లేదనుకుంటా. ఎలా ఉంది? . పోతే, (ఎవరూ అన

మౌనంగా ఉన్నప్పుడే మెరుపులాంటి ఆలోచనలు వస్తాయి!

Image
మౌనంగా ఉన్నప్పుడే మెరుపులాంటి ఆలోచనలు వస్తాయి! . అదిగో చూడుము బంగరు జింకా...  మన్నైకనునయ్యో లంకా...

శీర్షిక -| నగర గీతం |

Image
శీర్షిక -| నగర గీతం | _______________ మా ఆవిడ కోసం  ఏవైనా చేస్తాను నిన్న ఆవిడ ఒక కోరిక కోరింది వీధిలో  నా వెనకే నడిసొచ్చే  పచ్చని చెట్టు కావాలని ఎలా ?? _________ కవి :వాస్కో పోవ (యుగోస్లేవియా) అనువాదం : త్రిపురనేని శ్రీనివాస్

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు:-- శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.!

Image
విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు:-- శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.! . ఎప్పుడూ తిట్టే మిత్రుని పాత్రను అడ్డుపెట్టి తన విమర్శకులకు సమాధానం ఇలా ఇస్తారు విశ్వనాథ గారు. నీవు నన్ను తిడుతున్నావంటే అర్థమేమిటంటే నన్ను చదువు తున్నావన్న మాట!  చదవక తప్పదన్న మాట. నీకు తెలియకుండానే నన్ను మెచ్చుకుంటున్నావన్న మాట. అసలు తిట్టడానికీ, మెచ్చుకోవడానికీ పెద్ద భేదం లేదు. రెండూ ఒకటేననుకో.  రూపాయి ఉందనుకో. అక్షరాలవైపు ఒకటీ. బొమ్మ వైపు ఒకటీ. ఎటు తిప్పినా రూపాయే. కొండరేం చేస్తారంటే అర్థరాత్రి వేళ వస్తారు. తలుపు తట్టుతారు. ఎవరు వారు అంటే నేను అంటారు. ఏమి నేను, శ్రాద్ధం నేను . , నేను విష్ణుశర్మని కాదని అర్జీ పెట్టుకున్న వాళ్ళందరూ ఏకవాక్యంగా వీరేశలింగం పంతులు గారు గనుక ఒప్పుకుంటే పంచతంత్రం రాసింది ఈయనేనని ఒప్పుకుంటాము అన్నారు. "'నేను రాసిన పుస్తకానికి ఒకడు ఒప్పుకోవడమేమిటి? మీలో ప్రతివాడూ ఎవడో ఒకడై ఉంటాడు కదా! వాడు వాడేనని ఇంకొకడు చెప్తే గానీ కాడా ఏమిటి?"'  . "ఎవ్వడూ ఎరగని వాడొకడుంటాడు, వాడి గతి ఏం కావాలి?" .  "వాడి గతి అంతే" .

ఒక బృందావనం...సోయగం...

Image
ఒక బృందావనం...సోయగం... ఎద కోలాహలం..క్షణ క్షణం... ఒకే స్వరం..సాగెను తీయగా.. ఒకే సుఖం విరిసేను హాయిగా.. ఒక బృందావనం...సోయగం......

తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య!

Image
తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా.!

భామనే సత్య భామనే !

Image
భామనే సత్య భామనే ! .  భామనే.. సత్యా ..భామనే! వయ్యారి ముద్దుల.. సత్య భామనే ..సత్యా భామనే.. భామనే పదియారువేలా కోమలులందరిలోనా రామరో గోపాలదేవుని ప్రేమనుదోచినా ||సత్య|| అట్టహాసము చేసి సురల అట్టేగేలిచిన పారిజాతపు చెట్టుతేచ్చి నాదు పెరటా గట్టిగా నాటించు కున్నా..||సత్య|| ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే.. జాణతనమున సతులలో నెరజాణనై..వెలిగేటి ||సత్య|| అందమున ఆనందమున గోవిందునకు నెరవిన్దునే నందనన్దనుదేన్డుగానక ..నందనన్దనుదేన్డుగానక.. డెందమందున కుములుచుండే ||భామనే|| కూరిమి సత్రాజిత్తు కూతురై ఇందరిలోనా లలనా.. చెలియా.. మగువా.. సఖియా.. గోపాల దేవుని బాసి తాళజాలక యున్నట్టి..||భామనే||

ఆడ దాని గా పుడితే తప్ప ,ఈ వివక్ష అర్ధం కాదు ...

Image
ఆడ దాని గా పుడితే తప్ప ,ఈ వివక్ష అర్ధం కాదు ... నా ్సపోర్ట్ ఎప్పుడు స్త్రీ ల కే ..వారు ఎంత మూర్ఖులైనా ,, వారిని అలా చేసిన వ్యవస్థ మీదే నా కోపం అంతా .. మన చుట్టు ఉన్న సమాజం లో నించి కూడా చూసి నేర్చుకుంటారు , మన ఇంట్లో ఒక పధతి ఉన్నా ,అది సామాజిక అంశాల తో వైరుధ్యం గా ఉంటే ,పిల్లలు తట్టుకోలేరు , అందుకే మనం కూడా డైల్యుట్ చేస్తాం మన సిద్ధంతాలని ..సమాజం నించి అంగీకరం కోసం ఎదురు చూస్తూ ఉంటాం మనం ..మనకి తెల్య కుండానే ..మొత్తం మార్పు ఒక్కసారి రాదు ...్భర్త పోయిన వారికి గుండు గీయించే సాంప్రదాయం ఇప్పుడు పూర్తిగా పోయిందనే అనుకుంటున్నాను , మళ్ళి వివాహాలు కూడా చేసఉకుంటున్నారు ...మెల్ల గా , చాలా మెల్లగా వస్తాయి మర్పులు,  ఈ లోగా స్త్రీలు తమ కోసం తాము నోరు విప్పి అడగడం నేర్చు కోవాలి ,అదే కదా ,అమ్మాయిలు తమ కోరికలు పైకి చెపుతూ ఉంటే ,ఎంత అతలా కుతలం అయిపోతున్నాది సమాజం .. పాపం అబ్బాయిలు కి ఎన్ని కష్టాలు ? అంటూ సంతాపాలు .. మరి ఇన్నేళ్ళు స్త్రీ పడ్డ కష్తాలకి లేదేం ఈ ఓదార్పు

ఇదిఒకటే చాలు అన్నిపూజలుచేసినపుణ్యంవస్తుంది .

Image
ఆత్మా త్వం, గిరిజా మతిః .. . అప్పట్లో ఈ శ్లోకం ఎవరు రాసారో ఏమీ తెలియక పోయినా విపరీతమైన ఇష్టం. మా నాన్న గారు(వింజమూర్వెంకట్రావుగారు) రోజు చదివేవారు.. . ఇదిఒకటే చాలు అన్నిపూజలుచేసినపుణ్యంవస్తుంది అనేవారు .. . నేనుఎప్పుడుమనస్సులులో స్మరిచుకుంటాను.. మాసోదర్లు కూడా ఇది ఆది శంకరాచార్యులవారు రాసిన శివ మానస పూజ లోనిది. , "ఆత్మా త్వం, గిరిజా మతిః, సహచరాః ప్రాణాః, శరీరం గృహం, పూజా తే విషయోప-భొగ-రచనా, నిద్రా సమాధి స్థితిః / సంచారః పదయోః ప్రదక్షిణ-విధిః, స్తోత్రాణి సర్వా గిరొ, యద్-యత్ కర్మ కరొమి తత్-తద్-అఖిలం, శంభో తవ-ఆరాధనం " . ఆత్మా త్వం - You are my soul. గిరిజా మతిః - Parvathi(daughter to Giri Raja) is my mind. సహచరాః ప్రాణాః - Your army (Nandi, Bhrungi and all pramadhagaNas) are my breath. శరీరం గృహం - My body is your abode. పూజా తే విషయోప-భొగ-రచనా - Any activity I do is your worship. నిద్రా సమాధి స్థితిః - My sleep is your state of meditation. సంచారః పదయోః ప్రదక్షిణ-విధిః - All my movement is my pradakshina to you. స్తోత్రాణి సర్వా

"ఇద్దరమ్మాయిలూ-ముగ్గురబ్బాయిలు"

Image
శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు "ఇద్దరమ్మాయిలూ-ముగ్గురబ్బాయిలు" కధలో సంకురాత్రి గురించి ఇలాఆ పండగంత అందంగా చెప్పారు. " తెల్లవారిందనే దురభిప్రాయంతో కోడికూసింది.కాకులు మేలుకున్నాయి.ఈగలు డ్యూటీకి బయలుదేరాయి.దోమలు విశ్రాంతికి ఉపక్రమించాయి. దాలిగుంటలో పిల్లులు బద్దకంగా లేచి వళ్ళు విరుచుకొని బయటకు నడిచాయి. ఆవులు అంబా అన్నాయి. పువ్వులు వికసించాయి. నవ్వడం అలవాటయిన పిల్లలు చక్కగా నవ్వారు. ఉత్తి పుణ్యానికి ఏడవటం వృత్తిగా గల పిల్లలు చక్కగా ఏడవటం మొదలు పెట్టారు.కొద్దో గొప్పో పాడిగల ఇళ్ళలో అమ్మమ్మలూ, బామ్మలూ భూపాల రాగచ్చాయలో "అమ్మా గుమ్మడేడే " అని పాడుతూ మజ్జిగ చిలుకుతున్నారు. ముద్దబంతి పూలలా బొద్దుగా పచ్చగా ఉన్న అమ్మాయిలు పంచకళ్యాణి గుర్రాలకుమల్లే శోభిస్తూ కళ్ళు నులుపు కుంటూ, అమ్మల చేతా, బామల చేతా సున్నితంగా చీవాట్లు తింటూ యిళ్ళు కల కలలాడేలా తిరుగుతున్నారు. కొందరు గుమ్మాలలో పేడనీళ్ళు చల్లి, సంక్రాంతి ముగ్గులు తీర్చిదిద్దుతూ, ముగ్గులంత సజీవంగా నవ్వుతున్నారు "

శ్రీకాళహస్తీశ్వరా! .

Image
శ్రీకాళహస్తీశ్వరా! . తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది శ్రీకాళహిస్తీశ్వర శతకం. భక్తిశతకాలలో సాధారణంగా దేవుడి గూర్చి స్తోత్రం తప్ప మరేమీ కనిపించదు.  శ్రీకాళహిస్తీశ్వరశతకం వాటికన్నా భిన్నమైనది. ప్రత్యేకమైనది. ఇందులో కవి వ్యక్తిత్వం మనకి వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. అతను పడే తపన, ఆర్తి హృదయానికి హత్తుకుంటుంది. దానికి కారణం కవి పలుకులలోని మాధురీమహిమ! . శ్రీవిద్యుత్కలితాజవంజవమహాజీమూత పాపాంబుధా రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్ దేవా! నీ కరుణాశరత్సమయ మింతేఁ జాలుఁ జిద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా! ఇది యీ శతకంలో మొట్టమొదటి పద్యం. శ్రీ, విద్యుత్ (మెరుపు) . కలిత, ఆజవంజవ (సంసారం), మహాజీమూత, పాప, అంబుధారా, వేగంబున, మత్, మనః అబ్జ, సముదీర్ణత్వంబు, కోల్పోయితిన్.  సంపద అనే మెరుపుతో కూడుకున్న పెనుమేఘం సంసారం. అది నిరంతర ధారగా కురిసేది పాపాల జడివాన. తన హృదయమనే పద్మం ఆ వానలో తడిసిపోతూ వికాసాన్ని కోల్పోయింది, అంటే కుంచించుకుపోయింది. అది మళ్ళీ వికసించాలంటే వానకారు పోవాలి. పోవాలంటే వెన్నెల ఋతువు

శ్రీనాధుడు రాసిన " భీమఖండం "లోని సూర్యోదయ వర్ణన .!

Image
శ్రీనాధుడు రాసిన " భీమఖండం "లోని సూర్యోదయ వర్ణన .! " చంద్రుడు వెలవెలపోగా,, చుక్కలు పలుచబడగా,, . దిగుడుబావులలోని తామరలమధ్య తుమ్మెదల ఝుంకారాలు చెలరేగగా,, . కలువలు కన్నుమూస్తూ ఉండగా దిక్కులు తెలతెలవారాయి. తూర్పుదిక్కున అరుణరాగం ఉదయించింది.."" .  ఉదయసంధ్య అనే కాంత నొసటిమీద అందగించే సింధూర తిలకమేమో ! . దేవేంద్రుని రాణి నిండుగా అలంకరించుకుని చేతబట్టిన రత్న దర్పణమేమో !! ఉదయగిరిమీద చిగిర్చిన మెత్తని కంకేళీ నికుంజమేమో !!!  దేవేంద్రుని అంతఃపుర సౌధకూటంపై కనిపించే  బంగారు పద్మమేమో !!!! కాలమనే సిద్ధుడు పట్టి మ్రింగి వినోదార్ధం తిరిగి ఉమిసిన రసఘటకమేమో !!!!!  ఆకాశమందిరంలోని దీపపు మొలకయేమో !!!!! అన్నట్లు ఉదయించాడు సూర్యుడు "" శుభోదయం !

అల్జమీర్లు !

Image
అల్జమీర్లు ! . ఇద్దరు జీవితంలో బాగా ఎదిగినవారు ఒక ఆడ, ఒక మగ ఒక పెళ్ళిలో కలుసుకున్నారు. . . ఇద్దరుఒకరినొకరు చూసుకున్నారు. . ఆయన ఆవిడని చూసి నవ్వాడు. ఈవిడ ఆయనని చూసి నవ్వింది. .  భోజనాల టేబిల్స్ దగ్గర ఒకరికెదురుగా ఒకరు కూర్చున్నారు. మళ్ళీ అదే సీను. . నవ్వుకున్నారు. చివరికి ఆయనకి ధైర్యం వచ్చి మేజువాణి దగ్గర ఆవిడని పక్కకి పిలిచి "  మీరు నాకు నచ్చారు. మనం పెళ్ళి చేసుకుందామా " అనడిగాడు. ఆవిడ " సరే" నన్నది. .  ఆవిడను ఆయన ఇంటికి తీసుకు వెళ్ళేడు  ...  పిల్లలను పిలిచి ఇదుగో చూడండి .. ఇమే మీ కాబోయే అమ్మ నచ్చిందా అని అడిగేడు. . అదేమిటి నాన్న అమ్మ ను మల్లి పెళ్లి చేసుకోవడం ఏమిటి అన్నడు . . కోడలు "మామ అత్త గార్ల మతి మరపు. మరి ఎక్కువ గా వుంది .. . వాళ్ళు భార్య భర్తలు అని మరచిపోయారు డాక్టరు దేగ్గెర కు తీసు కు వెళ్ళాలి " అంది భర్త తో

జై పాతాళభైరవి !‘

Image
జై పాతాళభైరవి !‘ . ‘పాతాళ భైరవి’విడుదలయ్యే వరకూ  ఏయన్నార్ ప్రధానంగా జానపద చిత్రాల హీరో. ఎన్టీయార్ చేసినవన్నీ సాంఘిక చిత్రాలు.  . ఈ ఒక్క సినిమాతో ఎన్టీయార్ జానపద హీరోగా స్థిరపడి, తన సినీ జీవితంలో అత్యధిక భాగం జానపద చిత్రాల హీరోగా ఎదిగారు. . ఏయన్నార్ తనను తాను పునరావిష్కరించుకొని, దేవదాసు వగైరా చిత్రాలతో సాంఘిక, ప్రేమ కథా చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్నారు. పాతాళ భైరవి తరువాత ఏయన్నార్ నటించిన జానపదాలు మూడే మూడని సినీ గణాంక వివరాల నిపుణుల ఉవాచ . . ‘నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా...’ అనే  పాతాళ భైరవిలోని తోట రాముడి పాత్రతో ఎన్టీయార్ కు దక్కిన  మాస్ హీరో ఇమేజ్ చిరకాలం నిలిచిపోవడం విశేషం.  ఒక్క సినిమా కెరీర్ నే మార్చేస్తుందనడానికి ఇదో పెద్ద ఉదాహరణ.  . ‘సాహసం శాయరా డింభకా. రాకుమారి వరిస్తుంది...’ అంటూ  నేపాల మాంత్రికుడిగా ఎస్వీ రంగారావు చూపిన నట వైదుష్యాన్ని ఎవరైనా మర్చిపోగలరా. ఈ సినిమా తరువాతే ఆయనకూ స్టార్ నటుడి హోదా లభించింది.  ఇక, ఘంటసాల సంగీతంలోని ‘కలవరమాయే మదిలో...’, ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడూ...’, ‘ఎంత ఘాటు ప్రేమయో...’ లాంటి పాటలు,

కన్యాశుల్కము గురజాడ అప్పారావు!

Image
కన్యాశుల్కము గురజాడ అప్పారావు! . గిరీశం... యీవా`ళ మహాఉత్సాహంగా వచ్చానుగాని ఉత్సాహభంగంచేశావ్‌. . మధురవాణి... యెవిఁటా వుత్సాహం? గిరీశం ...యిదిగో జేబులో హైదరాబాద్‌ నైజామ్‌వారి దగ్గిర్నించి వొచ్చిన ఫర్మానా.  మానా`స్తం నవాబ్‌ సదరదాలత్‌ బావురల్లీఖాన్‌ ఇస్పహన్‌ జంగ్‌ బహద్దర్‌ వారు సిఫార్స్‌చేసి వెయ్యి సిక్కారూపాయలు జీతంతో ముసాయిబ్‌ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా బాద్షావారి హుజూర్న వుండడం...... యింత శుభవార్తతెచ్చినా, దగ్గిరకి రానిచ్చావు కావుగదా?  నాతో హైదరాబాద్‌ వస్తావా? . మధు రవాణి...(తలతిప్పుతూ) నే యెందుకు? పూటకూళ్లమ్మని తీసికెళ్లండి.. .ఆ బోడిముండా ఎందుకు. వెళ్తేగిల్తే నీ తోనే వెళ్ళాలి. - అన్నాడు గిరీశం

కుంభ సంభవులు .! .

Image
కుంభ సంభవులు .! .  శివుని తపో వేడిమికి ఆయన త్రిశూలం నుండి జారి పడిన స్వేదం ఒక కన్యగా అవతరించింది. ఆమె శివ పుత్రిక.  శివానుగ్రహంతో నదిగా మారి ఆమె నర్మద అయినది. ఇలాగే మరో సందర్భంలో శివుని స్వేదం నుండి చర్చిక అనే కన్య పుడుతుంది. మన పురాణాలు, ఇతిహాసాల గాధల్లో మరో విధమైన పునరుత్పత్తి పద్ధతి కన్పిస్తుంది. కుంభ సంభవులు అనగా కుండ నుండి పుట్టిన వారని అర్థం. కుండ నుండి మనిషి పుట్టడం ఏమిటి? ఇది మనకు విడ్డూరంగా వుండొచ్చు. కానీ` విచ్ఛిన్నమైన గాంధారి గర్భస్థ పిండాన్ని వ్యాసుల వారు తన తపోశక్తితో నూరు కుండల్లో భద్రం చేయగా వాటి నుండి దుర్యోధనితో సహా నూరుగురు సోదరులు జన్మించారు. వీరంతా కుంభ సంభవులే. కురు పాండవులకు విద్య నేర్పిన ద్రోణా చార్యుడున్నాడు. ద్రోణము అంటే కుండ. ఈయనా కుంభ సంభవుడే. ఇలాంటివి మరి కొన్ని వున్నా ముఖ్యంగా చెప్పుకోవలసిన కుంభ సంభవు ఇద్దరున్నారు. సప్తర్షుల్లోని వశిష్టుడు, అగస్థ్యుడు వీరిద్దరూ కవల సోదరులు కుంభ సంభవులు. అదో ఆసక్తి కరమైన గాధ. ఒకప్పుడు నారాయణాంశతో జన్మించిన నర నారాయణులనే సోదరులు మహాభక్తులు. తపస్సంపన్నులు. ఇరువురు బదరికా వనంలో ఘోర తపస్సు చేస్తున్నారు. ఆ తపో

దైవ ప్రార్ధన రచన:భళ్ళముడి సీతారామమూర్తి

Image
దైవ ప్రార్ధన రచన:భళ్ళముడి సీతారామమూర్తి (అ ముద్రితము. చేవ్రాత ప్రతినుండి సంగ్రహించ బడినది) ఆ: ఎన్ని తలపులొవలపులునెన్నియెన్నొ గుండెకుదులించినింపి నీగుడికివచ్చి ముచ్చటగనెందరో దేవమొక్కుచుంద్రు వారి భక్తియురక్తియెవ్వారికెరుక || 2. అందరిని జూచి యచ్చరునొందు చుందు నీదు తత్వముతెలియని నేను నిన్ను ఎటుల మెప్పించుటోస్వామి నెరుగనైతి నన్ను నెరిగిననీవె నన్నాదుకొనుము|| ౩. మూర్తి సౌంద్య ముకెంతొ మురియుదు దేవ నుతులవినినిన్ను నేనెంతొవెతకు చుందు మనసు చలియించిఅంతలోమఱచు చుందు ఎటుల గనుగొందునోయెరిగింపుమీవె!|

సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ దాగు బల్ సిగరెట్టూ !

Image
సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ దాగు బల్ సిగరెట్టూ…!… కుక్కపిల్లా, సబ్బు బిళ్ళా, అరటితొక్కా, బల్లచెక్కా  ఏదీ కవిత్వంలో వస్తువుగా అనర్హం కాదన్నారు శ్రీశ్రీ.  ఉదాత్తమైన వస్తువు మాత్రమే కవితా వస్తువుగా ఉండాలని మన ఆలంకారికుల నమ్మకం. కానీ సమాజంలో తేలికగా చూడబడే సి గరెట్టు లాంటి వస్తువు మీద “న భూతో నభివిష్యతి” అన్నట్టు అమోఘమైన పాట రాసారు కొసరాజుగారు. సరదా పాటల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన పాటల్లో ఇది మరీ ఉత్తమమైన కోవకు చెందుతుంది సిగార్ అంటే ఎండిన పొగాకును చుట్టగా చుట్టినది అని అర్థం. ఆ చుట్టని నైస్ గా చిన్నగా చుడితే అదే సిగరెట్. మన తెలుగు మర్యాద ప్రకారం సిగరెట్టుగా చేసుకుని వాడుకుంటున్నాం. “సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ దాగు బల్ సిగరెట్టూ పట్టుబట్టి ఓ దమ్ములాగితే స్వర్గానికి ఇది తొలిమెట్టు” అంటూ ఓ భర్తగారు గుఫ్పు గుఫ్ఫుమని పొగను పీలుస్తూ వదులుతూ స్వర్గం లో తేలుతున్నట్టుగా మురిసిపోతుంటాడు. భర్త దగ్గరకు వచ్చిన భార్య సిగరెట్టు పొగలు చుట్టుముట్టగా ఉక్కిరి బిక్కిరవుతుంది. ఆ సందర్భంలో సిగరెట్టు మంచి చెడులను ఎవరికి వారు సమర్థించుకుంటూ విమర్శించుకుంటూ సంభాషించుకునే పాట ఇది. తనక

కైకవిలాపం!

Image
కైకవిలాపం! . దశరథుడు కైకతో కోపముతో,నిస్సహాయత తో అన్న పద్యాలు ! (విశ్వనాథ వారి ' 'రామాయణ కల్ప వృక్షం' లోనివి) "వరమిచ్చిన ప్రభువగు శం  కరు నెత్తిని చేయి పెట్టు కరణిని నాచే వరముఁగొని హరీ! హరి! నా  వరమున నన్నణఁగద్రొక్కు పాతాళమునన్. " . (కల్పవృక్షం/అయోధ్య/అభిషేక/207) . “శంకరుని నెత్తిన చేయి పెట్టిన భస్మాసురుని వలె” అనే ఈ ఉపమానం గొప్పగా ఉన్నది. సారస్వతములో ఇంత గొప్ప ఉపమానాలరుదు. . "ఇషువుల నొడ్డుచున్ నిలిపి యేటికిఁ గోటికిఁ లాగు వాజులన్ గృషి మెయి మూర్ఛితున్ నిను భరించిన దానికి వైజయంతపున్ విషమ మహాహవ క్షితిని వేడక యిచ్చి వరద్వయంబు పౌ  రుష మిది గాక యిప్పటికి రూపముఁదాల్ప వహో! వరంబులున్." . (కల్పవృక్షం/అయోధ్య/అభిషేక/189) . “(ఇషువు) బాణములను అడ్డుకొనుచు, దేవాసుర యుధ్ధభూమిలో నిన్ను (భరించిన) రక్షించి నందులకు నీవిచ్చిన వరములు ఇప్పటికీ రూపము దాల్చలేదు’ అంటోంది కైక. పైగా,  “వేడక” అనే పదం విశ్వనాథ వారు గొప్పగా ప్రయోగించారు.  ప్రమాణాలు చేసి, పరిణామాల నెదుర్కోవటం త్రేతాయుగ రాజ లక్షణం!  రాజులు చేసిన ప్రమాణాల పరిణామాలను ప్ర

బారిష్టర్ పార్వతీశం' అమ్మడానికి రచయిత పడిన కష్టాలు!

Image
బారిష్టర్ పార్వతీశం' అమ్మడానికి రచయిత పడిన కష్టాలు! ఒక ప్రముఖుని (పోలాప్రగడ సత్యనారాయణ మూర్థిగారి ) మాటలలో......."ఒక రోజు కళాశాల నుంచి ఇంటి కొచ్చే సరికి మా ఇంటి అరుగు మీద వాలు కుర్చీలో కూర్చొని మా పిల్లలకి కథలు చెప్తూ నవ్విస్తున్నారు.. బారిస్టర్ పార్వతీశం నవలా రచయిత మొక్క పాటి నరసింహ శాస్త్రి గారు. కుశల ప్రశ్నలు అయింతర్వాత వచ్చిన పని చెప్పారు. . "వాడెవడో చెప్పితే నమ్మి ఐదు వేల కాపీలేశాను బారిస్టర్ పార్వతీశం. పది హేనేళ్లయింది. ఇంకా పదిహేను వందల పుస్తకాలు మిగిలి వున్నాయి. ఈ వూళ్లొ నాలుగైదు హైస్కూళ్లున్నాయంట గదా.... ఒక్కొక్క ఉన్నత పాఠశాల ఇరవై అయిదు చొప్పున కొన వచ్చట. అంతా కొంటే వంద పుస్తకాలు ఖర్చు అవుతాయి. కాపి రూపాయా పావలా... రేప్పొద్దున వెళ్లి ఒక్కొక్క హెడ్మాస్టర్ ను కలుసు కోవాలి. పని ఎంత వరకు అవుతుందో? "...... నాకు చాల బాధ కలిగింది. బారిస్టర్ పర్వతీశం అంటే ఒక హాస్య మహా కావ్యం. దాన్ని అమ్ముకోడానికి రచయిత ప్రతి ఉన్నత పాఠశాలకూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా యాచించడమా? "ఎన్ని పుస్తకాలు తెచ్చారు" అనడిగాను. "వంద. అంటే నూట పాతిక రూపాయిలవి"

పురాణాలలో మన్మథుడు!

Image
పురాణాలలో మన్మథుడు! ఇంద్రుడు మరియు ఇతర దేవతలను తారకాసురుడు బాధించసాగెను. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు.  అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు.  ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు. వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. వీరి కుమారుడు కార్తికేయుడు తారకాసురున్ని వధిస్తాడు. మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు చూపుతారు. ఇతని విల్లు చెఱుకు గడతోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.ఈ పువ్వులు: అశోకం, తెలుపు మరియు నీలం పద్మాలు, మల్లె మరియు మామిడి పూలు. ప్రాచీనమైన మన్మథు