Posts

Showing posts from October, 2018

🌹🌹🌹 "మంత్ర పుష్ప సమర్పణం🌹🌹🌹

Image
🌹🌹🌹 "మంత్ర పుష్ప సమర్పణం🌹🌹🌹 🌹" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ "🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఏ ఉపాయం చేతనైనా , ఈశ్వరుడి అను గ్రహాన్ని సంపాదింౘవలసినఅవసరం ఉంది. దానికిగల సులభోపాయాన్ని శంకరులు ఈ శ్లోకంలో చెపుతున్నారు . ఆసులభోపాయం తెలుసుకో లోని మందబుద్ధులను ౘూసి , శంకరులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్లో" గభీరే కాసారే _ విశతి విజనే ఘోరవిపినే విశాలే శైలేచ _ భ్రమతి కుసుమార్థం జడమతిః సమర్ప్యైకం చేతః _ సరసిజ ముమానాథ! భవతే సుఖేనావస్థాతుం జన ఇహ నజానాతి కి మహో !! తాత్పర్యము: ఓ పార్వతీపతీ ! మందబుద్ధియైన మనుష్యుడు నిన్ను పూజింౘడానికి, పూవులకోసం లోతైన తటాకం లోనికి దిగుతాడు. నిర్జనమైన, భయంకరమైన అరణ్య మందూ, పెద్ద పర్వతమునందూ తిరుగుతాడు. అతడు తనలోనే వున్న తనమనస్సు అనే పద్మమును నీకు సమర్పించి,, ఈ లోకంలో సుఖంగా ఎందుకు ఉండటం లేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. మనస్సు పెట్టి భక్తితో పూజింౘడం ముఖ్యం. అంతేకానీ , పుష్ప సేకరణకైపాటు పడటం ముఖ్యం కాదని భావం. వివరణ: " మనః పుష్పమ్ సమర్పయేత్". అనగా మ

పులి ముగ్గు” - (విశ్వనాథ సత్యనారాయణ రాసిన గ్రాంథిక నవల .)

Image
పులి ముగ్గు”  - (విశ్వనాథ సత్యనారాయణ రాసిన గ్రాంథిక నవల .) 🏵️ ఈ నవలకు విశ్వనాథ ఎన్నుకున్న అంశం వింతైనది, కొత్తది, పైగా జానపదం!! మనిషి పులిగా మారే విద్య మీద రాసిన నవల. ఖడ్గ విద్య లో ఎదురు లేని ఒక క్షత్రియ తాపసి, అంతులేని స్త్రీ వాంఛతో అసంబద్ధమైన శృంగార పరమైన కోరిక కోరి నాశనమైన రాజు.., నీచుడైన తండ్రికి తగిన పాఠం చెప్పిన కొడుకు… ఇలాటి పాత్రలతో  ఆద్యంతం ఉత్కంఠ గా సాగే నవల పులి ముగ్గు! కథ ప్రారంభమే మగధ సామ్రాజ్య సేనాధిపతి శ్రీముఖ శాతకర్ణీ, అతనికి పరిచయస్తుడైన తోహారు అనే ఒక ఆటవికుడూ కలిసి, సగం మనిషీ సగం పులి గా మారిన ఒక ప్రాణి కోసం అన్వేషణ సాగిస్తూ ఒక కారడవి లో పయనించడం తో మొదలౌతుంది. నిజానికి వాళ్ళు అన్వేషిస్తున్న వ్యక్తి వెనుక కాళ్ళు మనిషి కాళ్ళు గా ఉంటాయి తప్ప మిగతా మొత్తం పులిగా మారగలడు. మరి కొంత సాధన మిగిలి పోయి వెనుక కాళ్ళు మాత్రం మనిషి కాళ్ళుగానే ఉండి  పోయిన మనిషి  .అంటే మనిషీ పులీ కలగల్సిన ఒక వింత వ్యక్తి కోసం వాళ్ల అన్వేషణ ఆ జీవి కోసం ఓపిగ్గా తిరిగి తిరిగి  అలసిన  ఇద్దరూ ఒక పెద్ద తటాకం ఒడ్డున పులి,మనిషి పాదాల గుర్తులు గమనించి, అక్కడ ఒక చెట్టెక్కి మాటు వేస్

🌹బుర్రకధా పితామహుడు 🌹 🌹🌹పద్మశ్రీ షేక్ నాజర్ 🌹🌹

Image
🌹బుర్రకధా పితామహుడు 🌹 🌹🌹పద్మశ్రీ షేక్ నాజర్ 🌹🌹 వినరా భారత వీరకుమారా విజయము నీదేరా" అంటూ ప్రజా సమస్యలను బుర్రకధ లోజోడించి చెప్పిప్రజలను చైతన్యపరచిన ప్రజానాట్యమండలి కళాకారుడు,బుర్రకధా పితామహుడు పద్మశ్రీ షేక్ నాజర్ గారు మన తెలుగు పింజారి జాతిలో పుట్టిన ఆణిముత్యం.ప్రజా కళాకారుడిగా ప్రజా హృదయాలను చూరగొన్న ఆయనను 1986లో 'పద్మశ్రీ' అవార్డు వరించింది. జానపద కళాకారులలో 'పద్మశ్రీ' అవార్డు అందుకున్న తొలి జానపద కళాకారునిగా ఆయన చరిత్ర సృష్టించారు. " ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు"అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు. 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

తోలుబొమ్మలాట !

Image
తోలుబొమ్మలాట ! - తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా షృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది. ఒక సామూహిక సంగీత, నాట్య ప్రదర్శన కళారూపమైన తోలుబొమ్మలాట చారిత్రక పరిణామాలు గమనిస్తే ఒకప్పుడు విలక్షణమైన ఉన్నతిని అనుభవించిన ఈ కళ మొత్తం భారతీయ జానపద కళారూపాల్లోనే విశిష్ట స్థానాన్ని పొంది ఉంటుందని చెప్పవచ్చు. నృత్య దశలో నుండి మానవుడు నాటక దశలోనికి ఎదిగే పరిణామ క్రమంలో తోలుబొమ్మలాట ప్రముఖ పాత్ర వహించింది. జానపదుని మొదటి రంగస్థల ప్రదర్శన కళగా ఈ కళారూపాన్ని గుర్తించవచ్చు. తోలుబొమ్మలపై వాలిసుగ్రీవులు, రావణుడు, సీతారామలక్ష్మణులు, రాజులు, భటులు, మహాభారత వీరులు, మున్నగు వేషాలన్నియు వివిధ రంగులతో తీర్తురు. ప్రేక్షకులు బొమ్మల చూడగనే ఇది యీ వ్యక్తిని నిరూపించు బొమ్మ అని పోల్చుకొను సాం

పితృ తర్పణాలు

Image
పితృ తర్పణాలు - ఇంట్లో భగవంతునికి చేసే పూజతో సమానమైన ఫలితం  పితృ ఖర్మ చేయడం అని వేదం చెపుతోంది. పితృ కర్మ పవిత్రమైనది.  శుభ కార్యాలు ఉన్నాయి అనే పేరుతో చేయాల్సిన  పితృ తర్పణాలు మాని వేయడం సరికాదు. దురదృష్టవశాత్తు పెళ్లి అయిన సందర్భంగా శ్రాద్ద కర్మలు చేయకూడదు అనే తప్పుడు అభిప్రాయం తో ప్రజలు ఉన్నారు. ఇది 100 % సరి కాదు. వేదాలను అనుసరించే వారికి కర్మ-కాండలు (శ్రాద్ధ-విధి) నిర్వహించడం ఆచార కర్మగా చెప్పబడింది. గతించిన తమ పూర్వీకుల ఆత్మకు ముక్తి కలగడానికి సాంవత్సరికాలు చేస్తూ పితృతర్పణాలు వదులుతారు. ప్రకృతి వైపరీత్యాలలోనో, ప్రమాదాల లోనో, ఆత్మహత్య చేసుకునో అర్థాంతరంగా చనిపోయిన వ్యక్తులకు వెంటనే మరొక దేహం లభించక పోవచ్చు. అటువంటి వారికి తమ పుత్రులు, పౌత్రులు పిండ ప్రదానం చేసి తర్పణాలను వదలడం ద్వరా మళ్ళీ తమకు తగిన భౌతిక దేన్ని పొందగలుగుతారు .  భగవంతుడైన నారాయణుడికి లేదా ‘ఆర్యముడు’ అనే దేవుడికి నైవేద్యం అర్పించి సేవించడం కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కొడుకుల విధి. నేటికీ మనదేశంలో ‘గయ’ కు వెళ్ళి విష్ణుపాదాలకు పిండములు సమర్పించి తర్పణములు వదలడం ద్వరా ప్రేతాత్మ రూపంలో ఉన్న తండ

తనదైన హాస్యానికి చిరునామా -హస్యగంగ రేలంగి. 🌹

Image
తనదైన హాస్యానికి చిరునామా 🌹 🤣🤣🤣🤣🤣🤣🤣 వెండితెరకు స్వర్ణయుగం లాంటి రోజుల్లో ప్రజల గుండె తెరపై నవ్వుల నయాగరాలా ఉప్పొంగిన హస్యగంగ రేలంగి.  ఆయన ఏం చేసినా నవ్వొస్తుంది.  నవ్వించటం కోసమే ఏమైనా చేస్తాడు కూడా!  కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తన ప్రతిభకున్న అన్ని కోణాలని అద్భుతంగా ఆవిష్కరించారు రేలంగి. ఆకారంతోను, ఆహార్యంతోనే కాక అభినయంతో సైతం ప్రేక్షకులను తన నవ్వులతో ఊయలఊగించినహాస్యచక్రవర్తిరేలంగి.ఉర్రూతలూగించారు... రేలంగి వెంకట్రామయ్య తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో  1910వ సంవత్సరం ఆగస్టు 9న జన్మించాడు. ఆయన తండ్రి పిల్లలకు సంగీతం నేర్పిస్తూ.. హరికథలు చెప్తుండేవారు.  అందుకే రేలంగి చిన్నప్పటి నుంచి సంగీతంపై మక్కువ ఏర్పడింది. తండ్రి వద్ద హరికథలు చెప్పడం, పాటలు పద్యాలు పాడటంతో పాటు హార్మోనియం కూడా నేర్చుకున్నాడు. ఓ నాటక సంస్థ ద్వారా పలు నాటకాల్లో ఎన్నో పాత్రలు పోషించారు.  వీటిలో ఆయన పోషించిన స్త్రీ పాత్రలు ఆ రోజుల్లో జనాన్ని ఉర్రూతలూగించాయి. సినిమాలో నటించాలనే కోరికతో ఆయన తొలిసారిగా సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన  'శ్రీ కృష్ణ తులా

👌జడ భరతుని కథ.👌 (Suguna Rupanagudi గారి కధనం వారికి కృతజ్ఞలతో.)

Image
👌జడ భరతుని కథ.👌 (Suguna Rupanagudi గారి కధనం వారికి కృతజ్ఞలతో.) 👌👌👌👌👌👌👌👌👌👌👌 “అగ్నీధ్రుడు” జంబూ ద్వీపాన్ని పరిపాలించాడు. “పూర్వాచిత్తి” అనే అప్సరస వలన అతనికి తొమ్మండుగురు పుత్రులు కలిగారు. వారు “నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రంయకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు” అనువారు. జంబూ ద్వీప వర్షాలను (దేశాలను)ఈ తొమ్మిది మందికీ పంచి యిచ్చాడు. తండ్రి అగ్నీధ్రుడు. తమ తమ పేర్లతో వున్న వర్షాలను పరిపాలిస్తూ వచ్చారు.  పెద్దవాడయిన “నాభి” భార్య “మేరుదేవి”. వారిరువరికీ విష్ణువు కుమారుడుగా జన్మించాడు. అతని పేరు “ఋషభుడు”. అతను తన అద్భుత శక్తి చేత ఇంద్రుడిని అణచి వేశాడు. తన రాజ్యానికి “అజనాభం” అని పేరు పెట్టాడు. అతని భార్య “జయంతి”. వారికి నూర్గురు పుత్రులు కలిగారు. వారందరూ గుణగణాలలో తండ్రికి సాటి అయినవారు. వారిలో పెద్దవాడు “భరతుడు”. అతను ప్రసిద్ధుడై గొప్ప కీర్తి గడించాడు.  భరతుడు పరమ భాగవతోత్తముడు. విశ్వరూపుని కుమార్తె అయిన “పంచజని”ని పెళ్ళాడాడు. అన్ని విధాల తనతో సమానులైన 5 గురు పుత్రులను కన్నాడు. భరతుడు తన తండ్రి తాతల వలెనె ప్రజానురంజంకంగా పదివేల సంవత్

సుభాషితాలు మానవ జీవన వికాస సూత్రాలు🌹

Image
సుభాషితాలు మానవ జీవన వికాస సూత్రాలు🌹 🏵️ తే: కుసుమ గుఛ్ఛంబునకుఁ బోలెఁ బొసగు మాన సౌర్య వంతున కివి రెండుమహితగతులు, సకల జన మస్తక ప్రదేశములనైన, వనము నందైన జీర్ణభావంబు గనుట! అభిమాన వంతునకు రెండే జీవనమార్గాలట! పూలచెండులా,..... పూలచెండు యెవరైనా సిగలోనలంకరించు కొనినట్లయిన నలుగురిప్రశంసలకు నోచుకుంటుంది. లేకపోతే ఆయడవిలోనే చెట్టుదగ్గరే వాడిపోయి  పడిపోతుంది.  అభిమానవంతుడుగూడా బ్రతికితే అలానలుగురి చేతాప్రశంసింపబడుతూనలుగురితో కలసి బ్రతకాలి లేదంటే, యేయడవికోపోయి మునివృత్తితో జీవించాలి తప్ప వేరుమార్గమే లేదట!

పిం గళిసూరనగారి మనవడు !

Image
పిం గళిసూరనగారి మనవడు ! . పింగళిసూరనగారు, అల్లసానివారి మనుమరాలి భర్తయట!  చిన్నట అల్లరిచిల్లరిగా తిరుగుచు నందరిచే చవాట్లుదినుచుండు వాడట. చదువురానిమొద్దువని యొకమారు పెద్దనగారే తిట్టినారట.పౌరుషమువచ్చి యింటినుండి పారిపోయిరట. సూరన జాడకై వెదకి వేసారి మనుమరాలి యభాగ్యమునకు  దురపిల్లి యూరకుండిరట.  అట్లుపోయిన యాసూరన కాశీనగరమునకేగి  సర్వ విద్యలయందు నిష్ణాతుడై తిరిగి వచ్చినాడు. అప్పటికాతనిృరూపురేఖలు, వేషభాషలును మారుటచే  పెద్దన గుర్తింప లేకపోయెనట.  .  గోత్రనామములను,ప్రవరను,  తాత,తలిదండ్రుల పేరులనుఅడిగి వివరముల నెరింగి సూరనేయని నిశ్చయించి  ,యింతకాలమునకువచ్చితివా?  యికనీచదువు సంధ్యల నడుగనులే, పొమ్ములోనికిబోయి, నీభార్యనుపల్కరింపుమన,  సూరన"తాతా! నేను సర్వ విద్యల నేర్చితిని,  నీకన్నమిన్నగా కవిత్వమును గూడ చెప్పగలనులే"యన " నేదీ నీవురచించిన పద్యమొకటి వినిపించుమనెనట". అపుడుసూరన- తలపం జొచ్చెడియప్పుడంత-యనిచదువగనే "చాల్చాలులే!  యెత్తుగడలోనే యిన్నివిరుపులా?యిదానీకవిత్వమనిపరిహసింప , "తాతా! అప్పుడేయేమైనది, ముందువినరాదా?యనుచు-

ప్రేమ-ప్యార్ -కాదల్ !

Image
ప్రేమ-ప్యార్ -కాదల్ ! - ఆకాశమంత ఉన్నతమైనది సముద్రమంత లోతైనది ఏమీ కాదు ప్రేమ.... ప్రకృతి అంత చిత్రమైనది సృష్టి అంత విచిత్రమైనది కూడా కాదు ప్రేమ.... జీవితం కన్నా గొప్పదేమీకాదు అలాగని నీవు లేకుండా జీవించనూ లేము అందుకే ప్రతి ఒక్కరిలో ద్వేషాన్ని తగ్గించి నీవు ఉన్నత శిఖరాలకి ఎదిగిపో ఓ..............ప్రేమ

పాకుడురాళ్ళు-డాక్టర్ రావూరి భరద్వాజ 🌹

Image
పాకుడురాళ్ళు-డాక్టర్ రావూరి భరద్వాజ 🌹 🏵️ . పాకుడురాళ్ళు రావూరి భరద్వాజ విశిష్టమైన నవలా రచన. చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశాడు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ ల  ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే వ్రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా వ్రాశాడు. ఈ నవల మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రిక లో ధారావాహికగా వెలువడినది. ఈ పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి ఈ నవల రాసినందుకు రావూరికి 2013 లో సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈ పాకుడు రాళ్ళు వంటి సినీ ప్రపంచం నుండి జారి పడి, నేల రాలిన తారలని కాసేపు ఇక్కడ గుర్తు చేసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో స్లీపింగ్ పిల్స్ వేసుకుని చనిపోవడం మనకందరికీ తెలిసిందే!  పాకీజా లాంటి అద్భుత కళాఖండంలో నటించిన మీనా కుమారి తాగు

💐🙏🏼కాళిదాసు గర్వభంగం🙏🏼💐

Image
💐🙏🏼కాళిదాసు గర్వభంగం🙏🏼💐 మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు. మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు. ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి... ‘బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమ’ని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక... ‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని బదులిచ్చింది. కాళిదాసు: ‘నేను ఎవరో తెలియక పోవడం ఏంటి? పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు.* అహంకార పూరిత మైన ఆ మాటలు విని బాలిక నవ్వి... ‘మీరు అసత్య మాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది. అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి... ‘నాకు తెలియదు. గొంతు ఎండి పోతోంది. ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’ అని అడుగు తుంది. బాలిక.* ‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు. ‘మళ్లీ అసత్య

🙏కల్పవృక్షం... ఖండనం 🙏

Image
🙏కల్పవృక్షం... ఖండనం 🙏 🤲🤲🤲🤲🤲🤲🤲 సందర్భం వచ్చింది కాబట్టి ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’ గురించి కొన్ని విషయాలు... 👉విశ్వనాథ సత్యనారాయణ (1895- 1976) పద్యకావ్యంగా దీన్ని రాశారు. 👉ఈ రచన 1932లో ప్రారంభమైంది. 1944- 1962ల మధ్య అన్నికాండలముద్రణా పూర్తయింది. 👉ఈ రచనలో శబ్ద- అర్థపరంగా, ఛందోపరంగా ఉన్న లోపాలన్నీ వివరంగా పేర్కొంటూ కొత్త సత్యనారాయణ చౌదరి (1907- 1974) ‘కల్పవృక్ష ఖండనము’ రాశారు. 👉ఈ విమర్శ ‘భారతి’లో 1961 జూన్-అక్టోబరుల మధ్య ప్రచురితమై, సంచలనం సృష్టించింది. 👉దానిపై ‘ఆంధ్రపత్రిక సారస్వతానుబంధం’లో సుదీర్ఘ చర్చ జరిగింది. 👉ఈ చర్చనంతటినీ ఒకచోట కూర్చి 1962 జనవరి భారతి సంచికతో పాటు అందించారు. ఇంత వివాదం జరిగినా 1970లో రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ బహుమతి వచ్చింది! మరి ‘రామాయణ విషవృక్షం’ సంగతేమిటి? ఇది వాల్మీకి రచించిన రామాయణంపై "మార్క్సిస్టు దృక్పథం"తో చేసిన పరిశీలన, విమర్శ. ఇది వ్యాసాలుగా కాకుండా.. కథల రూపంలో ఉంటుంది. అవసరమైనచోట వాల్మీకి మూలగ్రంథంలోని శ్లోకాలూ, వాటి తెలుగు అర్థ తాత్పర్య

మృత సంజీవని – కొత్త సమాధానం ! (భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక)

Image
మృత సంజీవని – కొత్త సమాధానం !  (భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక) . విక్రమాదిత్యుడు మరోసారి భేతాళుడున్న శవాన్ని బంధించాడు. దాన్ని భుజాన పెట్టుకుని మౌనంగా బృహదారుణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడు పదిహేనవ కథ ప్రారంభించాడు. . “ఓ విక్రమాదిత్య మహారాజా! నీ పట్టుదల అనితర సాధ్యమైనది. నేనో కథ చెబుతాను. మార్గాయాసం మరిచి విను” అంటూ కథ కొనసాగించాడు.  ఒకానొకప్పుడు బ్రహ్మపురమనే బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. అందులో విష్ణు స్వామి అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడికి సంతతి లేదు. అందుచేత అతడెంతో దిగులు పడ్డాడు. ఎన్నో నోములూ, పూజలూ చేసాడు. చివరికి మహాశివుడి గురించి తీవ్ర తపమాచరించాడు. శివుడి దయతో, కొంత కాలానికి అతడికి సంతాన భాగ్యం కలిగింది. వరుసగా నలుగురు పుత్రులుదయించారు. అతడువారినెంతో అల్లారుముద్దుగా పెంచి, తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పాడు. మరిన్ని విద్యలు నేర్పాలన్న అభిలాషతో, కుమారులు నలుగురూ దేశాటనం బయలు దేరారు.  . అలా నానా దేశాలూ తిరుగుతూ, చివరికి ఓ యోగిని ఆశ్రయించారు. ఆ యోగి సకల విద్యా పారంగతుడు. మంత్ర తంత్ర విద్యలని సైతం ఎఱిగిన వాడు. బ్రాహ్మణ కుమారులు. అతణ్ణి శ్రద్ధా భక్తులతో సేవించారు. వ

మంచివారికి చెప్పిన సలహా రాణిస్తుందేమో !

Image
మంచివారికి చెప్పిన సలహా రాణిస్తుందేమో ! (శర్మగారి కాలక్షేపంకబుర్లు-సలహా) . ఈ మధ్య ఒక రోజు మరునాటి టపా రాదామని కూచుంటే  ఒక జంట వచ్చేరు. రమ్మని కుర్చీలు చూపించి చూస్తుండగా అతను “గుర్తు పట్టలేదండీ” అన్నాడు. అప్పుడు గొంతు గుర్తుపట్టి, “ఎలా వున్నా”రన్నా. ఉభయ కుశలో పరి, “నేను మళ్ళీ ఈ ఊరు ఉద్యోగానికొచ్చా. ఎదురుగా ఉన్న అపార్ట్మెంటులో అద్దెకుదిగా నిన్న, మిమ్మల్ని చూడాలని వచ్చా మ”న్నారు. “పిల్లలెలా వున్నా”రంటే, “మీదయవల్ల కులాసా,” అని నా మిత్రుని భార్య ఇలా అంది. . “ఉద్యోగంకి వచ్చిన కొత్తలో ఓవర్ టైం డబ్బులొచ్చినపుడు చెప్పేరట మీరు, ఆ డబ్బులు బోనస్ డబ్బు పెట్టి బంగారం కొనడం మొదలు పెట్టి ఏభయి తులాలు చేసి అమ్మాయికి పెట్టేం.”  దానికతను “ఏం పెట్టి ఏం ఉపయోగమైందండి అల్లుడు కాలం చేశాడు, మీరు ఎక్కడో ఉన్నవారు కబురు తెలిసి వచ్చి చూసి ఓదారుస్తూ, అమ్మాయిని రెండేళ్ళు పలకరించకండి, ఈ విషయాలమీద, ఆపు చేసిన చదువు పూర్తి చేయనివ్వండి. ఆ తరవాత మళ్ళీ పెళ్ళి గురించి అలోచిద్దామన్నారు. సరిగా అలాగే జరిగింది. . అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, ఈ లోగా మా బంధువులొకరు ఒక సంబంధం తెచ్చేరు. వాళ్ళకీ

🌹'ప్రేమనుతొలగిస్తే ఈ భూగోళం ఒక సమాధి'' 🌹

Image
🌹'ప్రేమనుతొలగిస్తే ఈ భూగోళం ఒక సమాధి'' 🌹 🏵️ సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు? .  చంద్రికలనేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? .  ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? ..  మావిగున్న కొమ్మను మధుమాసవేళ .  పల్లవము మెక్కి కోయిల పాడుటేల? పరుల తనయించుటకొ? తన బాగు కొరకొ గానమొనరింపక బ్రతుకు గడవబోకొ? ''-అని దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రేమ సహజమైందని, స్వార్థం లేనిదని, ప్రతిఫలాన్ని కోరదని, యాదృచ్ఛికమైందని చెప్పాడు. ప్రేమ అనే రెండక్షరాలకు సంతోషం, ఇష్టం, స్నేహం, చెలిమి అనే అర్థాలున్నాయి- ప్రేమ ప్రాధమికంగా ప్రకృతి పురుషులకు సంబంధించింది. మానవుడు ప్రకృతిని ప్రేమిస్తాడు. ప్రకృతిలోని సుందర దృశ్యాలను, చెట్లను, సెలయేళ్లను, కొండల్ని, గుట్టల్ని, ఆకాశాన్ని, సూర్యచంద్రాదుల్ని, నక్షత్రాల్ని, మేఘాల్ని, మెరుపుల్ని ఇష్టపడతాడు. ఒక పురుషుడు ఒక స్త్రీని ఇష్టపడతాడు. ఒక స్త్రీ ఒక పురుషునితో, స్నేహం చెయ్యాలనుకొంటుంది. కారణం మనసు-మనసు దేన్ని కోరుకొంటోందో దానిమీద ఇష్టం కలుగుతుంది. దాని సాన్నిహిత్యంలో సంతోషం కల

అరాళ కుంతలా - అంటే? ఏమో.🌹

Image
అరాళ కుంతలా - అంటే? ఏమో.🌹 🏵️ "నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా చిన అదినాకు మన్ననయా .. చెల్వగు నీ పదపల్లవంబు మ త్తనుపులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే ననియెద .. అల్కమానవుగదా ఇకనైన అరాళకుంతలా ! 🏵️🏵️🏵️ ఒక అమ్మాయి పద్యం అర్ధమడిగితే విడమరచి మరీ చెప్పా భవదీయ - నీ, దాసుని- దాసుడిని, (అయిన) నను - నన్ను, (నీ) మనంబున - మనసులో, నెయ్యపు -స్నేహపు, కినుక+పూని - అలక పూని (స్నేహపు అలక - ప్రణయ కలహం), తాచిన - తన్నిన, అదినాకు - అదినాకు, మన్ననయా - గౌరవమే; (నీ పాదం నన్ను తాకడం వలన) పులకాగ్ర- పులకించి గగుర్పొడిచి, కంటక - ముల్ల, వితానము - సమూహము, పొద (లా ఉన్నటువంటి) మత్తను - నా శరీరం, (ను) చెల్వగు - చెలివి అయినటువంటి, నీ - నీ, పదపల్లవంబు - చిగురులంటి పాదం, తాకిన - తాకిన, నొచ్చునంచు - నొప్పి కలుగును అని, నేననియెద - నేను అంటున్నా;. (కనుక) ఇకనైన - ఇకనైన, అల్కమానవుగదా - (నీ) అలక మానవా? అరాళ కుంతలా --?? అరాళ కుంతలా - అంటే? ఏమో. కానీ అరాళ కుంతల మాత్రం  నన్ను వదల్లేదు. అ పదాన్ని రకరకాలుగా విడగొట్టి అర్ధం చెప్పడానికి ప్రయత్నిచా. అ రాల కుంతల - రాలని

🙏 🙏🙏 హాలాహల భక్షణ!🙏🙏 🙏

Image
🙏 🙏🙏 హాలాహల భక్షణ!🙏🙏 🙏 👉పిల్లలకి తెలుగు పట్ల ఉత్సాహం, మక్కువ, ఆసక్తి, కలగాలంటే ఇలాంటి పద్యాలు వారి ఎదురుగా పెద్దలు పైకి బిగ్గరగా చదవాలి, నేర్చుకోవాలి. ) 🤲🤲🤲🤲🤲🤲🤲🤲 తనను స్తుతిస్తున్న బ్రహ్మాది దేవతలను చూసి,  సర్వప్రాణులనూ సమానంగా ఆదరించే పరమ విభుడు,  శంకరుడు తన అనుంగు భార్యతో ఇలా అన్నాడు.... 🏵️ క. కంటే జగముల దుఃఖము;  వింటే జలజనిత విషము వేఁడిమి; ప్రభువై యుంటకు నార్తుల యాపద గెంటింపఁగ ఫలము గాదె కీర్తి మృగాక్షీ! భావము: “ఓ లేడి కన్నుల సుందరీ! సతీదేవీ! చూడు లోకాలు ఎంత దుఃఖంలో ఉన్నాయో. ఎంత తీవ్ర ప్రభావంతో ఉందో నీళ్ళలో పుట్టిన ఆ హాలాహల విషం. శక్తిసామర్థ్యాలుగల ప్రభువు ప్రజల కష్టాన్ని తొలగించాలి. దానివలన కీర్తి వస్తుంది. 🏵️🏵️ క. ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన  ప్రాణుల రక్షింపవలయుఁ బ్రభువుల కెల్లం బ్రాణుల కిత్తురు సాధులు  బ్రాణంబులు నిమిష భంగురము లని మగువా! భావము: ఓ మగువా! పార్వతీ దేవి! ప్రాణభయంతో ఆశ్రయించిన జీవులను కాపాడటం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నిమిషంలో నశించి పోయేవి. అందువలననే ఉత్తములు ప్రాణులకు తమ ప్రాణ

చాలా సున్నితమైన గాధ!

Image
చాలా సున్నితమైన గాధ! ఒక భర్త భార్య పుట్టినరోజు విషయం మరచిపోయి ఆవిడకి శుభాకాంక్షలు కూడా చెప్పకుండా చాలా ఆలశ్యంగా ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు. " ఇఖ నన్ను కొన్నిరోజుల వరకు చూడలేరు" అన్నది ఆ భార్య భర్త తన అదృష్టాన్ని నమ్మలేకపొయాడు. " అబ్బో! అంత అదృష్టమా!" అన్నాడు. సొమవారం గడిచింది. ఆవిడ కనపడలేదు. మంగళవారం గడిచింది. ఉహూ! ఆవిడ కనపడలేదు. బుధవారం కూడా గడిచిపోయింది. ఉహూ! ఆవిడ కనపడలేదు. గురువారం కాస్త కంటివాపు తగ్గి కంటికొనలనుండి ఆవిడ లీలగా భర్తకి కనబడింది.

నండూరి వారు “ఎంకి”ని సృష్టించి 70 ఏండ్లు నిండాయి.

Image
నండూరి వారు “ఎంకి”ని సృష్టించి 70 ఏండ్లు నిండాయి. 🙏🙏🙏🙏🙏🙏🙏 అప్పుడు-ఇప్పుడు-ఎప్పుడు ఎంకి వయస్సు ఇరవై ఏండ్లే. నిండు జవ్వని-నిండు యవ్వని 🌹🌹🌹🌹 👉 ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి మెళ్ళో పూసల పేరు తల్లో పువుల సేరు కళ్ళెత్తితే సాలు: రసోరింటికైనా రంగు తెచ్చే పిల్ల. పదమూ పాడిందంటె కతలూ సెప్పిందంటె కలకాలముండాలి. అంసల్లె, బొమ్మల్లే అందాల బరిణల్లే సుక్కల్లె నా యెంకి అంటూ ”ఎంకి”ని సృష్టించారు నండూరి వారు. 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

తిట్టు' కవిత్వం కాదు .. 'విట్టు' కవిత్వమే!!

Image
తిట్టు' కవిత్వం కాదు .. 'విట్టు' కవిత్వమే!! 🏵️ . "ఆంధ్ర రత్న" బిరుదు కల దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు. కోదండ రామయ్య, సీతమ్మ దంపతులకు పుణ్య ఫలముగా పుట్టిన గోపాల క్రిష్ణయ్య "రామ దండు" సమర దళమును నిర్మించి,స్వాతంత్ర్య పోరాటములో తన క్రియా శీలతను నిరూపించు కొనిన ధీశాలి. అంతేకాదు! ఆయన గాయకుడు, రచయిత కూడా! ఆ దుగ్గిరాల వారి రచనలలో ఒక వ్యంగ్య సీస పద్యమును చూడండి. 🏵️ . సీ. కొండెంకటప్పన్న గుండు సున్న గదన్న - గోపాల కిట్టాయి కొక్కిరాయి . టంగుటూరు ప్రకాశ మింగిలీసు పిశాచి - నాగేశ్వరుడు వట్టి నాగ జెముడు . పట్టాభి సీతన్న తుట్టె పురుగు గదన్న - ఉన్నవ లచ్చుమన్న దున్నపోతు . గొల్ల పూడ్వరన్న కళ్ళు లేని కబోది - బులుసు సాంబడు వట్టి పుట్టు కుంక . అయ్యదేవర గాడు పెయ్య నాకుడు గాడు - అయ్యంకి రమణయ్య దయ్యమయ్య . డాక్టర్ సుబ్రహ్మణ్య మాక్టింగ్ పులిష్టాపు - దువ్వూరి సుబ్బమ్మ దృష్టి బొమ్మ . . తే.అనుచు పల్కుదు రాంధ్రుల నవని యందు - గాంధి శ్రేష్ఠుని మతములో గలిసి నపుడు తపము లేనిదె యెన్నరే నెప

ఈవిడ ఎవరు!

Image
ఈవిడ ఎవరు! . పడమట దిక్కున వరద గుడేసె  ఉరుముల మెరుపుల వానలు గురిసె  వాగులు వంకలు ఉరవడి జేసె  ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె ఏరువాక సాగారో రన్నో చిన్నన్న  నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న .. అని పాడిన ఆ నాటి అమ్మయే కదు !

మురళి ధర హరే మోహన కృష్ణ.🌹 🏵️

Image
మురళి ధర హరే మోహన కృష్ణ.🌹 🏵️ నంద లాలా యదు నంద లాలా బృందావన గోవిందా లాలా రాదే లోలా నంద లాలా రాదే మాధవ నంద లాలా! 🏵️🏵️🏵️ నాచో నంద లాలా నందలాలా స్మిత స్మిత సుందర ముఖారవిందా నాచో నంద లాలా నందలాలా మీరా కే ప్రభు లాలా నంద నాచో నందలాలా నందలాలా 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

గోదావరిపిలిచింది!

Image
గోదావరిపిలిచింది 🌅〰〰〰〰〰〰🌅 కొత్తగా పెళ్లైన కూతుర్నీ అల్లుడినీ సత్యనారాయణస్వామి దర్శనం చేయించి, భోజనాలయ్యేసరికి ఒంటిగంటయింది. కొత్త దంపతుల్ని వెంటబెట్టుకుని కారెక్కారు దక్షిణామూర్తి దంపతులు. ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్ళి జ్ఞాపకానికొచ్చింది. అప్పుడు కూడా ఇలాగే పెళ్లైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు అమ్మా, నాన్న. ఆ మాటకొస్తే దక్షిణామూర్తే కాదు, గోదావరి జిల్లాలో ఏ ఇంట్లో పెళ్ళయినా కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణస్వామి దర్శనం.  కారు నేషనల్‌ హైవే మీద పరిగెడుతోంది. చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలూ, దూరంగా పచ్చదుప్పటి కప్పుకున్నట్లున్న కొండలూ గజిబిజిగా వేగంగా కనుమరుగవుతున్నాయి. దక్షిణామూర్తి కడుపు నిండింది, మనసు మాత్రం వెలితిగా ఉంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఈమధ్యనే అమ్మాయి పెళ్ళి చేశాడు. అల్లుడికి అమెరికాలో ఉద్యోగం. మంచి స్థితిమంతుల కుటుంబం. భార్య తరఫు బంధువుల ద్వారా వచ్చిన సంబంధం అని, మరో ఆలోచన లేకుండా పెళ్ళి జరిపించాడు. ఒక వారంరోజుల్లో కూతురూ అల్లుడూ అమెరికా వెళ్ళిపోతారు. తనసలు చుట్టుపక్కల మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నాడు- మంచీ చెడ్డా కళ్ళె