🙏అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి🙏

🙏అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి🙏


🤲🤲🤲


అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి (నవంబరు 17, 1878 - జూలై 27, 1936) ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు మరియు ఆధ్యాత్మికవేత్త. 

రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు. 

వారు పదియేండ్ల వయసు నండే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము మరియు ఆయుర్వేదములో అసమాన ప్రతిభ చూపినారు. వీరి యొక్క వాక్చాతుర్యము, సంస్కృత భాషా ప్రావీణ్యము మరియు అన్ని శాస్త్రములందును విశేష ప్రతిభతో - నవద్వీప మందు విద్వత్పరీక్ష లందు పాల్గొని ‘కావ్యకంఠ’ బిరుదమును పొందిరి. వివిధ ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు


గణపతి శాస్త్రి విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం విజయనగరం జిల్లా) లోని కలవరాయి అగ్రహారం లో నవాబు అయ్యల సోమయాజుల అనే ఇంటి పేరుగల బ్రాహ్మణుల కుటుంబంలో అయ్యన సోమయాజుల నరసింహశాస్త్రి, నరసమాంబ దంపతుల రెండవ సంతానంగా జన్మించాడు.వీరి అసలుపేరు అసలు పేరు సూర్య గణపతిశాస్త్రి.వారు ఋగ్వేదులు, మరియు కౌండిన్యస గోత్రులు.


1900లో విజిగీషతో నవద్వీప విద్వత్పరీక్షలకు వెళ్ళగా, అక్కడ సభలోని పరీక్షక వర్గం వారు ఇతని కవిత్వ ప్రజ్ఞా ప్రదర్శనను చూసి 'కావ్యకంఠ' బిరుదుతో అభినందించారు. 1903లో మద్రాసులో నారాయణ సుదర్శనునితో పోటీలో ఆరు నిమిషాలలో కావ్యకంఠుడు ఇరవై శ్లోకాలను రచించి బంగారు కడియాన్ని బహుమానంగా పొందారు. 1902లో అరుణాచల క్షేత్రం వెళ్ళినప్పుడు వీరు శివుని సహస్ర శ్లోకాలతో స్తుతించి అక్కడ అధ్యాపకునిగా కొంతకాలం పనిచేసారు. తరువాత వేలూరులో తెలుగు పండితునిగా దాదాపు నాలుగు సంవత్సరాలు నిర్వర్తించారు.


కుటుంబ జీవితాన్ని గడుపుతూ, బాధ్యతలను నిర్వర్తిస్తూ తపస్సు చేసుకోవడం ద్వారా మోక్షప్రాప్తి సాధించవచ్చని ఋషులు చెప్పిన దానిని గట్టిగా విశ్వసించారు. భార్య అనుమతితో సంవత్సరంలో ఆరునెలల కాలం దేశంలోని వివిధ ఆలయాలలో ఏకాంత ప్రదేశంలో తపస్సు చేస్తుండేవారు. నవద్వీపంలో పండితుల సమక్షంలో వారి అభిమతం మేరకు 18 శ్లోకాలలో భారతగాథను ఆశువుగా చెప్పి ‘కావ్యకంఠ’ బిరుదు పొందారు. అరుణాచలంలో ఉన్న బ్రాహ్మణస్వామిని రమణమహర్షిగా మార్చారు.


చివరకు 1907లో దాస్య వృత్తిని వదలి అరుణాచలం వెళ్ళారు. అక్కడ అచంచల తపోదీక్షతో చిరకాలం ఉండి మునిగా రమణ మహర్షిని దర్శించి తపస్సు గురించి అతనికి అనుభవ పూర్వక వాక్యాలు ఉపదేశించారు. తరువాత ఈశ్వరిని స్తుతిస్తూ 'ఉమా సహస్ర' అనే గ్రంథాన్ని రచించారు. ఋగ్వేదం నుండి విదితమైన భారత చరిత్రాంశాలను నిరూపించు 'భారత విమర్శ' అనే గ్రంథం ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకు మించిన సత్యదర్శిని వంటిది. డెబ్బైఐదు వరకు ఉన్న వీరి గ్రంథాలలో కొన్ని మాత్రమే ముద్రించబడ్డాయి. వీరు 1924లో కాంగ్రెసులో చేరి, తమిళనాడు కాంగ్రెసు కమిటీకి అధ్యక్షులయ్యారు. సంఘ సంక్షేమం కోసం అస్పృశ్యతా నివారణను సమర్ధించి, దానిని శాస్త్రీయ దృష్టితో పోషించడానికి 'పంచ జన చర్చ' అనే వ్యాసాన్ని రచించారు.


923 డిసెంబరులో కాకినాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభలో స్త్రీల హక్కుల కోసం ఏర్పాటు చేసిన సభలో… పురుషులతో బాటు స్త్రీలకు సమానహక్కు ఉందని వేదశాస్త్ర ప్రమాణాలతో నిరూపించారు. 1924లో ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బెల్గాంసభలో … అస్పృశ్యత నివారణ శాస్త్రసమ్మతమని ప్రసంగించారు. హైదరాబాదులో ఆది హిందూసంఘం (హరిజనులు) వారు పల్లకిలో ఊరేగించి, సత్కరించి… ‘ముని’ బిరుదునిచ్చారు. ఒకపక్క తపస్సు ద్వారా అమ్మవారి దర్శనం, వివిధ రచనలు చేస్తూనే, మరోపక్క దేశోధ్ధరణకు పూనుకున్నారు.భారతీయుల పట్ల బ్రిటిష్‌వారి అమానుష ప్రవర్తనకు ఎంతో బాధపడిన నరసింహశాస్త్రి ప్రజలు ధర్మాలను ఆచరించకపోవడం వల్లే దేశానికి ఈ దుర్గతి పట్టిందని విచారించారు. సనాతన ధర్మాన్ని నెలకొల్పగల శక్తి సామర్థ్యాలుగల కుమారుడిని అనుగ్రహించమని తన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థించారు. వీరు ఆనేక ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు అయినను ఇంకా సంతృప్తి పడక - ఈశ్వర ప్రేరణమున, అరుణాచలము (తిరువన్నామలై) లో, 18-11-1907 న బ్రాహ్మణ స్వామిని (వేంకటరామన్) కలిసి '....... తపస్సాధన స్వరూపము కొఱకు అర్ధించుచు మిమ్ములను శరణువేడుచున్నాను.... ' అని తమిళ భాషలో అడిగిరి. అప్పటిదాకా పెక్కు సంవత్సరములు మౌనముగా వున్న బ్రాహ్మణ స్వామి:


"'నేను, నే' ననునది యెచ్చటనుండి వచ్చుచున్నదో విచారించినయెడల, అది ఉదయించు స్థలమందే లీనమగును. అదియే తపస్సు.

జపము చేయునప్పుడు మంత్రనాద మెచ్చటనుండి యుదయించు చున్నదని పరికించినచొ, అది యుధ్భవించు స్థలమందు పరికించు మనస్సు లీనమగును. అదియే తపము." అని మితాక్షరములతొ తమ ఉపదేశవాణిని తమిళ భాషలో వెలువడిరి.

గణపతిముని వేంకటరామన్ అను నామమమును 'రమణ' అని మార్చి, 'భగవాన్ శ్రీ రమణ మహర్షి' అను పూర్ణ నామమును సమకూర్చి, 'శ్రీ రమణపంచక' మను శ్లోక రత్నములను అప్పటికప్పుడు కూర్చి రమణుని హస్తమందుంచి 'మీరిది స్వీకరించి నన్ను ఆశిర్వదింతురు గాక' అని పలికెను. 'సరే, నాయనా' యని రమణుడు దానిని స్వీకరించెను. అప్పటినుండి బ్రాహ్మణ స్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షి గాను, కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని నాయన గాను పిలువబడుచుండిరి. జగత్ప్రసిద్దులయిరి. తదుపరి గణపతి ముని భగవాన్ శ్రీ రమణ మహర్షి అనుగ్రహము వలన చూత గుహలో కపాల భేద సిద్ధి పొందిరి (1922 వేసవి).


'నాయన' అను ప్రియ నామముతో ప్రకాశించిన శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని జూలై 27, 1936లో మరణించారు. ఈ దివ్యపురుషుని భౌతిక దేహమంతరించినను, తన గ్రంథములందు బోధరూపమున ప్రకాశించుచున్నారు.


గణపతిముని నిర్యాణము తరువాత గుంటూరు లక్ష్మికాంతము గారు తరచూ భగవాన్ శ్రీ రమణ మహర్షి యొద్దకు వచ్చుచుండెడి వారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయముగా లక్ష్మికాంతమును ఆశీర్వదించి, పలు వ్యక్తులను కలిసి నిజ నిర్ధాణము చేసుకొని, ఈ జీవిత చరిత్రను వ్రాయమని ఆదేశించిరి. ఈ జీవిత చరిత్ర మొదట 1958 లో ప్రచురింపబడింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!