Posts

Showing posts from 2018

దేవీ భాగవతాంతర్గత.మణిద్వీప వర్ణన !

Image
దేవీ భాగవతాంతర్గత.మణిద్వీప వర్ణన ! 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 - -బ్రహ్మలోకానికి పైనసర్వలోకం విరాజిల్లుతూ ఉంటుంది. దానినే మణిద్వీపమంటారు. అక్కడే శ్రీదేవి తేజరిల్లుతూ ఉంటుంది. సమస్తలోకాలకన్న అధికమైనది కావడం వల్లనే మణిద్వీపాన్ని సర్వలోకమని అంటారు. పరాంబికాదేవి దానిని తన సంకల్ప మాత్రంచేత సృష్టించింది. ఈ సృష్టికిపూర్వం మూల ప్రకృతీదేవి ఈ మణిద్వీపాన్ని తనకు ఆవాసస్థానంగా ఏర్పరచుకుంది. మణిద్వీపం కైలాసం కన్నా మిన్నగా, వైకుంఠంకంటే ఉత్తమంగా, గోలోకం కంటే శ్రేష్ఠంగా భాసిల్లుతూ ఉంటుంది. అందుకే దానిని సర్వలోకమంటారు. - సుదీర్ఘమైన ఆ తీరాలలో నయనానందకరమైన రత్నవృక్ష పంక్తులు రాజిల్లుతూ ఉన్నాయి. ఆ ప్రదేశానికి ఆవలిభాగంలో నిర్మించబడిన సప్త యోజనాల విస్తీర్ణంకల దృఢమైన లోహమయ ప్రాకారం ఉంది. నానాశస్త్రాస్త్రాలను ధరించి పోరడంలో యుద్ధ విశారదులైన రక్షకభటులు నాలుగు ద్వారాలతో ద్వారపాలకులై కాపలా కాస్తూ ఉంటారు. ప్రతి ద్వారంలోనుఊ వందలాది భటులుంటారు. అక్కడ శ్రీదేవీభక్తులు గణాలుగానివసిస్తారు. వారు సర్వదా జగదీశ్వరి దివ్య సందర్శనార్థం విచ్చేస్తూంటారు. వారు తమ దివ్య వాహనాలపై వస్తూపోతూంటా

అరాళ కుంతలా .🌹 (నెట్ నుండి స్వీకరణ .)

Image
అరాళ కుంతలా .🌹 (నెట్ నుండి స్వీకరణ .) 🌺 ఒక రోజు నేను శ్రీ కృష్ణ తులాభారం సినిమా చూస్తున్నప్పుడు అందులో ఎన్ టీ రామారావు, జమున కాళ్ళు పట్టుకుంటే ఆవిడ తన్నిన సన్నివేశం లో ఘంటసాల గారు ఒక పద్యం పాడారు. నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్‌కబూని తాచిన అది నాకు మన్ననయా చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చుననుచు నేనయిద అల్క మానవు కదా ఇకనైన అరాళ కుంతలా ........... పద్యం అంతా బానే అర్ధం అయ్యింది కానీ .... అరాళ కుంతలా ... అంటే ఏంటో అర్ధం కాలేదు. మా పితృ పాదుల వారు పక్కనే ఉన్నారు కదా అని ఆయన్ని అడిగాను. నేను చదువుకోకుండా సినిమా చూస్తున్నానన్న కోపం లో ఆయన పక్కనే ఎప్పుడూ రెడీ గా ఉంచుకునే కమండలం లో కాసిని నీళ్ళు తీసి "నీకు ఆ పదానికి అర్ధం తెలియకుండు గాక" అని శపించారు. యధా విధి గా నేను శాపవిమోచన మార్గం అడిగాను. అప్పుడు ఆయన "ఆ పదానికి అర్ధం వేరొకరి ద్వారా నువ్వు తెలుసుకుంటావు." అని సెలవిచ్చారు. పితృపాదుల వారి శాపం కారణం గా నా అంతట నేను దానికి అర్ధం తెలుసుకోలేకపోయాను. సరే అప్పటినుండీ చాలమంది ని అడిగి చూసాను. ఎవరూ అంత స్పష్టమైన సమాధా

విస్సన్న చెప్పిన వేదం-శ్రీ ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రులు !

Image
విస్సన్న చెప్పిన వేదం-శ్రీ ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రులు ! 🌺 “లేచింది ..నిద్ర లేచింది మహిళా లోకం  దద్దరిల్లింది పురుష ప్రపంచం” అనే పాట గుండమ్మ కథ సినిమా లోనిది మన N.T.రామారావు పాడింది  అందరూ వినే ఉంటారు. దానిలో అతడు “ఎపుడో చెప్పెను వేమన గారూ అపుడే చెప్పెను బ్రహ్మంగారూ ..ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా విస్సన్న చెప్పిన వేదం కూడా” అంటూ పాడుతాడు.  వేమన్న ఎవరో మనందరికీ తెలుసు.  అలాగే కాలజ్ఞానం చెప్పిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారూ తెలుసు. అయితే వీరి పేర్ల సరసన చేర్చబడిన ఆ విస్సన్నగారెవరో చాలమందికి తెలీదు. ఆయన చెప్పిన వేదం ఏమిటో కూడా తెలీదు.  ఆయన ఎక్కడివాడో ఎప్పటి వాడో తెలుసుకుందామన్నా చెప్పేవారెవరూ లేక ఆయన కూడా ఒక మహానుభావుడై ఉంటాడ్లే అని సరిపెట్టుకుని ఊరుకుంటాము. అలా ఊరుకోనక్కర లేదు.  ఆయనా ఒక చారిత్రిక పురుషుడే.ఆయన పూర్తి పేరు ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రులు .విస్సన్న చెప్పిందే వేదం అని ప్రఖ్యాతి గాంచిన ఈయన ఏ వేదం చెప్పలేదు. కాని ఏ విషయంలోనైనా వాదనలో ఆయనను ఓడించగల వాడు ఆయన కాలంలో ఉండేవాడు కాదు. ఏ శాస్త్ర విషయమైనా ఆయన నిర్ణయాన్ని కాదనగలిగే వారు లేక పోవడంతో ఆయన వాక్కే వ

వంట చేసే మహిళలకు చిట్కాలు..

Image
శుభరాత్రి.🌹 🌺 వంట చేసే మహిళలకు చిట్కాలు.. వంట గది..మహిళలు ఎక్కువ సమయం ఇక్కడనే కేటాయిస్తుంటారు. ఉదయం..మధ్యాహ్నం..రాత్రి సమయాల్లో ఇంటి వారికి కావాల్సిన వంటకాలు మహిళలు చేస్తుంటారు. వంట చేసే సమయాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటారు. వంట గది శుభ్రంగా ఉంచుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. వంటగది..వంటల్లో నెలకొనే సమస్యల పరిష్కారానికి కొన్ని చిట్కాలు... వంటగదిలో బొద్దింకలు..చీమలు ఎక్కువగా తిరుగుతూ ఇబ్బందులు పెడుతుంటాయి. బిర్యానీ ఆకును పొడి చేసి బొద్దింకలు తిరిగే చోట చల్లి చూడండి. ఒక దోసకాయను ముక్కలుగా తిరిగి చీమలు తిరిగే చోట పెట్టి చూడండి. వంట చేసే సమయాల్లో చేతులు మరకలవుతుంటాయి. మరకలు కాకుండా ఉండాలంటే ఆలుగడ్డ ముక్కలతో రుద్దాలి. చెక్కతో చేసిన వంట సామాగ్రీ వాసన వస్తుంటాయి. ఇలా రాకుండా ఉండాలంటే వెనిగర్ కలిపిన నీటిలో వాటిని ఉంచాలి. చపాతిలు మృదువుగా రావాలంటే పిండి కలిపే సమయంలో ఉడికిన బంగాళ దుంప కలపండి. చపాతి పిండిలో పాలు లేదా గోరువెచ్చని నీళ్లు కలిపి ఓ అరగంట..గంట పాటు నాననబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి. కూరల్లో మసాలా ఎక్కువైతే రెండు లేదా మూడు టమాటాలను ఉడికించి అ

🌹మధుర వాణి -సుమతీ శతకం పద్యం 🌹

Image
🌹మధుర వాణి -సుమతీ శతకం పద్యం 🌹 🏵️ నమస్కారం..!  ఈ రోజుటి సుమతీ పద్యం ఇదే..! - కొఱగాని కొడుకుపుట్టిన కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్ చెఱకు తుద వెన్ను పుట్టిన చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతీ! సుమతీ శతకాన్ని రాసిన బద్దెన తన శతకంలో అనేక విషయాలను అందరికీ అర్థమయ్యే భాషలో తెలియచేశాడు. ఈ పద్యంలో అప్రయోజకుడయిన కుమారుడి గురించి వివరించాడు. భావం: ప్రయోజకుడు కాని కొడుకు పుడితే, అతడు ప్రయోజకుడు కాకపోవటమే కాకుండా, తండ్రిలో ఉన్న సుగుణాలకు చెడ్డపేరు తీసుకువస్తాడు. చెరకుగడ చివర కంకి మొలిస్తే, మొలిచిన చోట తీపి ఉండదు. అక్కడ లేకపోవటమే కాక, గడలో ఉన్న తీపినంతటినీ కూడా ఈ కంకి చెడగొడుతుంది. ఇది ప్రపంచమంతటా ఉన్న సత్యం. కొఱగాని కొడుకు అంటే ఏపనీ చేతకానివాడు, నేర్చుకోని వాడు, ఏ పనీ చేయనివాడు అని అర్థం. ఇలాంటివారినే అప్రయోజకులు అని కూడా అంటారు. కొందరు పిల్లలు ఏ పనీ చేయకుండా, బద్దకంగా, సోమరిగా ఉంటారు. అంతేకాక పనికిమాలిన పనులు అంటే చేయకూడని పనులు చేస్తూ, తండ్రి పేరు చెడగొడతారు. అందరిచేత చివాట్లు తింటారు. అటువంటి కుమారుడిని చెరకులో పుట్టిన వెన్నుతో పోల్చి చెప్పాడు బద్దెన. ప్రప

🙏శ్రీ గురజాడ అప్పరావు గారు🙏

Image
🌹మన సాహితీ ప్రముఖులు (19)🌹 🙏శ్రీ గురజాడ అప్పరావు గారు🙏 👉దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్ గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌ పాడి పంటలు పొంగిపొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్ తిండి కలిగితే కండకలదోయ్ కండకలవాడేను మనిషోయ్ “పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టును…” ఈ మాటలన్న గిరీశం అంటే తెలియని వాళ్ళు బహుశా తెలుగునాట ఉండరేమో… అలంటి అద్భుత పాత్రని సృష్టించిన గురజాడ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రముఖ రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. గానూ భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు ప

🙏శ్రీదాశరథి గారు🙏

Image
🌹మన సాహితీ ప్రముఖులు (20)🌹 🙏శ్రీదాశరథి గారు🙏 👉  ఎవరు కాకతి! ఎవరు రుద్రమ! ఎవరు రాయలు! ఎవరు సింగన! అంతా నేనే! అన్నీ నేనే! అలుగు నేనే! పులుగు నేనే! వెలుగు నేనే! తెలుగు నేనే! దాశరథి కృష్ణమాచార్య జననం జూలై 22, 1925 వరంగల్ జిల్లా చిన్నగూడూరు మరణం నవంబర్ 5, 1987 ఇతర పేర్లు దాశరథి ప్రసిద్ధి కవి, రచయిత తండ్రి దాశరథి వెంకటా చార్య తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య  దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు. నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు. “ రైతుదే తెలం

🌹స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థమిదేః🌹

Image
🌹స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థమిదేః🌹 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణను ఎరుగని తెలుగు లోగిలి లేదనడం అతిశయోక్తి కాదు.  నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో యజమానురాలు, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, గృహిణి... ఇలా నిజ జీవితంలో విభిన్న పాత్రలను పోషించి ఆయా రంగాల ప్రముఖులచే భేష్ అనిపించుకున్న ఘటికురాలు. స్త్రీ స్వేచ్ఛపై తన అభిప్రాయాలను సుస్పష్టంగా చెప్పారామె. మహిళా స్వేచ్ఛ అంటూ చాలామంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారని డాక్టర్ భానుమతి పేర్కొంటూ, ఎవరినీ లెక్కచేయక విచ్చలవిడిగా తిరుగుతూ నిర్లక్ష్య ధోరణి గలవారు ఒకరైతే... పురుషాధిక్యానికి గురై అమాయకత్వంతో కూడిన అజ్ఞానంతో కష్టాలు పడే మహిళలకు విముక్తినివ్వాలని సీరియస్‌గా వాదించేవారు ఇలా రెండు రకాల మహిళా స్వేచ్ఛావాదులు ఉన్నారంటారు. అయితే "మట్టిలో మాణిక్యం" చిత్రంలో తాను రూపొందించిన లలిత పాత్ర. స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్ధం అంటారు డాక్టర్ భానుమతి. మహిళ తనకంటూ స్వంత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని, తన పరిమితులను తానెరిగి, జీవిత భాగస్వానిగా, అమ్మగా, పరిపూర్ణ స్త్రీగా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆత్

💥బాల గంగా ధర తిలక్..... కవితా మనసు.💕🌹

Image
💥బాల గంగా ధర తిలక్..... కవితా మనసు.💕🌹 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 . ఒక్క మునిమాపు వేళ మా వూళ్ళో ఒక కదంబ వృక్ష ఛాయలో మొదటి సారిగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తమ ఊర్వశీ ప్రవాసం లోంచి వివరాలీ విభావరీ విలాసాల నీ మసలు చరణ మంజీరము గుసగుసలో అన్న గేయం విన్నప్పుడు చటుక్కున ప్రబంధాల బలవంతపు వర్ణనలూ బిగుసుకుపోయిన భాషా శరీరాలూ, మా వూరి రోడ్ల మీది దుమ్ము అన్నీ మాయమయి పొయి 👉నేను నా లోంచి కదలి పోయి జాలి జాలిగా గాలిలో చిరు చీకటిలో నక్షత్రాల చిరు కాంతిలో కలసి పోయి యేదో యేదో అయిపోయిన క్రొత్త చైతన్యం లో ఆ రాత్రంతా నిద్రపోలేదు. (చిత్రం - వడ్డాది .) 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

దేముడు...దయామయుడు.." అను ఒక సారాయి షాప్ వాడి కధ !

Image
దేముడు...దయామయుడు.." అను ఒక సారాయి షాప్ వాడి కధ ! 😌😅😌😅😌😌😅😌😅😌 ఓ సారి దేముడు భూలొకానికి వచ్చాడు... నేను ఇంట్లొ లేను!! సరే ఊరు చూద్దామని బయలు దేరాడు దేముడు! దారిలో దాహం వేసింది!!! ఒక పాల వాడు కనిపించాడు... ''బాబూ కొంచెం పాలు పోస్తావా??" అని అడిగాడు!! "తేరగా పొయ్యడానికి ఇవి నీళ్లు కావు " అంటూ పాల వాడు వెళ్ళిపోయాడు ! దేముడికి నోరు ఎండిపోతోంది!! ఎదురుగ్గా సారాయి దుకాణం చూసి.... అక్కడికి వెళ్లి అడిగాడు!! "తాగు...నీ ఇశ్టమొచ్చినన్త తాగు....జల్సా చేసుకో " అన్నాడు సారాయి షాప్ వాడు తృప్తి గా తాగాడు దేముడు!! బాగా ఖుష్ అయిపోయాడు... అంత్హే ...వెంటనె ... "ఈ రోజు నుండి... "పాలు అమ్ముకుందుకు పాలవాడు ఇంటింటికీ తిరగాలి... సారాయి కావాల్సిన వాళ్లు ...నిన్నే వెతుకుంటూ వస్తారు..!!!.." అని శాపము...వరమూ....రెండూ ఇచ్చేసాడు . . "దేముడు".🙏🏿 -వింజమూరి .

🙏శ్రీ . గుర్రం జాషువా గారు.🙏

Image
🌹మన సాహితీ ప్రముఖులు (18)🌹 🙏శ్రీ . గుర్రం జాషువా గారు.🙏 👉ఇచ్చోట; నే సత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులతో గఱిగిపోయె యిచ్చోట ; నేభూములేలు రాజన్యుని యధికార ముద్రికలంతరించె యిచ్చోట ; నేలేత ఇల్లాలి నల్లపూసల సౌరు, గంగగలసిపోయె యిచ్చోట ; నెట్టి పేరెన్నికంగొన్న చిత్రలేఖకుని కుంచియనశించె ఇది పిశాచులలో నిటలేక్షణుండు గజ్జెగదలించి యాడురంగస్థలంబు ఇది మరణదూత తీక్షణ దృష్టులొలయ నవని పాలించు భస్మ సింహాసనంబు ' కఠిన చిత్తుల దురాగతములు ఖండించి కనికారమొలగించుకలమునాది ' అని ఎలుగెత్తి చాటారు " నిమ్మజాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయునని " హెచ్చరించారు అస్పృశ్యులు పండించే ధాన్యం ఆలయాలలో దేవునికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కాని ఆ ధాన్యం పండించే కృషికులకు ఆలయ ప్రవేశం కూడా లేదు అంటూ: ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకువిదల్పదీ భరతమేదిని ముప్పది మూడు కోట్లదే వతలెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులార్తురే ' అంటూ ధనవంతుల అపవ్యయాన్ని ఎండగట్టారు.

🌹🌺శ్రీమంతం -పురిటికొచ్చిన పిల్ల!🌺🌹

Image
🌹🌺శ్రీమంతం -పురిటికొచ్చిన పిల్ల!🌺🌹 (కృష్ణ శాస్త్రి గారి కవిత -దామెర్ల రామారావు గారి చిత్రం) - "ఎవరాడబడుచమ్మ - ఎవరాడబడుచు? యేరు దాటొచ్చింది ఎవరాడబడుచు? - కుచ్చులా పల్లకిని కూర్చున్నదీ - లోన అచ్చంగ రాణిలా అమరున్నదీ! పరుపు బాలీసుపై ఒరిగున్నదీ! అన్నలైతే పసిడి అందెలిస్తారు తమ్ములైతే వేలు సొమ్ములిస్తారు పెట్టి పోసేవారు పుట్టింటివారు పుట్టింటికే తానూ పురిటి కొచ్చింది! - లక్ష్మి[పురిటికొచ్చిన పిల్ల]:  అందుకు కాదమ్మోయ్ నేను వస్తా! సుబ్బమ్మ: అదెంత సేపమ్మోయి పిల్లా! మరదళ్ళు అడుగులకు మడుగు లొత్తేరు వదినల్లు కనుసన్న నొదిగి మెదిలేరు గౌరవానికి గాని ఘనతకు గాని తన పుట్టింటిలో తాను దొరసాని! - అబ్బాయి తాతయ్య అంక మెక్కెను అమ్మాయి అమ్మమ్మ చంక నెక్కెను తన పుట్టింటిలో తాను దొరసాని మగనింటిలో ఉంటె మగువ యువరాణి! [దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి రూపకము లోని కొంతభాగం] -వింజమూరి. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🙏🏿🌹-పోతన గారి ఒక అద్బుత శృంగార పద్యం.!🌹🙏🏿

Image
🙏🏿🌹శుభోదయం -పోతన గారి ఒక అద్బుత శృంగార పద్యం.!🌹🙏🏿 . (భాగవతం లోని వామనావతారం నందు బలిచక్రవర్తి .) 🌺 శా. ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై, బాదాబ్జంబులపైఁ, గపోలతటిపైఁ, బాలిండ్లపై నూత్నమ ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్ గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే? భావము: బలి చక్రవర్తి : ఓ మహత్మా! శుక్రాచార్యా! ఎడతెగని యజ్ఞ యాగాలు, వ్రతాలూ చేసినా, పుణ్యకార్యాలు చేసినా విష్ణువును దర్శించడానికి వీలు పడదు. అటువంటి గొప్ప వాడు కురచ  అయి అడుగుతున్నాడు. అతడు కోరినదానిని ఇవ్వడం కంటే నావంటి వాడికి ఇంకేం కావాలి. మొదట లక్ష్మీదేవి యొక్క కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ళ మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి చెయ్యి కిందది కావటం నాచెయ్యి పైది కావటం ఎంత అదృష్టం! ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏ పాటిది! ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా! ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా. (చిత్రం మన బాపూ గారు 🙏🏿) -వింజమూరి  🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🙏శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి గారు. 🙏

Image
🌹మన సాహితీ ప్రముఖులు (17)🌹 🙏శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి గారు. 🙏 👉అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి  ముందు చూపులేనివాడు ఎందునకూ కొరగాడు. 'పేరు కొసరాజు, తెలుగంటే పెద్దమోజు అని స్వయంగా ప్రకటించుకున్నాడు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు తొలిసారిగా కొసరాజు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు. 1938లో గూడవల్లి రామబ్రహ్మం రైతుబిడ్డ సినిమా లో కొసరాజు కొన్ని పాటలు రాయడమేకాక నటించారు యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు. తెలుగుభాషకి జరుగుతున్న అన్యాయాన్ని గురించి సంస్కృతము కొరకు చలపట్టునొక్కండు, హిందియనుచు గంతులిడు నొకండు, తెలుగు కొరకు నేడ్చు ధీరుండు కరువయ్యె...' అన్నారు తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేకపీఠం. ఆ రోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి. వ్యంగ్యం, హాస్యం మిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలి, అది రాఘవయ్య చౌదరిగారు రాయాలి - అని అప్పట్లో సిన

🙏శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు . 🙏

Image
🌹మన సాహితీ ప్రముఖులు (16)🌹 🙏శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు . 🙏 👉 కృష్ణ శాస్త్రి పాట అంటే ఆయన మాటల పాటలతోనే కూర్చిన ఈ గజ మాల.  మావిచిగురు తిన్న కోయిల తీయగా పాడే పాట! ఆకులో ఆకుగా , పువ్వులో పువ్వుగా ఒదిగి పోవాలనుకునే ప్రకృతి మమేకం ప్రతి రాత్రిలోనూ వసంత రాత్రిని చూసే శృంగా రం ఆకాశం లో హాయిగా విహరించే మేఘం ద్వారా పంపే ప్రేయసీ ప్రియుల సందేశం తెలుగు ఆడపడుచు జీవితంలో కార్తీక దీపం కన్నె పిల్ల అరచేత ఎర్రగా పండిన గోరింటాకు మామిడి చిగురు లోని ఎరుపు, మంకెన పువ్వులోని ఎరుపు, మాణిక్యం లోని ఎరుపు మనస్సు నిలుపోలేక కుశలమా అంటూ అడిగే క్షేమ సమాచారం నిదుర రాని నిశి రాత్రుల్లో, నోరు లేని ఆవేదనల్లో తోడుగా నిలిచేది అడుగడుగునా, అందరిలోనూ గుడి ఉందంటూ దైవానికి చెప్పే నిర్వచనం అప్సరసలు పేరంటా ళ్ళుగా, దేవతలు పురోహితులుగా, నక్షత్రాలు తెచ్చే తలంబ్రాలతో ఆకాశ పందిరిలో జరిగే పెళ్లి హరి పూజకు సమర్పించే పువ్వు రావమ్మా మహాలక్ష్మీ అంటూ పిలిచే హరిదాసు పిలుపు కన్నెపిల్ల చెదిరే ముంగురులు, కాటుకలు , నుదురంతా పాకేటి కుంకుమలు అందీ అందని సత్యాలేమో అని

🙏🏿🙏🏿🌺 సాటిలేని - వేదాంతి - గార్గి🌺🙏🏿🙏🏿

Image
🙏🏿🙏🏿🌺 సాటిలేని - వేదాంతి - గార్గి🌺🙏🏿🙏🏿 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🏵️🏵️🏵️🏵️🏵️🏵️🙏🏿🙏🏿🙏🏿🙏🏿 వేదకాలం నుంచీ కూడా భరతవర్షం మీద ఆడవారంటే పక్షపాత ధోరణి ఉందంటూ చాలామంది ఆరోపిస్తుంటారు.  కానీ ఆడవారి పట్ల వివక్ష కొత్తగా పుట్టుకువచ్చిందే కానీ వేదకాలంలో ఇలాంటి ధోరణులు లేవన్నది ధార్మికుల మాట. అందుకు ఉదాహరణగా గార్గి పేరు ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. వేదాలు స్త్రీలు అభ్యసించకూడదనీ, అసలు వినకూడదనీ ఎలాంటి నిబంధనా లేదనీ... అందుకు గార్గి జీవితమే సాక్ష్యమనీ చెబుతుంటారు. గార్గి, వచక్నుడు అనే రుషి కుమార్తె. వచక్నుడు సకలశాస్త్ర పారంగతుడు. వేదాధ్యయన తత్పరుడు. ఆయన ఇంట్లో పెరుగుతున్న గార్గికి సహజంగానే వేదాలంటే మక్కువ ఏర్పడింది. వాటిని అభ్యసించేందుకు పురుషులతో సమానంగా ఉపనయం చేసుకుంది. ఒకో శాస్త్రాన్నే ఔపోసన పట్టసాగింది. వాటిలో నిష్ణాతురాలై ఏకంగా ‘బ్రహ్మవాదిని’ అన్న బిరుదుని సాధించింది. గార్గి గురించిన ప్రస్తావన బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందులో జనకుని సభలో యాజ్ఞవల్య్క రుషిని ఆమె ముప్పుతిప్పలు పెట్టిన విధం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. జనకుడు బ్రహ్మ జ

🙏శ్రీ. పింగళి నాగేంద్రరావుగారు . 🙏

Image
🌹మన సాహితీ ప్రముఖులు (15)🌹 🙏శ్రీ. పింగళి నాగేంద్రరావుగారు . 🙏 👉 మిస్సమ్మ : ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, ఔనంటే కాదనిలే కాదంటె ఔననిలే మాయాజార్ : అటు నేనే.. ఇటు నేనే చిరంజీవ.. చిరంజీవ.. సుఖీభవ! సుఖీభవ!! పింగళి నాగేంద్రరావు కేవలం సినిమా రచయిత మాత్రమే కాదు. పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రాసినవే. చిన్నతనం నుంచీ విద్యార్థిదశలోకూడా, నాగేంద్రరావుకు రచనలుచేసే అభ్యాసం వుండేది. ముఖ్యంగా నాటకాలమీద ఆయనకు ఎక్కువమక్కువ. శారద పత్రికను నడిపేరోజులలోనే ఆయన ద్విజేంద్రలాల్ రాయ్ బెంగాళీ నాటకాలు “మేవాడ్ పతన్”, “పాషాణి” తర్జుమాచేసి కృష్ణా పత్రికలో ప్రచురించారు. ఆయన సొంతనాటకాలు “జేబున్నీసా” (1923), “వింధ్యరాణి” కృష్ణా పత్రికలో ధారావాహికగానూ, “నా రాజు”(1929) భారతిలోనూ పడ్డాయి. జేబున్నీసా నాటకాన్ని ప్రదర్శించకుండా ఆపడానికి మహమ్మదీయులు ఈ నాటకానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. తత్ఫలితంగా, హిందూ-ముస్లిం ఘర్షణల

నాకు నచ్చిన పద్యం: సత్యభామ వర్ణన🌹

Image
నాకు నచ్చిన పద్యం: సత్యభామ వర్ణన🌹 (🙏🏿రచన: శ్రీ చీమలమర్రి బృందావనరావుగారు .🙏🏿 🌺🌺 మ. అరి జూచున్ హరి జూచు జూచుకములం దందంద మందార కే సరమాలామకరందబిందుసలిలస్యందంబు లందంబులై తొరుగం బయ్యెద కొం గొకింత దొలగం దొడ్తో శరాసారమున్ దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేలీగతిన్ పై పద్యం ఉత్తర హరివంశ కావ్యం లోనిది. నాచన సోమనాథుడు రచించినది. చాలా ప్రసిద్ధమైన పద్యం. హరివంశాన్ని మహాభారతానికి పరభాగంగా భావిస్తారు. ఇందులో శ్రీకృష్ణుని బాల్యమూ, ఆయన వివిధ దశల్లో జరిపిన యుద్ధాలు మొదలైనవి వర్ణింపబడ్డాయి. సంపూర్ణ హరివంశంలో ఎక్కువ భాగాన్ని ఎఱ్ఱాప్రగడ తెనిగింపగా ఉత్తరభాగం లోని కొన్ని అంశాలను నాచన సోమన తెనిగించాడు. రెండు కావ్యాలకూ మంచి ప్రాచుర్యమే వచ్చింది. వంశాభివృద్ధిని కోరుతూ (అంటే మగపిల్లవాడే పుట్టాలని లెండి) గర్భిణీ స్త్రీలతో హరివంశాన్ని పారాయణం చేయించడం, వారికి హరివంశాన్ని పురాణంగా చెప్పించి వినిపించడం, పూర్వం చాలా ఇళ్ళలో జరిగేది. కృష్ణుని జననమూ, బాల్య క్రీడలూ ఎఱ్ఱన హరివంశం లోనే ఉన్నాయి కాబట్టీ ఎఱ్ఱన హరివంశానికే ఆ అవకాశం ఉండేది. నాచన సోమన ఎఱ్ఱనకు సమకాలికుడో, తరువాతి వాడో కాని పూర్వుడ

🌹🌺ఈ రోజు మహానటి సావిత్రి పుట్టిన రోజు.🌺🌹

Image
🌹🌺ఈ రోజు మహానటి సావిత్రి పుట్టిన రోజు.🌺🌹 మహానటి సావిత్రి.. మరులుగొల్పు మలయ మారుత మత్తేభ మందగమన మాధుర్య మధుశాల సావిత్రి, సొంపైన సొగసు సోయగాలు నింపి సుగంధ సౌరభాలు వెదజల్లు సుందరాంగి సావిత్రి, నిండుదనమే నిచ్చెనగా,హుందాతనమే హొయలుగా రంజింపు రసమయే సావిత్రి, గహన గాంభీర్య సన్నివేశ సమాహారంబున అలవోక సజీవ ప్రదర్శనమే సావిత్రి !! 🌺🌹 నట శిరోమణి మహానటి 'సావిత్రి'.-ఈ నాటి ఈ బంధం ! - అభినయానికి చిరునామా, నటి అనే పదానికి పర్యాయ పదం. ప్రతీ పాత్రకు ప్రాణం పోసే అభినయ కౌసలం.  వెరసి ఆమె వెండితెర రాణి. మహానటిగా పేరు సంపాధించి అశేష వాహిన అభిమానులను సొంత చేసుకున్ననట శిరోమణి మహానటి 'సావిత్రి'. ఎన్ని తరాలు మారిన తెలుగు సినిమాల్లో ఆమె నటన ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఆమె అభినయం, నటనలోని వైవిధ్యం చిత్ర రంగంలో తిరుగులేని నటిగా నిలబెట్టింది.! 🌺🌹. సావిత్రి గారి ఇష్టాలు ! - మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి.  ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది.  చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప

"" ఋణానుబంధం - అంతా ఋణానుబంధం "" - ----"" జగమంతా ఋణానుబంధం ""-----

Image
🌺🌹🌺🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🌺🌹🌺 ఈ విషయం చదివేముందు ఒక్కమాట ! ఒక తండ్రి 70 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత చనిపోయినప్పుడు పెద్దకొడుకు వయస్సు 40, రెండవకొడుకు వయస్సు 37, మూడవ కొడుకు వయస్సు 33, నాలుగవ కొడుకు వయస్సు 30. సంవత్సరాలు అయితే... అంటే పెద్ద కొడుకుతో 40 ఏళ్ళు ఉంటే , చివరి నాలుగవ కొడుకుతో 30 ఏళ్ళు మాత్రమే వున్నాడు . ఎందుకు ? మీ అనుభవంలో ............ఒక సంతానం ఏదైనా కోరితే డబ్బులు లేకున్నా అప్పు చేసి వారి కోరిక నెరవేరుస్తాము , కానీ మరో సంతానం ఏదైనా కోరితే చేతిలో డబ్బులున్నా వాడి కోరిక తీర్చాలనిపించదు ఎందుకని ? అలాగే కొంతమంది విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తాం ఎందుకని ? ఇక చదవండి ! మనకు పూర్వ జన్మ కర్మల వలననే  ఈ జన్మలో... తల్లి,  తండ్రి,  అన్న,  అక్క,  భార్య,  భర్త,  ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు,  శత్రువులు మిగతా సంభంధాలు... ఈ ప్రపంచం లో మనకు లభిస్తాయి. ఎందు కంటే మనం వీళ్లకు... ఈ జన్మ లో... ఏదో ఒకటి ఇవ్వ వలసి, లేదా తీసుకొన వలసి రావచ్చును. # మనకు సంతాన రూపం లో ఎవరెవరు వస్తారు. మనకు.... పూర్వ జన్మ లో సంబంధం వున్న వ

శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 051218)

Image
శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 051218) 🏵️ ఆదివరాహుడవయి నీ వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్ మోదమున సురలు పొగడఁగ మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా! 🏵️ భావం:  మొట్టమొదటి వరాహరూపాన్ని (ఆది వరాహం) ధరించిన ఓ కృష్ణా! నువ్వు హిరణ్యాక్షుడు అనే పేరుగల రాక్షసుని చంపి పాతాళంలో  మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పెకైత్తి ప్రకాశించావు. ప్రతిపదార్థం: కృష్ణా అంటే ఓ కృష్ణా; నీవు అంటే నువ్వు; ఆదివరాహుడవు అంటే విష్ణుమూర్తి అవతారంగా వరాహ రూపం ధరించి; ఆ దనుజున్ అంటే రాక్షసుడయినటువంటి ఆ; హిరణ్యనేత్రున్ అంటే హిరణ్యాక్షుడిని; హతున్ అంటే చంపి; తగన్ అంటే ఒప్పుగా; మోదమునన్ అంటే సంతోషంతో; సురలు అంటే దేవతలు; పొగడగన్ అంటే ప్రశంసించగా; మేదినిన్ అంటే భూమిని; గొడుగున్ + ఎత్తి అంటే గొడుగులాగ పెకైత్తి; మెరసితి అంటే ప్రకాశించావు. సకలజీవరాసులూ నివసించటానికి అనువైన భూమి నీటిలో మునిగి ఉన్నందున, దానిని పైకి తీసుకురమ్మని తండ్రి అయిన బ్రహ్మను ప్రార్థిస్తాడు మనువు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన ముక్కు నుంచి వరాహం శిశువు రూపంలో బయటపడి, క్రమేపీ పర్వతమంత పెరిగి గర్జించింది. ఆ రూపాన్ని చూస

వీడటే.. వీడటే.🌹

Image
వీడటే.. వీడటే.🌹 (పోతన భాగవత పద్యం) 🌺🌺🌺 యశోదమ్మే ఆశ్చర్యపోయింది కన్నయ్యను జూచి... పెరిగి పెద్దయాక... . అంటూ...చాలా సార్లు ఎఫ్బీ లో రాసినా మళ్ళీ...  ఆ కన్నయ్యను గూర్చి యశోదమ్మ చెప్పిన మాటలు  పోతన చాటు మాటుగా వినే వుంటాడు. చిత్తగించండి మళ్ళీ ఓ సారి. . వీడటే రక్కసి విగతజీవగ జన్ను - బాలుద్రావిన మేటి బాలకుండు వీడటే నందుని వెలదికి జగమెల్ల - ముఖమందు జూపిన ముద్దులాడు వీడటే మందలో వెన్నలు దొంగిలి - దర్పించి మెక్కిన దావరీడు వీడటే యెలయించి వ్రేతల మానంబు - సూరలాడిన లోకసుందరుండు 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

"మా మంచి ..అత్తగారు" జోకు!!

Image
"మా మంచి ..అత్తగారు" జోకు!! - హే! నాకు పెళ్లి అయ్యింది, మా అత్త గారు కూడా వచ్చారు !! వహ్!..చాలా మంచి వార్త! ఎం మంచి ??..అత్త చాలా గయ్యాళి ! అయ్యో!!!..చాలా చెడ్డ వార్త ! ఎందుకు చెడ్డ వార్త ?..అత్త చాలా ధనికురాలు!! వహ్!..చాలా మంచి వార్త! ఎం మంచి ??.అత్త .నాకు పైసా కూడా ఇవ్వలేదు ! అయ్యో!!!..చాలా చెడ్డ వార్త ! ఎందుకు చెడ్డ వార్త ?..అత్త నాకు ఉండటానికి పెద్ద మేడ ఇచ్చింది!!!! వహ్!..చాలా మంచి వార్త! ఎం మంచి ??..ఆ మేడ నిన్న తగలబడి పోయింది!! ! అయ్యో!!!..చాలా చెడ్డ వార్త ! ఎందుకు చెడ్డ వార్త ?..--అత్త ఆ మేడ లోనే వుంది!!! --

🌹🌺శుభరాత్రి .🌺🌹

Image
🌹🌺శుభరాత్రి .🌺🌹 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః! దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః!! వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ, త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపో, కుంకుమో, అక్షతలో వేయాలి. అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి.  ఆరోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మనమీద పడినా చాలు. కీటాశ్చ - పురుగులు; మశకాశ్చ - దోమలు, ఈగలు మొదలైనవి, అంతే కాదు చెరువు ఉంది అనుకోండి అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి. అవి జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి. నీటిలో ఉన్న పురుగులు, భూమిమ ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతోందో ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుగాక! వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగాక!  అవి తొందరలో మనుష్య జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుష్ఠానము చేసి భగవంతుణ్ణి చేరుగాక! అని శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు. ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప

బాపూ..!! నీకేంటి చెప్పూ!💔🌹

Image
బాపూ..!! నీకేంటి చెప్పూ!💔🌹 వెన్నెల్లో ఆరుబయట పట్టెమంచమ్మీద మెత్తటి పరుపూ, గళ్ళదుప్పటీ, బూరుగుదూది తలగడాలూ. మళ్ళా.. ఆ గలీబులమీద అందంగా లేసులల్లిన ‘స్వీట్ డ్రీమ్స్' అనే అక్షరాలు మత్తెక్కించే మరువం, దహించివేసే దవనం. సాయంకాలం తీరిగ్గా కట్టుకున్న సన్నజాజి మొగ్గల దండా, ఒంటికి పూసుకున్న పాండ్స్ పౌడరూ, మధ్యరాత్రి దాహఁవేస్తే మరచెంబుతో మంచినీళ్ళూ.. ఇలా సెట్టింగులేసి రెచ్చగొట్టేస్తావు! నీకు తోడు ఆ కెమేరావాళ్ళూ.. అలాంటివాళ్ళే దొరుకుతారు నీకు. కొబ్బరాకుల్లోంచి చందమామనీ, విరబోసుకున్న జుట్టులోంచి ఆపిల్ల ముఖాన్నీ చూపించీ చూపించకండా చంపొదిలిపెడతారు! కోపాలొస్తే కళ్ళతో బాణాలెయ్యడాలూ, అలకలొస్తే జడతో జాడించెయ్యడాలు, అరిపాదాల్లో గోరింటాకులు, మూసినా బానేవుండే కళ్ళు.. ఇలా సాగుతూనే వుంటుంది నీ యవ్వారం! అందరూ నువ్వేసిన బొమ్మల్లానూ, మన రవణ రాసిన సీతల్లానూ వుండరు సామీ! రెండుజెళ్ళ కాలఁవా ఇదీ ? అన్నీ డిప్పలే !! ‘పొద్దుకాదది నీముద్దుమోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా!

కృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 031218)

Image
శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 031218) 🏵️ కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్ రక్షక వటపత్రముపై దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా! 🏵️ ప్రతిపదార్థం: రక్షక అంటే అందరినీ రక్షించే; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; కుక్షిని అంటే నీ పొట్టయందు; నిఖిల అంటే సమస్తమైన; జగంబులను అంటే లోకాలను; నిక్షేపము చేసి అంటే దాచిపెట్టి; ప్రళయ అంటే ప్రళయ సంబంధమైన; నీరధి అంటే సముద్రము యొక్క; నడుమన్ అంటే మధ్యభాగంలో; వటపత్రముపై అంటే మర్రి ఆకు మీద; దక్షతన్ అంటే నేర్పు; పవళించునట్టి అంటే నిద్రిస్తున్న నీవు; ధన్యుడు అంటే గొప్పవాడివి. భావం: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం! ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలే గాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంలో వివ

🙏శ్రీ సి. నారాయణ రెడ్డి గారు . 🙏

Image
🌹మన సాహితీ ప్రముఖులు (13)🌹 🙏శ్రీ సి. నారాయణ రెడ్డి గారు . 🙏 👉  పగలే వెన్నెల, జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులుంటే నన్ను దోచుకుందుే వెన్నెల దొరసానీ  అనే పాటల తో పేరుపొందారు.తర్వాత చాలా సినిమాల్లో మూడు వేలకు పైగా పాటలు రాశారు . విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే. విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది. ఇప్పటి కవుల్లో నారాయణరెడ్డిగారికున్నంత శబ్దస్ఫూర్తి ఉన్నవాళ్లు ఎక్కువ మంది లేరు. శబ్దస్ఫూర్తి అంటే శబ్ద సంపద ప్లస్‌ స్ఫూర్తి. అంతేకాదు. ఆ శబ్దాలను అతికే శక్తి మహాద్భుతమైనది. శబ్దాలకు రంగు, రుచి, వాసన కలిగించే ఆల్కెమీ ఏదో సినారె దగ్గర ఉండి ఉండాలి. అది అనిర్వాచ్యం. అది పరిశోధనకందదు . 🌹🙏 చిత్రం - పద్మ కృష్ణ గారు.🙏🌹

శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 021218)

Image
శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 021218) 🏵️ మగ మీనమువై జలధిని పగతుని సోమకుని జంపి పద్మ భవునకు న్నిగమముల దెచ్చి యిచ్చితి సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణా! 🏵️ భావం:  మంచి గుణాలకు నెలవైన వాడా, దైవసంబంధమైన  సౌందర్యం కలవాడా!  ఓ శ్రీకృష్ణా! వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుడు. వాడిని నువ్వు మగ చేపవై (మీనావతారం) సంహరించి, వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు ఇచ్చావు. ఆహా ఎంత ఆశ్చర్యం. చెడ్డవారికి ఎప్పటికైనా చావు తప్పదు.  ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలని, సత్యాన్నే పలకాలని వేదాలు చెబుతున్నాయి. చెడ్డ లక్షణాలు ఉన్నవారిని రాక్షసులు అంటారు. ఎవరిలో రాక్షస గుణాలు ఉంటాయో వారిని భగవంతుడు శిక్షిస్తాడు అని కవి ఈ పద్యంలో వివరించాడు. 🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏

🙏శ్రీ త్రిపురనేని గోపిచంద్ గారు. 🙏

Image
🌹మన సాహితీ ప్రముఖులు (12)🌹 🙏శ్రీ త్రిపురనేని గోపిచంద్ గారు. 🙏 👉 మానవుడు సగం జీవితం నేర్చుకోవడంతోనూ  మిగిలిన సగం తాను నేర్చుకున్నది తప్పు అని తెలుసుకోవడంతోనూ గడుపుతున్నాడు.. త్రిపురనేని గోపీచంద్ (సెప్టెంబర్ 8, 1910 - నవంబర్ 2, 1962) సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం, ఆస్తి, శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్నే అతన్ని ఒక జిజ్ఞాసువుగా, తత్వవేత్తగా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది. గోపీచంద్ రచనలలో విలు