Posts

Showing posts from February, 2016

గుప్పెడంత ప్రేమ…!

Image
గుప్పెడంత ప్రేమ…! (మెరుపుకల...నా కొత్త కలల లోకం) . అమ్మ ప్రేమ కావాలి అమ్మ ఒడిలో పడుకోవాలని నా బాధలు భయాలు చెప్పుకోవాలని అమ్మ చెయ్యితో నాతలను ప్రేమగా నెమరాలి నా భయాలు అన్నీ మరిచి హాయిగా పడుకోవాలని నాకు అనిపిస్తుంది కానీ ఆ అమ్మ ప్రేమ నాకు దొరకలేదు ..  నా అదృష్టం ఏంటో నాకు ఊహరాకముందే నాన్న చనిపోయాడు నాన్న ప్రేమ ఎలావుంటుందో తెలీదు సినిమాలో చూడడం పుస్తకాల్లో చదవడం తప్ప …  ఇక తోడబుట్టిన వాళ్ళ గురించి ఐతే ఏంచెప్పిను స్వార్ధానికి రూపం వుండి బట్టలు వేస్తే వాళ్ళు అని చెప్పొచ్చు … బ్రహ్మదేవుడు నాతల రాత రాసేటప్పుడు బాగా ఫస్ర్టేషన్ లో వున్నట్టుంన్నాడు ఆ సరస్వతీ మాతమీద వున్న కోపం మొత్తం నామీద చూపించాడు  పాపం ఆయనను నేను నిందించలేను ఎందుకంటే ఫస్ర్టేషన్ నమ్మా … ఫస్ర్టేషన్ …  నేను అర్థం చేసుకోగలను మిస్టర్ బ్రహ్మ … అది సంగతి  ఇంతకీ మనం ఎక్కడ వున్నాం హు… గుప్పడంత ప్రేమ కోసం నేను తపించిపోతుంన్నా నా తలమీద చేయివేసి నేనుంన్నానంటూ ధైర్యం చెప్పాలి ,  నా రెండు చెంపలమీద తనరెండు చేతులతో నన్ను దగ్గరగా లాగుకుని ప్రేమగా నా నుదురుపైన ముద్దు పెట్టాలి నేనుంన్నానంటూ , నేను టెంషన్ లో వుండి నిద్

Aishwarya Srinivas - Ennaganu Rama Bajana

Image
భద్రాచల రామదాసు ! (ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా ) పంతువరాళి - రూపక పల్లవి: ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా ఎ.. అను పల్లవి: సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనస? కన్నవిన్నవారి వేడుకొన్న నేమిఫలము మనస? ఎ.. చరణము(లు): రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి రామరామరామ యనుచు రమణియొకతె పల్కగా ప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడు కామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా? ఎ.. శాపకారణము నహల్య చాపరాతి చందమాయె పాపమెల్ల బాసె రామపదము సోకినంతనే రూపవతులలో నధిక రూపురేఖలను కలిగియు తాపమెల్ల తీరి రామతత్త్వమెల్ల తెలుపలేదా? ఎ..

తృణకంకణము! (శ్రీ రాయప్రోలు సుబ్బారావు.)

Image
తృణకంకణము! (శ్రీ రాయప్రోలు సుబ్బారావు.) తృణకంకణము రాయప్రోలు సుబ్బారావు రచించిన సుప్రసిద్ధమైన ఖండకావ్యం. 20వ శతాబ్దపు తెలుగు కవిత్వంపై గొప్ప ప్రభావాన్ని ప్రసరించిన భావకవిత్వ యుగంలో మొదటి రచనగా చారిత్రిక ప్రాధాన్యత కలిగివుంది. 1913లో విడుదలైన ఈ రచన ప్రబంధ బంధురమైన తెలుగు సాహిత్యాన్ని ఇతివృత్తం, శైలి, శిల్పం పరంగా గొప్ప మార్పు సూచిస్తూ నూతన యుగానికి నాంది పలికింది. .  రాయప్రోలు సుబ్బారావు రచించిన తృణకంకణము అనే ఖండకావ్యం 1913లో తొలిముద్రణ పొందింది. ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో దీనిని రచించారు. ఇటువంటి కథాంశం, ఆ కథాంశం క్లుప్తత వంటివి ఒక వినూత్నమైన, ఆనాటి ప్రబంధ యుగంలో కొత్తది. . తృణకంకణము (ఆంధ్ర భారతి నుండి) .  అడుగులు బొబ్బలెత్త, వదనాంచలమందున చిన్కు చెమ్మటల్‌ మడుగులుగట్ట, మండు కనుమాలపుటెండ పడంతి యోర్తు జా ఱెడు జిలుగుంబయంట సవరించుచు, చొక్కిన యింపుతోడ కా ల్నడకన బోవుచుండె నెడలన్‌ కనుపించెడి పచ్చతోటకున్‌. పసినిమ్మపండ్ల చాయలు కొసరెడి యా కుసుమగంధి కోమలపు

రుక్మిణీదేవి అరండేల్!

Image
రుక్మిణీదేవి అరండేల్! .  తమిళనాడులోని చెన్నైలో కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు రుక్మిణీదేవి అరండేల్‌ . ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, భరతనాట్యాలలో ప్రావీణ్యం సంపాదించేలా చేశారుు. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యం, గౌరవం ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేసింది. .  ఈమె 1904వ సంవత్సరం, ఫిబ్రవరి 29వ తారీఖున నీలకంఠశాస్ర్తి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న మధురైలో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆ తరువాత కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే దివ్యజ్ఞాన సమాజం థియాసాఫికల్‌ సొసైటీలో చేరింది. ఈమె తన అభిరుచులతో, ఆలోచనలతో ఏకీభవించిన అరండేల్‌ అనే విదేశీయుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 16, అరండేల్‌కు 40. వీరి వివాహము పెద్దల విపరీతమైన అభ్యంతరాల మధ్య ముంబైలో రిజిస్టర్‌ ఆఫీసులో జరిగింది. . వివాహానంతరం ఈమె తన భర్తతో అనేక ప్రదేశాలను దర్శి

కొండమీద కనకదుర్గ నవ్వింది .!

Image
కొండమీద కనకదుర్గ నవ్వింది .! .  By - Sree Virabhadra Sastri Kalanadhabhatta..  .  ఒకడు నదిమీదకు వంగి వున్న కొమ్మను గొడ్డల్తో కొడుతూవుండగా, గొడ్డలి జారి నదిలో పడింది. వాడు విచారిస్తూవుంటే నది దేవత ప్రత్యక్షమై విషయం తెలుసుకొని, నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. కాదన్నాదు. మళ్ళీ నదిలోకి మునిగి, ఈసారి వెండి గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. కాదు అన్నాడు. మూడోసారి మునిగి వాడి గొడ్డలినే తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. ఆ! ఇదే నాది అన్నాడు సంబరపడిపోతూ. వాడి నిజాయితీకి మెచ్చుకొని బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా వాడికి ఇచ్చింది. వాడు ఆనందంగా వాటిని తీసుకు ఇంటికి వెళ్ళాడు.  *** *** *** రాజు అతని భార్య ఒక చల్లటి సాయంత్రం (బహుశా శీతాకాలం అయివుంటుంది. ఈ వేళ అయితే 46 డిగ్రీలు) విజయవాడ బ్యారేజీమీద షికారుకుచేస్తూ, పల్లీలు కొనుక్కుని నముల్తూ కబుర్లు చెప్పుకుంటు నడుస్తున్నారు. రాజు భార్య బ్యారేజీ ప్రక్కనవున్న రైలింగు మీదనుంచి నదిలోకి తొంగిచూస్తోంది. రాజు ఏదో విట్ వేసాడు. పకపకా నవ్వుతూ హమ్మ అబ్బ అంటూ నవ్వలేక మెలికలు తిరిగిపోతూ ఆవూపులో కృష్ణా నదిలో పడిపోయి

నన్నెచోడుని పద్యశిల్పం.!..

Image
నన్నెచోడుని పద్యశిల్పం.!.. (శ్రీ.కామేశ్వర రావు భైరవభట్ల ) నన్నెచోడుడు అనే రాజకవి వ్రాసిన "కుమారసంభవం"ఈ కావ్యంలో  నన్ను బాగా ఆకట్టుకొన్న ఒక మంచి పద్యాన్ని గురించి యిప్పుడు ముచ్చటించుకుందాం. . "పవడంపులతమీద ప్రాలేయపటలంబు బర్వెనా మెయినిండ భస్మమలది లాలితంబగు కల్పలత పల్లవించెనా గమనీయ ధాతువస్త్రములు గట్టి మాధవీలత కళిమాలికల్ ముసరెనా రమణ రుద్రాక్షహారములు వెట్టి వర హేమలతికపై బురినెమ్మి యూగెనా సన్నుతమగు నెఱిజడలు బూని" . తపస్సు చేస్తున్న పార్వతీదేవి వర్ణన యిది. ప్రాలేయము అంటే మంచు. మంచు బిందువులతో మెరిసే పగడపుతీగవలె ఉన్నదామె. ఎందుకు? ఆమె మేను సహజమైన కెంపుదనంతో పగడపుతీగలా ఉంది. దానిమీద తెల్లని బూడిద పూసుకుంది. అందుకు. అలాగే లలితమైన కల్పలత (పారిజాతపు తీగ) చిగురించినట్లుగా ఉంది , ఆమె అందమైన కాషాయి వస్త్రాలను కట్టుకొంటే. మాధవీలత చుట్టూ నల్లని తేనెటీగలు మూగినట్లుగా ఉన్నాయామె ఒంటిపై చుట్టుకున్న రుద్రాక్షహారాలు. జడలుగట్టిన ఆమె నెఱికుఱులను చూస్తే అందమైన బంగారు సంపెంగ తీగపై, విప్పారిన నెమలి పురి ఊగుతున్నట్లుంది. మామూలుగా అయితే జడ నల్లని కాంతులతో న

హనుమాన్ చాలీసా !

Image
హనుమాన్ చాలీసా ! . శ్రీ హనుమను గురుదేవు చరణములు ఇహపర సాధక చరణములు  బుద్ధిహీనతను కలిగిన తనువులు  బుద్బుధములని తెలుపు సత్యములు |!

అన్నమయ్య కీర్తన.!

Image
అన్నమయ్య కీర్తన.! . అతివ జన్మము సఫలమై పరమయోగి వలె నితర మోహాపేక్షలన్నియు విడిచె సతి కోరికలు మహా శాంతమై యిదె చూడ సతత విజ్ఞాన వాసన వోలె నుండె.. . శ్రీవేంకటేశ్వర స్వామి వారి వరప్రసాదమైన అన్నమాచార్యుల వారు రచించిన  శృంగార సంకీర్తనల పరమార్ధాన్ని తెలిపే అద్భుతమైన ఒక సంకీర్తనను గూర్చి స్థూలంగా తెలుసుకుందాం! ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మఱి యిదిగాక వైభవం బిక వొకటి కలదా ||పల్లవి|| అతివ జన్మము సఫలమై పరమయోగి వలె నితర మోహాపేక్షలన్నియు విడిచె సతి కోరికలు మహా శాంతమై యిదె చూడ సతత విజ్ఞాన వాసన వోలె నుండె ||ఇది|| . తరుణి హృదయము కృతార్ధత పొంది విభుమీది పరవశానంద సంపదకు నిరవాయ సరసి జానన మనోజయమంది యింతలో సరిలేక మనసు నిశ్చల భావమాయి ||ఇది|| . శ్రీవేంకటేశ్వరుని చింతించి పరతత్త్వ భావంబు నిజముగా పట్టె చెలియాత్మ దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు లావణ్యవతికి నుల్లంబు దిరమాయ . అన్నమయ్య ఆధ్యాత్మ, శృంగార రీతులలో సంకీర్తనలు రచించాడు. రాశి లో శృంగార సంకీర్తనలు అధ్యాత్మ సంకీర్తనలకు మూడు రెట్లు ఎక్కువ. మధురభక్తి సంప్రదాయంలో ఆత్మార్ధంతో వ్రాసుకున్న ఈ శృంగార సంకీర

"రారండోయ్ బాలల్లారా రారండోయ్ "

Image
"రారండోయ్ బాలల్లారా రారండోయ్ "  . Veera Narasimha Raju గారికికృతజ్ఞతలతో.... . 1940 ల నుండీ 1970 ల వరకు ఆనాటి పిల్లలందరికీ వాళ్ళు అన్నయ్య అక్కయ్యలే.  ఎందఱో తెలుగు వారి పిల్లలు ప్రతి ఆదివారం బాలానందం లో హాయిగా ఆడుతూ పాడుతూ గెంతులు వేసారు. "రారండోయ్ బాలల్లారా రారండోయ్ " అంటూ పిలిచి అందరినీ మంచి పౌరులుగా తీర్చి దిద్దారు.  అందుకే ఆనాటి వారిలో దేశ భక్తీ, కళాత్మక తృష్ణ ప్రతి ఒక్కదాని మీద సదభిప్రాయం కలిగి ఉండేవారు . బాల అక్కయ్య బాల అన్నయ్య గా శ్రీ న్యాయపతి రాఘవ రావు గారు, శ్రీమతి న్యాయపతి కామేశ్వరి గారు సుప్రసిద్దులు. వారిరువురు మంచి విద్యావంతులు. భావి భారత పౌరులను తీర్చి దిద్దడానికి వారు చేసిన కృషి అంతా ఇంతా కాదు.. తమ ఆస్తులను కూడా తృణప్రాయంగా వదులుకున్నారు తాము అనుకున్నది సాధించడానికి .. బాలన్నయ్య బాలక్కయ్య దివ్య స్మృతికి .. బాలన్నయ్య న్యాయపతి రాఘవరావు గారి వర్ధంతి సందర్భంగా .

బాక్సా? భార్యా? (స్కెచ్ ).

Image
బాక్సా? భార్యా? (స్కెచ్ ). . (By - Sri.Virabhadra Sastri Kalanadhabhatta.) . అరోజు మహిళామండలి వార్షికోత్సవం. ఈ సారి సెలిబ్రేషన్ లో ప్రత్యేకత ఏమిటంటే, సభ్యురాండ్రతోబాటు వారి భర్తలు కూడా ఆహ్వానింపబడడం. భార్యలపోరు పడలేక చాలమంది భర్తలుకూడా హాజరవడంతో హాలు కిక్కిరిసి వుంది.  సభాప్రారంభ సూచనంగా కార్యదర్శిని అధ్యక్షురాలిని, ఇతర వక్తలను వేదికమీదకు ఆహ్వానించారు. అధ్యక్షురాలు శ్రీమతి రాధాభాయమ్మగారు వేదికమీదకు వస్తూవుంటే చప్పట్లతో హాలు మారుమ్రోగింది. ఆమె వచ్చికూర్చోగానే ఒక చిన్నపాప వచ్చి ఆమె మెడలో గులాబీల దండవేసింది.  రాధాభాయమ్మగారు లేచి సభకు నమస్కరించి మైకు దగ్గరకు వచ్చి సుతారంగా వ్రేలితో మైకును మీటి అది పనిచేస్తోందని నిర్ధారించుకొని, కళ్ళజోడు సవరించుకొని తమ వుపన్యాసం ప్రారంభించారు.  సభకు నమస్కారం. ఈరోజు సుదినం పర్వదినం సభ నేత్రానందకరంగావుంది. కారణం వేరే చెప్పనక్కరలేదనుక్కుంటాను. మన మహిళా మండలి సభ్యురాళ్లతోబాటు వారి భర్తలు కూడా రావడం ఎంతోముదావహం మరియు శ్లాఘనీయం (చివరముక్క ఆమె తప్పకుండా తమ వుపన్యాసంలో వుపయోగిస్తారు)  సరే విషయంలోకి డైరెక్ట్ గా వచ్చేస్తా. ఇక్కడకు వచ్చిన మగవ

భాగవత పద్యాలు!

Image
భాగవత పద్యాలు! "అల వైకుంఠ పురంబులో నగరిలో నామూలసుధంబు దా, పల మందారవనాన్త రామ్రు త సరః ప్రాంతేందు కాంతోప లో, త్పల పర్యంక రమావినోది యగునాపన్నప్రసన్నుండు వి, హ్వలనాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై" . వైకుంఠపురం . అందులో సరస్సు , సరస్సు పక్కనే మందారవనం . మందారవనంలో ఒక చలువరాతి మంటపం . అక్కడే కలువపూలు పరిచిన పర్యంకం . మందహాస వదనారవిందుడై పర్యంకం మీద పవళించి లక్ష్మీ మాతతో సరస సల్లాపాలలో మునిగి ఉన్నాడు మాధవుడు . అకస్మాత్తుగా వినిపించింది గజేంద్రుని ఆర్తనాదం .  క్షణంపాటు తొట్రుపాటు పడ్డాడు . భక్తుడు కష్టాలలో చిక్కుకున్నాడన్న విషయం తెలిసింది . గజేంద్రుని కరుణించాలనే తపన తప్ప ఇతర విషయాలేవీ పట్టించుకోలేదు పరమాత్ముడు . ఇతరులకు సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పినవాడు తానే ఇతర విషయాలన్నీ వదిలేసి ఉన్నపళంగా బయలు దేరాడు భక్తుని రక్షించడానికి . ఆర్తత్రాణ పరాయణత్వం అంటే ఇదే . . "సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడాకర్ణికాం తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోద్ధితశ్రీ కుచో పరి చేలాంచలమైన వీడడు హరి గజప్రాణ

మాహోదయం లో మంచి మూహుర్తం మాధవి లతకు పెండ్లి .!

Image
మాహోదయం లో మంచి మూహుర్తం  మాధవి లతకు పెండ్లి ..  కొమ్మ కొమ్మకు ఒక సన్నాయి ..  రెమ్మ రేమ్మకు ఒక తువాయి ..  ఈ పాట మా పెద్దక్క పెండ్లి కి శ్రీ దేవు పల్లి కృష్ణ శాస్త్రి గారు బహుమతి గా రాసి సీతా అనసూయ చేత పాడిం చేరు.(1944) ఇప్పుడు మా సోదరి శ్రీమతి బొడ్డు సుబ్బలక్ష్మి (సిరి ) పాడింది , ఈ పాట మా ఇళ్ళలో ప్రతి పెళ్ళికి పాడుకుంటాం  https://www.youtube.com/watch?v=RnUp2Y0s_So .

అమ్మాయిని చూస్తే !

Image
అమ్మాయిని చూస్తే ! . ఆ అమ్మాయి కళ్ళకి కాటుక లేదు, పెదాలకు లిప్ స్టిక్ వేసుకోలేదు, బొట్టుబిళ్ళలు ఏమి ఉపయొగించకుండా చక్కగా కుంకుమబొట్టు పెట్టుకుని  ఎరుపు ,ఆకుపచ్చ గల పంజాబి డ్రెస్ లో ఉంది ఆ అమ్మాయి.. అమ్మాయిలకి నిజమైన అందం ఈ అలంకరణల వల్ల ఏదీ రాదనుకుంట....!!! . ఏ బుద్ధిలేనివాడు చెప్పాడు దేవకన్యలు కేవలం స్వర్గంలోనే ఉంటారని?  వాడేవడో ఈ అమ్మాయిని చూస్తే ఖచ్చితంగా ఆ అభిప్రాయం మార్చేసుకుంటాడు అని అనిపించింది. ఎందుకో అమ్మాయిని చూస్తే " శ్రీహర్ష నైషదం " లోని దమయంతి  మళ్ళీ ఈ అమ్మాయి రూపంలో భూమి మీదకి అవతరించేసిందా? అని అనుమానం కలిగింది. .

సంతకెల్లి.. నా మావ.

Image
సంతకెల్లి.. నా మావ. అద్దమే తెచ్చాడు అద్దమందు నన్ను నే చూసుకొన అందాలరాశి కనిపించె...... అప్పుడర్ధమైనది నాకు నా మావ... పగలు,రాత్రి నా సుట్టెందుకు తిరుగుతున్నాడో!!!

రామరాజ్యం - 11000 సం. లేదా 30 సం?

Image
రామరాజ్యం - 11000 సం. లేదా 30 సం?  .  (Vvs Sarma గారి వ్యాసం ... మన ఒక రోజు వాల్మీకి తర్క పరిభాషలో ఒక వత్సరము .) .  రామరాజ్యం - మన భారతదేశీయుల కల, ఆదర్శం -  అయోధ్యలో ఆనాడు రామచంద్రుని పరిపాలన ఎన్నిరోజులు సాగింది?  మనకు వాల్మీకి రామాయణమే ప్రమాణం. రామాయణంలో వాల్మీకి వాక్కు ఏమిటి?  .  दश वर्ष सहस्राणि दश वर्ष शतानि च | रामो राज्यम् उपासित्वा ब्रह्म लोकम् प्रयास्यति || १-१-९७ .  "On reverencing the kingdom for ten thousand years plus another one thousand years, i.e. for a total of eleven thousand years, Rama voyages to the abode of Brahma... [1-1-97] .  రాముడు దశ సహస్ర వత్సరాలపై దశ శత వత్సరాలు రాజ్యాన్ని ఉపాసించి తదుపరి బ్రహ్మాలోకానికి పయనమయాడు.  .  తెలుగులో సాధ్యమయినంత సంస్కృత వాక్య నిర్మాణం ఉపయోగించాను.  సంవత్సరము అనకుండా వత్సరము (వర్షము అనే పద ప్రయోగానికి దగ్గరగా) ఉపయోగించాను.  11000 వేల ఏళ్ళు (years) పాలించి బ్రహ్మగారి నివాసానికి వెళ్ళాడు అన్నట్లున్నది ఆంగ్లానువాదం లోని (abode) అనే పదం.  ఇది రామాయణంలో (రాముని ప్రయాణంలో) భాగమే .  రాముడు ఇ

కవితా చమత్కారం !

Image
క వితా చమత్కారం ! ----------------------------- ఉన్నదున్నట్లు చెబితే కవిత్వం యెందుకవుతుంది? యేదో కొత్తదనం ఆమాటలలో జొప్పించాలి. అప్పుడది చమత్కార భాసురమై కవిత్వం అవుతుంది. :" చమత్కార మంజరి "- అనేగ్రంథంలో రెండవ అధ్యాయంలో ఒక చక్కని పద్యం ఉంది. ఒకా నొక చక్రవర్తి గారి చెలికత్తె సౌందర్యాన్ని చూచి ముగ్ధుడై ఓకవి యిలా వర్ణించాడు. . మ: " బిగువుం జన్నులు గాంచి , మాను నల జంబీరంబు బీరంబు! క్రొం జిగి మోముంగని , సిగ్గునన్ వదలు రాజీవంబు జీవంబు ! విం తగు భ్రూరేఖలు గాంచి , భీతినిడు కోదండంబు దండంబు ! త జ్జగతీ నాధుని మ్రోలనున్న చెలులం జర్చింపగా పాడియే ? " జంబీరాది పదాలలో మొదటి యక్షరం లోపించటం ఈపద్యం లోని చమత్కారం!  . కథానాయిక బిగువగు వక్షోజములను జూచి,  జంబీరములు ( గజ నిమ్మ పండ్లు -వానికి స్తనములతో పోలిక కవిసమయము ) బీరమును వదలుచున్నవి .బీరమనగా గర్వము. అందమైన ఆమెముఖాన్ని జూచి రాజీవము (పద్మము) ిగ్గుపడి జీవాన్ని వదలు తున్నది. ( నాయిక ముఖం సహజంగానే గులాబి రంగులోనున్నది. దానిని చూడగానే పద్మం వెలవెలృ బోతోన్నదని ఒక అర్ధం, ప్రాణాన్ని విడుస్తోందని మరోఅర్ధం ) సొగసైన కను

Sadasiva Brahmendra Krithis || Dr. M. Balamuralikrishna || CarnaticClass...

Image
సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి చింతా నాస్తికిల తేషాం కాంభోజి - ఆది (నవరోజ్‌ - ) పల్లవి: చింతా నాస్తికిల తేషాం చింతా నాస్తికిల॥ చరణము(లు): శమ దమ కరుణా సంపూర్ణానాం సాధు సమాగమ సంకీర్ణానామ్‌॥ కాలత్రయ జిత కందర్పాణాం ఖండిత సర్వేంద్రియ దర్పాణామ్‌॥ పరమహంస గురుపద చిత్తానాం బ్రహ్మానందామృత మత్తానామ్‌॥ సదాశివ బహ్రేంద్ర ఒక యోగి, కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, అద్వైత తత్వవేత్త. 18 శతాబ్దంలో తమిళనాడులోని కుంభకోణం వద్ద జీవించారు. ప్రధానంగా సంస్కృతంలో ఆయన రచనలు ఉన్నాయి. ఈ స్వరసృష్టిలోని ఇప్పటికి కొన్ని మాత్రమే మిగిలి ఉన్నా, వాటిని కర్ణాటక సంగీతంలో అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు . బహుళ ప్రజాదరణ పొందిన ఆయన కీర్తనలు కర్ణాటక సంగీత సభల్లో తరుచూ వినబడుతూ ఉంటాయి. కొన్ని: ఆనందపూర్ణ బోథోహం సచ్చిదానంద - శంకరాభరణ రాగం ఆనందపూర్ణ బోధోహం సతతం - మధ్యమావతి రాగం భజరేగోపాలం - హిందోళ రాగం భజరే రఘువీరం - కళ్యాణి రాగం భజరే యదునాథం - పీలు బ్రహ్మైవహం - నాదనామక్రియ బ్రూహి ముకుందేతి - గౌళ, నవరోజు, కురింజి, సెంచురి

భారతీయ ఆలోచనా విధానం.!

Image
భారతీయ ఆలోచనా విధానం.! (Vvs Sarma గార్కి కృతజ్ఞతలతో.) . సద్గురు శివానందమూర్తిగారు ఇలా అన్నారు  - The greatest creation of God is man while the greatest discovery of man is God.- ఈ వాక్యము గురించి న్యూటన్, ఐన్స్టీన్, స్టేఫెన్ హాకింగ్ వంటి విజ్ఞానవేత్తలు ఏమంటారు? న్యూటన్ క్రైస్తవుడు. బహుశ “నేను దేవుని నమ్ముతాను. దేవుని కుమారునికూడా నమ్ముతాను” అంటాడు. . యోగేనాంతే తను త్యజాం .! . ఐన్స్టీన్ యూదుడు. దేవుని నమ్ముతాడు. వారిద్దరికీ దేవుడు ఒక విశ్వాసం. , Einstein refused surgery, saying: "I want to go when I want. It is tasteless to prolong life artificially. I have done my share, it is time to go. I will do it elegantly.” His science and philosophy certainly correspond to that of a Yogi.. . యోగేనాంతే తను త్యజాం (కాళిదాసు) . "అహం కాలోస్మి"! . హాకింగ్ నాస్తికుడు. "కాలము సంక్షిప్త చరిత్ర" (A brief history of time) తో సైన్సు రచయితగా కూడా పేరుగొన్న శాస్త్రవేత్త. అతని మాటలలో “We are each free to believe what we want and it is my vie

శ్రీ వేమన పద్య సారామృతము .!

Image
శ్రీ వేమన పద్య సారామృతము .! . శ్లో ||బమ్మ గుడ్డు యనెడు పట్నంబు లోపల  బమ్మనెరుగలేని బాపడేల ? తన మనంబు దెలియ దానే పో బ్రహ్మంబు  విశ్వదాభిరామ వినుర వేమ ! తా :-బ్రహ్మాండం అనే పట్టణంలో ఉన్న బ్రాహ్మణుడికి బ్రహ్మాన్ని గురించి తెలియకపోతే అతడు ఇంకా బ్రాహ్మణుడేమిటి ?తనను తాను తెలుసుకోవడమే బ్రహ్మ . ..... శ్లో ||అగ్ని శిఖల యందు నమరంగ మమకార  మభవు మీద ధ్యాస మలర నునిచి  యాహుతి యగు వెనుక హరున కర్పిత మౌను  విశ్వదాభిరామ వినుర వేమ ! తా :-ఈశ్వరుని మీద మనస్సును నిలిపి నిలకడగా ఉంచి సుజ్ఞానం అనే అగ్నిలో మమకారాన్ని హోమం చేస్తే అది ఈశ్వరార్పణం అవుతుంది . ..... శ్లో ||నిజము యేల నెరిగి నిత్యుండు గాడాయె ? పలుకులోని బిందు పదిల పరచి  వేడుకైన బిందు వెదబెట్ట కుందురా  విశ్వదాభిరామ వినుర వేమ ! తా :- నిజాన్ని తెలుసుకుని నిత్యుడు కావడం మంచిది ,మాటలలోని మధురిమను భద్ర పరచు కుంటూ శాశ్వత పదార్ధ బోధ వాక్యాలను మనస్సులో నింపుకుని ఉండడం శ్రేష్టం కదా ! ...... శ్లో ||ఆశ విడక కాని పాశ ముక్తుడు గాడు  ముక్తుడైన గాని మునియు గాడు మునికి గాని సర్వ మోహంబు లూడవు విశ్వదాభిరామ వినుర వేమ !

వినాయకుని వలెను బ్రోవవే! .

Image
త్యాగరాజ కీర్తన - వినాయకుని వలెను బ్రోవవే! . 1. వినాయకుని వలెను బ్రోవవే మధ్యమావతి – ఆది పల్లవి: వినాయకుని వలెను బ్రోవవే, నిను వినా వేల్పు లెవరమ్మ? ॥వినాయకుని॥ అను పల్లవి: అనాథరక్షకి శ్రీకామాక్షి సుజనాఘమోచని శంకరి జనని ॥వినాయకుని॥ చరణము(లు): నరాధములకును వరాలొసగనుండరాములై భూసురాది దేవతలు రాయడిని జెందరాదు దయ జూడరాదా కాంచీపురాది నాయకి .. ॥వినాయకుని॥ పితామహుఁడు జనహితార్థమై నిన్ను తా తెలియ వేడ తాళిమిగల యవతార మెత్తె యికను తామసము సేయ తాళజాలము నతార్తి హారిణి .. . ॥వినాయకుని॥ పురాన దయచే గిరాలు మూకుకి రాజేసి బ్రోచిన రాజధరి త్యాగరాజుని హృదయ సరోజ మేలిన మురారి సోదరి పరాశక్తి నను .. . ॥వినాయకుని॥ భావార్థవివరణ..... . కాంచీపురమునందు వెలసియున్న శ్రీకామాక్షీదేవిని గూర్చి ఈ కీర్తనయందు ప్రార్థించినారు. . నీ కుమారుడయిన వినాయకుని కాపాడిన రీతిని నన్ను రక్షించుము (సుజనాఘ మోచని-) సజ్జనుల పాపములను హరించుదానా! అనాథరక్షకి! నీచమానవులకు నీవు వరములనివ్వగా, (రాములై-) నీయందు అనురాగము కలవారయి ఉండగా భూసురాది దేవతలు అందరూ, నరాధములవలన(రాయిడిని-) రాపిడిని, ఒత్తిడిని పొందవలసినదేనా? . శంకరీ! కాంచీపురాధి నాయకీ! జననీ! దయచూడ

మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకములు .. 21-31

Image
మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకములు .. 21-31 .  "పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్ ఇహ సంసారే బహుదుస్తారే కృపయాఽపారే పాహి మురారే "|| 21 || . మరల పుట్టుక మరల మరణము  మరల తల్లిగర్భంలో నివాసము అను దాటలేని  అపారమైన సముద్రం నుండి ఓ కృష్ణా! దయతో రక్షించుము. . "రథ్యా చర్పట విరచిత కంథః పుణ్యాపుణ్య వివర్జిత పంథః యోగీ యోగనియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవ "|| 22|| . కూడలిలో దొరికిన పీలిగుడ్డలను కట్టుకుని,  పాపపుణ్యములంటని కర్మలనాచరించుచూ,  యోగముచే చిత్తవృత్తులను నిరోధించు యోగి  బాలునివలే ఉన్మత్తునివలే ఆనందించుచుండును. "కస్త్వం కోఽహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారమ్ విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్ "|| 23 || . నీవెవరు?నేనెవరు? ఎక్కడినుండి వచ్చావు? నాతల్లి ఎవరు? నాతండ్రి ఎవరు? స్వప్నమువలే కనబడు  ఈ ప్రపంచమును విడిచి అంతా నిస్సారమే అని భావించుము. . "త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదజ్ఞానమ్ &qu

స్త్రీ ఉదయిస్తుంది!

Image
స్త్రీ ఉదయిస్తుంది స్త్రీ ఉప్పొంగుతుంది స్త్రీ విచ్చుకుంటుంది స్త్రీ పరిమళిస్తుంది స్త్రీ వర్షిస్తుంది.  .  చూపుల్లో ఒక అందం మాటల్లో ఒక అందం తాకిళ్లో ఒక అందం నడుమోంపుల్లో ఒక అందం నర్తించే పదముల్లో ఒక అందం ఇలా ఎటు చూసిన ఏం చేసినా ఉప్పొంగే రమణి అణువణువు అందమే  ఆమె ప్రతి కదలిక మధురానందమే. . 

రాగ దేవత కల్యాణి ప్రత్యక్షమైన సంఘటన :

Image
రాగ దేవత కల్యాణి ప్రత్యక్షమైన సంఘటన : .  రెంటాల జయదేవ గారు ఒక మంచి పాత్రికేయుడు. ఆయన ఎవరితో నైనా ఇంటర్వూ చే స్తే భలేగా ఉంటుంది. శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారితో జరిపిన ముఖాముఖీ తాలూ కా కొన్ని పాత అంశాలు : .  గతంలో ఒకసారి కేరళలోని త్రివేండ్రంలో అనుకుంటా.  కచ్చేరీ చేస్తున్నా. ఆ సమయంలో నేను కల్యాణి రాగం పాడుతుంటే, ఒక అందమైన అమ్మాయి వచ్చి, నా పక్కన కూర్చొంది.  ‘సొగసు నీ సొమ్ము కల్యాణి రాగిణీ, వగలు విరజిమ్ము నా భావజాలమ్ములో…’ అని అప్పటికప్పుడు పాట, వరుస కట్టాను.  ఆ కృతి అయిపోగానే ఎలా వచ్చిన అమ్మాయి అలా వెళ్ళిపోయింది.  ఆ అమ్మాయి ఎవరో ఎవరికీ తెలీదు. దానికి ఆ కచ్చేరీకి వచ్చినవాళ్ళే సాక్షులు.  కల్యాణి రాగదేవతే అలా వచ్చిందనుకుంటా .  .  నేను అక్కడే వున్నాను ... నాకు కనపడ లేదు విని పడింది ..  కళ్ళు మూసుకుంటే .. మాకు కన పడింది .. కళ్యాణి ..(రాగం) జీవితం లో మరచి పోలేని కచేరి .  1980 లో కేరళ .. యూనివర్సిటీ సెనెట్ హాల్ లో ..  అదే అనుకుంటా

మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకములు 11-20

Image
మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకములు 11-20 .  "మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్ మాయామయమిదమఖిలం బుధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా "||11 || . ధనము - జనము - యౌవనము చూచి గర్వపడకుము. .  వీటన్నిటినీ కాలము ఒక్కక్షణములో హరించును. .  మాయామయమయిన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము. . "దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః "|| 12 || . పగలు - రాత్రి , సాయంకాలము - ప్రాతఃకాలము ,  .  శిశిర ఋతువు - వసంత ఋతువు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వచ్చును. .  కాలము ఆటలాడుచున్నది.ఆయుష్షు క్షీణించుచున్నది  .  అయినా ఆశ విడవకున్నది. . "కా తే కాంతా ధన గతచింతా వాతుల కిం తవ నాస్తి నియంతా త్రిజగతి సజ్జనసం గతిరైకా భవతి భవార్ణవతరణే నౌకా "|| 13 || . ఓ మూర్ఖుడా! నీకు కాంత - ధనములపై చింత ఎందుకు?  .  నిన్ను శాసించువాడెవడూ లేడా ఏమి?  .  మూడులోకములలోనూ, సత్పురుషసాంగత్యమొక్కటే .  సంసారసముద్రము దాటించు నౌక. . "జటిలో ముండీ లుంఛి