శ్రీ నాధుడు ... అరవ బొజనం !

శ్రీ నాధుడు ... అరవ బొజనం !

ఒకసారి శ్రీనాథుడు.పేద కోమటి వేమారెడ్డి పంపితే కాంచీపురం వెళ్ళాడట .

అక్కడ ఎవరింట్లోనో భోజనం చేశాడు.వారి భోజనాన్ని యిలా వర్ణిస్తున్నాడు.

తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు చారు 

చెవులలో పొగ వెళ్లి చిమ్మిరేగ 

బలుతెరంగుల తోడ పచ్చళ్ళు 

చవి గొన్న బ్రహ్మ రంధ్రము దాక బారు నావ 

యవిసాకు వేచిన నార్నెల్లు ససిలేదు 

పరిమళ మెంచిన బండ్లు సొగచు 

వేపాకు నెండించి వేసిన పొళ్ళను 

గంచాన గాంచిన గ్రక్కు వచ్చు 

నరవ వారి యింట విందెల్ల నాగడంబు 

చెప్పవత్తురు తమతీరు సిగ్గులేక

చూడవలయు ద్రావిడుల కీడు మేళ్ళు 

అప్పటికి మిరపకాయలు లేవు కారాలన్ని టికీ మిరియాలనే వాడేవారు. 

ఆంధ్రులకు పప్పు ముఖ్యం వారికి చారు ముఖ్యం.

అలవాటు లేని చారు మొదటనే వడ్డించే సరికి 

ఆ కారం ఆయన నసాళానికి అంటిందట.

యవిసాకు ఆర్నెల్ల కిందట వేయించి పెట్టినది 

దాని వాసన తలుచుకుంటేనే పండ్లు పులిసి పోతాయి.

వివిధ రకాల పచ్చళ్ళు,

వేపాకు వేయించి చేసిన పొడి వేశారట.

అవన్నీ తినలేక ఈ పద్యం చెప్పాడట.

ఆయనకు అందర్నీ విమర్శించడం అలవాటే కదా!

యిప్పుదేవరూ అంత కారాలు తినడం లేదు.

యిది శ్రీనాథుని కాలం లోని సంగతి. . .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!