Posts

Showing posts from May, 2018

🙏 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏

Image
🙏 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏 🤲 జగత్ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమమ్ | స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః || 10 | 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲 విష్ణు సహస్రనామాలలో మొదటి నామం విశ్వం - వివరణ: 🤲 ౧. విశ్వము - జగము - గోచరాగోచరాత్మకమైన అనంత విశ్వము నారాయణుడే. మొదటి నామం విశ్వం. ప్రతివ్యక్తికీ మొదట గోచరించేది విశ్వమే. తొలుత కనబడే ఈవిశ్వమే విష్ణుని రూపమని గ్రహించాలని ఈ ప్రథమ నామం బోధిస్తోంది. ౨. విశ్వమునకు కారణమైనవాడు, కార్యమైనవాడు - అని మరొక అర్థం. పరబ్రహ్మకు భిన్నమైనది ఏదీలేదు. అందుకే విశ్వమే నారాయణుడు. "బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం: (ముండకోపనిషత్తు). "పురుష ఏవేదం విశ్వం" (ముండకోపనిషత్తు). "అంతర్బహిశ్చ తత్సర్వంవ్యాప్యనారాయణ స్థితః" లోపలా బయటా అంతటా వ్యాపించి నారాయణుడున్నాడు - అని నారాయాణ సూక్తం. ౩. ’విశతి’ - అంటే ’ప్రవేశించెను’ అని అర్థం. నారాయణుడు దేనియందు ప్రవేశించి ఉన్నాడో అది ’విశ్వం’. కనుక ’విశ్వ” అన్నమాటే”నారాయుడు ఇందులో ఉన్నాడు’అని ఎరుకపరుస్తోంది. "తత్ సృష్ట్యా తదేవాను ప్రావిశత్" దీనిని సృ

🌷🏵️🌷-మహానటి- 🌷🏵️🌷

Image
🌷🏵️🌷-మహానటి- 🌷🏵️🌷 👉మహానటి చూసారా . అభిప్రాయం చేబూతారా అని స్నేహితులు చాలామంది అడిగారు .  మహానటి సినీమా ఏందుకు చూడము!! చందమామ ఏలా అందరి సోంతమో ; సావిత్రీ ప్రతీ వారికీ సోంతమే . మన అందరికీ ఆవిడ తో ఆ అనుబంధం విడదీయనిది . ఆవకాయ ; గోంగూర ఏలా అయితే ప్రతీవారికీ ముఖ్యంగా మన తేలూగూవారికి సోంతమో--_ ఇష్టమో ; సావిత్రి కూడా మనఅందరకీ ఇష్టం మన ఇంటి బిడ్డ. మనకి ఇష్టమైన విషయము మీద ఏలాగ మనం బంధం-- అనుబంధం ఏర్పరుచుకుంటామో; ఏలా దానిని మనకే సంబంధించిన మన విషయం అని నిర్వచించుకుంటామో; అనువయించుకుంటామో అలాగే సావిత్రి తో మన అనుబంధం . అది విడదీయరానిది అసలు ఓక సావిత్రీ తోనేనా??  జమున ; భానుమతి; అంజలి; కన్నాంబ ; రేలంగి; సూర్యకాంతం; షావుకారు జానకి ; కృష్ణకుమారి ; నాగయ్య ; యేస్వీ రంగారావు; csr ఆంజనేయులు ; జగ్గయ్య ; కాంతారావు ; ఛాయాదేవి ; రామారావు; రాజనాల ; నాగేశ్వరరావు; రమణారేడ్డి ; గిరిజ ; చలం; నాగభూషణం ; అల్లూ రామలింగయ్య ; పద్మనాభం ; రాజబాబు ; శారద ; గీతాంజలి ; రమాప్రభ;  హేమలత (ఈ కేరక్టర artiste ఇంకా hyderabad లో ఉన్నారు 92 years. అత్తలు కోడళ్ళు సినీమా లో సూర్యాకాంతాన

👉మహాభారతం --జీవిత సత్యాలు!🙏

Image
👉మహాభారతం --జీవిత సత్యాలు!🙏 👉తమపై తమకు అపారమైన నమ్మకం కలిగి ఉండాలి: ఇది కొత్త సూక్తేమీ కాదు. ఎన్నో సార్లు ఈ సూక్తిని మనం చదివే ఉంటాం. అయినా, ఈ సూక్తిని దాని అర్థాన్ని గుర్తించడంలో విఫలమవుతూ ఉంటాం. మహాభారతం ఈ జీవిత సత్యం గురించి చక్కగా వివరిస్తోంది. అనేక అడ్డంకులు ఎదురైనా, భారీగా గాలి వాన కురుస్తున్నా కంసుడి బారి నుండి కృష్ణుడిని రక్షించడానికి కృష్ణుడి తండ్రి కృష్ణుణ్ణి ఒక బుట్టలో తీసుకుని వెళ్తాడు. పరిస్థితులకు ఎదురీది కృష్ణుడిని కాపాడతాడు. పాండవులకు తమ మీద తమకు అపార నమ్మకం కలిగి ఉండటం వలన కౌరవులపై పోరాడి విజయం సాధిస్తారు. ద్రోణాచార్యుడు కర్ణుడికి విలువిద్యను నేర్పించేందుకు అంగీకరించడు. కర్ణుడిని తన విద్యార్థిగా ఒప్పుకోడు. అయినా, మొక్కవోని దీక్షతో తనపై తనకున్న నమ్మకంతో విలువిద్యలో మంచి పట్టును సాధించాడు. 👉ఫలితం గురించి ఆలోచించకూడదు: ఈ పవిత్ర గ్రంధంలో ఈ విషయం కూడా చక్కగా ప్రస్తావింపబడింది. తమ పనిని తాము దీక్షతో చేసుకోవాలి. ఎటువంటి అడ్డంకులూ ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్న పనిని పూర్తిచేయాలి. ఫలితం గురించి ఆలోచించకూడదు. ఫలితం మీద దృష్టి పెట్టడం వలన చక్కటి పనితీర

🙏భగవద్గిత 🙏

Image
🙏భగవద్గిత 🙏 👉ప్రకృతి,పురుషుడు,క్షేత్రం,క్షేత్రజ్ఞుడు,జ్ఞానము,జ్ఞేయము అనగా ఏమిటి? (క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము-13 వ అధ్యాయం) 👉దేహాన్ని క్షేత్రమని,దీనిని తెలుసుకొన్నవాన్ని క్షేత్రజ్ఞుడని అంటారు. నేనే క్షేత్రజ్ఞున్ని.క్షేత్రక్షేత్రజ్ఞులను గుర్తించడమే నిజమైన మతం.  ఋషులు అనేకరకాలుగా వీటిగురించి చెప్పారు.బ్రహ్మసూత్రాలు వివరంగా చెప్పాయి. పంచభూతాలు, అహంకారం, బుద్ధి ,ప్రకృతి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, ఇంద్రియవిషయాలైన శబ్ద,స్పర్శ,రూప,రుచి,వాసనలు,ఇష్టద్వేషాలు,తెలివి,ధైర్యం ఇవన్నీ కలిసి క్షేత్రమని క్లుప్తంగా చెప్పారు. అభిమానము,డంబము లేకపోవడం,అహింస,ఓర్పు,కపటం లేకపోవడం,గురుసేవ,శుచిత్వం,నిశ్చలత,ఆత్మనిగ్రహం,ఇంద్రియ విషయాలపై వైరాగ్యం,నిరహంకారం,ఈ సంసార సుఖదుఃఖాలను నిమిత్తమాత్రుడిగా గుర్తించడం,భార్యాబిడ్డలందు,ఇళ్ళుల యందు మమకారం లేకపోవడం,శుభాశుభాల యందు సమత్వం,అనన్య భక్తి నాయందు కల్గిఉండడం,ఏకాంతవాసం,నిరంతర తత్వ విచారణ వీటన్నిటిని కలిపి జ్ఞానం అని చెప్పబడతోంది.దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానం. సత్తు లేక అసత్తు అని చెప్పలేని సనాతన పరబ్రహ్మం ను తెలుసుకొంటే మోక్షం వస

రేచీకటి అల్లుడు"!

Image
రేచీకటి అల్లుడు"! (చిలకమర్తి వారి 'వినోదములు' నుండి.) సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఒక అల్లుడు అత్తవారింటికి వచ్చెను. అతనికి రేచీకటి. ఈ లోపమును వారికి తెలియజేెయట కతనికిష్టము లేదు. ఒక రోజు రాత్రి బింకముగా వాకిలిలో అటు ఇటు నడుచుచుండెను. ఇలా నడచుచూ వాకిటిలో ఉన్న పాతరగోతిలో పడి పోయెను. ఆ చప్పుడు విని బావ మరుదులు కంగారుగా వచ్చి "బావా! గోతిలో పడితిరా ? అని అడుగ అత్తగారింట పరువు నిలుపుకొనుటకై-- "లేదు. నేను పడలేదు. పాతరగొయ్యి ఎంత లోతున్నదో తెల్సుకొనుటకు ఇందులో దూకితిని. దీని లోతు "ఇంత తక్కువ వున్నదేమి? అని బావా మరుదులు చేయూత పుచ్చుకుని మెల్లగా లేచి భోజనము నిమిత్తం లోనికి పోయెను. భోజనము చాలావరకైన పిదప అత్తగారు పంక్తిలోనున్న అందరకు మజ్జిగ వడ్డించి,అల్లుడు కదా అని ఈయనకు పెరుగు వడ్డించసాగెను. కంచంలోకి పెరుగు పోస్తుండగా "తొళుకు తొళుకు అని శబ్దం వచ్చెను. పరధ్యానంలో వున్న అల్లుడు కుక్కవచ్చి అన్నం ముట్టుచున్నదని భ్రమించి బెదిరించు ఉద్దేశ్యముతో చేయివిసరగా అత్తగారికి చెంపదెబ్బ తగిలినది. అయ్యో!అని అత్తగారు వెనుకకు పారిపోయెను. బావమ

మూడు మంచాల కథ!

Image
మూడు మంచాల కథ! "కళ్లు మండుతున్నాయమ్మా! ఇక నీళ్ళు పోసెయ్, త్వరగా!" అంటున్నాడు పిల్లాడు. "మొహం బాగా కడుక్కోకపోతే గుల్లలు లేస్తాయిరా నాన్నా! కాస్త సహనం అలవరుచుకోవాలి, ఇక నుండి నువ్వు" అటోంది అమ్మ. "సహనం అంటే ఏంటమ్మా?" అని అడిగాడు అబ్బాయి. "సహనమంటే భూమాతరా నాన్నా!" అన్నది అమ్మ. "భూమాతంటే ఎవరమ్మా?" అడిగాడు అబ్బాయి. "భూమాతంటేనా!" అంటూ ఈ చక్కని కథను తన కొడుకుతో చెప్పింది తల్లి: ఒక గదిలో ముగ్గురు స్నేహితులుండేవాళ్లు. ఒకనాటి మధ్యాహ్నం, వాళ్లంతా పనులమీద బయటికి వెళ్లిన సమయంలో, వాళ్ల మంచాలు మూడూ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఒక మంచం అన్నది " అబ్బా! ఎంత బరువున్నాడో వీడు. మొయ్యలేక చస్తున్నా, రెండేళ్ల నుండీ!. ఇలా ఎంత కాలంరా నాయనా?" అని.  ఇంతలో రెండవ మంచం అందుకొని "ఇంతకీ వాడి బరువెంత?" అని అడిగింది. "యాభై ఆరు కేజీలట. ఒకనాడు చెప్పుకుంటూంటే విన్నాను." అన్నది మొదటి మంచం. తన గొంతును చిన్నదిగా చేస్తూ. రెండవ మంచం అన్నది "యాభై ఆరు కేజీలేనా? నువ్వే అలా అంటే మరి నేనేమనాలి?

విగ్రహం -అద్దం ! 🌷

Image
🏵️ విగ్రహం -అద్దం ! 🌷 🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 *ఒక శిష్యుడు గురువుగారి ని అడిగిన ప్రశ్న....* భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా.  హృదయంలో ఉండే హరిని వెతకటానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్లడం దేనికి? *గురువు గారి జవాబు:* ముఖం మన దగ్గరే ఉంది.  కానీ మన కంటికి మన ముఖం కనిపించదు. కనపడడానికి అద్దం లో చూసుకొంటాము, అద్దంలో ప్రాణం లేదు,  కంటికి ప్రాణం ఉన్నా ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకు కనిపిస్తుంది. అలాగే తెలుసుకోవాల్సిన మనం ఇక్కడే ఉన్నాం.  తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండు కాకుండా మనకి ఏదయినా ఒక అద్దం లాంటిది కావాలి, *అదే విగ్రహం ....* భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు.  అందులో భగవంతుడిని చూసే భక్తి మనకి కావాలి.  మనలోన భక్తి, విగ్రహం ఈ రెండు అద్దం లాంటి ఫలితాన్నిస్తుంది.... *అప్పుడే భగవంతుడి సాక్షాత్కారం పొందవచ్చు....* అందుకే గుడికి వెళ్ళాలి.... 🙏🌺🙏🌺🙏🌺🙏🌺

దేవుడు ఏం చేస్తాడు?🌷

Image
🥀దేవుడు ఏం చేస్తాడు?🌷 🙏🤣🙏చందమామ పిట్ట కధ 🙏 🙏🤝🙏🤝🙏 👉🏻ఓ దేశాన్ని పాలించే రాజు మనస్సులో మూడు ప్రశ్నలు ఉదయించాయి. ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు జవాబులు యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను, శాస్తక్రారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకువచ్చి సరైన సమాధానం చెప్పినవారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. లేదంటే వారు ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పారు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఓ కుగ్రామంలోనుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు. రాజాస్థానం చేరుకొన్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు. పశువుల కాపరి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేసాడు. ‘‘చెప్పేవాడు గురువు; వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి’’. కాబట్టి మహారాజా! మీరు సింహాసనం దిగండి అన్నాడు. రాజు సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించి, ‘‘మహారాజా ఇప్

కాలభైరవ స్వామి చరిత్ర

Image
కాలభైరవ స్వామి చరిత్ర ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అస్సలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోజాత, అఘోర ,తత్పురుష ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి.  ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మము ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల అన్నిటిని సృష్టించాను, నేనే ని పుట్టుక కు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను ,నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు. తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా,కావున నేనే బ్రహ్మమును అన్నాడు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. ఋగ్వేదం:>>>>>>>>>>>>> అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ,ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుక

ఆస్తికులు-నాస్తికులు !

Image
ఆస్తికులు-నాస్తికులు ! - ఒక మిత్రుడు నన్నడిగాడు.ఆస్తికులు మంచివారా? నాస్తికులు మంచివారా? అని. ఈ ప్రశ్న నన్ను ఆలోచింప చేసింది. ఆస్తికత్వం, నాస్తికత్వం అనెవి మన నమ్మకాలకు చెందిన విషయాలు. కాని మంచితనం అలా కాదు. అది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. హృదయానికి సంబంధించిన విషయం. ప్రపంచంలొ మహా భక్తులుగా చెలామణీ అవుతున్న వారిలో పెద్ద దొంగలు, దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. అదే విధంగా మంచి వారూ చాలామంది ఉన్నారు. అలాగె నాస్తికులలో కూడాను. కనుక ఈ రెండూ భిన్న విషయాలు. పోల్చలెనివి. ఒక మనిషి బాధలో ఉన్నపుడు స్పందించి ఆ బాధను తనదిగా భావించి సాయం చెయ్యటం మంచితనం. మానవత్వం. దీనికి కావలసింది స్పందించే హృదయం. అసలు, మనిషి ఆస్తికుడా నాస్తికుడా అనేది ప్రశ్నే కాదు. మనిషి మనిషి గా ఉన్నాడా లెదా అనేదే ప్రశ్న. ఒక మనిషి గనక పరిపూర్ణ మానవత్వం తో ఉంటె, అతను నాస్తికుడైనా సరే, దెవునికి అతడే దగ్గర అవుతాడు. అదే స్వార్ధ పరుడైన ఆస్తికుడు ఎన్ని పూజలు చెసినా దెవునికి దగ్గర కాలేడు. కనుక మనిషి స్వార్ధ పరుడా, లెక నిస్వార్ధ పరుడా అనెదె ముఖ్యం కాని, అతడు దెవుని నమ్ముతున్నాడా లెదా అనెది ముఖ్యం కాదు.

మీది ఏ తత్వం?

Image
మీది ఏ తత్వం? - ఉన్నది అన్నది ………..ఆస్తికత్వం ఉన్నది అన్నది లేదన్నది ………..నాస్తికత్వం  ఉందో లేదో అన్నది ………..చపలత్వం ఉంటే ఉంది లేకపోతే లేదన్నది ………..తెలివైన తత్వం ఉన్నది లేనిది రెండూ నీవే అన్నది ………..వేదాంత తత్వం ఉన్నదాన్ని వదిలేసి లేనిదాన్ని ఊహించడం ………..భావుకత్వం లేనిదాన్ని వదిలేసి ఉన్నదాన్ని ప్రేమించడం ………..మానవత్వం

ఆభరణాలు నిలువుదోపిడీ !

Image
ఆభరణాలు నిలువుదోపిడీ ! - ఆమె ఎవరో కాదు మన మహానటి సావిత్రినే! ఇది ఆమెలోని దాతృత్వానికి అద్దం పట్టడమే కాదు ఆమె లోని దేశభక్తికి నిదర్శనం కూడా. ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయబడిన కథనం మీకు తెలుసు . అయితే ఇది యథాతథంగా అలాగే జరిగి ఉండకపోవచ్చు... ఎందుకంటే ఇందుకు సంబంధించిన చిత్రంలో జెమినీ గణేషన్ తో పాటు శివాజీ గణేషన్ కూడా ఉండటం మన గమనించవచ్చు. అయితే వారిద్తరూ తమిళ నటులు కాగా వారితో పాటు మన మహానటి సావిత్రి మాత్రమే ఉండి ప్రధాని ఆభరణాలు నిలువుదోపిడీ దానంగా ఇవ్వడం ద్వారా ఆ ఘటన,  అందుకు సంబంధించిన పూర్వాపరాలు మాత్రం వాస్తవమేనని అర్థం చేసుకోవచ్చు

"మన తెలుగునటి సావిత్రి"గారు.

Image
👉1965 భారత్ పాక్ మధ్య  రెండవసారి యుద్దం.......... యుద్ధంలో భారత్ దగ్గర  మందుగుండు సామగ్రి అయిపోయింది........... నాటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ప్రజలను విరివిగా విరాళాలు ఇవ్వమని దేశప్రజలను అభ్యర్థించాడు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👉1965 సెప్టంబర్ ప్రధాని చాంబర్ లోనికి గుమస్తా వచ్చి మీ కోసం ఒక దక్షిణాది నటిగారు వేచిఉన్నారని చెప్పాడు............ శాస్త్రిగారు ఆలోచిస్తూ సరే లోపలికి పంపండి అన్నారు............. 👉ఐదు నిమిషాల తర్వాత 28 సంవత్సరాల వయస్సు వున్న యువతి వంటినిండా నగలతో దగదగలాడుతుండగా ప్రధాని గారికి నమస్కారం చేస్తూ లోనికి ప్రవేశించింది............ శాస్త్రిగారితో తను ఎవరో పరిచయం చేసుకుంది.. 👉శాస్త్రిగారూ అభినందన పూర్వంగా నవ్వారు., తర్వాత తను వచ్చిన పని చెబుతూ ....... తను ధరించిన ఆభరణములన్నింటిని తీసి శాస్త్రిగారి టేబుల్ మీద పెడుతూ ......... ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని అన్నది.......... 👉తాళిబొట్టు తప్ప అన్నీ నిలువుదోపిడీ ఇచ్చిన ఆమె వంక ఆశ్చర్యపోయి చూస్తుండి పోయారు ప్రధానిగారు.. తర్వాత తేరుకొని

ఆరున్నొక్క రాగం ఆదితాళం !

Image
ఆరున్నొక్క రాగం ఆదితాళం ! 😪😪😪😪😪😪😪😪😪😪😪 👉అల్లసాని పెద్దన్న అల్లిబిల్లిగా ఏడ్చాడు.. .  ముక్కు తిమ్మన్న ముద్దు ముద్దుగా ఏడ్చాడు... భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడు’ అన్న ఛలోక్తి సాహిత్య లోకంలో సుప్రసిద్ధమైంది.  . వరూధిని వంటి గంధర్వాంగన కోరి వ(రి)స్తే ప్రవరాఖ్యుడు కాదు పొమ్మన్నాడు. ఆవిడకు కోపం రాదు మరీ!  వచ్చింది. కానీ, ప్రవరుడు ఆ కోపాన్నీ పట్టించుకోలేదన్న ఉక్రోషంతో ‘నన్ను తోసినప్పుడు నీ చేతి గోళ్ళు ఎక్కడెక్కడ గాయపరిచాయో చూడు... అంటూ ఆ పాటలగంధి వేదన నెపంబిడి ఏడ్చింది’ అని చెప్పాడు అల్లసాని పెద్దన్న. కనుకనే ‘వరూధినిది తెచ్చిపెట్టుకున్న దుఃఖం!’ అన్నారు తాపీ ధర్మారావు.  . 👉నంది తిమ్మన్న సత్యభామది మరోరకం దుఃఖం. తనను కాదని సవతికి మొగుడు పెద్దపీట వేశాడు. పారిజాతాన్ని రుక్మిణి జడలో తురిమాడు. దాంతో సత్య ‘ఈసునపుట్టి డెందమున హెచ్చిన కోపదవానలంబుచే గాసిలి ఏడ్చింది.’  . 👉వసురాజును వలచి విరహ తాపంతో సతమతమవుతున్న గిరికపై నిండు పున్నమి వెన్నెల దాడి చేసింది. అది అన్యాయం కాదు మరీ! ‘ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్‌ (తాళ)లేక రాకా నిశారాజ శ్రీసఖమైన మోమున, పటాగ్రం

నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని శృంగారలీల

Image
నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని శృంగారలీల శా. అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకూరముల్ లోచనా        పాంగ ప్రాంతమునం దిగుర్ప నొక సయ్యాటంబు గల్పించి నా        యంగుళ్యాభరణంబు బుచ్చుకొనవా! ఆ యుంగరంబిప్పుడే        సింగారింపని చేత బావకునకున్ జేయన్ హవిర్దానమున్🌷 అనగనగా కాంపిల్యమనే పురం. అందులో యజ్ఞదత్తుడనే పరమ నైష్ఠిక బ్రాహ్మణుడు. అతని కొడుకు గుణనిధి. ఎంతో కాలానికి గొడ్డువీగి పుట్టిన బిడ్డడు. అంచేత తల్లికి ఆ కొడుకంటే విపరీతమైన ప్రేమ. తండ్రి తన యజ్ఞ యాగాది కార్యకలాపాలలో మునిగి కొడుకుపై శ్రద్ధ చూపించడు. బాధ్యతంతా భార్యకే వదిలివేస్తాడు. దీనితో ఆ గుణనిధి కాస్తా చదువు సంధ్యలూ, ఆచారవ్యవహారాలూ పూర్తిగా మానేసి, జూదగాళ్ళతోనూ విటులతోనూ చెడు తిరుగుళ్ళు పడతాడు. కొడుకు వ్యవహారం తల్లికి తెలిసినా ఆమె యేమీ అనదు. కనీసం భర్తకు చెప్పదు. పైగా కొడుకు గురించి యజ్ఞదత్తుడు ఎప్పుడడిగినా, అబద్ధాలు చెప్పి వాడి తప్పులన్నీ దాచిపెడుతుంది. సరే, ఒక రోజు అసలు సంగతి బయటపడనే పడుతుంది. ఆ రోజు యజ్ఞదత్తుడు బజారులో పోతూ ఉంటే ఒక జూదగాడి చేతికి, నవరత్నాలు పొదిగిన తన ఉంగరం కనిపిస్తుంది. అది తనకి రాజుగారు బహూకరించిన ఉం

మోహిని అందం - భస్మాసుర అంతం!

Image
మోహిని అందం - భస్మాసుర అంతం! - పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతలతో ప్రతి యుద్దంలోను ఓటమి లేని వాడిగా, మరియు దేవతలను నాశనం చేయాలన్న దుర్బుద్ధితో శివుని కోసం కఠోర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై “ఏమి వరం కావాలో కోరుకో” అంటే ప్రకృతికి విరుద్ధమైన కోరిక "అమరత్వం (మరణం లేకపోవటం)" ప్రసాదించమని కోరతాడు. దానికి శివుడు నిరాకరించగా భస్మాసురుడు - "నేను ఎవరి తలపై నా చేయి పెడతానో వాళ్ళు భస్మమైపోవాలి" అని వరం కోరతాడు. దానికి శివుడు అంగీకరిస్తాడు. భస్మాసురుడు ఆ వరమును పరీక్షించేందనని శివుని తలపైన తన చేయి వేయ ప్రయత్నించగా, శివుడు పారిపోవలసి వచ్చింది. భస్మాసురుడు వెంబడించాడు. శివున్ని కాపాడుటకై విష్ణుమూర్తి "మోహిని" అవతారం దాలుస్తాడు. విష్ణుమూర్తి, మోహిని అవతారంలో, భస్మాసురుని ఎదుట నిలుస్తాడు. మోహిని యొక్క అందమును చూసి భస్మాసురుడు వ్యామొహంలో పడిపోతాడు. భస్మాసురుడు మోహినితో “నిన్ను పెళ్ళి చేసుకుంటాను” అనగా అప్పుడు మోహిని "నాకు నాట్యం అంటే చాలా ఇష్టం కావున నాలాగ నాట్యం చేసిన వారినే పెళ్ళాడుతాను" అని అంటుంది. భస్

🙏 భక్తుడు-బిచ్చగాడు 🤲

🙏 భక్తుడు-బిచ్చగాడు 🤲 👉ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.  రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.  ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే.  ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది...... బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు.  చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది.  తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు. తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు.  భక్తుడు సరేనన్నాడు.  ఆ ఘడియ రానే వచ్చింది.  బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. ..... భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.  ఆశ్చర్యం ......! దాని నుండి నిధి బయటపడింది.  వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి.  అవన్నీ అతడి సొంతమయ్యాయి..... మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.  అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది.

ఎందరో మహానుభావులు🌷 (చెప్పి గెలిచిన దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు) 🙏🙏🙏🙏- తనికెళ్ళ భరణి🙏🙏🙏

Image
ఎందరో మహానుభావులు🌷 (చెప్పి గెలిచిన దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు) 🙏🙏🙏🙏- తనికెళ్ళ భరణి🙏🙏🙏 విజయనగరం మహారాజు శ్రీ శ్రీ శ్రీ విజయరామ గజపతుల వారికి వీణంటే ప్రాణం. యువరాజు గారు శ్రీ ఆనంద గజపతుల వారికి సితార్ పై మోజు చూడ్డానికి ఒకేలా అనిపించినా.. దేనిదారి దానిదే.. వీణ పదహారణాల దక్షిణాది వాయిద్యం సితార్..ఫక్తు హిందుస్తానీ.. వీణకీ...పక్కన మృదంగ విన్యాసం ఉంటే సితార్ కి తబలా కావాలి. అయితే రెండు అప్ప చెల్లెళ్ళు కావు.. తోడికోడళ్ళు. రాజావారు కొడుక్కి వీణే నేర్పిద్దామనుకున్నాడు. కొడుకు గారు ససేమిరా వద్దనాడని.. సరే వీణ-సితార్ కంటే గొప్పదీ అని ఋజువైతే.. కొడుకు ఎదురు ప్రశ్న? ఇంతెందుకూ.. పోటీ పెడదాం ఎవరక్కడ చప్పట్లు.. సంగీత దర్బార్ తయారైంది. రెండు వేడుకలు సిద్ధం. ఒకటి హిందుస్తానీ రెండోది ..కర్ణాటకం. ఓ వైపు అత్తరు పరిమళాలు మరోవైపు అగరు పొగలు ఓ వేపు మల్లెల దండలు మరోవేపు గులాబీల గుత్తులు ఒక దిక్కు.. మఖ్ మల్ తక్త్ లు మరో దిక్కు పట్టు బాలీసులు బనారసీ పాన్ - జర్దా ఘుమాయింపు వొక చోట నుంచి లేత తమల పాకుల విడియముల పరిమళములొక చోట నుండీ.

అష్టావక్ర మహర్షి! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Image
అష్టావక్ర మహర్షి! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఏకపాదుడనే బ్రాహ్మణుడు నిరంతర తపోనిధుడు. ఆయన భార్య సుజాత ఉత్తమురాలు. ఏకపాదునికి ఎంతోమంది శిష్యులుండేవారు. బ్రహ్మచారులందరూ ఆయన వద్దనే ఉండి విద్య నేర్చుకొనేవారు. భార్యాభర్తలిద్దరూ శిష్యులతో హాయిగా కాలం గడుపుచున్నారు . సుజాత కొన్నిరోజులకు గర్భవతి అయింది.  పుట్టబోయే బిడ్డ తండ్రి వేదములు శిష్యులకు చెప్తూవుండగా తల్లిగర్భంలో వుండి వింటూ సర్వము తప్పు నిద్రాహారములు లేకుండా శిష్యులతో చెప్పించటం తప్పు అని తండ్రికి తెలిపాడు. తనకు పుట్టబోయే కుమారుడు దివ్య మణితుల్యుడు అని గ్రహించి సంతోషించాడు. కాని పుట్టకుండానే తనను తప్పుపట్టాడు వక్రముగా ఆలోచించాడని, ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు. సుజాత ఒక రోజున నెయ్యి, నూనె, ధాన్యం తెమ్మని చెప్పగా వాటికోసం జనకమహారాజు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ పందెం జరుగుచున్నది. అదేమంటే వరుణుని కుమారుడు వందితో వాదమున గెలిచినవారికి సర్వం యిస్తారని, ఓడితే జలములో మునిగి ఉండవలెనని చెప్పారు. ఏకపాదుడు వందితో వాదించి ఓడిపోయాడు. జలాశయంలో ఉండిపోయాడు.  సుజాత నెలలు నిండాక ఒక కుమారుణ్ని కన్నది. ఆ బిడ్డ ఎనిమిది వం

మాతృ దినోత్సవము.!

Image
మాతృ దినోత్సవము.! జనని తనువు నొసగు పునర్జన్మ మెత్తి మహిని వెలసిన దేవియే మాతృ మూర్తి అమ్మ కన్నను దైవమీ యవని లేదు తల్లి ఋణమును దీర్ప సాధ్యంబు కాదు !! చిన్ని నాడు చిలుక పల్కుల  బుడి బుడి నడకల నేర్పిన యాదిగురువు చిరుప్రాయంబునజనని యొడియనుభవం యిల లోని జనులందరికో దివ్య వరం !! విశాలజగాన విఫణినిదొరకనిదిజనని ' యొక్కటే  సేదదీర్చి హాయి నందించే ప్రశాంతతే అమ్మ  వయసెంత _ రెక్కలెంత_పెరిగినా దరిజేర్చు కొనే వెచ్చని గూడే___అమ్మ అమ్మ స్పర్శ లో వాత్సల్యం అమ్మ చూపులో ఆప్యాయం అమ్మ తలపులో నైర్మల్యం అమ్మ హృదయం అనంత వైశాల్యం !! అమ్మ బిడ్డకు మొదటి దిక్కు అమ్మ బిడ్డకు మొదటి వాక్కు  అమ్మ బిడ్డకు మొదటి ఋక్కు  అమ్మ కే బిడ్డ పై మొదటి హక్కు !! అమ్మ మనసు మంచి గంధం  అమ్మ సూక్తులు మంచి గ్రంధం ప్రాతః కాలాన జనని పాదంబు దాకు వారి సర్వ కార్యంబులు సిద్దింప కుండునే ? సర్వ తీర్థాంబువుల కంటే సమధి కంబు పావనంబైన జనయిత్రి పాదజలము (కాశీఖండము__శ్రీనాథ మహాకవి) ఉపవసించి యుపాసించు యోగి జనుల  కనుల బడునేమొ దేవుండు కాని, తానె ఉపవసించి యుపాసించి నెపుడు మనల

పుల్లాపంతుల సోదరులు-ముక్కు తిమ్మన...గారి తలనొప్పి 😡

Image
పుల్లాపంతుల సోదరులు-ముక్కు తిమ్మన...గారి తలనొప్పి  😡 👉ఒకసారి నంది తిమ్మన గారికి విపరీతమైన తలనొప్పి పట్టుకుంది. అది వచ్చినప్పుడు పిచ్చి పట్టినట్టుగా వుండేది (మైగ్రేన్)  రాయలవారు ఎంతో మంది వైద్యులకు చూపించారు ఎన్నో మందులు వాడారు. అప్పటికి ఉపశమనమే తప్ప మరీ కొన్నాళ్ళకు వచ్చేది. ఇలా కాదు కాశీకి వెళ్లి చూపించుకుంటాను అని తన పరివారం తో  సహా కాశీకి ప్రయాణం కట్టారు.అలా వెడుతూ వెడుతూ మధ్యలో  శిరోభారం ఎక్కువైపోయి నెల్లూరి ప్రాంతానికి చెందిన దరిశి మండలములో  వున్న బోదనం పాడు అనే గ్రామ శివార్లలో డేరాలు వేసుకొని బస చేశారు. తిమ్మన గారికి తలనొప్పి ఎక్కువై పోయి పెద్దగా మూలగా సాగారు. అది విని ఆదారిలో వెళుతున్న యిద్దరు వైద్య సోదరులు ఆ డేరా దగ్గరికి  పోయి అక్కడ కాపలాగా వున్నవారిని మేము ఘన వైద్యులము యిక్కడెవరో బాధతో మూలుగుతున్నారు ,మేము లోపలి వెళ్లి చూస్తాము అన్నారు. మేము యిద్దరూ అన్నదమ్ములంఈ బోదనంపాడు గ్రామానికి చెందిన వాళ్ళం. మాపేర్లు పుల్లాపంతుల పుల్లన్న,సూరన్న యిక్కడెవరో జబ్బు పడినట్టున్నారు, మూలుగులు బయటికి వినిపిస్తున్నాయి. మేము వారికి వైద్యం చేస్తాము అన్న

" సూర్య భగవానుని చరిత్ర "

Image
" సూర్య భగవానుని చరిత్ర " సూర్యుని భార్య ' సంజ్ఞా దేవి '. త్వష్ట ప్రజాపతి కుమార్తె. సంజ్ఞాదేవి గర్భవాసాన సూర్యునికి ముగ్గురు బిడ్డలు. వారు మనువు,యముడు,యమున. మనువుల చే పరిపాలించబడటం వలన మనం ' మానవులు 'అయినాము. సూర్యుని కుమారుడు అయిన మనువు మొదటి మనువు. ధర్మ స్వరూపుడైన 'యముడు' అష్టదిక్పాలకులలో ఒకడైనాడు. యముడే ధర్మదేవత.జీవుల పాపపుణ్యాలను గుణించి,శిక్షించి, కర్మ పరిహారం చేసే ' నరకలోకాధిపతి '. ఇలా ఉండగా సంజ్ఞాదేవికి అమిత తేజోవంతుడైన తన భర్త కాంతిని భరించడం సాధ్యం కానిదయ్యింది.కొంతకాలం తన పుట్టింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవనుకుంది.చెపితే భర్త ఒప్పుకోడని,బాగా ఆలోచించి,తన శక్తితో తన ప్రతిరూపాన్ని సృష్టించింది.ఆ స్త్రీ మూర్తికి 'ఛాయ ' అని పేరు పెట్టింది. తన భర్తని,పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి,ఎట్టి పరిస్థిలోనూ ఈ రహస్యం భర్తకు తెలియరాదని మాట తీసుకుంది. తనకు శాప భయం రానంత వరకు ఎవరికీ తెలియనివ్వనని షరతుతో కూడిన మాట ఇచ్చింది ఛాయాదేవి. సంజ్ఞాదేవి పుట్టింటికి చేర